న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఫిరాయింపులపై చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని విజయ సాయిరెడ్డి ఆ ప్రయివేట్ బిల్లులో పేర్కొన్నారు. కాగా ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై.. ఆగస్ట్ 13 వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ 17న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఫిరాయింపులపై విజయ సాయిరెడ్డి ప్రయివేట్ బిల్లు
Published Wed, Jul 13 2016 12:29 PM | Last Updated on Thu, May 24 2018 2:18 PM
Advertisement
Advertisement