సాధారణం కన్నా పెరిగిన ఉష్ణోగ్రతలు | temperature rise in telangana | Sakshi
Sakshi News home page

సాధారణం కన్నా పెరిగిన ఉష్ణోగ్రతలు

Published Mon, Feb 8 2016 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

temperature rise in telangana

సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో చలి తీవ్రత తగ్గింది. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు చలి తీవ్రత కొనసాగాల్సి ఉంది. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత 24గంటల్లో హన్మకొండలో సాధారణం కంటే 5డిగ్రీలు అధికంగా 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల తేడా ఉంది. నిజామాబాద్‌లో 5డిగ్రీలు అధికంగా 22 డిగ్రీలు, రామగుండంలో 5 డిగ్రీల తేడాతో 23 డిగ్రీలకు చేరుకుంది. ఎల్‌నినో కారణంగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement