హుస్సేన్ సాగర్‌లో రెండు మృతదేహాలు | two dead bodies in hussain sagar | Sakshi
Sakshi News home page

హుస్సేన్ సాగర్‌లో రెండు మృతదేహాలు

Published Sun, May 17 2015 8:11 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

two dead bodies in hussain sagar

హైదరాబాద్ సిటీ: హుస్సేన్ సాగర్‌లో శనివారం సాయంత్రం రెండు మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న రాంగోపాల్ పేట పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బయటపడ్డ మృతదేహాల్లో ఒకరిని బహుదూర్‌పురాకు చెందిన అహ్మదీ బేగం (55) గా గుర్తించారు.

ఆర్థిక ఇబ్బందులతోనే హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరో వ్యక్తి మృతదేహాన్ని గుర్తుపట్టాల్సి ఉంది. మృతిచెందిన వ్యక్తి నల్ల ప్యాంటు, తెల్ల రంగు గీతల చొక్కా ధరించి ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement