Parliament session
-
తొక్కిసలాట మరణాలపై తప్పుడు లెక్కలు.. లోక్సభలో అఖిలేష్ ఫైర్
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఈ దుర్ఘటనలో మరణాలు దాస్తున్నారంటూ.. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా సందర్భంగా యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపైనా మండిపడ్డ ఆయన.. తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?.. అసలైన లెక్క బయటపెట్టండి.. అంటూ ప్రసంగించారు.రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు పార్లమెంట్ మంగళవారం కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో.. కుంభమేళా దుర్ఘటనపై అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు. ‘‘మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరం. యూపీ ప్రభుత్వం 30 మంది చనిపోయారని, 60 మందికి గాయాలయ్యాయని చెబుతోంది. కానీ, విపక్షాలు ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయని అంటున్నాయి. బడ్జెట్ విషయంలో సరైన లెక్కలు చెప్పే ఈ ప్రభుత్వం.. కుంభమేళా మరణాల సంఖ్యను మాత్రం ఎందుకు దాస్తోంది. అసలు ఈ దుర్ఘటనకు బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు అని అఖిలేష్ ప్రశ్నించారు.#WATCH | Samajwadi Party Chief Akhilesh Yadav says "Uttar Pradesh Chief Minister did not express condolence. When the President and Prime Minister of the country expressed condolence, after 17 hours the (State) government accepted it. These are the people who cannot accept the… pic.twitter.com/4F3ONlYA0l— ANI (@ANI) February 4, 2025కుంభమేళా తొక్కిసలాట ఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించాలి. మరణాలు, గాయపడ్డవాళ్లు, వాళ్లకు అందుతున్న చికిత్స, అక్కడి వైద్య సిబ్బంది, రవాణా సదుపాయలు, వైద్యం.. ఇలా అన్నింటి గురించి చర్చ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారాయన. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపేంతదాకా యోగి సర్కార్ సంతాపం ప్రకటించకపోవడంపైనా అఖిలేష్ విరుచుకుపడ్డారు. అలాగే.. పెట్టుబడుల విషయంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఇంజిన్లు మాత్రమే కాదు.. భోగీలు కూడా ఢీ కొట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి.. మౌని అమావాస్య పురస్కరించుకుని అమృత స్నానాల కోసం భక్తులు పోటెత్తారు. అఖాడా ఘాట్ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరగడంతో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మృతి చెందగా, గాయపడ్డవాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలకు పరిస్థితి అదుపులోకి రావడంతో పుణ్య స్నానాలు యథాతధంగా కొనసాగాయి. చివరకు.. ఘటనలో 30 మంది మరణించినట్లు అక్కడి పోలీసు అధికారులు సాయంత్రం ప్రకటించారు. -
పార్లమెంట్ సమావేశాలు.. కుంభమేళాపై చర్చకు విపక్షాల ఆందోళన
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష పార్టీల ఎంపీలు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై చర్చకు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో, సభలో నిరసనలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజులు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో భాగంగా మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై ప్రభుత్వం చర్చకు రావాలని విపక్ష పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విపక్ష ఎంపీలు సభను హోరెత్తించారు. దీంతో, ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభ్యులను కోరారు. అనంతరం, రాజ్యసభ నుంచి ప్రతిపక్ష నేతలు వాకౌట్ చేశారు. All Opposition parties' MPs in Rajya Sabha walkout from the House over the issue Prayagraj Mahakumbh stampedePhoto source: Sansad TV/YouTube pic.twitter.com/ekGB0qYIJN— ANI (@ANI) February 3, 2025మరోవైపు.. లోక్సభలో సైతం సభ్యులు కుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టారు. ఈ సందర్భంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, విపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ.. నినాదాలు ఆగలేదు. ఈ పరిస్థితుల మధ్యే లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి #WATCH | Opposition MPs in Lok Sabha raise slogans against Uttar Pradesh's Yogi Adityanath government over Maha Kumbh stampede issue (Video source: Sansad TV/YouTube) pic.twitter.com/8Fl2KXlY9a— ANI (@ANI) February 3, 2025 -
పార్లమెంట్ వద్ద గందరగోళం.. ఉభయ సభలు మధ్యాహ్ననికి వాయిదా
Parliament Session Live Updates..👉పార్లమెంట్ వెలుపల గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా. Rajya Sabha adjourned till 2 pm today amid uproar in the House over Union HM Amit Shah's statement in the House on Babsaheb Ambedkar. pic.twitter.com/j4ol3Ix4Ui— ANI (@ANI) December 19, 2024తోపులాట ఇలా జరిగింది.. 👉ఇండియా బ్లాక్, బీజేపీ నేతలు ఒకరిపైపు ఒకరు దూసుకెళ్లారు. నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో గుంపు ఏర్పడటంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతోనే ఆయన కింద పడిపోయినట్టు తెలుస్తోంది. #WATCH | MPs of INDIA bloc and BJP came to face at the Parliament premises earlier today while carrying out their respective protests over Dr BR Ambedkar.INDIA MPs are demanding an apology and resignation of Union Home Minister Amit Shah over his remarks on Babasaheb Ambedkar… pic.twitter.com/IhryQTbKoQ— ANI (@ANI) December 19, 2024 పార్లమెంట్ వద్ద తోపులాట.. బీజేపీ ఎంపీకి గాయంపార్లమెంట్ బయట కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ కింద పడిపోయారు. దీంతో, ఆయనకు కంటి వద్ద గాయమై స్వలంగా రక్తం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా బీజేపీ ఎంపీ సారంగి మాట్లాడుతూ.. తనను కాంగ్రెస్ నేత రాహుల్ తోసివేసినట్టు చెప్పారు. రాహుల్ కారణంగానే తాను గాయపడినట్టు ఆరోపించారు. #WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down...I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me..." pic.twitter.com/xhn2XOvYt4— ANI (@ANI) December 19, 2024అనంతరం, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్ లోపలికి వెళ్లే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నన్ను లాగే ప్రయత్నం జరిగింది. అనంతరం, లోపులాట చోటుచేసుకుంది. #WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "This might be on your camera. I was trying to go inside through the Parliament entrance, BJP MPs were trying to stop me, push me and threaten me. So this happened...Yes, this has happened (Mallikarjun Kharge being pushed). But we do not… https://t.co/q1RSr2BWqu pic.twitter.com/ZKDWbIY6D6— ANI (@ANI) December 19, 2024 లోక్సభ వాయిదాpic.twitter.com/Ng1cxNL4oI— LOK SABHA (@LokSabhaSectt) December 19, 2024రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేడ్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదాపడ్డాయి.పార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలుపార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటాపోటీ నిరసనలు కొనసాగుతున్నాయి.రాజ్యసభలో అంబేద్కర్పై అమిత్షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులుకాంగ్రెస్ పార్టీనే అంబేడ్కర్ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీల నిరసన#WATCH | Delhi | INDIA bloc holds protest march at Babasaheb Ambedkar statue in the Parliament complexThey will march to Makar Dwar, demanding an apology and resignation of Union Home Minister Amit Shah over his remarks on Babasaheb Ambedkar in Rajya Sabha. pic.twitter.com/4cmM90DWpY— ANI (@ANI) December 19, 2024 #WATCH | Delhi: BJP MPs protest in Parliament, alleging insult of Babasaheb Ambedkar by Congress party. pic.twitter.com/HRF2UFfucd— ANI (@ANI) December 19, 2024శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇంకా బీజేపీ చేసేదేమీ లేదు. అమిత్ షా దేశానికి హోంశాఖ మంత్రి. అంబేద్కర్పై అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన అంబేద్కర్కు క్షమాపణలు చెప్పడం నేరమేమీ కాదు కదా?. అంబేద్కర్ది దేవుడి లాంటి వ్యక్తిత్వం. దేశంలోని వెనుకబడిన వారికి గౌరవం అందించిన వ్యక్తి. అంబేద్కర్ విషయంలో అమిత్ షా తప్పుడు పదాలు ఉపయోగించారు. కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే. #WATCH | Shiv Sena (UBT) leader Sanjay Raut says, "BJP has no work left. BJP is a party which is sitting idle. Amit Shah is the Home Minister of the country. If he has made a mistake, if there was a slip of the tongue, he should apologise. There is no crime in apologising over Dr… https://t.co/JdVCWRpk0k pic.twitter.com/OTojRiNotq— ANI (@ANI) December 19, 2024 -
పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా
Live Updates..ఢిల్లీ:పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాఅంబేద్కర్ అంశంపై విపక్షాల ఆందోళనముందుకు సాగని సభా కార్యక్రమాలు👉విపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా.. 👉పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోక్సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.#WATCH | On Union HM's speech in RS during Constitution debate, Rajya Sabha LoP and Congress MP Mallikarjun Kharge says "He has insulted Baba Saheb Ambedkar and the Constitution. His ideology of Manusmriti and RSS makes it clear that he does not want to respect Baba Saheb… pic.twitter.com/x9H75vJcZk— ANI (@ANI) December 18, 2024👉కాంగ్రెస్ నేతలు నేడు అంబేద్కర్ చిత్రపటంతో సభలు వచ్చారు. ఈ సందర్బంగా అమిత్ షా రాజీనామా చేయాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల నిరసనలను బీజేపీ ధీటుగా కౌంటరిచ్చింది.👉మరోవైపు.. అంబేద్కర్ను అమిత్ షా కించపరచలేదని కేంద్రమంత్రి మేఘవాల్ చెప్పుకొచ్చారు. 👉రాజ్యసభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. అమిత్ షా తన ప్రసంగంలో అంబేద్కర్పై గౌరవ భావాన్ని స్పష్టంగా చూపించారు. అలాగే అంబేద్కర్ బ్రతికుండగానే ఆయనను కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు. 1952లో కుట్రతో ఎన్నికల్లో ఓడించింది. నేను బౌద్ధుడిని ఈ దేశంలో బాబా సాహెబ్ చూపిన బాటలో నడిచే వ్యక్తిని . బాబా సాహెబ్ 1951లో న్యాయ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు. అనంతరం, 71 సంవత్సరాల తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి బౌద్దుడిని న్యాయ మంత్రిని చేశారు.#WATCH | In Rajya Sabha, Union Minister Kiren Rijiju says "Yesterday, Union HM Amit Shah clearly showed our sense of reverence in his speech. He also said how Congress insulted Ambedkar ji when he was alive...The Congress party did not award him with Bharat Ratna for so many… pic.twitter.com/0G6MaEG1AN— ANI (@ANI) December 18, 2024 -
సోరోస్తో స్నేహంపై శశిథరూర్ రియాక్షన్
ఢిల్లీ : 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్ట్పై వివాదం రాజుకుంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, తన పాత మిత్రుడు జార్జ్ సోరోస్ను కలిశానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను టార్గెట్ చేస్తూ బీజేపీ చేస్తున్న ఆరోణల్ని శశిథరూర్ ఖండించారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పెట్టుబడిదారుడితో కుమ్మక్కయ్యారని బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అందుకు.. అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులతో పనిచేస్తున్న ఎఫ్డీఎల్-ఏపీ సహ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాందీ.. ఆ సంస్థలో తన పాత్రను వెల్లడించాలని డిమాండ్ చేసింది.తాజాగా,సోరోస్తో కాంగ్రెస్కు ఉన్న సాన్నిహిత్యంపై మరోసారి బీజేపీ నేతలు ప్రస్తావించారు. మే 26, 2009న ఎక్స్ వేదికగా ప్రపంచ కుబేరుల్లో ఒకరు, తన పాత మిత్రుడు జార్జ్ సోరోస్ను కలిశాను. అతను పెట్టుబడిదారుడి కంటే అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంటారు’అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన నాటి ట్వీట్ను వెలుగులోకి తెచ్చారు.Since there is so much unhealthy curiosity about this tweet, I knew Mr Soros well in my @UN days as an upstanding international-minded resident of New York. He was a friend in the social sense: i have never received or solicited a penny from him or any of his foundations for… https://t.co/c1PmAHygyl— Shashi Tharoor (@ShashiTharoor) December 15, 2024ఆ ట్వీట్కు శశిథరూర్ ఎక్స్ వేదికగా.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న రోజుల్లో సోరస్ నాకు బాగా తెలుసు. అయితే, సోరస్ తనకు మంచి స్నేహితుడు. అంతే తప్పా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంస్థలు, ఆర్థికపమైన లావాదేవీలు జరగలేదు. సోరస్తో మాట్లాడి సుదీర్ఘకాలమైంది. సోరస్కు తనకున్న స్నేహాన్ని రాకీయాలు ముడిపెట్టడం తగదు’ అని అన్నారు.పదిహేనేళ్ల నాటి ట్వీట్తో అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ తప్పుదారి పట్టించే వారికి ఇది స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం, ఆ ట్వీట్లో పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిగ్గా మారాయి. -
జమిలి ఎన్నికల బిల్లులు వాయిదా
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లు సోమవారం లోక్సభ ముందుకు రావడం లేదు. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్ దిగువ సభలో నేడు ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆదివారం సవరించిన బిజినెస్ జాబితా నుంచి ఈ రెండు బిల్లులను తొలగించారు. సోమవారం నాటి లోక్సభ అజెండాలో వీటిని చేర్చలేదు. అయితే, రెండు బిల్లులను ఈ వారమే సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 20న ముగియనున్నాయి. ఆలోగానే బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులను లోక్సభ స్పీకర్ అనుమతితో చివరి నిమిషంలోనైనా సప్లిమెంటరీ లిస్టు ఆఫ్ బిజినెస్ జాబితాలో చేర్చే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. నిధుల కేటాయింపులకు సంబంధించిన కొన్ని డిమాండ్లపై సోమవారం లోక్సభలో చర్చించాల్సి ఉందని, అందుకే జమిలి ఎన్నికల బిల్లులను వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. లోక్సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన రెండు బిల్లుల వివరాలను నిబంధనల ప్రకారం గత వారమే లోక్సభ సభ్యులకు అందజేశారు. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఈ నెల 12న ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. జమిలి బిల్లులకు మద్దతివ్వండిలక్నో: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’విధానాన్ని బీఎస్పీ అధినేత మాయావతి సమర్థించారు. ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సంక్షేమ కార్యక్రమాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఆమె చెప్పారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టే జమిలి బిల్లుకు మద్దతు పలకాలని ఇతర రాజకీయ పార్టీలను మాయావతి కోరారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలన్నారు. -
గాంధీ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించింది: లోక్సభలో ప్రధాని మోదీ
Live Updates..రాజ్యాంగంపై చర్చ.. ప్రధాని మోదీ సమాధానంఇవాళ మనం ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నాంరాజ్యాంగ నిర్మాతలతో పాటు దేశ ప్రజలకు ధన్యవాదాలుప్రజాస్వామ్య భావనను 75 ఏళ్లుగా నిలబెట్టుకున్నాంఅందుకు ప్రజలకే మొదట ఘనత దక్కుతుందిభారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందిమనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కూడామనది మదర్ ఆఫ్ డెమోక్రసీదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందిత్వరలోనే మూడో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించబోతుందిరాజ్యాంగంలో మహిళలు కీలక ప్రాంత పోషించారువివిధ రంగాలకు చెందిన ఆ మహిళలు రాజ్యాంగ నిర్మాణంలో చాలా ప్రభావశీలంగా పనిచేశారు.భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకతభారతీయుల ఏకతనే రాజ్యాంగం కూడా ప్రస్తావించిందిఆర్టికల్ 370 దేశం ఏకత్వానికి అడ్డుగా నిలిచింది.ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటిందిభారత ప్రజాస్వామ్యం, గణతంత్రం ఎంతో గొప్పదిమన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది.ఎందరో మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు.ప్రజా స్వామ్య దేశాలు భారత్ను విశ్వసిస్తున్నాయి.గాంధీ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించింది.కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాతలను అవమానించారుకాంగ్రెస్ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందిప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పాలించింది. లోక్సభలో రాజ్యాంగంపై వాడీవేడీ చర్చ..కాసేపట్లో ప్రతిపక్ష నేతల ప్రశ్నలపై సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీపార్లమెంటులో రాజ్యాంగంపై రెండో రోజు కొనసాగుతున్న చర్చరాజ్యాంగ చర్చలో.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 26.. మతపరమైన విద్యాసంస్థల ఏర్పాటు, నిర్వాహణకు వెసులుబాటు కల్పించింది కానీ, ప్రధాని మాత్రం వక్ఫ్ బోర్డుకు రాజ్యాంగంతో ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు. అసలు ఈ ప్రధానికి పాఠాలు నేర్పింది ఎవరు?. ఆయన్ని(ప్రధాని మోదీని ఉద్దేశించి..) ఆర్టికల్ 26 చదవమనండి. వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్రను కేంద్రం చేస్తోంది #WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, AIMIM MP Asaduddin Owaisi says, "Read Article 26, it gives religious denomination, the right to establish and maintain institution for religious and charitable purposes. The Prime Minister… pic.twitter.com/5KOoRAe6Vm— ANI (@ANI) December 14, 2024 అందుకే కులగణన.. రాజ్యాంగ చర్చలో రాహుల్ గాంధీ50 శాతం రిజర్వేషన్ అనే గోడను మేం బద్ధలు కొడతాంఅందుకే కులగణనని తెరపైకి తెచ్చాంమీరేం చెప్తారో.. చెప్పుకోండిదేశం కోసం రాజ్యాంగం.. ఇండియా కూటమి సిద్ధాంతంరాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ కూటమి ఉందిఆర్థిక-సామాజిక సమానత్వాలు లేకుండా రాజకీయ ఐక్యత మనుగడ కష్టమని అంబేద్కర్ చెప్పారుఇవాళ అదే ప్రతీ ఒక్కరి ముందు కనిపిస్తోందిరాజకీయ సమానత్వం లేకుండా పోయిందిదేశంలోని వ్యవస్థలన్నింటిని గుప్పిట పట్టేశారుసామాజిక, ఆర్థిక సమానత్వాలు లేకుండా పోయాయిదళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, రైతులు, శ్రామికులు.. దేశంలో వీళ్లు(బీజేపీ) ఎవరి బొటనవేళ్లు కత్తిరిస్తున్నారో దేశానికి చూపించాలనుకున్నాంఈ క్రమంలోనే కులగణన మా తదుపరి అడుగు అయ్యిందికులగణనతో భారత్లో సరికొత్త అభివృద్ధికి బాటలు వేస్తాంఅలా రాజ్యాంగంలో ఉందా? చూపించండి: రాహుల్ గాంధీకుల, వర్ణ, వర్గ, లింగ.. వివక్ష రహిత సమాజం కొనసాగాలని రాజ్యాంగంలో ఉంది.కొన్నిరోజుల కిందట.. సంభల్ నుంచి కొందరు యువకులు నన్ను చూడడానికి వచ్చారుఅమాయకులైన ఐదుగురు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపబడ్డారుఅలా చంపేయమని రాజ్యాంగంలో రాసి ఉందా?మీరు ఎక్కడికి వెళ్లినా.. ఒక మతంతో మరొక మతానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వెదజల్లుతారు.హాథ్రస్ సామూహిక అత్యాచార బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించాబాధితులు మాత్రం ఇంటినుంచి బయటకు రాలేని పరిస్థితి.ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతాన్ని ఉసిగొల్పాలని, ఒక దళిత కుటుంబాన్ని బంధించాలని నేరాలు చేసిన వాళ్లను స్వేచ్ఛగా తిరిగేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?రాజ్యాంగంలో అలా ఎక్కడ రాశారు? నాకు చూపించండి.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తోంది. బీజేపీ మాత్రం దానిపై దాడి చేస్తూనే ఉంది లోక్సభలో రాజ్యాంగంపై చర్చ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంఅగ్నివీర్తో దేశ యువత బొటనవేలు తెంపేశారుదేశవ్యాప్తంగా 70 పేపర్ల లీకేజీ ఘటనలు వెలుగు చూశాయిపేపర్ లీక్లతో యువత బొటనవేలు తెంపేశారుఢిల్లీ సరిహద్దులో రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు.. రైతులపై లాఠీ ఛార్జీలు చేస్తున్నారువాళ్లు మిమ్మల్ని కోరేది మద్దతు ధర.. ఆ డిమాండ్ సబబైందేకానీ, అదానీ, అంబానీలను అందలం ఎక్కిస్తూ.. అన్నదాతల బొటనవేలు కూడా తెంపేశారుఅభయ ముద్రతో మేం(కాంగ్రెస్) ‘‘భయపడొద్దు’’ అని ప్రజలకు చెప్తుంటే.. మీరేమో వాళ్ల బొటనవేలు తెంచేస్తున్నారుఇదే మీకు మాకు ఉన్న తేడా! లోక్సభలో రాజ్యాంగంపై చర్చ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంఅనేకమంది మేధావుల లోచనలకు ప్రతిరూపం మన రాజ్యాంగందేశంలో ప్రజలు వివిధ రకాల సిద్ధాంతాలను పాటిస్తారుసావర్కర్ సిద్దాంతాలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్ విశ్వసించారురాజ్యాంగం, మనుస్మృతి వేర్వేరురాజ్యాంగం ఆధునిక భారత దస్త్రం.. కానీ, ప్రాచీన భారతం, దాని ఆలోచనలు అందులో ఉన్నాయిరాజ్యాంగాన్ని తెరిస్తే.. అంబేద్కర్, గాంధీ, నెహ్రూల ఆకాంక్షలు, ఆలోచనలు మనకు కనిపిస్తాయిసావర్కర్ గురించి ప్రశ్నిస్తే నన్ను దోషిగా చూస్తున్నారుమహాభారతంలోని కులవివక్షను ప్రస్తావించిన రాహుల్ గాంధీఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు విలువిద్య నేర్పమని వెళ్లాడునువ్వు మా జాతివాడివి కాదని ఏకలవ్యుడ్ని వెనక్కి పంపాడుద్రోణుడి ప్రతిరూపంతో ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడుద్రోణుడు కోరితే తన బొటనవేలును గురుదక్షిణగా ఇచ్చాడుద్రోణుడి మాదిరిగానే మీరు(కేంద్రాన్ని ఉద్దేశించి..) కూడా దేశ యువత బొటనవేలును కత్తిరిస్తున్నారు. #WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, "This is Abhayamudra. Confidence, strength and fearlessness come through skill, through thumb. These people are against this. The manner in which Dronacharya… pic.twitter.com/nIropoeCfq— ANI (@ANI) December 14, 2024#WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, "I want to start my speech by quoting what the Supreme Leader, not of the BJP but of the modern interpretation of the ideas of the RSS has to say about the… pic.twitter.com/eS7HGR8Ivp— ANI (@ANI) December 14, 2024 జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకం: కార్తీ చిదంబరం👉వన్ నేషన్ వన్ ఎలక్షన్పై, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. డీఎంకేతో సహా అనేక ప్రాంతీయ పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య నిర్మాణాన్ని తీసివేయడానికి ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం ఇది. రాష్ట్ర ఎన్నికలు ప్రజాస్వామ్యానికి చాలా మంచివి. రాష్ట్ర ఎన్నికలు రాజకీయ పార్టీలను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రజలకు అవకాశం ఇస్తాయి అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: On One Nation One Election, Congress MP Karti Chidambaram says, "The Congress party will oppose this proposal and many regional parties including the DMK oppose the proposal. It is yet another attempt by the government to take away the federal structure. Having… pic.twitter.com/kK2CfP1KFm— ANI (@ANI) December 14, 2024అలా చేయడం నియంతృత్వమే.. 👉జమిలి ఎన్నికలపై టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ..‘1966-68 వరకు ప్రతీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగింది. అందుకే అన్ని ఎన్నికలు కలిసి జరిగేవి. కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం ప్రారంభమైన తర్వాత వ్యవస్థ మారిపోయింది. సంకీర్ణాల వల్ల కొన్నిసార్లు ప్రభుత్వం పడిపోతుంది. ఇలాంటి నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవద్దు. ప్రతిపక్షంతో మాట్లాడకుండా దీనిని తీసుకురావడం నియంతృత్వం అవుతుంది.#WATCH | Delhi | On One Nation One Election, TMC MP Kirti Azad says, “Till 1966-68, all the elections used to happen together because the government used to run for 5 years. But then the system changed because coalition governments started forming and sometimes the government… pic.twitter.com/Cjiz5jzSNA— ANI (@ANI) December 14, 2024 👉దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అంశం లోక్సభలో చర్చకు వచ్చింది.. ఈ సందర్బంగా ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటరిచ్చారు. 👉లోక్సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. మన దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని ప్రతిపక్ష నేతలు ఎందుకు అంటున్నారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏ ఒక్క పార్టీ కోసమో చెప్పడం లేదు. నేను దేశం కోసం చెబుతున్నాను.👉యూరోపియన్ యూనియన్లోని సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ సర్వే ప్రకారం.. యూరోపియన్ యూనియన్లో 48% మంది ప్రజలు వివక్షకు గురయ్యారు. అందులో ముస్లింలు, హిందువులు, మైనారిటీలు కూడా ఉన్నారు. స్పెయిన్లో ముస్లింలపై వివక్ష ఎక్కువగా ఉంది. ముస్లింలపై అంతర్గత ద్వేషపూరిత నేరాల నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో కూడా పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాలను వెల్లడించారు. ఆప్ఘనిస్తాన్ సహా టిబెట్లో జరుగుతున్న పరిణామాలను సైతం చెప్పారు. అలాంటప్పుడు ఈ దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని ఎందుకంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. #WATCH | In Lok Sabha, Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "...A narrative is being created. According to the survey of the Center for Policy Analysis in European Union, 48% people in European Union have been victims of discrimination. Most of them are… pic.twitter.com/oqZVtpGLDn— ANI (@ANI) December 14, 2024👉రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఇరుపక్షాల మధ్య మధ్య ఇవాళ లోక్సభలో వాడీవేడి చర్చ జరగనుంది. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ మాట్లాడనున్నారు. 👉లోక్సభ చేపట్టిన రెండు రోజుల చర్చలో.. ఇవాళ కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. రాజ్యాంగంపై చర్చలో.. రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలూ మాట్లాడతారు. సాయంత్రం.. ఆఖర్లో ప్రధాని ప్రసంగంతో ఈ చర్చ ముగియనుంది. ఈ క్రమంలో నిన్న ప్రియాంక గాంధీ.. ఇవాళ రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకు, విమర్శలకు మోదీ స్పందించనున్నారు.👉పార్లమెంట్ వద్ద ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. విపత్తుకు గురైన వయనాడ్కు స్పెషల్ ప్యాకేటీ ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. హిమాచల్లో కూడా ఇలాంటి విపత్తే సంభవించింది. ఈ మేరకు సాయం కేంద్రాన్ని కోరాం. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాం. కానీ, విన్నపాన్ని వారు పట్టించుకోలేదు. విపత్తును కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అక్కడ నివస్తున్న వాళ్లు కూడా భారతీయలే అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "The government is refusing to give a special package to Wayanad. We have requested the Home Minister, we have written to the Prime Minister...Himachal Pradesh has also seen similar large-scale devastation and there is a… https://t.co/mIyBAQipwu pic.twitter.com/7xdie56kHH— ANI (@ANI) December 14, 2024👉తొలిరోజు.. శుక్రవారం బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. 👉ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. పార్లమెంట్లో తొలి ప్రసంగం చేసిన ఆమె.. బీజేపీపై ఎదురుదాడి చేశారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు.ఎల్లుండి జమిలి బిల్లు👉సోమవారం లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వన్ నేషనల్ వన్ ఎలక్షన్ బిల్ వెళ్లనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా సోమవారం లోక్సభ బిజినెస్లో లిస్ట్ జమిలి ఎన్నికల బిల్లును చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 82, 83, 172, 327కు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు రూపకల్పన చేశారు. 👉లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించారు. మధ్యలో అసెంబ్లీలు రద్దయినప్పటికీ మిగిలిన కాలానికే ఎన్నికల నిర్వహణ జరిగేలా బిల్లులో సవరణలు చేశారు. అసెంబ్లీలు ఉన్న ఢిల్లీ, జమ్మకశ్మీర్, పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాల కోసం మరొక సవరణ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. అపాయింటెడ్ డే తర్వాత ఒకే సారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేశారు. 👉ఇదిలా ఉండగా.. అపాయింటెడ్ డే 2029 కంటే ముందే ఉంటుందా? లేదా అనేదానిపై భిన్నమైన చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సహకరిస్తేనే జమిలి ఎన్నికల బిల్లు చట్ట రూపం దాల్చే అవకాశం ఉంది. -
ప్రతిపక్షాల ప్రశ్నల వర్షం.. ఉభయ సభలు వాయిదా
ఢిల్లీ : గత వారం రాజ్య సభలో కరెన్సీ నోట్ల కలకలంతో వాయిదా పడ్డ ఉభయ సభలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, సభ ప్రారంభమైన కొద్ది సేపటికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరు అంశాలను లేవనెత్తడంతో స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్య సభలో సైతం ప్రతిపక్ష నేతలు ఆందోళన కొనసాగుతుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. సభాసంప్రదాయాలను పక్కన పెట్టి జగదీప్ ధనఖడ్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. జైరాం రమేష్ వ్యాఖ్యలపై జగదీప్ ధనఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను మద్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఉభసభ సమావేశాల్లో ఇవాళ మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాటిల్లో 2024 రైల్వే బిల్లు (సవరణ) , 2024 విపత్తు నిర్వహణ బిల్లు (సవరణ), 2024 బ్యాంకింగ్ చట్టాల బిల్లు (సవరణ)లు ఉన్నాయి. సభ చివరి రోజు చర్చలో తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కి కేటాయించిన సీటు వద్ద రూ.50వేల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు లభ్యమవ్వడం కలకలం రేపింది. సభలో భద్రతా అధికారుల తనిఖీల్లో ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి అంటూ భారత ఉపరాష్ట్ర పతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ప్రకటించారు. విచారణకు ఆదేశించింది. ఈ ప్రకటనపై ఉభసభల్లో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కరెన్సీ నోట్లు ఎవరివో తేల్చకుండా సింఘ్వీకి కేటాయించిన సీటు వద్ద కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని ఎలా చెప్తారంటూ ప్రశ్నించాయి. దీనిపై ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి మొదలై డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి. -
లోక్సభలో టీడీపీ బండారం బయటపెట్టిన మిథున్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైఎస్సార్సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన అభియోగాలను.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇష్టానుసారం కథనాలతో వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాయి. అయితే.. ఈ కుట్రను తాజాగా లోక్సభలోనూ వైఎస్సార్సీపీ బయటపెట్టింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఇదే సమయంలో అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పార్టీ తరఫున ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘సోలార్ పవర్ విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుంది. అదానీతో ఒప్పందం చేసుకోలేదు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. చాలా తక్కువ రేటుకు మేము ఒప్పందం చేసుకున్నాం. 2021లో సోలార్ పవర్ 5.90 యూనిట్కు ఉంది. మేము 2.49కు మాత్రమే కొనడానికి ఒప్పందం చేసుకున్నాము. ఇటీవల కాలంలో కూడా ఐదు రూపాయలకు పైగా యూనిట్కు చెల్లించి పవర్ కొన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఒక వర్గం మీడియా, మేధావులు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చట్ట సభ దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో బ్యాంకింగ్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుంది. దేశంలో 62% జనాభా వ్యవసాయంపైన ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి తగిన చర్యలు కనిపించడం లేదు. రుణమాఫీ, అందుబాటులోని రుణాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదు. చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. చిన్నతరహ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే రుణాలకు సరైన విధానం రూపొందించాలి’ అని మిథున్ రెడ్డి సూచనలు చేశారు. -
45 ఏళ్ల తర్వాత మరణాలు.. చైనాపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. గత కొద్ది నెలలుగా రెండు దేశాల మధ్య నిరంతర దౌత్య చర్చల ఫలితంగా సంబంధాలు మెరుగైనట్టు ఆయన తెలిపారు. భారత సరిహద్దుల విషయంలో కూడా కీలక పురోగతి నెలకొందని చెప్పుకొచ్చారు.ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్..‘భారత్-చైనా సంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా జైశంకర్ పార్లమెంట్లో మాట్లాడుతూ..‘చైనా చర్యల కారణంగా 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం వాటిల్లింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని తెలిపారు.2020 ఏప్రిల్లో తూర్పు లడఖ్లోని కొన్ని ప్రాంతాలలో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గడిచిన 45 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా రెండు వైపులా మరణాలకు ఈ ఘర్షణ దారితీసింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన.. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు కోసం భారతదేశం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో లడఖ్లోని భారత సరిహద్దుల నుంచి చైనా బలగాలు, భారత సైన్యం వెనక్కి వెళ్లినట్టు ఆయన తెలిపారు. గతంలో 38 వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. వాస్తవాధీన రేఖకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఇరుదేశాలకు ఏకాభిప్రాయం లేదు. పరస్పరం అంగీకరించిన యంత్రాంగం ద్వారా శాంతియుతంగా సరిహద్దు సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో కూడా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పలు విషయాలపై చర్చించారు’ అని చెప్పుకొచ్చారు. లాజిస్టికల్ సవాళ్లు, కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ.. మన బలగాలు వేగంగా, సమర్థవంతంగా స్పందించి చైనాను కట్టడి చేశాయి. ఇలా తమ సామర్థ్యాలతో ఓ వైపు దీటుగా ప్రతిస్పందిస్తూనే, ఉద్రిక్తతలు తగ్గించడం కోసం పొరుగు దేశంతో దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నాలు చేశాం. సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా ఇరు దేశాల సంబంధాలు సాధారణంగా ఉండలేవని మన ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందన్నారు. వీటికి సంబంధించి భారత్కు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.#WATCH | In the Lok Sabha, EAM Dr S Jaishankar says "I rise to apprise the House of some recent developments in the India-China border areas and their implications for our overall bilateral relations. The House is aware that our ties have been abnormal since 2020 when peace and… pic.twitter.com/gmE3DECobq— ANI (@ANI) December 3, 2024 -
దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు.. ప్రధానికి ఎంపీ గురుమూర్తి లేఖ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఈ క్రమంలో దక్షిణ భారత్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని లేఖలో డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఈ డిమాండ్కు అందరూ సహకరించాలి ఆయన కోరారు.వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో గురుమూర్తి..‘దక్షిణ భారత్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఏడాదికి కనీసం రెండు పార్లమెంట్ సెషన్స్ దక్షిణ భారత రాష్ట్రాల్లో నిర్వహించాలి కోరారు. జాతీయ సమగ్రత దృష్ట్యా దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం మంచిదన్నారు.ఇదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సైతం ఈ అంశాలను భాషా పాలిత రాష్ట్రాలు అనే పుస్తకంలో ప్రస్తావించారని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అంశంపై విశాల దృక్పథంతో ఉండాలని నాటి ప్రధాని వాజ్పేయ్ కూడా చెప్పినట్టు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ డిమాండ్కు అందరూ సహకరించాలని కోరారు. -
మరోసారి పార్లమెంట్ ను కుదిపేసిన అదానీ వ్యవహారం
-
అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ
సాక్షి,ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఆదివారం(నవంబర్ 24) సమావేశమైంది. అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్లీడర్లతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి , లోక్ సభపక్ష నేత మిథున్రెడ్డి హాజరయ్యారు.పోలవరం ఎత్తు , ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు , విశాఖ స్టీలు ప్రైవేటీకరణ అంశాలను వైఎస్సార్సీపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తనున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నేతలు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పార్లమెంట్లో గళం విప్పనున్నారు.కాగా, సోమవారం(నవంబర్ 25) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. డిసెంబర్ 20దాకా సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు(జమిలి ఎన్నికలు) బిల్లులతో పాటు మరో 16 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వక్ఫ్, జమిలి ఎన్నికల చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: మహాయుతి దెబ్బకు ఎల్వోపీ సీటు గల్లంతు -
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. నవంబర్ 26(రాజ్యంగా దినోత్సవం)న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగం ఆమోదంపొంది 75 ఏళ్ల సందర్భంగా వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరగనున్న మొదటి పార్లమెంటు సమావేశాలు కావటం గమనార్హం. వక్ఫ్ బిల్లుకు వివాదాస్పద సవరణలు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు సంబంధించిన నిబంధనల బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ బిల్లు సవరణలను ప్రస్తుతం అధికార బీజేపీకి చెందిన జగదాంబిక పాల్ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తోంది. నవంబర్ 29లోగా కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంది. అయితే.. ప్రతిపక్ష ఎంపీలు లోక్సభ స్పీకర్కు లేఖ రాయడంతో జేపీసీ పనితీరు వివాదాస్పదమైంది.Hon’ble President, on the recommendation of Government of India, has approved the proposal for summoning of both the Houses of Parliament for the Winter Session, 2024 from 25th November to 20th December, 2024 (subject to exigencies of parliamentary business). On 26th November,… pic.twitter.com/dV69uyvle6— Kiren Rijiju (@KirenRijiju) November 5, 2024 -
అమిత్ షా Vs అఖిలేష్.. స్పీకర్ చైర్పై కామెంట్స్
ఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సందర్భంగా లోక్సభలో కేంద్ర హోంమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీజేపీపై అఖిలేష్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ అని విమర్శించారు. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.కాగా, పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నేడు సభలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణలన్నీ కూడా కేవలం ఒక సాకు మాత్రమే. కేంద్రంలోని బీజేపీ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ ప్రయోజనాల కోసం పథకం అనే దాంట్లో ఇది మరో లింక్ మాత్రమే. వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.#WATCH | Samajwadi Party MP Akhilesh Yadav speaks in Lok Sabha on Waqf (Amendment) Bill, 2024 "Yeh bill jo introduce ho raha hai woh bahut sochi samjhi rajneeti ke tehat ho raha hai...Speaker sir, I heard in the lobby that some of your rights are also going to be taken away and… pic.twitter.com/sy7PRW6I04— ANI (@ANI) August 8, 2024ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లాపై కూడా అఖిలేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మా హక్కులు, స్పీకర్ హక్కుల కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. బీజేపీ నేతలు స్పీకర్ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి జడ్డీగా వ్యవహరించే మీ హక్కులు కూడా వారే తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేశారు. ఇక, అఖిలేష్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటరిచ్చారు. సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘ఇది స్పీకర్ చైర్ను అవమానించడమే. స్పీకర్ హక్కులు ప్రతిపక్షానికి చెందవు. సభ మొత్తానికి చెందుతాయి. ఇష్టానుసారం మాట్లాడకండి. మీరు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. చైర్పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదన్నారు. -
Vinesh Phogat Row: రాజకీయ రగడ
ఢిల్లీ: ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత అంశం.. రాజకీయ రగడకు దారి తీసింది. ఈ అంశంపై లోక్సభలో చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనతో సంతృప్తి చెందని విపక్షాలు అభ్యంతరం చెబుతూ సభ నుంచి వాకౌట్ చేశాయి.వినేశ్ ఫోగట్ అనర్హతపై కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘అనర్హత అంశంలో తగు చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషాను ప్రధాని మోదీ ఆదేశించారు. ఈరోజు ఆమె బరువు 50 కిలోలు 100 గ్రాములు ఉన్నట్లు గుర్తించి అనర్హత వేటు పడింది. భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష పారిస్లో ఉన్నారు. ప్రధాని మోదీ ఆమెతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు’అని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఆమెకు వ్యక్తిగత సిబ్బందితో సహా ప్రతి సౌకర్యాన్ని అందించిందని చెప్పారు. మరోవైపు.. క్రీడామంత్రి వివరణ ఇస్తున్న సమయంలో ఈ అంశంలో పూర్తి వివరణ ఇవ్వాలని పట్టుపట్టారు. అనంతరం నిరసనలు తెలుపుతూ విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి.#WATCH | Union Sports Minister Mansukh Mandaviya speaks on the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024He says, "…Today her weight was found 50 kg 100 grams and she was disqualified. The Indian Olympic Association has lodged a strong… pic.twitter.com/7VkjoQQyIM— ANI (@ANI) August 7, 2024మరోవైపు.. రాజ్యసభలో కూడా వినేశ్ ఫోగట్ అనర్హత అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుపట్టారు. ఇదీ చదవండి: వినేష్ ఫోగట్ అనర్హత.. కుట్రా? కఠిన వాస్తవమా?ఫోగట్కు న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. అనంతరం రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు రెజ్లర్ వినేశ్ ఫోగట్కు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.#WATCH | Delhi | INDIA bloc MPs stage protest at Makar Dwar of Parliament seeking justice for wrestler Vinesh Phogat after disqualification from Paris Olympics pic.twitter.com/8qZ6GqjbeT— ANI (@ANI) August 7, 2024కోచ్లు, ఫిజియోథెరపిస్టులు ఏం చేశారు: పంజాబ్ సీఎంవినేశ్ ఫోగట్ అనర్హతపై పంజాబ్ సీఎంభగవంత్ మాన్ సింగ్ స్పందించారు. ఆమె బరవును చెక్ చేయాల్సిన పని కోచ్, ఫిజియోథెరపిస్టులది. ఇప్పుడు అనర్హత పడింది. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్లు, ఫిజియోథెరపిస్టులకు లక్షల్లో జీతం ఇస్తున్నారు. వారేమైనా సెలవుల కోసం అక్కడికి వెళ్లారా?’ అని మండిపడ్డారు.#WATCH | Charkhi Dadri, Haryana | On Vinesh Phogat's disqualification, Punjab CM Bhagwant Mann says," To check her weight was the work of her coaches and physiotherapists. Now, the decision has come. This injustice should have been stopped...Did they (The Centre) fix anyone's… pic.twitter.com/0UmPHc7s4Q— ANI (@ANI) August 7, 2024 వినేశ్పై అనర్హత విచారకరం: రాహుల్ గాంధీ ప్రపంచ చాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్కు చేరిన వినేశ్ భారత్కు గర్వకారణం. సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం విచారకరం. భారత ఒలింపిక్ సంఘం ఈ నిర్ణయాన్ని గట్టిగా సవాలు చేస్తుందని ఆమెకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం’అని రాహుల్ గాంధీ ఎక్స్లో అన్నారు. పట్టు వదలకుండా ఆమె మళ్లీ రంగంలోకి దిగుతుందనే నమ్మకం ఉంది. వినేశ్ దేశం గర్వించేలా చేశావు. దేశం మొత్తం మీకు మద్దతుగా నిలుస్తోంది తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హావినేశ్ ఫోగట్ చాలా అర్హత నిబద్ధత గల క్రీడాకారిణి. ఒలింపిక్స్లో రెజ్లింగ్ ఫైనల్స్కు చేరుకున్న మొదటి భారతీయ మహిళ. ఆమె ఒక ప్రపంచ ఛాంపియన్ను ఓడించారు. ఫైనల్స్లో మరొక ప్రపంచ ఛాంపియన్తో బరిలోకి దిగాల్సింది. ఆమె అనర్హత భారతీయులందరికీ, వినేష్ ఫోగట్ మద్దతుదారులందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని అన్నారు.#WATCH | On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, TMC MP Shatrughan Sinha says, "She is a very deserving and committed athlete. She became the first Indian woman to reach the wrestling finals in the Olympics. She defeated a world champion and… pic.twitter.com/3dFMnLKOAT— ANI (@ANI) August 7, 2024అనర్హత వేటు నేపథ్యంలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. భారత దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొంటున్నారు.ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగట్పై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో వినేశ్ ఫొగట్కు ప్రధాని మోదీ అండగా నిలిచారు. వినేశ్. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్. భారత్కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరే స్పూర్తి. ఒలింపిక్స్లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.వినేశ్ ఫోగట్ అనర్హత విషయంలో ఆమెకు లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలు అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.సంబంధిత వార్త: వినేశ్ ఫొగట్పై వేటు: ప్రధాని మోదీ కీలక ఆదేశాలు -
రాజ్యసభలో అమితాబ్ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలో భాగంగా రాజ్యసభలో శుక్రవారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. సభలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ఆమె తన భర్త అమితాబ్ పేరును ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన ఎంపీలు నవ్వుతూ కనిపించారు. అయితే సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వాహించాగా.. ఆమె అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తనను ‘‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’అంటూ చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ మహిళలకు సొంతంగా గుర్తింపు లేదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.Watch 🔥 🔥 🔥Vice-president Jagdeep Dhankhar Ji enjoying the meltdown with his witty relies.🤣🤣🤣🤣🤣 pic.twitter.com/N6SMykvQg0— Alok (@alokdubey1408) August 2, 2024 ఈ నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్ బచ్చన్గా పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆమె అబితాబ్ ప్రస్తావన తీసుకురాగనే జగదీప్ ధన్ఖడ్ పగలబడి నవ్వారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేదు. అందుకే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే మీకు ఆహారం అరగదేమో’అంటూ చమత్కరించారు. దానికి ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సైతం అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. ‘వాస్తవానికి బ్రేక్ సమయంలో లంచ్ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’అంటూ సమాధానం ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి. -
లోక్సభలో గందరగోళం
updatesవయనాడ్ జల విలయంపై లోక్ సభలో కాంగ్రెస్ సావధాన తీర్మానంమధ్యాహ్నం లోక్ సభలో చర్చ లోక్సభలో గందరగోళంఅనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం.కులగణనపై వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్అనురాగ్కు వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ మంగళవారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేపాయి. అవి రాహుల్ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యసభలో బీజేపీ విప్గా ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ నియామకం అధికార భాషా కమిటీకి ఎన్నిక కోసం కేంద్ర మంత్రి అమిత్ షా తీర్మానం చేయనున్నారు.Parliament Session Live: Amit Shah to move motion for election to Committee on Official LanguageRead @ANI Story | https://t.co/7FRazcYhbP#ParliamentSession #AmitShah pic.twitter.com/FLKeCljX2S— ANI Digital (@ani_digital) July 31, 2024 మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్వయనాడ్ వరదలు దురదృష్టకర సంఘటన, ఇది జాతీయ విపత్తువయనాడ్లో పరిస్థితిని చాలా సీరియస్గా తీసుకున్నాం.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్లో పర్యటిస్తారు.పార్టీ కార్యకర్తలు పునరావాస పనుల్లో నిమగ్నమయ్యారు.రాజ్యసభలో వయనాడ్ వరదల అంశాన్ని లేవనెత్తుతాం.కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి. పార్లమెంట్లోని సంవిధావ్ సధన్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంపార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశం ప్రారంభంసమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలువాయనాడ్ మృతులకు, రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్లో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీMoment of silence for the lives lost in the Wayanad landslide and the three UPSC aspirants in Delhi who lost their lives due to flooding, held at the Central Hall, Parliament House, New Delhi.(General Body meeting of CPP in Central Hall, Samvidhan Sadan, Parliament House, New… https://t.co/4c3XFlvFXv— ANI (@ANI) July 31, 2024 కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారుసరిహద్దు పరిస్థితులు, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని ఆయన లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అస్సాం వరదలపై కాంగ్రెస్ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిందిలోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ అసోంలో వరద నిర్వహణ సమస్యను లేవనెత్తుతూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు Congress Deputy Leader in Lok Sabha Gaurav Gogoi moved an Adjournment Motion notice to raise ‘flood management issue in Assam’ pic.twitter.com/MosFDood6m— ANI (@ANI) July 31, 2024 -
భర్త పేరుతో పిలవటంపై ఎంపీ జయా బచ్చన్ అసహనం
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సోమవారం సీనియర్ నటీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను భర్తతో పేరుతో కాకుండా జయా బచ్చన్ అని పిలిస్తే చాలని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్తో అన్నారు. సోమవారం రాజ్యసభలో ఎస్పీ రాజ్యసభ సభ్యురాలైన ఆమెను మాట్లాడావల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్.. ‘శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ, ప్లీజ్’ అని కోరుతారు. అయితే స్పీకర్ పూర్తి పేరుతో పిలవడంపై జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే చాలని ఆమె స్పీకర్కు బదులు ఇచ్చారు. అయితే దీనిపై డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ.. మీపేరు పార్లమెంట్ రికార్డుల్లో అధికారికంగా జయా అమితాబ్ బచ్చన్ అని ఉందని తెలిపారు. పార్లమెంట్ రికార్డుల్లో ఎలా రాసిఉందో.. అలాగే తాను పిలిచినట్లు డిప్యూటీ స్పీకర్ అన్నారు. అయినప్పటికీ జయా బచ్చన్ అభ్యంతం తెలిపారు. ‘‘ఇది చాలా కొత్తగా ఉంది. మహిళలను వారి భర్తలపేరుతో గుర్తించటం. భర్త పేరు లేకుండా గుర్తించడానికి మహిళలకు వారి సొంతం ఉనికి, సాధించిన విజయాలు ఉండవా?’’ అని ఆమె అన్నారు.Watch: "It's a very painful incident and we should not bring politics into the matter," says Samajwadi Party MP Jaya Bachchan on the death of the UPSC student in Old Rajinder Nagar pic.twitter.com/4928QcZoNS— IANS (@ians_india) July 29, 2024అనంతరం ఆమె ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి వరదనీరు పోటెత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై మాట్లాడారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. ఈ విషయంలో రాజకీయలను తీసుకురాము’ అని జయా బచ్చన్ అన్నారు. -
పార్లమెంట్లో వయనాడ్ విలయంపై కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటన
updates:ప్రతినేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడారు.ఈరోజు తెల్లవారుజామున, వయనాడ్ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 70 మందికి పైగా మరణించారు. ముండక్కై గ్రామం ఊడ్చిపెట్టుకుపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం స్థాయిని అంచనా వేయడానికి రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. మరణించిన వారికి తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ పరిహారాన్ని కూడా పెంచండి.రవాణా, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించండి. వీలైనంత త్వరగా సహాయాన్ని అందించండి. బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్మ్యాప్ను సిద్ధం చేయండి. పశ్చిమ కనుమల్లో గత కొన్నిఏళ్లుగా కొండచరియలు విరిగిపడటం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.వయనాడ్ విలయంపై పార్లమెంట్లో కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటనప్రధాని మోదీ కేరళ సీఎం విజయన్ మాట్లాడారు. కేంద్ర అండగా ఉంటుందని భోరోసా ఇచ్చారు.కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయిఘటానాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం.#WATCH | Wayanad landslide: In Rajya Sabha, Union Minister JP Nadda says, "Discussions began here and all the Members expressed their concern over the massive tragedy that has occurred there. I would like to say this is a tragedy of not just Kerala alone, but the entire nation is… pic.twitter.com/xgDNA73S9R— ANI (@ANI) July 30, 2024 Live: Parliament Session: Congress gives Adjournment Motion notice in Lok Sabha on Wayanad landslidesLIVE @ANI | https://t.co/n7jkluCMdz#ParliamentSession #WayanadLandslide #Congress pic.twitter.com/H5m6K2ly28— ANI Digital (@ani_digital) July 30, 2024 వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డ విపత్తుపై లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది జనగణన ఆలస్యంపై చర్చ జరపాలని లోక్భలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. జన గణన ఆలస్యం వల్ల మహిళా రిజర్వేషన్ అమలు ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ నోటీసులో పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.సరిహద్దు పరిస్థితి, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని కోరారు.Congress MP Manish Tewari gives Adjournment Motion notice in Lok Sabha, 'to have a discussion on the border situation and the huge trade deficit with China'. pic.twitter.com/Hh08uiwp8Y— ANI (@ANI) July 30, 2024 ఇవాళ లోక్ సభలో బడ్జెట్పై చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు. -
Parliament: కోచింగ్ వ్యాపారంగా మారిపోయింది: రాజ్యసభ చైర్మన్
Updatesరావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లోక్సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా విషాదకరం.ఒక తెలివైన అభ్యర్థి సివిల్స్ సాధించి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వస్తారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు చాలా కలలు కంటారు. కానీ, ఇలాంటి ఘటనలు వారి హృదాయాన్ని ముక్కలు చేస్తాయి. నష్టపరిహాం ఇచ్చే విషయమే అయినా.. ఎంత నష్టం పరిహారం ఇచ్చినా అభ్యర్థులు కోల్పోయిన జీవితానికి తిరిగి ఇవ్వలేం. ఇటవంటి ఘటనలు జరగకుండా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. భవనం కోడ్లు, అగ్నిమాపక భద్రత, వరద భద్రత వంటి విషయాల్లో ప్రాథమిక నిబంధనల ఉల్లంఘిస్తున్నారు.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, Congress MP Shashi Tharoor says, "It's a shocking situation and I have to say that when you have a brilliant student all the dreams of serving the nation through the UPSC exam have been shattered and the hopes… pic.twitter.com/gAv9wTJGsu— ANI (@ANI) July 29, 2024 రావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. ఈ ఘటనకు ప్లాన్, ఎన్ఓసీ ఇచ్చిన అధికారులే బాధ్యత వహించాలి. దీనంతటికీ అసలు ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారులుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఒకే అక్రమం భవనం కాదు. యూపీలో అక్రమ భవనాలను బుల్డోజర్తో కూల్చటం చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఢిల్లీలో బుల్డోజర్తో చర్యలు చేపడుతుందా? లేదా?అని ప్రశ్నించారు.#WATCH | Old Rajinder Nagar incident | "It's a painful incident. It's the responsibility of the officers to plan and provide NOCs, the question is who all are responsible and what actions are being taken against them. It's not just a single case of illegal building, we are seeing… pic.twitter.com/JH7gXphzGg— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్సభలో బీజేపీ ఎంపీ భానుశ్రీ స్వరాజ్ మాట్లాడారు. సివిల్స్ ప్రివేర్ అవుదామని ఢిల్లీకి వచ్చిన అభ్యర్థుల మృతికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆమ్ ఆద్మీ పార్టీ పాలన యంత్రాంగం నిర్లక్ష్యంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. వరదల విషయంలో రాజేంద్ర నగర్ ప్రాంత ప్రజలు ఎన్నొసార్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆయన చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై హోం మంత్రిత్వ శాఖ ఓ కమిటి ఏర్పాటు చేసిన దర్యాప్తు చేయలని కోరుతున్నా.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, BJP MP Bansuri Swaraj says, "...Those students were in Delhi for the preparation of IAS examinations, but sadly I have to say that due to criminal negligence of Delhi govt, those students have lost their… pic.twitter.com/2alk7SPBDH— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మాట్లాడారు. నాకు రూల్ 267 కింద నోటీసులు అందాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల విషాద మరణంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.‘‘కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయి. ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయి. ఈ అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ సముచితమని భావిస్తున్నాం. దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్ఛాంబర్ మీటింగ్ ఏర్పాటుచేయాలి’’ అని ధన్ఖడ్ అన్నారు. #WATCH | Delhi's Old Rajinder Nagar incident | Rajya Sabha to have a discussion on the death of 3 UPSC aspirants. Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I have received notices under Rule 267...They have demanded a discussion on the tragic death of UPSC… pic.twitter.com/MyEezLrlKh— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో శివసేన(యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ నోటీసులు ఇచ్చారు. మహారాష్ట్రలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు.Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi gives Suspension of Business notice under Rule 267 in Rajya Sabha, over alleged rampant corruption in infrastructure projects in Maharashtra. pic.twitter.com/VS3wL6XRXO— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ ఘటనపై దద్దరిల్లనున్న పార్లమెంట్కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అమర్ సింగ్ లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని, సభలో వివరణ ఇవ్వాలని కోరారాయన. Congress MP Dr Amar Singh moves Adjournment Motion in Lok Sabha 'demanding accountability for death of IAS aspirants in Delhi’s coaching centre' pic.twitter.com/4k1cdh4nB9— ANI (@ANI) July 29, 2024 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో జమ్ము కశ్మీర్ అప్రోప్రియేషన్ (నం 3) బిల్లును ఇవాళ ప్రవేశపెట్టనున్నారుNirmala Sitharaman to move J-K Appropriation (No 3) Bill in Lok Sabha; Budget discussion to continue in Parliament todayRead @ANI Story | https://t.co/WKrumWYWrp#BudgetSession #NirmalaSitharaman #LokSabha pic.twitter.com/zDkjVNcTpA— ANI Digital (@ani_digital) July 29, 2024 కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైనాతో సరిహద్దు పరిస్థితి, భారీ వాణిజ్య లోటుపై చర్చను డిమాండ్ చేశారు.#ParliamentMonsoonSession | Congress MP Manish Tewari gives adjournment motion notice in Lok Sabha, demands discussion on "the border situation and huge trade deficit with China." pic.twitter.com/G7VJolxgx0— ANI (@ANI) July 29, 2024 నేడు లోక్సభ, రాజ్యసభ బడ్జెట్పై చర్చ కొనసాగనుంది. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చలో ఇవాళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. జూలై 22న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. -
కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి 75 వేల రూపాయలకు పెంపు... కొత్త పన్నుల విధానం శ్లాబుల్లో స్వల్ప మార్పులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
PM Narendra Modi: ప్రధాని గొంతే నొక్కజూస్తారా!
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అందుకు పార్లమెంటును కూడా దురి్వనియోగం చేసే ప్రయత్నంలో పడ్డాయని మండిపడ్డారు. ఆ క్రమంలో ప్రధానమంత్రి గొంతునే నొక్కే పోకడలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్పై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలను పక్కన పెట్టి వచ్చే ఐదేళ్లలో దేశాభివృద్ధి కోసం పారీ్టలన్నీ ఒక్కతాటిపైకి రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘పార్లమెంటు ఉన్నది ఏదో ఒక్క పార్టీ కోసం కాదు. మొత్తం దేశం కోసం’’ అంటూ విపక్షాలను ఉద్దేశించి హితవు పలికారు. ‘‘మళ్లీ 2029 జనవరిలో మరోసారి లోక్సభ ఎన్నికల క్షేత్రంలోకి దిగండి. కావలిస్తే అందుకు పార్లమెంటును కూడా వాడుకోండి. అప్పటిదాకా ప్రజా సంక్షేమం కోసం పాటుపడదాం’’ అని పిలుపునిచ్చారు. విపక్షాల తీరు మారాలి సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని విపక్షాల తీరుతో ఆయా పార్టీల ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశమే రాలేదని మోదీ అన్నారు. ‘‘ఇది విచారకరం. అన్ని పారీ్టలు సభ్యులందరికీ, ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన వారికి మాట్లాడే అవకాశమివ్వాలి. తొలి సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగించాయి. దాంతో 140 కోట్ల భారతీయుల ఆదేశంతో ఎన్నికైన ప్రభుత్వ స్వరం పదేపదే మూగబోయింది. ఇవి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. నిజానికి ప్రతికూల రాజకీయాలకు మన పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడూ స్థానం లేదు’’ అన్నారు.ఇది అమృతకాల బడ్జెట్ మేం ప్రవేశపెట్టబోతోంది అమృతకాల బడ్జెట్. వచ్చే ఐదేళ్లకే గాక 2047 నాటికి వికసిత్ భారత్ను సాకారం చేసుకునే కలకు పునాది. -
Big Question: పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు కేసులపై మోదీకి ప్రశ్న
-
లోక్సభలో అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతోన్న చర్చలో.. ఎన్డీయే కూటమిపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. మంగళవారం లోక్సభలో ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్.. యూపీ ఫలితాలతో పాటు పేపర్ లీక్, ఈవీఎంల అంశం గురించి మాట్లాడారు.‘‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా చెప్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’’ అని అన్నారు. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈవీఎంలపై నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. మాకు యూపీలో 80కి 80 లోక్సభ సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక నీట్ అవకతవకలపై మాట్లాడుతూ.. ‘‘అసలు పేపర్ లీక్లు ఎందుకు జరుగుతున్నాయి? యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది’’ అని మండిపడ్డారు. -
ఇది డిమాండ్ కాదు ఏపీ ప్రజల హక్కు
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి సంబంధించిన పలు కీలకాంశాల్ని ప్రస్తావించారాయన. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది డిమాండ్ కాదు.. ఏపీ ప్రజల హక్కు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు టీడీపీకి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్య పార్టీగా ఉంది. కాబట్టి, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలి. అన్యాయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలి’’ అని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులపైనా ఆయన స్పందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు వారాలు గడిచింది. అప్పటి నుంచి ఆ పార్టీ వైఎస్సార్సీపీ శ్రేణులుపై దారుణంగా దాడులు చేస్తోంది. ఏపీలో శాంతి స్థాపనతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. 👉 పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి👉 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలి👉 ఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను వైయస్ జగన్ స్థాపించారు. తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. 👉 రైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండి. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలి👉 రైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలి. రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. భద్రత చర్యలను వెంటనే అప్ గ్రెడ్ చేయాలి👉 రైల్వే జోన్ కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించింది. నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలి👉 విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను వెంటనే పూర్తి చేయాలి👉 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలి. విశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలిఇదీ చదవండి: అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా అడగరా?: ఎంపీ తనూజ -
నీట్ అంశంపై దద్దరిల్లిన లోక్సభ.. సోమవారానికి వాయిదా
Live Updates..👉లోక్సభలో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. 👉నీట్పై చర్చకు విపక్ష నేతలు పట్టు. నీట్పై చర్చకు ప్రధాని మోదీ రావాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. .👉సభలో నినాదాలు దద్దరిల్లడంతో లోక్సభ సోమవారానికి వాయిదా👉రాజ్యసభలో నీట్పై గందరగోళం నెలకొంది. 👉సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. వాయిదా అనంతరం ఉభయ సభలు ప్రారంభం.👉నీట్పై చర్చకు డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు.. లోక్సభలో గందరగోళం👉 ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా #WATCH | Lok Sabha adjourned til 12 noon. LoP Rahul Gandhi raised NEET issue and demanded, along wth Opposition MPs, that the matter be discussed. Speaker Om Birla insisted that discussion on Motion of Thanks to President's Address be taken up first.LoP says, "...We wanted to… pic.twitter.com/p63AOqGOuN— ANI (@ANI) June 28, 2024 Rajya Sabha adjourned till 12 noon. Rajya Sabha LoP Mallikarjun Kharge raised the NEET issue along with Opposition MPs, that the matter be discussed. pic.twitter.com/6qyxbR4SJY— ANI (@ANI) June 28, 2024 👉పార్లమెంట్ సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. 👉రెండు సభల్లో నీట్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో, గందరగోళం నెలకొంది. 👉అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 👉నీట్పై రాజకీయాలొద్దు..👉నీట్పేపర్పై సమగ్ర చర్చ జరగాలి👉ఆ తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించాలి.👉నీట్ పేపర్ లీకులపై లోక్సభలో చర్చకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం👉వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్👉పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ విఫలంపై చర్చకు డిమాండ్ చేసింది👉పార్లమెంట్ సమావేశాలు నేడు(ఐదో రోజు) కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు సభలో ప్రతిపక్షాలు ‘నీట్’ అంశంపై చర్చించే అవకాశం ఉంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వంపై విరుచుకుపడే ఛాన్స్ ఉంది.👉సమాచారం మేరకు.. ఉభయ సభలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. శుక్రవారం లోక్సభలో ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని ప్రస్తావిస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇవ్వనున్నారు. 👉ఇక, నిన్న ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వం స్పందించాల్సిన సమయం. మేము నీట్ అంశంపై చర్చ కోసం కట్టుబడి ఉన్నాము అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కూడా లోక్సభ సభ్యులు ప్రమాణం సందర్భంగా సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఎన్డీయే కూటమి సభ్యులు ప్రమాణానికి వెళ్తున్న సమయంలో నీట్.. నీట్.. అంటూ నినాదాలు చేశారు. ఇదిలాఉండగా.. నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారీ సంఖ్యలో విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. -
నీట్ పేపర్ లీక్ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 18వ లోక్సభ కొలువుదీరడంతో.. ఆనవాయితీ ప్రకారం గురువారం ఉదయం ఆమె పార్లమెంట్కు విచ్చేసి ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి తన ప్రసంగం వినిపించారు. అదే సమయంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ విజయాలను, రాబోయే ఐదేళ్ల కాలపు లక్ష్యాలను.. పలు కీలకాంశాలను ఆమె తన ప్రసంగం ద్వారా చదివి వినిపించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా (లోక్సభ సభ్యులు) సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించింది. జమ్ముకశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈసారి కశ్మీర్ లోయలో మార్పు కన్పించింది. శత్రువుల కుట్రలకు అక్కడ ప్రజలు గట్టిగా బదులిచ్చారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొనడం విశేషం. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు రూ.3.20లక్షల కోట్లు ఇచ్చాం. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. ఈ రోజుల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా భారత్ ఉత్పత్తులు అందిస్తోంది. ఆరోగ్య రంగంలో దేశం అగ్రగామిగా ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది గేమ్ ఛేంజర్గా నిలుస్తోంది. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కింద సేవలు కల్పిస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. నారీమణుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఈ రంగంలో భారీగా పెట్టబడులు పెట్టాం. ప్రపంచ వృద్ధిలో భారత్ 15శాతం భాగస్వామ్యం అవుతోంది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా రోడ్ల విస్తరణ జరుగుతోంది. పౌర విమానయాన రంగంలో పలు మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. డిజిటల్ ఇండియా సాధనకు ప్రభుత్వం సంకల్పించింది. బ్యాంకుల క్రెడిట్ బేస్ పెంచి వాటిని బలోపేతం చేశాం. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణలు రావాలి. మన బలగాలు స్వయంసమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి. అత్యయిక స్థితి నాటి రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. కానీ అటువంటి రాజ్యాంగ విరుద్ధ శక్తులపై వ్యతిరేకంగా దేశం విజయం సాధించింది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు విభజన శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఏ చర్యనైనా మనమంతా తీవ్రంగా ఖండించాలి. పేపర్ లీకేజీ అంశంపైనా.. ఇటీవల నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్ లీక్లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ముర్ము తెలిపారు.అంతకు ముందు.. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి ప్రథమ పౌరురాలు ప్రసంగం చేశారు. 18వ లోక్సభకు ఎన్నికైన సభ్యులను అభినందించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం.. ప్రధాని మోదీ ఎంపీలను రాష్ట్రపతి ముర్ముకు పరిచయం చేశారు. -
ఇది చాలా పవిత్రమైన రోజు: మోదీ
-
Parliament Session: లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం
పార్లమెంట్ సమావేశాలు.. అప్డేట్స్ ఏపీ నుంచి వైఎస్సార్సీపీ నాయకురాలు గుమ్మా తనుజా రాణి హిందీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.మీ అందరి ఆశీస్సులతో.. జగనన్న దీవెనలతో ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. pic.twitter.com/DqRcsYMdc5— Dr Gumma Thanuja Rani (@ArakuPalguna) June 24, 2024 పార్లమెంట్ భవనం మెట్లు దిగుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె.సురేష్ను ఆప్యాయంగా పలికరించారు.#WATCH | Delhi: Congress MPs KC Venugopal and K Suresh, and Union Minister-BJP MP Giriraj Singh share a candid moment on the staircase of the new Parliament building. pic.twitter.com/po1LQqqJLg— ANI (@ANI) June 24, 2024 తెలుగులో బండి సంజయ్ ప్రమాణంతెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bandi Sanjay Kumar and Sukanta Majumdar take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/re8wf295RF— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు జి. కిషన్రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers G Kishan Reddy and Chirag Paswan take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/aUiSfimQyU— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, గజేంద్ర షెకావత్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bhupender Yadav and Gajendra Singh Shekhawat take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/BAXUduVIVt— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Minister and BJP MP Dharmendra Pradhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/9rcS4OSwkj— ANI (@ANI) June 24, 2024 ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw— ANI (@ANI) June 24, 2024 లోక్సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister and BJP MP Piyush Goyal takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/Ls4hhIIDbb— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Shivraj Singh Chouhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/nZpQ0GGxmz— ANI (@ANI) June 24, 2024 కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18 లోక్సభ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Nitin Gadkari takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/XMLofSCdX8— ANI (@ANI) June 24, 2024 అమిత్ షా ఎంపీగా ప్రమాణంహోంమంత్రి అమిత్ షా ఎంపీగా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Home Minister Amit Shah takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3rlhhGKLbJ— ANI (@ANI) June 24, 2024 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Defence Minister Rajnath Singh takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/GDJFlyqkth— ANI (@ANI) June 24, 2024 ఎంపీగా మోదీ ప్రమాణంమొదటగా నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ ఎంపీ ప్రమాణం చేయించారు.#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0— ANI (@ANI) June 24, 2024 రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం రాజీనామాను ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆమోదించారు.Pro-tem Speaker Bhartruhari Mahtab accepts the resignation of Congress leader Rahul Gandhi from Wayanad Lok Sabha seat.Rahul Gandhi kept the Raebareli Lok Sabha seat. pic.twitter.com/rFoya8nCJb— ANI (@ANI) June 24, 2024 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన 18వ లోక్సభప్రమాణం చేయనున్న ఎంపీలులోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్మొదట ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీపార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీఇది చాలా పవిత్రమైన రోజుఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నాఎంపీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలిమాకు మూడోసారి వరుసగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామూడోసారి ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కిందికొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలివికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి#WATCH | PM Narendra Modi says, "...The 18th Lok Sabha is starting today. The world's largest election was conducted in a very grand and glorious manner... This election has also become very important because for the second time after independence, the people of the country have… pic.twitter.com/bASHVtfh3S— ANI (@ANI) June 24, 2024 ఆ ఖర్మ నాకు పట్టలేదు: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీ ఎన్నికయ్యాహ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉందిమా పార్టీ అధినేత వైయస్ జగన్కు ధన్యవాదాలురాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తాజాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాంరాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు పట్టలేదుకూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారుగతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారువైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారువైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతారాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదేసాక్షి టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి మరికాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఎంపీలుగా ప్రమాణం చేయనున్న సభ్యులుప్రధాని మోదీ సహా 280 మంది ప్రమాణంమోదీ తర్వాత కేంద్ర మంత్రులుఆ తర్వాత ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా సభ్యుల ప్రమాణంనేడు ఏపీ, రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణంప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణంలోక్సభ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేసిన భర్తృహరి మెహతాబ్భర్తృహరితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము#WATCH | Delhi: BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker of the 18th Lok SabhaPresident Droupadi Murmu administers the oath pic.twitter.com/VGoL5PGEkT— ANI (@ANI) June 24, 2024ఎన్డీయే అలా ముందుకు..పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని భావిస్తున్న ఎన్డీయేసభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరే అవకాశంస్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరనున్న బీజేపీ అగ్రనేతఅమిత్ షా లేదంటే రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యే ఛాన్స్ ఐక్యంగా ఇండియా కూటమిపార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఐక్యత చాటాలని ఇండియా కూటమి నిర్ణయంగతంలో గాంధీ విగ్రహం ఉన్న గేట్-2 వద్ద భేటీఐక్యంగా పార్లమెంట్లోకి ఎంట్రీప్రొటెం స్పీకర్ ఎంపిక నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశంనీట్పైనా కేంద్ర ప్రభుత్వాన్నినిలదీసే ఛాన్స్సంబంధిత వార్త: ప్రొటెం స్పీకర్కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?! కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణం18వ లోక్సభ తొలి సమావేశంనేడు, రేపు ఎంపీలుగా సభ్యుల ప్రమాణ స్వీకారంసభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ఎల్లుండి స్పీకర్ ఎన్నికడిప్యూటీ స్పీకర్ పోస్టు ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎవరికి వెళ్తుంది? అనే దానిపై చర్చ27న ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం -
ప్రొటెం స్పీకర్కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?!
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పద్దెనిమిదవ లోక్సభ ఇవాళ తొలిసారి భేటీ కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయడం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం.. నేపథ్యాలతో నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంట్లో ఇవాళ, రేపు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఇండియా కూటమి ఎంపీలు కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సీనియర్ ఎంపీలు కే సురేష్(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), బీజేపీ ఎంపీలు రాధా మోహన్ సింగ్.. ఫగ్గాన్ సింగ్ కులాస్తే, సుదీప్ బంధోపాధ్యాయ(టీఎంసీ)లను ప్రొటెం స్పీకర్ సహాయ ప్యానెల్లో సభ్యులుగా నియమించారు.అయితే ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ నియామకాన్ని ఇండియా కూటమి తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. సభలో సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే భర్తృహరిని ఎంపిక చేశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రొటెం స్పీకర్ ప్యానెల్లోని బీజేపీ ఎంపీలిద్దరు తప్ప మిగతా ముగ్గురు.. భర్తృహరికి సహకరించొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. పార్లమెంట్సమావేశాలు ఈ ఉదయం 11గం. ప్రారంభం కానున్నాయి. అరగంట ముందుగానే పార్లమెంట్ కాంప్లెక్స్ గేట్ నంబర్ 2 వద్ద ఇండియా కూటమి ఎంపీలు చేరుకుంటారు. తమ ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకేసారి పార్లమెంట్లోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ గేట్ వద్దే ఎంపీలు నిరసన తెలిపే గాంధీ విగ్రహం ఉండేది. ఆ తర్వాత గాంధీ విగ్రహంతో పాటు మిగతా వాటిని ‘ప్రేరణ స్థల్’ కి ఏర్పాటు చేశారు. లోక్సభ సమావేశాల్లో.. తొలుత భర్తృహరి మెహతాబ్తో ప్రోటెం స్పీకర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఎంపీలంతా పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. 18వ లోక్సభ ప్రారంభానికి ముందు.. కాసేపు ఎంపీలంతా మౌనం పాటించి కుర్చీల్లో కూర్చుంటారు.ముందుగా ఆనవాయితీ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు సహా మొత్తం 280 మంది ఎంపీలు ఇవాళ ప్రమాణం చేస్తారు. రేపు మిగతా ఎంపీలు ప్రమాణం చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఇవాళ ఏపీ, రేపు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఇక.. స్పీకర్ ఎన్నిక 26వ తేదీన ఉండనుంది. ఇక 27వ తేదీన రాష్ట్రపతి ముర్ము లోక్సభ-రాజ్యసభ సభల సభ్యుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇదిలా ఉంటే.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నాలు సాగిస్తోంది ఎన్డీయే కూటమి. ఈ క్రమంలోనే ఓం బిర్లా కే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని విపక్ష కూటమి కోరే అవకాశాలున్నాయి. సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.డిప్యూటీ స్పీకర్ విషయంలో.. 2014లో అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది ఎన్డీయే కూటమి16 వ లోకసభ లో (2014లో) ఏఐఏడిఎంకే కి చెందిన తంబిదొరై డిప్యూటీ స్పీకర్గా నియమితులయ్యారుఅయితే 17 వ లోకసభ లో (2019 లో ) మాత్రం ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది -
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఆయనేనా?
సాక్షి, ఢిల్లీ: రేపు(సోమవారం) నుంచి 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. భర్తృహరి మెహతాజ్ను ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు. ఇక, జూన్ 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నికల జరుగనుంది.కాగా, ప్రొటెం స్పీకర్గా ఎంపికైన మెహతాజ్.. రేపు, ఎల్లుండి కొత్త ఎన్నికైన లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపించనున్నారు. తొలిరోజు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు సహా 280 మంది ఎంపీలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు తెలంగాణ సహా మిగిలిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.ఇక, జూన్ 26న లోకసభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరోవైపు.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నం చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. ఓం బిర్లాకే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని విపక్ష కూటమి కోరుతున్నట్టు తెలుస్తోంది.సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి ఇస్తారు. 2014లో అన్నాడీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇచ్చింది. 16వ లోక్సభలో తంబిదొరై డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇక, 17వ లోక్సభ(2019)లో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికీ ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉంది. ఇదిలా ఉండగా.. జూన్ 27వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు. -
పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు అయింది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటాయి. అదే విధంగా రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి జూలై 3 వరకు జరుగుతాయి.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ, రాజ్యసభలను ఉద్దేశించి జూన్ 27న ప్రసంగించనున్నారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో చేసే పాలన గురించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎన్నికైన కేంద్ర మంత్రులను పార్లమెంట్కు పరిచయం చేయనున్నారు. -
24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకూ జరుగనున్నాయి. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరడంతో లోక్సభ కార్యకలాపాలు నిర్వహించడానికి స్పీకర్ను ఎంపిక చేయడంతోపాటు నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో తొలి రెండు రోజులు సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్గా కాంగ్రెస్ సభ్యుడు కొడికొన్నిల్ సురేశ్ వ్యవహరించనున్నట్లు సమాచారం.లోక్సభలో ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడు వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి లోక్సభకు ఎన్నికైన వారిలో కొడికున్నిల్ సురేశ్, గత సమావేశాల్లో ప్రొటెం స్పీకర్గా వ్యవహరించిన వీరేంద్రకుమార్ ఖతిక్(బీజేపీ) ఎనిమిదేసి పర్యాయాలు ఎంపీలుగా నెగ్గారు. వీరేంద్రకుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కారణంగా కొడికున్నిల్ సురేశ్కు ప్రొటెం స్పీకర్గా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎంపిక జరుగనుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జేడీ(యూల) లోక్సభ సభాపతి పదవి కోసం పట్టుపడుతున్నప్పటికీ ఆ స్థానానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ అందుకు అంగీకరించడం లేదు. స్పీకర్ పోస్టును వదులుకోబోమని చెబుతోంది. గత సమావేశాలకు సభాపతిగా పనిచేసిన ఓం బిర్లాతోపాటు పలువురి పేర్లను బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. మరోవైపు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు వస్తున్నాయి. -
పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి
సాక్షి,ఢిల్లీ : కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్క్ దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుని బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా, కేబినెట్ సభ్యులు, సహాయ మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు సైతం పూర్తయింది. ఇక, లోక్సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఎనిమిది రోజులపాటు కొనసాగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జూన్ 24 నుంచి 25 ఈ రెండు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎంపిక జరగనుంది.స్పీకర్ రేసులో ఎవరున్నారంటే? రాజస్థాన్ కోట లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత ఓం బిర్లా 2019 నుంచి 2024 వరకు లోక్సభకు 17వ స్పీకర్గా పనిచేశారు. అయితే ఇటీవల సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో లోక్సభకు 18వ స్పీకర్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు లోక్సభ స్పీకర్గా పనిచేసిన ఓం బిర్లా స్థానంలో కొత్తగా ఎన్నికైన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్లమెంట్ సభ్యులను లోక్సభ స్పీకర్గా ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ లోక్సభ స్పీకర్ పదవి కోసం టీడీపీ,ఏపీ బీజేపీ, జేడీయూ పోటీపడుతున్నాయి. -
ఇంతకన్నా మంచి మార్గాలు లేవా?
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అంతరాయం కలిగించినందుకు గాను లోక్సభ, రాజ్యసభల్లో 141 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంటులో ప్రతిష్టంభన కొత్తేమీ కాదు. ఈ అంతరాయాలు మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా ఉన్న విధానపరమైన స్తబ్ధత కారణంగా ఏర్పడుతున్నాయి. ఎంపీలను శిక్షించడం ద్వారా పరిష్కరించగల క్రమశిక్షణా సమస్యగానే దీన్ని చూస్తున్నారు. మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటులో తగిన స్థానం లేదు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని వారు డిమాండ్ చేయవచ్చు. అయితే వాటిని అంగీకరించాలా వద్దా అన్నది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. ప్రతిపక్షం కూడా ఉభయ సభల్లో చర్చకు ఎజెండాను సిద్ధం చేసేలా విధానాల్లో మార్పు రావటం అవసరం. పార్లమెంటరీ వ్యవస్థ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం, వివాదాస్పద అంశాలపై చర్చించడానికి విధానపరమైన యంత్రాంగాలు లేకపోవడమే. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ప్రస్తుత ప్రతిష్టంభన ఫలితంగా ఇది కనివిని ఎరుగని పరిస్థితికి దారితీసింది. పార్లమెంటు శీతాకాల సమా వేశాలకు అంతరాయం కలిగించినందుకు గాను లోక్సభ, రాజ్య సభల్లో 141 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. పార్లమెంటులో భద్రతా లోపంపై హోంమంత్రి ప్రకటన చేయా లని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంటు భద్రత అనేది సున్ని తమైన అంశమనేది ప్రభుత్వ వైఖరి. ఇది లోక్సభ సెక్రటేరియట్ పరిధిలోకి వస్తుంది. స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలను ప్రభుత్వం అనుసరిస్తుంది. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ విచారిస్తోందని సభకు స్పీకర్ తెలియజేశారు. అఖిలపక్ష సమావేశంలో వచ్చిన కొన్ని సూచనలను అమలు చేశారు. పార్లమెంటులో ప్రతిష్టంభన కొత్తేమీ కాదు. మన పార్లమెంటులో రాజకీయ పార్టీ/కూటమి పాత్రతో సంబంధం లేకుండా, చాలా సంవ త్సరాలుగా ఒక సుపరిచిత కథనం వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఒక ముఖ్యమైన అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి కానీ ప్రభుత్వం తప్పించుకుంటోంది. నిజానికి ఈ రోజు మనం చూస్తున్న అంత రాయాలు, క్రమశిక్షణా ప్రతిస్పందనలు... మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా ఉన్న విధానపరమైన స్తబ్ధత కారణంగా ఏర్పడుతున్నాయి. ఎంపీలు మన పార్లమెంటరీ కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం 1960వ దశకంలో మొదలైంది. తాము ముఖ్యమైనవిగా భావించిన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడానికి సభాపతి తమకు తగిన అవకాశం ఇవ్వడం లేదని భావించిన కొందరు ఎంపీలు ఈ పనిలోకి దిగారు. మూడవ లోక్సభ (1962–67) సభ్యులు రామ్ సేవక్ యాదవ్, మనీరామ్ బాగ్రీ వంటి ఎంపీలు పార్లమెంటరీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పీకర్ పదేపదే హెచ్చరించేవారు. వివిధ సందర్భాల్లో పదేపదే అంతరాయం కలిగించడంతో సభ నుండి వారిని ఏడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. లోక్సభ తన కార్య కలాపాల నుండి మినహాయించిన మొదటి పార్లమెంటేరియన్లు వారే కావచ్చు. మూడవ లోక్సభ తన పదవీకాలం ముగిసే సమయానికి, ఏకంగా ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసింది. మన పార్లమెంటరీ చర్చలలో అంతరాయాలు ఆనవాయితీగా మారబోతున్నాయని ఇది సూచించింది. అప్పటి నుండి, ఎంపీలు పార్లమెంటు కార్యకలా పాలకు అంతరాయం కలిగించిన ఘటనలు, దాని కోసం క్రమశిక్షణకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కాలక్రమేణా, పార్లమెంటరీ అంతరాయాలు నెమ్మదిగా రాజకీయ సాధనంగా మారాయి. ఈ మారుతున్న ధోరణి గురించి పలువురు సభాపతులు నొక్కి చెప్పారు. ‘చాలా సందర్భాలలో, సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. అవి యాదృచ్ఛికంగా జరగలేదు. ఉద్దేశపూర్వకంగా అరుస్తూ, సభ వెల్లోకి ప్రవేశించడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయడం, పార్లమెంటు పనిచేయడా నికి అనుమతించకూడదనే ఉద్దేశమే ఇక్కడ కనబడుతోంది’ అన్నారు 14వ లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ. కానీ మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటులో తగిన స్థానం లేదు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని వారు సూచించవచ్చు, డిమాండ్ చేయవచ్చు. అయితే వాటిని అంగీకరించాలా వద్దా అన్నది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. పైగా సమస్యంతా అందులోనే ఉంది. ప్రతిపక్ష ఎంపీలు సభలో మాట్లాడలేకపోతే, అది నిరంతరం అంతరాయాలకు దారి తీస్తుంది. ఇప్పటివరకు, సంస్థాగత ప్రతిస్పందన ఏమిటంటే, అంతరాయం కలిగించే ఎంపీలను శిక్షించ డమే. కానీ ఇటీవలి సంఘటనలు చూపించినట్లుగా, ఈ విధానం పనిచేయనిదిగా మారింది. పైగా, అంతరాయానికి చెందిన స్వభావం క్రమంగా పరిణామం చెందినప్పటికీ, పార్లమెంట్ సంస్థాగత ప్రతిస్పందన సరళంగానే ఉంటూ వచ్చింది. ఏమాత్రం మారలేదు. ఎంపీలను శిక్షించడం ద్వారా పరిష్కరించగల క్రమశిక్షణా సమస్యగానే ఇది ఇప్పటికీ అంతరా యాలను చూస్తుంది. సమస్యలో కొంత భాగం పార్లమెంటును మనం చూసే విధానంలో కూడా ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు మన జాతీయ శాసన సభను ప్రభుత్వ వ్యవహారాల కోసం ఉద్దేశించిన ఒక సంస్థగా రూపొందించారు. రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటును సమావేశపరిచే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. పార్లమెంటరీ ప్రక్రియ నియమాలు ఈ ఆలోచనా విధానాన్ని బలపరిచాయి. ఈ నియమాలు స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ మూసపై ఆధారపడి ఉన్నాయి. వలస ప్రభుత్వ వ్యవహారాలకు ప్రాధాన్యత ఉండేలా చూడటం వారి ఉద్దేశం. ఈ భావనకు అదనంగా, వెస్ట్మినిస్టర్ పార్ల మెంటరీ సూత్రం ప్రకారం, పార్లమెంటును సజావుగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. దేశంలో అత్యున్నతమైన శాసన నిర్మాణం, జవాబుదారీతనం ఉన్న ప్రాతినిధ్య సంస్థను చూసే లోపభూయిష్ట మార్గం ఇది. ఇది పార్లమెంట్ ఎజెండాను నిర్ణయించే అధికారాన్ని, దానిలో ఏయే అంశాలు చర్చకు వస్తాయో నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. నిజానికి చట్టసభలు అనేవి సహకార స్థలాలు. ఇక్కడ ఖజానా(ప్రభుత్వం), ప్రతిపక్షాలు రెండూ కలిసి దేశానికి మంచి ఫలితం కోసం పని చేయాలి. ఎన్నికైన ప్రభుత్వ పాత్ర ఏమిటంటే శాసన, ఆర్థికపరమైన ప్రాధాన్యతలను నిర్ణయించడం. ప్రతిపక్షాల బాధ్యత ఆ ఆలోచనలను వ్యతిరేకించడం లేదా ప్రత్యామ్నాయాలను సూచించడం, అంతరాలను ఎత్తి చూపడం ద్వారా వాటిని బలోపేతం చేయడం. ఈ విధానం ఇప్పుడు ఆచరణ సాధ్యం కానిదిగా మారింది. సభను నడపటం సభాపతికి సాధ్యం కాదని 2005లో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వ్యాఖ్యానించారు. ‘సభ్యుల సమూహం సభలను నడపనివ్వకుండా మొండిగా వ్యవహరిస్తే, దానిని నియంత్రించడం చాలా కష్టం.’ పార్లమెంటు సమర్థవంతంగా పనిచేయాలంటే ఎంపీలను శిక్షించడం సరిపోదు. ప్రతిపక్షం కూడా ఉభయ సభల్లో చర్చకు ఎజెండాను సిద్ధం చేసేలా విధానాల్లో మార్పు రావటం అవసరం. ప్రస్తుతం, ముఖ్యమైన శాసనపరమైన, విధానపరమైన అంశాలను చర్చించడానికి ప్రైవేట్ సభ్యులకు మాత్రమే ప్రతి శుక్రవారం రెండున్నర గంటల సమయం లభిస్తుంది. అయితే, పార్లమెంటులో నిర్దిష్ట చర్చ జరగాలని ఎంపీల బృందం కోరే యంత్రాంగం లేదు. చర్చను బలవంతం చేయడానికి వారికి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం, అవిశ్వాస తీర్మానమే. బహుశా, పార్లమెంటు సమావేశాల క్యాలెండర్లో ప్రతి పక్షాల కోసం నిర్దిష్ట రోజులను చేర్చడం గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. హౌస్ ఆఫ్ కామన్్స లాగా, ప్రతిపక్షాలు ముఖ్య మైనవిగా భావించే సమస్యలపై చర్చించడానికి ఈ రోజులను కేటాయించవచ్చు. పార్లమెంటులో ఇటీవలి అంతరాయాలు, చాలామంది ఎంపీల సామూహిక సస్పెన్షన్ మన జాతీయ శాసనసభకు మేల్కొలుపు పిలుపు అనే చెప్పాలి. అత్యున్నత చర్చా వేదికగా పార్లమెంటు ఖ్యాతి ప్రమాదంలో ఉందని ఈ సంఘటనలు నొక్కి చెబుతాయి. చర్చను పెంపొందించడానికి పార్లమెంటు మెరుగైన పరిష్కారాలను కను గొనవలసి ఉంటుంది. లేదంటే దానిపై ప్రజల విశ్వాసం నెమ్మదిగా క్షీణించే ప్రమాదం ఉంది. చక్షు రాయ్ వ్యాసకర్త పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్లో పనిచేస్తున్నారు. -
పార్లమెంట్.. విపక్షాలది ఫ్రస్ట్రేషన్: మోదీ
Parliament Winter Session 2023 Updates ►లోక్సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టెలికమ్యునికేషన్ బిల్లు-2023 పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi writes to Lok Sabha Speaker Om Birla, expressing his "deep concern about the Telecominniocation Bill 2023. In its current form, the Bill raises several serious concerns that have the potential to negatively impact the future of… pic.twitter.com/81nSyleKma — ANI (@ANI) December 19, 2023 ►కేంద్ర వస్తు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు- 2023 లోక్సభలో ఆమోదం పొందింది. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్-2023ని లోక్సభలో ప్రవేశపెట్టారు. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్పై మిమిక్రీ చేయడం సభ హక్కులను దిక్కరించడమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. "Contemptible": Kiren Rijiju slams Rahul Gandhi for filming TMC's Kalyan Banerjee mimicking Rajya Sabha Chairman Read @ANI Story | https://t.co/B5BomJ328f#KalyanBanerjee #RajyaSabha #RahulGandhi pic.twitter.com/6wQgyUPRrW — ANI Digital (@ani_digital) December 19, 2023 ► ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షాలు ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నాయని ప్రధాని మోదీ చురకలు అంటించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. Venting out frustration after poll routs: PM Modi calls out Oppn for 'political spin' to Parliament security breach Read @ANI Story | https://t.co/r9FJB4hexS#BJP #PMModi #Parliament pic.twitter.com/dP60IxCqg3 — ANI Digital (@ani_digital) December 19, 2023 ►పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి సభాధ్యక్షున్ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. #WATCH | "Ridiculous, unacceptable", says Jagdeep Dhankhar after TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman and Congress MP Rahul Gandhi films the act. pic.twitter.com/F3rftvDmhJ — ANI (@ANI) December 19, 2023 ఎన్సీఆర్ ఢిల్లీ సవరణ బిల్లు, సీజీఎస్టీ సవరణ బిల్లులకు లోక్సభ ఆమోదం #WATCH | National Capital Territory of Delhi Laws (Special Provisions) Second (Amendment) Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. pic.twitter.com/dmAXVkSdtp — ANI (@ANI) December 19, 2023 పార్లమెంట్ నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ లోక్సభ, రాజ్యసభల నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ ఇవాళ ఒక్కరోజే లోక్సభ నుంచి 49 మంది ఎంపీల సస్పెన్షన్ నిన్న 33 మంది ఎంపీలు..అంతకుముందు 13 మంది సస్పెన్షన్ లోక్సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీల సస్పెండ్ ఈ సెషన్లో మొత్తం 141 మంది ఎంపీలు బయటికి More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 అపోజిషన్ ముక్త్ పార్లమెంట్కు బీజేపీ ప్రయత్నం : శశి థరూర్ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి చర్చ లేకుండా బిల్లులు పాస్ చేసుకోవాలనుకుంటోంది పార్లమెంట్ డెమొక్రసీకి ఇవాళ చచ్చిపోయింది #WATCH | On suspension of more than 40 MPs from Lok Sabha, including his own, Congress MP Shashi Tharoor says, "...It is clear that they want an Opposition-mukt Lok Sabha and they will do something similar in Rajya Sabha. At this point, unfortunately, we have to start writing… pic.twitter.com/mh9LeXEgiB — ANI (@ANI) December 19, 2023 లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల నినాదాల మధ్య లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా ప్లకార్డులు ప్రదర్శించవద్దని కోరిన స్పీకర్ పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి స్టేట్మెంట్కు విపక్షాల పట్టు గాంధీ విగ్రహం వద్ద ఖర్గే, శరద్పవార్ నిరసన 92 మంది ఎంపీల సస్పెన్షన్పై విపక్షాల ఆందోళన పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నేతల నిరసన #WATCH | Opposition MPs including NCP's Sharad Pawar and Congress' Mallikarjun Kharge stage protest in front of Gandhi Statue in Parliament premises, after the suspension of 92 MPs for the remainder of the ongoing winter session pic.twitter.com/WKzk0xa1TP — ANI (@ANI) December 19, 2023 పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతల భేటీ పార్లమెంట్ సమావేశాల బహిష్కరించాలని నిర్ణయించిన పార్టీలు ఒక్కరోజే ఉభయ సభలో 78 మంది ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాల ఆగ్రహం మొత్తం 92 మంది ఎంపీలపై పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు సస్పెండైన ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని నిర్ణయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు నేడు పార్లమెంటులో కీలక బిల్లులు ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు నిన్న విపక్ష ఎంపీల సస్పెన్షన్ తో సాఫీగా సభా కార్యక్రమాలు జరిగే చాన్స్ సస్పెన్షన్పై పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టనున్న విపక్ష ఎంపీలు లోక్ సభలో బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరు మార్పు ఐపీసీని భారత న్యాయ సంహితగా పేరు మార్పు సిఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహితగా చేంజ్ ఎవిడెన్స్ యాక్టుకు భారత సాక్ష బిల్లుగా నామకరణం కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన హిందీ పేర్లతో వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందంటున్న విపక్షాలు -
లోక్సభ ఘటన నిందితులకు కస్టడీ
Live Updates.. లోక్సభ ఘటన నిందితులకు కస్టడీ నలుగురు నిందితులకు కస్టడీ విధింపు ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించిన కోర్టు పార్లమెంట్ సమావేశాల్లో.. బుధవారం మధ్యాహ్నాం అలజడి సృష్టించిన ఇద్దరు బయట నినాదాలతో మరో ఇద్దరి నిరసన లోక్సభ రేపటికి వాయిదా సభ్యుల నిరసనలతో లోక్సభ రేపటికి వాయిదా ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన స్పీకర్ ఓం బిర్లా సభా నియమాలను ఉల్లంఘన, సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారనే ఈ నిర్ణయం తిరిగి శుక్రవారం ఉదయం 11గం. ప్రారంభం కానున్న లోక్సభ రాజ్యసభ మళ్లీ వాయిదా సభ్యుల నినాదాలు, ఆందోళనల నడుమ 3గం. ప్రారంభమైన రాజ్యసభ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ సస్పెన్షన్ ప్రకటన తర్వాత వాయిదా పడ్డ సభ ఓ'బ్రియన్ చేష్టలు సిగ్గుచేటుగా అభివర్ణించిన చైర్మన్ ధన్కడ్ చైర్మన్ ఆదేశాల్ని ధిక్కరించారని మండిపాటు గంటపాటు వాయిదా పడిన రాజ్యసభ.. 4గం. ప్రారంభం అయ్యే ఛాన్స్ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ లోక్సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు సస్పెండ్ తీర్మానం ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సస్పెండ్ అయిన ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్ జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్ ఈ రకమైన దురదృష్టకర సంఘటనలు మొదటి నుండి జరుగుతున్నాయి: ప్రహ్లాద్ జోషి నినాదాలు చేయడం, కాగితాలు విసిరివేయడం గ్యాలరీ నుంచి దూకడం కొందరు చేస్తున్నారు: ప్రహ్లాద్ జోషి లోక్ సభా నియమాలను ఉల్లంఘించినందుకు, సభా కార్యకలాపాలకు అడ్డుపడినందుకు ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్లో ఫుల్ ఆంక్షలు పార్లమెంటులో అడుగడుగునా ఆంక్షలు లోక్సభలో నిన్నటి భద్రత వైఫల్యంతో ప్రతిబంధకాలు విధించిన సిబ్బంది పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు ఢిల్లీ పోలీస్, ప్యారా మిలిటరీ , పార్లమెంటు స్పెషల్ సెక్యూరిటీ గార్డులతో పహార సందర్శకుల అన్ని రకాల పాసులు రద్దు ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని సస్పెండ్ చేసిన పార్లమెంట్ సెక్రటేరియట్ ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని విపక్షాల డిమాండ్ టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్పై సస్పెన్షన్ రాజ్యసభలో టీఎంసీ పక్ష నేత డెరెక్ ఒబ్రెయిన్పై సస్పెన్షన్ రాజ్యసభ వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేసినందుకు సస్పెన్షన్ వేటు ఒబ్రెయిన్ సస్పెన్షన్పై విపక్షాల ఆందోళన సభా కార్యక్రమాలు మధ్యాహ్నానికి వాయిదా Rajya Sabha adopts motion for suspension of TMC MP Derek O' Brien for the remainder part of the winter session for "ignoble misconduct" As per the Rajya Sabha Chairman, Derek O' Brien had entered the well of the House, shouted slogans and disrupted the proceedings of the House… pic.twitter.com/bXmFL8W5Vv — ANI (@ANI) December 14, 2023 ►విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా Lok Sabha adjourned till 2pm amid sloganeering by Opposition MPs over yesterday's security breach incident. The opposition MPs also demanded the resignation of Union Home Minister Amit Shah over the incident Lok Sabha Speaker Om Birla said "all of us are concerned" about what… pic.twitter.com/P20jMqEfO9 — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్లో దాడి ఘటనపై లోక్సభలో గందరగోళం ►దాడి ఘటనపై లోక్సభలో అమిత్ షా మాట్లాడాలని విపక్షాల డిమాండ్. దాడి బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు. ►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. పార్లమెంట్ భద్రతా సిబ్బంది సస్పెండ్ పార్లమెంట్లో దాడి నేపథ్యంలో కేంద్రం సీరియస్ పార్లమెంట్ సిబ్బందిపై చర్యలు పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కారణమైన ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ Lok Sabha Secretariat has suspended total eight security personnel in yesterday's security breach incident. — ANI (@ANI) December 14, 2023 ►కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశం. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్తో మోదీ భేటీ. Prime Minister Modi holds meeting with senior ministers. Union Home Minister Amit Shah, BJP National President JP Nadda, Union Ministers Prahlad Joshi and Anurag Thakur present. — ANI (@ANI) December 14, 2023 ►ఖర్గే చాంబర్లో సమావేశమైన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు. లోక్సభలో దాడి నేపథ్యంలో సభలో వ్యహరించాల్సిన వ్యూహంపై చర్చ. #WATCH | Opposition leaders meet in the chamber of Leader of Opposition in Rajya Sabha Mallikarjun Kharge, in Parliament pic.twitter.com/dPU8tdeAn9 — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు. భద్రత ఉల్లంఘనపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీస్ ఇచ్చిన ఎంపీ రాజీవ్ శుక్లా. లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి. Congress MP Rajeev Shukla gives Suspension of Business Notice in Rajya Sabha under rule 267 and demands a discussion on Dec 13 security breach incident in Parliament — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్లో దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ►కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఘటన జరిగింది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ఎటువంటి ప్రకటనలు లేవు, ఈ ఘటనపై సభలో చర్చ జరగాలన్నారు. #WATCH | Congress MP Adhir Ranjan Chowdhury on December 13 Parliament security breach incident "Such a big incident has happened and till now there have been no statements from the PM and the Union Home Minister. There should be a discussion on this incident..." pic.twitter.com/H8T6Qm9wc4 — ANI (@ANI) December 14, 2023 ►ఈ ఘటనపై ఇండియా కూటమి పార్లమెంటరీ పక్షనేతల సమావేశం ►పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతల చర్చ ►లోక్సభలో దాడి ఘటనను వివరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరిన కూటమి నేతలు ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు Congress MP Manickam Tagore gives Adjournment Motion notice in Lok Sabha demanding a discussion on the Parliament security breach incident and a reply from the Union Home Minister on the issue — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్లో దాడి ఘటన నేపథ్యంలో అక్కడ భద్రతను పెంచారు. ►నూతన పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఆగంతకులు లోక్సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు ఉండగా.. పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. ►పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఏపీఏ), ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. #WATCH | Congress MP Adhir Ranjan Chowdhury on December 13 Parliament security breach incident "Such a big incident has happened and till now there have been no statements from the PM and the Union Home Minister. There should be a discussion on this incident..." pic.twitter.com/H8T6Qm9wc4 — ANI (@ANI) December 14, 2023 -
పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అంశంలో కీలక పరిణామం
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, బిధూరి వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పార్టీ అగ్రనాయకత్వం రమేష్ బిధూరికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వివాదాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభా హక్కుల కమిటీకి నివేదించారు. రమేష్ బిధూరి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు విపక్ష ఎంపీలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో, వీరి ఫిర్యాదులను బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ సారధ్యంలోని సభా హక్కుల కమిటీకి స్పీకర్ పంపించారు. ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేసినందుకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు. लोकसभा अध्यक्ष @ombirlakota जी का आभार,उन्होंने दानिश अली प्रकरण में @LokSabhaSectt की कमिटि को जॉंच का ज़िम्मा सौंपा ।आज यह इसलिए संभव हो पाया क्योंकि लोकसभा में भाजपा का बहुमत है,नहीं तो पहले लोकसभा ने 2006 में RJD-JDU-congress का जूता व माईक मारपीट,2012 में सोनिया गांधी जी की… — Dr Nishikant Dubey (@nishikant_dubey) September 28, 2023 ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరికి కాషాయ పార్టీ కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్ధాన్లోని టోంక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్గా రమేష్ బిధూరిని నియమించడం పట్ల బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్వేష వ్యాఖ్యలు చేసే వారికి బీజేపీ పట్టం కడుతుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టోంక్లో ముస్లిం జనాభా 29 శాతమని, రాజకీయ లబ్ధి కోసం విద్వేష విషం వెదజల్లుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. VIDEO | "I am waiting for the Speaker (Lok Sabha) to take action in this matter. I hope he will definitely take action," says BSP MP @KDanishAli on the issue of derogatory comments made against him by BJP Ramesh Bidhuri in Lok Sabha. pic.twitter.com/ULJKqudtnm — Press Trust of India (@PTI_News) September 28, 2023 ఇది కూడా చదవండి: భారత తొలి ప్రధాని నెహ్రు కాదు.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ -
నారీలోకానికి నీరాజనం!
చిరకాలంగా మహిళాలోకం ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందటంతో పార్లమెంటు ఆమోదముద్ర లభించినట్టయింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభమయ్యాక జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావటం, దీన్ని దాదాపు అన్ని పక్షాలూ ఏకగ్రీవంగా ఆమోదించటం ఒక అరుదైన సన్నివేశం. మహిళా కోటాకు లోక్సభలో బుధవారం 454 మంది అనుకూలంగా ఓటేయగా, కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. రాజ్యసభలో హాజరైన మొత్తం సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందించితీరాలి. దశాబ్దాలుగా నేతల ఎన్నికల ప్రచార సభల్లో... చానెళ్ల చర్చల్లో మాత్రమే వినబడుతూ చట్టసభల్లో మాత్రం కనబడని బిల్లుకు ప్రాణప్రతిష్ట చేసి, పట్టాలెక్కించి అన్ని పార్టీలనూ అంగీకరింపజేయటం చిన్న విషయమేమీ కాదు. అయితే జనాభా లెక్కల సేకరణ, దాని ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చాకే కోటా అమలవుతుందనటం నిరాశ కలిగించే అంశం. ఏతావాతా 2029 తర్వాత మాత్రమే ఇది ఆచ రణలోకొస్తుంది. అంటే... మరో ఆరేళ్ల వరకూ దీనికి మోక్షం కలగదు! విస్తట్లో అన్ని పదార్థాలూ వడ్డించి, తినడానికి ఇంకా ముహూర్తం ఆసన్నం కాలేదని చెప్పినట్టయింది. స్వాతంత్య్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడిచాక మాత్రమే మహిళా కోటా సాకారం కాగా, దాని అమలుకు మరింత సమయం పడుతుందనటం ఏమాత్రం భావ్యంకాదు. ఈ బిల్లు ఆమోదంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం మరొకటుంది. ఇరవైయ్యేడేళ్ల క్రితం తొలిసారి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఓబీసీ వర్గాల వాటా నిర్ధారించాలని బలహీనవర్గాలు పట్టుబట్టాయి. చట్టసభలో మాత్రమే కాదు... వెలుపల సైతం అనేక ప్రజాసంఘాలు ‘కోటాలో కోటా’ గురించి డిమాండు చేస్తూనే ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు గడిచాక కూడా ఆ విషయం తేల్చకుండానే బిల్లు ఆమోదం పొందటం మనం ఆచరిస్తున్న విలువలను పట్టి చూపుతుంది. బిల్లుపై అన్ని పార్టీలనూ ఒప్పించిన అధికార పక్షానికి ‘కోటాలో కోటా’ గురించి నిర్దిష్టంగా తేల్చటం అంత కష్టమైన పనేమీ కాదు. ఎందుకనో ఆ పని చేయలేదు. మహిళా కోటా బిల్లుకు తామే ఆద్యులమని, యూపీఏ ప్రభుత్వ కాలంలో 2010లో దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందామని కాంగ్రెస్ నేత సోనియాగాంధీ చెబుతున్నారు. కానీ ఆ బిల్లుకూ, ఇప్పుడు ఆమోదం పొందిన బిల్లుకూ సంబంధం లేదు. అసలు మహిళా కోటా బిల్లుకు అంతకన్నా పూర్వ చరిత్ర చాలా ఉంది. తొలిసారి 1996లో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టగా, ఆ మరుసటి ఏడాది వచ్చిన ఐకె గుజ్రాల్ సర్కారు సైతం బిల్లు దుమ్ము దులిపింది. అప్పుడే ఓబీసీ కోటా సంగతేమిటన్న చర్చ మొదలైంది. వాజపేయి హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరసగా 1998, 1999, 2002, 2003 సంవత్సరాల్లో మహిళా కోటా బిల్లును గట్టెక్కించాలని ప్రయత్నించింది. కానీ ఓబీసీ కోటా విషయంలో దుమారం రేగి ఆగిపోయింది. 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. కానీ లోక్సభలో ఎస్పీ, బీఎస్పీ తదితర పక్షాలు ‘కోటాలో కోటా’ కోరుతూ అడ్డుకున్నాయి. ఇప్పుడు ఓబీసీ కోటా తేల్చాలని చెబుతున్న కాంగ్రెస్ నేతలు తమ హయాంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారో సంజాయిషీ ఇవ్వాలి. మరోపక్క కోటా చట్టంగా రూపుదిద్దుకున్న నాటినుంచి కేవలం పదిహేనేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ లెక్కన 2029 వరకూ అమలే సాధ్యం కాని చట్టం మరో తొమ్మిదేళ్లపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పొడిగింపు సంగతి ఏమవుతుందన్నది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ పరిమితి ఏవిధంగా చూసినా సబబుగా లేదు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వటంలో జాప్యం జరగటం సమర్థించుకోలేనిది. లింగ వివక్ష, అసమానతలు, వేధింపులు అన్ని స్థాయిల్లోనూ ఉన్న సమాజంలో మహిళలను విధాన నిర్ణయాల్లో భాగస్వాములను చేయటం, వారి ప్రాతినిధ్యం పెంచటం ఎంతో అవసరం. అందువల్ల సమాజ నిర్మాణంలో తామూ భాగస్వాములమని, తమ ఆలోచనలకూ విలు వుంటున్నదని స్త్రీలు గుర్తిస్తే అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరింతమంది మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వీలవుతుంది. సమాజంలో మహిళలపట్ల ఉన్న ఆలోచనా ధోరణి మారు తుంది. దీన్ని అవగాహన చేసుకోవటానికీ, ఆచరించటానికీ ఇంత సుదీర్ఘ సమయం పట్టడం విచార కరం. మనకన్నా ఎంతో చిన్న దేశాలూ, బాగా వెనక బడిన దేశాలూ సైతం మహిళలకు చట్టసభల్లో పెద్ద పీట వేసిన వైనం గమనిస్తే మహిళల విషయంలో మనం ఎంత వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తు న్నామో అర్థమవుతుంది. రువాండా పార్లమెంటులో మహిళలు 61 శాతం ఉంటే... క్యూబా(53), నిగ రాగువా(52), మెక్సికో, న్యూజిలాండ్ చట్ట సభల్లో 50 శాతం మహిళలుండి మన సమాజం తీరు తెన్నుల్ని ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి దశాబ్దం క్రితం ప్రజాతంత్ర రిపబ్లిక్గా ఆవిర్భవించిన నేపాల్లో సైతం పార్లమెంటులో 33 శాతం మహిళలున్నారు. అమలుకు ఇంకా సమయం పడుతుందంటు న్నారు గనుక ఈలోగా పార్లమెంటు చర్చలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా ఓబీసీ కోటా సంగతి తేల్చటం, చట్టం అమలుకు విధించిన పరిమితిని ఎత్తివేయటం అత్యంత కీలకమని కేంద్రం గుర్తించాలి. ఎన్నెన్నో అవాంతరాలను అధిగమించి సాకారం కాబోతున్న ఈ చట్టం భవిష్యత్తులో సమాజం మరింత పురోగతి సాధించటానికి నాంది కాగలదని ఆశించాలి. -
ఇది రాజీవ్ గాంధీ కలల బిల్లు: సోనియా గాంధీ
-
మహిళా బిల్లుపై సోనియా గాంధీ భావోద్వేగం
సాక్షి, ఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. బిల్లుపై చర్యలో భాగంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ చర్చను ప్రారంభించారు. ఈ సందర్బంగా లోక్సభలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఇది నా జీవితంలో కూడా భావోద్వేగంతో ముడిపడిన క్షణాలు. వంటింటి నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరు. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి స్త్రీలు పోరాడారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారు. #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "This is an emotional moment of my own life as well. For the first time, Constitutional amendment to decide women's representation in local body election was brought by my life partner… pic.twitter.com/stm2Sggnor — ANI (@ANI) September 20, 2023 ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలిసారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారు. రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పీఎం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారు. దీంతో, రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తవుతుంది. #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "Congress party supports this Bill. We are happy regarding the passing of the Bill but we are also concerned. I would like to ask a question. Indian women have been waiting for their… pic.twitter.com/H3VDbcG6ki — ANI (@ANI) September 20, 2023 గతంలో బీజేపీ సభ్యులు మహిళా బిల్లును అడ్డుకున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. కానీ, బీజేపీ తెస్తున్న బిల్లులో కొన్ని భయాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 13 ఏళ్లుగా మహిళలు బిల్లు అమలు కోసం వేచిచూస్తున్నారు. ఇంకెన్నాళ్లు మహిళలు వేచిచూడాలి. వెంటనే కులగణన చేసి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. SC, ST మరియు OBC రిజర్వేషన్లపై కూడా నిర్ణయం తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: జనగణన లేకుండా బిల్లు పెట్టి ఏం చేస్తారు? -
మూడో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
-
Live: ముగిసిన కేబినెట్ భేటీ
Updates.. ►కేబినెట్ భేటీ ముగిసింది. ఏ అంశంపై చర్చించారనే విషయం బయటకు వెలువరించలేదు. పలు కీలక బిల్లులపై చర్చ జరిగినట్లు సమాచారం. రేపటి నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో నిర్ణయాత్మకమైన బిల్లులపై చర్చ జరగనుంది. ►పార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం అయింది. ► ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపు మధ్యాహ్నం 1:15 గంటలకు లోక్ సభ, 2:15 గంటలకు రాజ్య సభ ప్రారంభం అవుతాయని స్పీకర్ వెల్లడించారు. ►ప్రధాని మోదీ నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 6:30కు ప్రారంభం కానున్న కెబినెట్ భేటీకి ముందు కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఇద్దరు కేంద్ర మంత్రులతో సమావేశం జరిపారు. కేంద్ర మంత్రుల భేటీ అజెండాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎలాంటి ముందస్తు నోట్ లేకుండానే కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ► చంద్రబాబు అరెస్టుపై లోక్సభలో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకున్న వైఎస్ఆర్సీపి ఎంపీలు మిథున్ రెడ్డి, మార్గాన్ని భరత్. స్కిల్ స్కాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని లోక్ సభలో మిథున్ రెడ్డి అన్నారు. ఫేక్ జీవోలు ఇచ్చి, రూ.371 కోట్ల రూపాయల లూటీ చేశారని మండిపడ్డారు. దోచిన మొత్తాన్ని 80 షెల్ కంపెనీలకు పంపారని అన్నారు. ఈ కేసులో నగదు ఎక్కడెక్కడికి వెళ్లిందో ఈడీ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. చిట్టచివరికి చట్టానికి చంద్రబాబు చిక్కారు. ఐటీ కేసులో సైతం నోటీసులు అందుకున్నారని తెలిపిన మిథున్ రెడ్డి.. చంద్రబాబు పీఏ దేశం విడిచి పారిపోయాడని చెప్పారు. ► కొత్త పార్లమెంట్లోనైనా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఫన్నీగా ఉన్నాయని చెప్పారు. విశ్వాసమున్న నేతలనే ప్రజలు నమ్ముతారని అన్నారు. సీఎం కేసీఆర్ను ప్రజలు మూడోసారి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ► పాత పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేదు అనుభవం మిగిల్చిందని ప్రధాని మోడీ అన్నట్లు గుర్తు చేసిన నామా.. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టి అందర్ని కూడగట్టారని సీఎం కేసీఆర్ని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ► సాయంత్రం 6:30 కు పార్లమెంట్ భవనంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. నూతన బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ► పార్లమెంటు రాజ్యాంగ సభ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ► 75 ఏళ్ల పార్లమెంటు ప్రస్థానంపై లోక్ సభలో చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపి తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా హామీ ఇచ్చి పదేళ్లు గడుస్తున్న ఇంకా ఇవ్వలేదని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం గొప్ప పరిణామం అని అన్నారు. పార్లమెంటు పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు 30శాతం సమయం కేటాయించాలని కోరారు. ► పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ సెషన్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 20న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో కొంత కాలంగా పెండింగ్లో ఉంది. ► పార్లమెంట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎంపీల నిరసన. #WATCH | BRS MPs hold a protest demanding the Women's Reservation Bill, near the Gandhi statue on Parliament premises. pic.twitter.com/XI0ccy1ymI — ANI (@ANI) September 18, 2023 ► కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఈ భవనం చాలా జ్ఞాపకాలతో నిండి ఉంది, ఇది చరిత్రతో నిండి ఉంది. ఇది విచారకరమైన క్షణం. కొత్త భవనంలో మెరుగైన సౌకర్యాలు, కొత్త సాంకేతికత, మరిన్ని సౌకర్యాలు ఉండాలని ఆశిద్దాం. పార్లమెంట్ సభ్యులు.. చరిత్ర, జ్ఞాపకాలతో నిండిన భవనాన్ని విడిచిపెట్టడం ఎల్లప్పుడూ భావోద్వేగ క్షణం అని అన్నారు. #WATCH | Congress MP Shashi Tharoor says, "Well this building is full of memories as the PM also said, it is full of history. It will be a sad moment. Let's hope that the new building has better facilities, new technology and more convenience for the members of the… pic.twitter.com/u6fVbLyBMq — ANI (@ANI) September 18, 2023 ► రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని నిరసనలు తెలిపారు. ► లోక్సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నాం. ఈ 75 ఏళ్ల ప్రయాణం ఎంతో గర్వకారణమైంది. ఈ ప్రయాణంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. భారతీయులు స్వేదం, డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించాం. ఈ పార్లమెంట్ భవనం మనల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. మనం కొత్త భవనంలోకి వెళ్తునప్పటికీ పాత భవనం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. చంద్రయాన్-3 విజయం దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తుంది. ఇది మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి ప్రతీక. చంద్రయాన్-3 విజయంతో మన సత్తా చాటాం. భారత్ అభివృద్ధి ప్రపంచమంతా ప్రకాశిస్తోంది. ► ఈ భవనానికి వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురిచేస్తోంది. పాత పార్లమెంట్తో ఎంతో అనుబంధం ఉంది. పార్లమెంట్లో తొలిరోజు నేను భావోద్వేగానికి గురయ్యాను. ప్రజల సందర్శనకు పాత పార్లమెంట్ భవన్ తెరిచే ఉంటుంది. ప్రారంభంలో మహిళా ఎంపీల సంఖ్య తక్కువగా ఉండేది. క్రమంగా వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ► పార్లమెంట్లోకి వెళ్తే గుడిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ప్రజాస్వామ్యానికి జీవాత్మలాంటిదైన పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగింది. పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడిని భారత్ ఎప్పటికీ మరిచిపోదు. ఉగ్రదాడి నుంచి పార్లమెంట్ను రక్షించిన సైనికులకు సెల్యూట్. ఇంద్రజిత్ గుప్తా 43 ఏళ్లు ఈ భవనంలో సేవలందించారు. దళితులు, ఆదివాసీ, మధ్య తరగతి మహిళలకు ఈ సభ అవకాశమిచ్చింది. ► నెహ్రు, అంబేద్కర్ నడయాడిన సభ ఇది. ఓ పేదవాడు పార్లమెంట్లో అడుగుపెడతారని ఎవరైనా ఊహించారా?. నెహ్రు నుంచి మన్మోహన్ సింగ్ వరకూ ఎందరో ప్రధానులు సమావేశాలకు నాయకత్వం వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మన హీరోలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ఈ 75ఏళ్లలో 7500 మంది ఎంపీలు, 17 మంది స్పీకర్లు పనిచేశారు. ► 1996లో పార్లమెంట్లో వాజ్పేయి ప్రసంగం పాపులర్ అయ్యింది. నెహ్రు, వాజ్పేయి ప్రసంగాలు పార్లమెంట్లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ పార్లమెంట్లోనే ఆర్టికల్ 370 రద్దు చేశాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ తీసుకొచ్చింది ఇక్కడే. జీఎస్టీకి తీర్మానం చేశాం. తెలంగాణ ఏర్పాటు కూడా ఈ భవనంలోనే జరిగింది. #WATCH | Special Session of Parliament | In Lok Sabha, PM Modi says, "...All of us are saying goodbye to this historic building. Before independence, this House was the place for the Imperial Legislative Council. After independence, this gained the identity of Parliament House.… pic.twitter.com/GRWUlr69U2 — ANI (@ANI) September 18, 2023 సమిష్టి కృషి వల్లే జీ20 విజయవంతం.. ► సమిష్టి కృషి వల్లే జీ20 విజయవంతమైంది. భారత్ నిర్మాణాన్ని గర్వంగా చెప్పుకోవాలి. జీ20 విజయం దేశ ప్రజలందరిది. జీ20 విజయాన్ని ప్రపంచం మొత్తం కీర్తిస్తోంది. జీ20 విజయం ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం. జీ20లో ఆఫ్రికా యూనియన్ను భాగస్వామిని చేశాం. అనేక రంగాల్లో భారత్ గణనీయంగా అభివృద్ధి చెందింది. భారత్ ఇప్పుడు అన్ని దేశాలకు విశ్వమిత్రగా మారుతోంది. ►ప్రత్యేక సమావేశాల సందర్బంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జీ20 సక్సెస్ను సభకు వివరించారు. లోక్సభలో ఓం బిర్లా మాట్లాడుతూ.. జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నాం. జీ20 విజయవంతం దేశ ప్రజలందరికీ గర్వకారణం. గ్లోబల్ ఆఫ్ ది సౌత్ వాయిస్ను భారత్ వినిపించింది. ప్రపంచ దేశాలు భారత్ను మెచ్చుకున్నాయి. జీ20 కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ సమర్థతతోనే జీ20 విజయవంతమైంది. భారత్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు విప్లవాత్మక చర్య. #WATCH | Special Session of the Parliament | Lok Sabha Speaker Om Birla says "I want to congratulate each and every Indian for the successful organisation of the G20 Summit. I also appreciate PM Modi's vision to dedicate this Summit to the people of the country. India's… pic.twitter.com/og2faC7xeX — ANI (@ANI) September 18, 2023 ► రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ ప్రమాణం చేశారు. #WATCH | Special Session of Parliament | BJP leader Dinesh Sharma takes oath as a Member of the Parliament (MP) in Rajya Sabha. pic.twitter.com/avCL5Ws1qX — ANI (@ANI) September 18, 2023 ► లోక్సభ ప్రారంభంలోనే టెక్నికల్ ఇష్యూ కారణంగా సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగునున్నాయి. ఈ సమావేశాల్లో పార్లమెంట్ ప్రస్థానంపై ఉభయసభల్లో చర్చ జరుగనుంది. ► పార్లమెంట్ సమావేశాలకు హాజరైన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ ఎంపీలు. Union Home Minister Amit Shah and Defence Minister Rajnath Singh arrive at the Parliament. pic.twitter.com/lmJ7M5okdg — ANI (@ANI) September 18, 2023 ► పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament. pic.twitter.com/FP3nhi430m — ANI (@ANI) September 18, 2023 ► పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా కూటమి సభ్యులు పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అవసరమైన విషయాలపై తమ వాదనలు వినిపించనున్నారు. INDIA bloc parties decide to participate in the special session of Parliament and will raise important issues: Sources — ANI (@ANI) September 18, 2023 జీ20 సక్సెస్ భారత్కు గర్వకారణం: మోదీ ► పార్లమెంట్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ పార్లమెంట్ భవనం చారత్రక కట్టడం. పార్లమెంట్ దేశ ప్రతిష్టను పెంపొందించింది. పార్లమెంట్ భవనంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలి. పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు లేకుండా సజావుగా జరుపుకుందాం. పాత పార్లమెంట్లో ఇది చివరి సమావేశం. రేపటి నుంచి కొత్త పార్లమెంట్లో సమావేశాలు జరుగుతాయి. #WATCH | Prime Minister Narendra Modi says "Tomorrow, on Ganesh Chaturthi, we will move to the new Parliament. Lord Ganesha is also known as ‘Vighnaharta’, now there will be no obstacles in the development of the country... 'Nirvighna roop se saare sapne saare sankalp Bharat… pic.twitter.com/P2DZmG3SRF — ANI (@ANI) September 18, 2023 ► వినాయక చతుర్థి సందర్భంగా కొత్త పార్లమెంట్లో అడుగుపెడుతున్నాం. ఎలాంటి విఘ్నాలు కలుగకుండా గణేషుడు చూడాలని ప్రార్థిస్తున్నాను. ► సకల వసతులతో యశోభూమిని నిర్మించుకున్నాం. యశోభూమి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కూడా నిన్న దేశానికి అంకితం చేయబడింది. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారత్ జెండా చంద్రుడిపై రెపరెపలాడుతోంది. శివశక్తి పాయింట్ కొత్త స్ఫూర్తి కేంద్రంగా మారింది. తిరంగా పాయింట్ మనలో గర్వాన్ని నింపుతోంది. ఇటువంటి భారత్ కీర్తి పెంచుతున్నాయి. దీంతో, అనేక అవకాశాలు భారత్ ముందుకు వస్తున్నాయి. #WATCH | Before the commencement of the Special Session of Parliament PM Narendra Modi says, "Success of Moon Mission --- Chandrayaan-3 has hoisted our Tiranga, Shiv Shakti Point has become a new centre of inspiration, Tiranga Point is filling us with pride. Across the world,… pic.twitter.com/sUTPpqCaXu — ANI (@ANI) September 18, 2023 ► జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారు. భారత్ సత్తా ఏంటో చూపించాం. భారత్ పురోగతిని ప్రపంచమంతా కొనియాడుతోంది. జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించాం. ఆధునిక భారత్ సాకారమవుతోంది. భారత్ పురోగతిని ప్రపంచం కొనియాడుతోంది. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారత్ ఎప్పుడూ గర్వపడుతుంది. ఇవన్నీ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం. #WATCH | Prime Minister Narendra Modi says "...India will always be proud that we became the voice of the Global South during the G20 Summit and that the African Union became a permanent member of the G20. All this is a signal of India's bright future. 'YashoBhoomi' an… pic.twitter.com/UXhtqEZ0GJ — ANI (@ANI) September 18, 2023 ► పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.. #WATCH | Prime Minister Narendra Modi arrives at the Parliament. pic.twitter.com/FvnJlu1yxH — ANI (@ANI) September 18, 2023 సాక్షి, ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగునున్నాయి. ప్రత్యేక సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలు లేకుండానే నేరు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవనున్నాయి. ఈ సందర్భంగా 75 ప్రస్థానంపై చర్చ జరుగనుంది. ► ఈ క్రమంలో పార్లమెంట్ 75 ఏళ్లలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, పాఠాలు అనే అంశంపై చర్చ జరుగనుంది. ► ఇక, రేపు కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశం జరుగుతుంది. ► రేపు ఉదయాన్నే 9:30 గంటలకు ఎంపీలతో గ్రూప్ ఫొటో ఉంటుంది. -
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
-
యూటీగా ముంబై.. కాంగ్రెస్ చీఫ్ సంచలన కామెంట్స్
ముంబై: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలో జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే, ప్రత్యేక సమావేశాలపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ సమావేశాల వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఆయన తెలిపారు. యూటీగా ముంబై! కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని, దేశాన్ని విభజించడంతో పాటు ముంబై నగరాన్ని మహారాష్ట్ర నుంచి విడగొట్టి, కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేయాలనే ఎజెండాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. ప్రతిపక్షాలు, పార్లమెంట్ వ్యవహారాల కమిటీతో సహా ఏ పక్షంతో కూడా సంప్రదింపులు చేయకుండా మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిందన్నారు. అప్పుడెందుకు ప్రత్యేక సమావేశాల్లేవ్.. ఇదే సమయంలో కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. దేశంలో నోట్ల రద్దు, కోవిడ్-19 సంక్షోభం, మణిపూర్ హింసాకాండ వంటి అంశాలపై ప్రత్యేక సమావేశాలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై నగరానికి ప్రపంచ ప్రాముఖ్యత ఉందన్నారు. అటువంటి నగరాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టి, ఇక్కడి సంస్థలు, కార్యాలయాలను బీజేపీ సర్కార్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు తరలిస్తోందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కుట్రలో భాగంగా బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీని తరలించాలనే ప్లాన్లో మోదీ ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారత్లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి! -
సోనియా లేఖకు బదులిచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండా ఏమిటో తెలపాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖకు స్పందిస్తూ వ్యంగ్యంగా బదులిచ్చారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. అజెండా లేకుండా సమావేశాలా? సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే విషయమై ప్రతిపక్షాలతో చర్చించకుండానే పిలుపునిచ్చారని కనీసం అజెండా ఏమిటో తెలపమని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు సోనియా గాంధీ. అయినప్పటికీ ఈ సమావేశాలకు హాజరు కావడానికి తాము సుముఖంగానే ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రజాసమస్యలు చాలానే ఉన్నాయని చెబుతూ తొమ్మిది అంశాలను లేఖలో ప్రస్తావించారు. వాటిలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మణిపూర్లో పరిస్థితి, మతతత్వం, చైనా సరిహద్దు అంశంతోపాటు మరికొన్ని అంశాలున్నాయి. Here is the letter from CPP Chairperson Smt. Sonia Gandhi ji to PM Modi, addressing the issues that the party wishes to discuss in the upcoming special parliamentary session. pic.twitter.com/gFZnO9eISb — Congress (@INCIndia) September 6, 2023 ఆ సంప్రదాయం లేదు.. సోనియా గాంధీ లేఖకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ మీకు ఇక్కడి సంప్రదాయాలు ఇంకా అలవాటైనట్టు లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఎన్నడూ పార్టీల అభిప్రాయాలను అడిగిడం కానీ వారితో చర్చలు జరిపింది కానీ లేదని అన్నారు. రాష్ట్రపతి సందేశంతో పార్లమెంట్ సెషన్లు ప్రారంభమవుతాయి. అన్ని పార్టల నాయకులు సమేవేశమయ్యాక అప్పుడు ప్రజా సమస్యలపైనా ఇతర అంశాలపైనా చర్చలు కొనసాగిస్తుంటామని రాస్తూ బదులిచ్చారు. यह बेहद दुर्भाग्यपूर्ण है कि एक वरिष्ठ सांसद होने के बाद भी कांग्रेस की पूर्व अध्यक्षा श्रीमती गांधी संसद के आगामी सत्र को लेकर अनावश्यक विवाद पैदा करने की कोशिश कर रही हैं। संसद का सत्र बुलाना भारत सरकार का संवैधानिक अधिकार है। मैं आशा करता हूं कि सभी पार्टियां संसद की गरिमा… pic.twitter.com/STTOYtxIsO — Pralhad Joshi (@JoshiPralhad) September 6, 2023 ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి -
సమావేశాల్లో ఆ 9 అంశాలపై చర్చించండి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అజెండాను ప్రకటించకుండానే ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసారి సమావేశాల్లో మణిపూర్లో హింస, దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు తదితర కీలకాంశాలపై చర్చించాలని డిమాండ్చేస్తూ ప్రధాని మోదీకి సోనియా లేఖ రాశారు. ముఖ్యంగా తొమ్మిది అంశాలపై చర్చ జరగాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. ‘ మణిపూర్లో హింస, పెరిగిన ధరవరలు, రాష్ట్రాలు– కేంద్రం మధ్య క్షీణిస్తున్న సత్సంబంధాలు, చైనాతో సరిహద్దు వెంట కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అదానీ గ్రూప్లో అవినీతి లావాదేవీల బహిర్గతం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు వంటి అంశాలను చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ‘ ఇతర రాజకీయ పారీ్టలతో ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండా ఏమిటో ఎవ్వరికీ తెలియదు. సమావేశాలు జరిగే ఈ మొత్తం ఐదు రోజులూ ప్రభుత్వ ఎజెండాపైనే చర్చ జరగనుందని మాకు సమాచారం వచ్చింది’ అని సోనియా వ్యాఖ్యానించారు. ఇదో చక్కని అవకాశం ‘ఇదో చక్కని అవకాశం. ప్రజాసమస్యలు, ప్రాముఖ్యత దృష్ట్యా ఈసారి సమావేశాల్లో మేం తప్పకుండా పాల్గొంటాం. ఈ అంశాలపై చర్చకు సమయం కేటాయిస్తారనే భావిస్తున్నాను’ అని సోనియా అన్నారు. ‘ఉభయ సభల్లో ఏ అంశాలపై చర్చిస్తారో అనే విషయాన్ని ముందుగా తెలపకుండానే సెషన్ను ప్రారంభిస్తుండటం బహూశా ఇదే తొలిసారి అనుకుంటా’ అని కాంగ్రెస్ మరో నేత జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర రాజకీయ పారీ్టలు చేస్తున్న డిమాండ్లకు తగ్గట్లు దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని సోనియా కోరారు. ప్రకృతి విపత్తుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ వరదలు సృష్టించిన విలయం, మరి కొన్ని రాష్ట్రాల్లో కరువు కాటకాలు వంటి ఘటనలను చర్చించాలని సోనియా డిమాండ్చేశారు. ‘పెరుగుతున్న నిరుద్యోగిత, సమాజంలో అసమానతలు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సమస్యల వలయంలో చిక్కుకోవడం వంటి అంశాలనూ చర్చించాలి. రైతుల డిమాండ్ మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతాంగం సమస్యలు చర్చకు రావాలి’ అని సోనియా అన్నారు. ‘ఈసారి సమావేశాలను మేం బాయ్కాట్ చేయబోం. సభలోనే ఉండి సమస్యలపై పోరాడతాం’ అని ఢిల్లీలో మీడియా సమావేశంలో జైరాం రమేశ్ చెప్పారు. ఆ తొమ్మిది అంశాలు 1. ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితితో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎస్ఎంఈలపై దుస్థితి 2. రైతులు, రైతు సంస్థలు లేవనెత్తిన కనీస మద్దతు ధర అంశంతో పాటు వారు లేవనెత్తిన ఇతర డిమాండ్ల పరిస్కారం కోసం మోదీ సర్కార్ చూపే నిబద్ధత 3.అదానీ వ్యాపార సమూహం లావాదేవీలను దర్యాప్తు చేయడానికి జేపీసీ ఏర్పాటు 4.మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న నిరంతర వేదన, రాజ్యాంగ వ్యవస్థల విచి్ఛన్నం, అక్కడ నెలకొల్పాల్సిన సామాజిక సామరస్యం 5.హరియాణా వంటి వివిధ రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడం 6.భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లోని మన సరిహద్దుల్లో దేశ సార్వ¿ౌమాధికారానికి ఎదురైన సవాళ్లు 7.దేశవ్యాప్తంగా కుల గణన 8.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దిగజారుతున్న సంబంధాలు 9.ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు, మరికొన్ని రాష్ట్రాల్లో కరువు కారణంగా పెరిగిన కష్టాలు Here is the letter from CPP Chairperson Smt. Sonia Gandhi ji to PM Modi, addressing the issues that the party wishes to discuss in the upcoming special parliamentary session. pic.twitter.com/gFZnO9eISb — Congress (@INCIndia) September 6, 2023 #WATCH | #WATCH | Congress MP Jairam Ramesh says, "Sonia Gandhi in a letter (to PM Modi) mentioned that the session has been called without any discussion with the opposition...Nobody had any information about it...This is for the first time that we do not have any details for… pic.twitter.com/IzEXXJFMEj — ANI (@ANI) September 6, 2023 -
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. 10, జన్పథ్లోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, అధిర్ రంజాన్ చౌదరి ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నటు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని ప్రతిపక్షాలు అమ్ములపొదిలో అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశాల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటన్నది ప్రకటించలేదు కానీ అసెంబ్లీ, పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశమే ప్రధానాంశంగా సమావేశాలు జరుగుతాయని మాత్రం తెలుస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు కేంద్రం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా వేసింది కేంద్రం. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎన్కె సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారిలు ఉండగా ప్రతిపక్ష నేత అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రం జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేసి హుటాహుటిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సిద్ధపాటుగా ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇండియా కూటమి ఎంపీలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: 'భారత్' అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం: ప్రధాని మోదీ -
మోదీతో జేపీ నడ్డా, అమిత్ షా కీలక భేటీ.. గంటన్నరపాటు చర్చ..
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. మోదీ నివాసంలో ప్రధానితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంటన్నరపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకురావాల్సిన బిల్లుపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రం ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. కాగా, ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలు ఉంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది, ఆందోళన పడవద్దు అని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజండాపై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని ఆయన చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: ఆదిత్య–ఎల్1 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం -
మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు?
సాక్షి, ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్లో పార్లమెంట్ అమృత్కాల్ స్పెషల్ సెషన్ను ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు.. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసిన లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కాల పరిమితి పెంపు, తగ్గింపు.. ఇక.. ప్రస్తుతం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సాధారణంగా వాటి గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అయితే.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఐడియా కింద, లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కింద కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి పెంచడం, మరికొన్ని అసెంబ్లీల కాలపరిమితి తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. కాగా, రాబోయే ప్రత్యేక సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. బిల్లు ఆమోదానికి 2/3 వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది. Special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings. Amid Amrit Kaal looking forward to have fruitful discussions and debate in Parliament. ಸಂಸತ್ತಿನ ವಿಶೇಷ ಅಧಿವೇಶನವನ್ನು… pic.twitter.com/k5J2PA1wv2 — Pralhad Joshi (@JoshiPralhad) August 31, 2023 ఇది కూడా చదవండి: జమ్ములో ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం -
Parliament session: నాకు కోపమే రాదు ఎందుకంటే... నా పెళ్లై 45 ఏళ్లయింది!
మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న వేళ రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ తనపైనే జోకులు వేసుకుని సభలో నవ్వులు పూయించారు. దాంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మీకు పదేపదే కోపమెందుకు వస్తుందని విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘సర్. నాకసలు కోపమే రాదు. ఎందుకంటే నా పెళ్లై 45 ఏళ్లయింది’ అంటూ ధన్ఖడ్ చెణుకులు విసరడంతో సభ్యుల నవ్వులతో సభ దద్దరిల్లిపోయింది. ‘‘చిదంబరం (కాంగ్రెస్ సభ్యుడు) చాలా సీనియర్ లాయర్ కూడా. అథారిటీపై కోపం చూపే హక్కు మాకుండదని ఆయనకు బాగా తెలుసు. సభలో మీరే (సభ్యులు) అథారిటీ. మరో విషయం. నా భార్య ఎంపీ కాదు. కనుక ఆమె గురించి నేనిలా సభలో మాట్లాడటం సరికాదు కూడా’’ అంటూ ధన్ఖడ్ మరోసారి అందరినీ నవి్వంచారు. తనకు కోపం వస్తుందన్న వ్యాఖ్యలను సవరించుకోవాల్సిందిగా ఖర్గేను కోరారు. దాంతో ఆయన లేచి, ‘‘మీకు కోపం రాదు. చూపిస్తారంతే. కానీ నిజానికి చాలాసార్లు లోలోపల కోపగించుకుంటారు కూడా’’ అనడంతో అధికార, విపక్ష సభ్యులంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయారు! రెండుసార్లు వాకౌట్ అంతకుముందు, మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు తదితర విపక్షాలు ఉదయం రాజ్యసభ భేటీ కాగానే వాకౌట్ చేశాయి. మధ్యాహ్నం రెండింటికి తిరిగి సమావేశమయ్యాక కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీకి చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ అవకాశమిచ్చారు. మణిపూర్ హింసపై, మహిళలపై ఘోర అత్యాచారాలపై చర్చకు అవకాశం కోరుతున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై అధికార, విపక్ష సభ్యులతో ఎన్నిసార్లు సమావేశమైనా ఎవరికి వాళ్లే తమదే పై చేయి కావాలని పట్టుదలకు పోవడంతో లాభం లేకపోతోందంటూ చైర్మన్ వాపోయారు. ఆగ్రహించిన విపక్ష సభ్యులు ‘ప్రధాని మోదీ సభకు రావాలి’ అంటూ నినాదాలకు దిగారు. వాటిని పట్టించుకోకుండా ఖనిజాల (సవరణ) బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రి ప్రహ్లాద్ జోషికి చైర్మన్ అవకాశమిచ్చారు. దాన్ని నిరసిస్తూ విపక్షాలు రెండోసారి వాకౌట్ చేశాయి. -
మణిపూర్ వ్యవహారం.. ఉభయ సభలు రేపటికి వాయిదా
Live Updates: ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సోమవారం(జులై 31).. మణిపూర్ వ్యవహారంపై స్వల్పకాలిక చర్చకు ఇటు లోక్సభ స్పీకర్, అటు రాజ్యసభ చైర్మన్ అంగీకరించినా.. విపక్షాలు మాత్రం ప్రధాని మోదీ సమక్షంలో దీర్ఘకాలిక చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కూడా నినాదాలతో తమ ఆందోళన కొనసాగించాయి. సభలు ముందుకు సాగకపోవంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి మంగళవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు మొదలుకానున్నాయి. ► పార్లమెంట్ను 9 రోజుల పాటు నినాదాలు చేసి సభలు జరగనివ్వకుండా పాడు చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విపక్షాలపై మండిపడ్డారు. అయితే.. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2023 మాత్రం ఇవాళ ఆమోదం పొందగలిగింది. తొలుత రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత లోక్సభలో ఆమోదించబడింది. ► రాజ్యసభలో మణిపూర్ హింసపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నాయి. ►పార్లమెంటులో మణిపూర్ మంటలు ఆరడం లేదు. గత పదిరోజులుగా ఉభయ సభల్ని మణిపూర్ అంశం కుదిపేస్తోంది. మధ్యాతర్వాత రాజ్యసభలో మణిపూర్పై చర్చకు సిద్ధమని తెలిపిన ప్రభుత్వం తెలిపింది. అయితే అవిశ్వాసంపై వెంటనే చర్చించాలంటూ లోక్సభలో విపక్షాలు పట్టుబట్టాయి. ►మణిపూర్ హింసాకాండపై ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, నినాదాల మధ్య రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ►లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మణిపూర్ ఘటనపై విపక్ష ఎంపీలో నినాదాలతో హోరెత్తించడంతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే లోక్సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. #WATCH | Leader of the House in Rajya Sabha, Piyush Goyal says "We want discussions on Manipur to take place in Parliament today at 2 pm. They (Opposition) are trying to misuse the liberty given to the members. The govt is ready to discuss Manipur, but they (Opposition) have… pic.twitter.com/Bs37pxMbD8 — ANI (@ANI) July 31, 2023 ► సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ,నేటి మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటులో మణిపూర్పై చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నట్లు రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రతిపక్షాక్ష సభ్యులు తమకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మణిపూర్పై చర్చకు సిద్ధంగా ఉందని చెబుతున్నా.. విపక్షాలు ఇప్పటికే 9 రోజులగా సభలను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ►పార్లమెంట్లో కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మణిపూర్పై చర్చ జరగకుండా ప్రతిపక్షాలను ఎవరు ఆపుతున్నారు అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. పార్లమెంటు లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాలని మేము మొదటి రోజు నుంచి కోరుతున్నామని.. చర్చలు జరపకుండా వారిని ఆపేది ఏంటని నిలదీశారు. చర్చలో పాల్గొనకుండా పారిపోతారని విమర్శించారు. రాజకీయాల కోసం మణిపూర్ అంశాన్ని వాడుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. #WATCH | Delhi: Union Minister Anurag Thakur says, "I request them to come inside Parliament and participate in discussions. We want discussions from day 1. What is stopping them (Opposition) from holding talks?... They only run away from discussions rather than taking part in… pic.twitter.com/LJ6kMxmT7T — ANI (@ANI) July 31, 2023 విపక్షాల భేటీ ఇటీవల మణిపూర్లో పర్యటించిన ఎంపీలతో ప్రతిపక్ష ఇండియా కూటమి భేటీ అయింది. పార్లమెంట్ హౌజ్ భవనంలోని కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ(సీపీపీ) కార్యాలయంలో సమావేశమయ్యాయి. రెండు రోజుల పర్యటన వివరాలను ఎంపీల బృందం విపక్ష నేతలకు వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా విపక్షపార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు రెండు రోజులపాటు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. #WATCH | Meeting of I.N.D.I.A party alliance floor leaders with MPs who visited Manipur recently is underway at the Congress Parliamentary Party CPP office in Room no 53 at the Parliament House building to discuss the strategy for the floor of the House. Congress parliamentary… pic.twitter.com/UY5r2m3MW5 — ANI (@ANI) July 31, 2023 మణిపూర్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది: అధిర్ రంజన్ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలనేది తమ డిమాండ్గా పేర్కొన్నారు. మణిపూర్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.. దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, మిత్రపక్షాలు కూడా మణిపూర్లో పర్యటించాలని, అక్కడి పరిస్థితిని అందరూ విశ్లేషించుకోవాలని సూచించారు. చదవండి: మణిపూర్ హింస.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధిత మహిళలు #WATCH | Delhi: West Bengal Congress president Adhir Ranjan Chowdhary says, "Our demand is only that there is a discussion on no-confidence motion...The situation in Manipur is very serious...The country needs to be saved...BJP and its alliances should also tour Manipur, they… pic.twitter.com/dcTWjBDipr — ANI (@ANI) July 31, 2023 న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని అధికారుల నియామకాలు, బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం నేడు (జూలై 31) పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్సభలో కేంద్రమంత్రి అమిత్షా ఈ బిల్లును ప్రవేశ పెట్టనుననారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీంతో సభలో మరింత గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మణిపూర్ హింసపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని కూడా సమర్పించింది. దానిపై ఇంకా చర్చించలేదు. ఓటింగ్ జరగలేదు. లోక్సభలో రగడ ఈ క్రమంలో లోక్సభలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్(సవరణ) బిల్లు తీసుకురావడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగమైన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో.. పార్లమెంట్ వేదికగా దీనిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సోమవారం లోక్సభలో రగడ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ముందు ఢిల్లీలో బదిలీలు, నియామకాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీనికి లెక్కచేయకుండా అధికార యంత్రాంగంపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే ఇది చట్టవిరుద్దమంటూ, ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ ఇప్పటికే ఆప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. VIDEO | "This is the most undemocratic, illegal legislative exercise that is being done by the BJP in the history of India's parliamentary democracy. This bill is an assault on two crore people of Delhi," says AAP leader @raghav_chadha on Delhi services bill which the government… pic.twitter.com/62WNGg0nHG — Press Trust of India (@PTI_News) July 31, 2023 -
కుంకుమ పువ్వు కృత్రిమ సాగుకు ప్రోత్సాహం
న్యూఢిల్లీ: కృత్రిమ వాతావరణంలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించే దిశగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఒక యువ వ్యవసాయ పట్టభద్రురాలు ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వును సాగు మొదలెట్టి తొలి ప్రయత్నంలోనే స్వచ్ఛమైన 200 గ్రాముల ఫస్ట్ గ్రేడ్ దిగుబడి సాధించిన విషయం మీ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిందా అని రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం వ్యవసాయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్ధిని ఒకరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తన ఇంట్లోనే హ్యుమిడిఫైర్స్ సాయంతో సెమి హైడ్రోపోనిక్స్ పరిస్థితులు సృష్టించి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. జమ్మూ, కశ్మీర్లోని పంపోర్, పుల్వామా, బుడ్గాం, శ్రీనగర్ ప్రాంతాల్లో కుంకుమ పువ్వు సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ వాణిజ్య స్థాయిలో ఈ పంట సాగు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమశీతోష్ణ వాతావరణం, నీరు నిల్వని వదులైన భూమి కుంకుమ పువ్వు సాగుకు అనువైన పరిస్థితులు కల్పిస్తాయి. భూమిలో పీహెచ్ విలువ 6.3 నుంచి 8.3 వరకు ఉండాలి. వాతావరణం ఎండా కాలంలో 23 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య శీతాకాలం అయింతే మైనస్ 15 డిగ్రీల నుంచి మైనస్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గకుండా ఉంటే మంచి నాణ్యమైన కుంకుమ పువ్వు దిగుబడి సాధించవచ్చని మంత్రి తెలిపారు. కృత్రిమ వాతావరణంలో నిరూపితమైన టెక్నాలజీని వినియోగించి కుంకుమ పువ్వుతో సహా ఎలాంటి పంటలు సాగు చేయడానికైనా ఉద్యానవన పంటల సమగ్ర అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్) ద్వారా వ్యవసాయ మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు. ఈ విధంగా చేపట్టే కృత్రిమ పంటల సాగుకు అవసరమయ్యే పాలిహౌస్, కృత్రిమ వాతావరణ కల్పన కోసం చేపట్టే నిర్మాణాల ఖర్చులో 50 శాతం వ్యవసాయ మంత్రిత్వ శాఖ భరిస్తుందని ఆయన తెలిపారు. ప్లాంటేషన్ కోసం మౌలిక వసతుల అభివృద్ధిలో భాగమైన ఫాన్, పాడ్ సిస్టమ్, సహజమైన వెంటిలేషన్ కోసం నిర్మించే ట్యూబ్యులర్ స్ట్రక్చర్, వుడెన్ స్ట్రక్చర్, బాంబూ స్ట్రక్చర్ వంటి వాటి నిర్మాణంలో 50 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆహార భద్రత మిషన్లో చిరుధాన్యాలకు ప్రోత్సాహం చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంగా చేసుకుని వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ కింద సబ్-మిషన్ ఏర్పాటు చేసిందని ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. గడిచిన అయిదేళ్ళలో దేశంలో 814.17 లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి జరిగినట్లు ఆమె తెలిపారు. 2017-18లో 164.36 లక్షల మెట్రిక్ టన్నులు, 2018-19లో 137.17 ఎల్ఎంటీ, 2019-20లో 172.6, ఎల్.ఎం.టీ, 2020-21లో 180.2ఎల్ఎంటీ, 2021-22 లో 159.9 ఎల్ఎంటీ చిరుధాన్యాలు ఉత్పత్తి జరిగినట్లు తెలిపారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా ప్రకారం 2022-23లో దేశంలో 159.09 లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలతో సహా మొత్తం 3235.54 లక్షల మెట్రిక్ టన్నులు వివిధ రకాల ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరగనున్నట్లు అంచనా వేశారు. అయితే 2022-23లో అంచనా వేసిన మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చిరు ధాన్యాల ఉత్పత్తి కేవలం 4.92% మాత్రమే. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మిడ్ డే మీల్) తదితర పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 6.07లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. జాతీయ ఆహార భద్రతా యాక్ట్-2013 ప్రకారం ధాన్యం, గోధుమలు, ముతక ధాన్యం, నాణ్యత కల్గిన ఇతర రకాలను కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలుగా గుర్తిస్తోందని అన్నారు. చిరుధాన్యాలకు చట్టంలో ప్రత్యేక నియమం ఏదీ లేదని మంత్రి తెలిపారు. అయితే ఆహార భద్రత చట్టం కింద లబ్ధి పొందుతున్న వారిలో పోషక విలువలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా వినియోగిస్తున్న చిరుధాన్యాల ప్రాధాన్యతనుబట్టి చిరుధాన్యాలు కొనుగోలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే చిరుధాన్యాలు టార్గెటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగమైనట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ముతక ధాన్యం కొనుగోలు, నిల్వ, పంపిణీ చేస్తున్నాయని మంత్రి తెలిపారు. -
BJP: ముందు క్షమాపణ చెబితేనే..
న్యూఢిల్లీ: తీవ్ర ఆందోళనల నడుమ పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రధాన పార్టీల సభ్యుల ఆందోళనలతో వరుసగా రెండోరోజూ కూడా ఉభయ సభల నిర్వాహణ కష్టతరంగా మారింది. భారత ప్రజాస్వామ్యంపై లండన్లో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రసంగించేందుకు అనుమతిస్తామని బీజేపీ స్పష్టం చేస్తోంది. ఒకవైపు రాహుల్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రసంగంపై బీజేపీ క్షమాపణలు కోరుతోంది. మరోవైపు అదానీ-హిడెన్బర్గ్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతపతిక్షాలు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) కూడా బీజేపీ-కాంగ్రెస్ నినాదాల నడుమ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కిందటి రోజు మైకులను ఆఫ్ చేశారు. ఇవాళ ఏమో ఏకంగా సభలనే నడవకుండా చేశారు. ప్రధాని మోదీ స్నేహితుడి(అదానీని ఉద్దేశిస్తూ..) పార్లమెంట్నే మూగబోయేలా చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ పేజీలో ట్వీట్ చేసింది. తనను మాట్లాడనిస్తే తన లండన్ ప్రసంగంపై వివరణ ఇస్తానంటూ రాహుల్ గాంధీ చెప్తుండగా.. మరోవైపు ముందు జాతికి క్షమాపణ చెబితే రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతిస్తామని చెబుతోంది. ఈ తరుణంలో పోటాపోటీ నినాదాలతో పార్లమెంట్ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. బ్రిటన్ లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయి దాడి జరుగుతోందని ఆరోపించారు. -
Budget 2023: PLI పథకం విస్తరణ దిశగా అడుగులు
ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇది. దీంతో.. బడ్జెట్ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తయారీ రంగానికి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి..? అన్న చర్చ జరుగుతోంది. తయారీ రంగం అభివృద్ధి పథంలో వేగంగా అడుగులు వేసేలా.. భారీ కేటాయింపులు ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. దీర్ఘకాలిక అభివృద్ధి, ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనలో తయారీ రంగానిది కీలక పాత్ర. PLI పథకాన్ని మరింత విస్తరించి, దీని పరిధిలోకి మరిన్ని సెక్టార్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 14 రంగాలకు రూ. 1.97 లక్షల కోట్లతో ఈ పథకం రూపొందించబడింది. ప్రస్తుతం PLI స్కీమ్ లో ఆటోమొబైల్స్, దాన్ని అనుబంధ వస్తువులు, గృహోపకరణాలు, టెక్స్ టైల్స్, ఆహార పదార్థాలు, సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్, స్టీల్ తదితర ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ లో బొమ్మలు, సైకిళ్లు, లెదర్, ఫుట్వేర్ తయారీ పరిశ్రమలను కూడా PLI స్కీమ్ పరిధిలోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థకు PLI పథకం ఎంతో ముఖ్యమైనది. ప్రాదేశీయ తయారీని ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడంతో పాటు తయారీరంగంలో గ్లోబల్ ఛాంపియన్లను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 2022 సెప్టెంబర్ నాటికి PLI పథకం ద్వారా భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ.4,784 కోట్లను ఆకర్షించింది. రూ. 2,03,952 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. రూ.80,769 కోట్ల ఎగుమతులు జరిగాయి. PLI పథకంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం గణనీయమైనది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. 2022 డిసెంబర్ 16 నాటికి 13 పథకాలకు అనుమతులు లభించగా.. వీటిలో 100కు పైగా MSMEలకు లబ్ది చేకూరింది. -
సభకు నమస్కారం.. రెండువారాలు రచ్చ రచ్చే!
ఢిల్లీ: వరుసగా ఏడోసారి పార్లమెంట్ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ముగిశాయి.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయని.. ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారమే ప్రకటించారు స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. డ్యూ డేట్ కంటే ఐదురోజులు ముందుగానే ఇలా ఉభయ సభలు వాయిదా పడడం ఇదే ఏడోసారి. మిగిలిన ఐదురోజుల్లో రెండు రోజులు సెలవులే ఉన్నాయి. ఒకటి ఆగష్టు 9వ తేదీ మొహర్రం, మరొకటి ఆగస్టు 11 రక్షా బంధన్. ఈ రెండు రోజులు ఎలాగూ సభలు జరగవు. పండుగల కోసం వాళ్ల వాళ్ల నియోజకవర్గాలు, స్వస్థలాలకు ఎంపీలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. ప్రభుత్వానికి చాలామంది ఎంపీలు విజ్ఞప్తి చేయగా.. ఐదు రోజులు ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం.. జులై 18 నుంచి ఆగష్టు 12వ తేదీవరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగాలి. ధరల పెరుగుదల అంశం చర్చగా.. విపక్షాల నిరసనలతో తొలి రెండువారాల పాటు సభాకార్యక్రమాలు అసలు జరగనేలేదు.ఒక వారం పాటుగా మాత్రమే ఉభయ సభాకార్యకలాపాలు సాగాయి. అయితే.. సమయం సంగతి ఏమోగానీ.. చట్టపరమైన ఎజెండా మాత్రం సంతృప్తికరంగా ఉన్నట్లు పార్లమెంట్ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. లోక్సభ పదహారు రోజులు మాత్రమే సమావేశం అయ్యిందని, ఏడు చట్టాలకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక రాజ్యసభ వాయిదాకు ముందు.. ఉపరాష్ట్రపతి పదవీ విరమణ చేయనున్న వెంకయ్యనాయుడు సైతం రాజ్యసభ కార్యకలాపాల గురించి వివరించారు. సభ 38 గంటలు పని చేసిందని.. 47 గంటలకంటే ఎక్కువ వాయిదాలతోనే వృథా అయ్యిందని ప్రకటించారాయన. ఇక పార్లమెంట్ సమావేశాల పేరిట చేసిన పద్దుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. మేజర్ హైలెట్స్ ► ధరల పెంపుపై విపక్షాల నిరసనలు.. నిత్యం నిరసన గళాలతో నినాదాలు ► సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ఆవరణలో ఉంటూ నిరసన ► రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. వాటి ఫలితాలు ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఉభయ సభల్లో బీజేపీ ఆందోళనతో హోరెత్తించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ► పలు కీలక బిల్లులపై ఆమోదం ► టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ను.. ధరల చర్చ జరుగుతున్న టైంలో టేబుల్ కింద దాయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య పట్ల పార్లమెంట్ తీవ్ర సంఘీభావం వ్యక్తం చేసింది. -
మొదటికొచ్చిన ‘డేటా’ బిల్లు
పార్లమెంటు కారిడార్లో దాదాపు దశాబ్దకాలంగా వినబడుతున్న డేటా పరిరక్షణ బిల్లు వ్యవహారం మొదటికొచ్చింది. పాతికేళ్లుగా భౌగోళిక సరిహద్దులకు అతీతంగా సమాచార ప్రవాహం నిరంతరం దేశంలోకి వస్తూ పోతూ ఉంది. పౌరుల భద్రతకూ, వారి వ్యక్తిగత గోప్యతకూ కలిగే ముప్పు గురిం చిన భయాందోళనలు అడపాదడపా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అవి కేవలం భయాందోళనలు కాదు, చేదు నిజాలని రుజువవుతూనే ఉన్నాయి. గూగుల్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఎందుకో, ఏమిటో చెప్పకుండా కోట్లాదిమంది ఖాతాదార్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని రాబడు తున్నాయి. అలా సేకరించిన సమాచారాన్ని ఫేస్బుక్ సంస్థ 2015లో కేంబ్రిడ్జి ఎనలిటికా(సీఏ) సంస్థకు చడీచప్పుడూ లేకుండా అమ్ముకున్న సంగతి తెలియంది కాదు. కానీ మనకు డేటా పరిరక్షణ కోసం ఇంతవరకూ చట్టం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ బిల్లు తెస్తామని చెప్పారు. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే ఆధార్ పేరుతో దేశ పౌరుల డేటా సేకరణ మొదలు పెట్టారు. గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కుగా సర్వోన్నత న్యాయస్థానం గుర్తించి, అందుకోసం చట్టం అవసరమని సూచించి ఈ నెల 24కు అయిదేళ్లవుతోంది. అయినా చట్టం సాధ్యపడలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఏడాదిపాటు అనేకమంది నిపుణులనూ, సంస్థలనూ సంప్రదించి, విదేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్య యనం చేసి ముసాయిదా బిల్లు సమర్పించి నాలుగేళ్లు కావస్తోంది. అనంతరం 2019 డిసెంబర్లో కేంద్రం పార్లమెంటులో బిల్లుకూడా ప్రవేశపెట్టింది. తీరా మూడేళ్లు గడిచాక ఇప్పుడు ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించారు. చెప్పాలంటే డేటా పరిరక్షణ బిల్లుపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం తన సహజ ధోరణికి భిన్నంగా ఈ బిల్లు గురించి ఉభయ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేసీపీ)కి ఇవ్వడానికి అంగీకరించింది. ఆ కమిటీ గత రెండేళ్లుగా క్షుణ్ణంగా చర్చించి బిల్లుకు 81 సవరణలు సూచించింది. అరడజను సిఫార్సులు చేసింది. ఫలితంగా బిల్లు పరిధి పూర్తిగా మారిపోయింది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కాస్తా విస్తృత డేటా పరిరక్షణగా మారింది. సైబర్ ప్రపంచంలో ప్రవహించే డేటాను వ్యక్తిగత, వ్యక్తిగతేతర సమా చారంగా వర్గీకరించారు. స్మార్ట్ ఫోన్లలో ‘విశ్వసనీయమైన’ హార్డ్వేర్ను మాత్రమే వాడాలన్న నిబంధన, సామాజిక మాధ్యమ సంస్థల నియంత్రణకు సంబంధించిన నిబంధనలు, మధ్యవర్తులుగా వ్యవహరించని సామాజిక మీడియా సంస్థల్లో వచ్చే వార్తలకూ, వ్యాఖ్యలకూ ఆ సంస్థలను బాధ్యత వహించేలా చేయడం వంటివి సిఫార్సుల్లో ఉన్నాయి. వీటిలో కొన్నిటికి కొత్తగా తీసుకురాబోయే బిల్లులో చోటిచ్చే అవకాశం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు వచ్చిపడే డేటాను నిక్షిప్తం చేయడం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాల్సివుంది. ఈ దేశంలో రూపొందే సమస్త డేటానూ ఇక్కడి సర్వర్లలోనే సామాజిక మాధ్యమ సంస్థలు భద్రపరచాలని ప్రభుత్వం మొదట్లో చెప్పినా వ్యక్తుల సున్నిత సమాచారాన్ని, కీలక సమాచారాన్ని ఇక్కడ సర్వర్లలోనే ఉంచాలని పాత బిల్లు నిర్దేశించింది. ఇప్పుడు దాన్ని సవరించి భారత ప్రభుత్వం విశ్వసించే మరేదైనా ప్రాంతంలో కూడా ఈ సర్వర్లు ఉండొచ్చని, నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వం కోరిన సమాచారాన్ని అందజేస్తే సరిపోతుందని నిబంధన విధించవచ్చంటున్నారు. ఎవరికైనా క్షణంలో అందుబాటులోకొచ్చే సైబర్ ప్రపంచంలో వ్యక్తిగత డేటా పరిరక్షణ కత్తి మీద సాము వంటిదే. పౌరుల గోప్యతకు సామాజిక మాధ్యమాల వల్ల మాత్రమే కాదు... ప్రభుత్వాల నుంచి సైతం ముప్పువాటిల్లితే పౌరులకుండే ఉపశమనం ఏమిటన్నది కూడా బిల్లు చెప్పగలగాలి. పౌరుల ప్రాథమిక హక్కుతో ముడిపడి ఉండే డేటా పరిరక్షణ వంటి అంశాల్లో పాలకులు ఉదారంగా ఉంటారనుకోవడం అత్యాశ. వ్యక్తుల డేటాపై ఏదోమేర ఆధిపత్యం, నియంత్రణ సాధించేందుకు వారు ప్రయత్నిస్తారు. 2019 నాటి బిల్లు వాలకాన్ని గమనించిన జస్టిస్ శ్రీకృష్ణ ‘నా ముసాయిదాకూ, బిల్లుకూ పోలికే లేద’ని వ్యాఖ్యానించిన సంగతీ, ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం డేటాపై సమస్త అధికారాలనూ దఖలు పరుచుకుందని చెప్పడమూ ఎవరూ మరిచిపోరు. డేటా పరిరక్షణ అథారిటీ(డీపీఏ) చైర్పర్సన్ ఎంపిక కోసం ఏర్పాటయ్యే కమిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నామినేట్ చేసే న్యాయమూర్తి ఆధ్వర్యం వహించాలన్న నిబంధనకు కూడా మంగళం పాడారు. వీటన్నిటికీ మించి అసలు గత మూడేళ్లలో సైబర్ ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ–కామర్స్, డిజిటల్ మార్కెట్, డిజిటల్ సర్వీసులు వగైరావెన్నో వచ్చాయి. పాత బిల్లు వీటిలో చాలా అంశాలను స్పృశించలేదు. వీటన్నిటికీ ఒక్క చట్టంలో చోటీయడం అసాధ్యమేకాక, అనవసరం కూడా. అందుకోసం యూరప్ దేశాల మాదిరిగా విడివిడి చట్టాలు అవసరం. లేనట్టయితే అయోమయం నెలకొంటుంది. ఎటూ కొత్తగా బిల్లు తెస్తున్నారు గనుక పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా దాన్ని రూపొందించాలని కేంద్రం గుర్తించడం అవసరం. చట్టం దుర్వినియోగం కాకుండా, అస్పష్టతకు చోటీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ ప్రపంచం పౌరులకు సురక్షిత ప్రదేశంగా మారుతుంది. -
Monsoon session: ఆగని వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా ఐదో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. శుక్రవారం ఉదయం లోక్సభ ఆరంభమైన వెంటనే ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను 12 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మళ్లీ సోమవారం మధ్యాహ్నానికి స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా మొదట 12 గంటలకు, తర్వాత గంట పాటు కొనసాగిన అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సభ వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ కొనసాగింది. ఇక ఉభయ సభల ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకోవాలని, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కోరారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకు ఆమోదం లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళన, నినాదాల మధ్యే ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు–2022 ఆమోదం పొందింది. అంటార్కిటిక్ ప్రాంతంలో భారత్ నెలకొల్పిన పరిశోధనా కేంద్రాల విషయంలో దేశీయ చట్టాలను అమలు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మొదటి బిల్లు ఇదే కావడం విశేషం. బిల్లుపై లోక్సభలో స్వల్పచర్చ జరిగింది. ‘అగ్నిపథ్’పై మాట్లాడనివ్వడం లేదు డిఫెన్స్పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం వాకౌట్ చేశారు. అగ్నిపథ్ పథకంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్పై చర్చించాలని కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్కుమార్రెడ్డి, దానిష్ అలీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జువాల్ ఓరామ్ను కోరగా, ఆయన నిరాకరించారు. కేవలం అజెండాలో ఉన్న అంశాలపై చర్చించాలని తేల్చిచెప్పారు. కావాలంటే పార్లమెంట్లో అగ్నిపథ్ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
పామాయిల్ సాగు ప్రోత్సాహానికి రూ.11 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పామాయిల్ సాగు ప్రోత్సాహం కోసం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో వంట నూనెల అందుబాటును విస్తృతం చేసేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ఎంఈవో) పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో 27.99 లక్షల హెక్టార్లు పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని కమిటీ అంచనా వేసిందని తెలిపారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి వంటనూనెల దిగుమతి వల్ల పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్ఎంఈవో బృహత్తర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ ధరల్లో హెచ్చు తగ్గుల నుంచి పామాయిల్ రైతులను కాపాడేందుకు వీలుగా గిట్టుబాటు ధర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. ఏపీలో 40 ఎఫ్సీఐ వేర్హౌస్లు ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీఐకు చెందిన సొంత, అద్దె గోదాములు 40 ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎఫ్సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు నిర్వహిస్తున్న వేర్హౌస్లు సెంట్రల్పూల్ స్టాక్కు సరిపోతాయని చెప్పారు. ఏపీ ప్రతిపాదనలకు అనుమతి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై)లో ఏపీ పంపిన ప్రతిపాదనలను అనుమతించామని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రూ.657.11 కోట్ల పనులకు అనుమతించి ఇప్పటివరకు రూ.108.95 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, ఓడరేవుల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు ఫిష్ రిటైల్ హబ్ తదితర పనులకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పీపీపీ పద్ధతిలో ఎంవీయూలు పశువుల సంరక్షణ నిమిత్తం సేవలు నేరుగా రైతుల ఇంటివద్దే అందించేలా మొబైల్ వెటర్నరీ యూనిట్లను (ఎంవీయూలను) పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో తీసుకొచ్చినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాలను, ఏజెన్సీలు (కోఆపరేటివ్, మిల్క్ యూనియన్లు) మానవ వనరులను ఏర్పాటు చేస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లబ్ధిదారుల్ని పెంచాలని ఏపీ కోరింది జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)లో లబ్ధిదారుల సంఖ్యను గ్రామీణ ప్రాంతంలో 75, పట్టణ ప్రాంతంలో 50 శాతానికి పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 2011 జనాభా లెక్కలననుసరించి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41.14 శాతం లబ్ధిదారుల్ని గుర్తించినట్లు చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. చెత్త బడ్జెట్ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. చర్చలో పాల్గొన్న ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్లు, సర్ఛార్జ్ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్ విషయంలో ట్యాక్స్ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు. 2010-2015 మధ్య ఏపీ షేర్ 6.9 శాతం కాగా, 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3 శాతానికి పడిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9 శాతం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. కానీ, కేంద్రం వెచ్చిస్తోంది 3.9 శాతం మాత్రమేనని చెప్పారు. విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చుచేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం కంటే రాష్ట్రామే ఎక్కువ ఖర్చు చేస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. -
కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ ఖాళీలను త్వరితగతిన భర్తీచేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభలో మంగళవారం జీరో అవర్లో ఆయన ఉద్యో గ ఖాళీల భర్తీ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ప్రకటనల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, తద్వారా నియామక ప్రక్రియ పూర్తికావడం బాగా ఆలస్యం అవుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో రిక్రూట్మెంట్ పరీక్షల కో సం ఏళ్ల తరబడి రేయింబవళ్లు కష్టపడే యవతీ యువకులను ఈ పరిణామాలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నాయని చెప్పారు. నిర్ణీత కాలవ్యవధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేయడంలో కేంద్రం ఉదాసీన వైఖరి వల్ల లక్షలమంది యువతీయువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిగణలోకి తీసుకుని ఖాళీల భర్తీకి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. భవిష్యత్తులోను నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ఖాళీలను భర్తీచేయడానికి వీలుగా ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్విమ్స్కు రూ.58.31 కోట్లు విడుదల తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) తొలిదశలో వైద్య పరికరాల సేకరణకు కేంద్ర వాటాగా రూ.58.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆరో గ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల, అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలల ఆధునికీకరణకు రూ.150 కోట్లు (కేంద్రం వాటా రూ.120 కోట్లు, రాష్ట్ర వాటా రూ.30 కోట్లు) వేర్వేరుగా పీఎంఎస్ఎస్వై–2లో అనుమతించినట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు రూ.10వేల ప్రోత్సాహకం కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహకంతో కలిపి ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు రూ.10 వేలు ఇస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ఎల్ఐసీ మూలధన పెంపునకు అనుమతి చెల్లింపుల మూలధనాన్ని పెంచుకోవడానికి ఎల్ఐసీకి అనుమతించామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ తెలిపారు. గతనెల 31 నాటికి ఎల్ఐసీ చెల్లింపు మూలధనం రూ.6,324.99 కోట్లు అని వైఎస్సార్సీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు రూ.36.1 కోట్లు విడుదల సాగరమాల పథకంలోని కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పిల్లర్స్లో భాగంగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు రూ.72 కో ట్లు మంజూరు చేశామని, దీన్లో రూ.36.1 కోట్లు విడుదల చేశామని కేంద్ర నౌకాయానశాఖ మంత్రి శర్బానంద సోనోవాల్.. వైఎస్సార్సీపీ ఎంపీ మో పిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఎంపీ అసదుద్దీన్ జడ్ కేటగిరి భద్రతను అంగీకరించాలని విజ్ఞప్తి: అమిత్షా
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జడ్ కేటగిరి భద్రతను అంగీకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమితాషా కోరారు. ఉత్తరప్రదేశ్లో ఒవైసీ కాన్వాయ్పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. ఘటన పూర్వపరాలు, విచారణ వివరాలు సభకు వెల్లడించారు. ఎంపీ అసదుద్దీన్నపై హత్యా ప్రయత్నం జరిగిన నేపథ్యంలో కేంద్రం ఆయనకు జడ్ కేటగిరి భద్రతను ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. అయితే దీనిని ఒవైసీనే తిరస్కరించారని అమిత్షా ఈ సందర్భంగా తెలిపారు. ఒవైసీకి ఇప్పటికీ భద్రతా ముప్పు ఉందని.. జడ్ కేటగిరి భద్రతను అంగీకరించాలని పార్లమెంట్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు అస్వస్థత ‘ఫిబ్రవరి 3న ఉత్తరప్రదేశ్లో ఒవైసీ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదం నుంచి ఒవైసీ సురక్షితంగా బయట పడ్డారు. అనంతరం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి ఆల్టో కారు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కల్పించిన భద్రతకు ఒవైసీ సమ్మతించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అమిత్ షా తెలిపారు. చదవండి: మణికొండ జాగీర్ భూముల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు కాగా ఉత్తరప్రదేశ్లో ఎంపీ అసదుద్దీన్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. మీరట్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తుండగా.. గురువారం రాత్రి ఒవైసీ కారుపై దాడి జరిగింది. ఛాజర్సీ టోల్గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఎంపీకి కేంద్రం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. అయితే ప్రత్యేక భద్రతను ఒవైసీ తిరస్కరించారు. చావుకు తాను భయపడిపోనని, తనకు జడ్ కేటగిరి అవసరం లేదని, అందరిలాగే తాను ఏ కేటగిరి పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. చదవండి: టీడీపీ విషప్రచారం.. తిప్పికొట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి -
బడ్జెట్ సమావేశాలు: శుక్రవారానికి రాజ్యసభ వాయిదా
TIME: 15:00 ► శక్రవారం ఉదయం 10 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. ► కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గతంలో 'యువరాజు' లాగా ప్రవర్తించేవాడని, ఇప్పుడు తానే ను భారతదేశానికి 'రాజు' అని భావిస్తున్నాడని చురకలంటించారు. ► లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సరైన పార్లమెంటరీ విధానాన్ని అనుసరించడం లేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం కాంగ్రెస్ సభ్యుడు, ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. తాను మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ మరో ఎంపీకి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంతో.. స్పీకర్ స్పందిస్తూ అనుమతి ఇవ్వడానికి మీరు ఎవరు? మీరు అనుమతి ఇవ్వలేరు, అది నా హక్కు అని స్పష్టం చేశారు. ► ఏపీలో ప్రషాద్ (PRASHAD) పథకంలో అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలు ఉన్నాయయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు వాటిని ఈ పథకంలో చేర్చామని మంత్రి పేర్కొన్నారు. అమరావతికి 2015-16లో రూ.27.77 కోట్లతో పర్యాటక గమ్యస్థానం కింద అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం ఆలయాభివృద్ధి కోసం రూ.37.88 కోట్ల ఖర్చు చేశామని పేర్కొన్నారు. ► లోక్సభలో విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశానికి సంబంధించిన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి లేఖపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కొత్త రైల్వే జోన్ ఏర్పటుపై డీపీఆర్ అందిందని ఆయన పేర్కొన్నారు. ► రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ మోపీదేవి వెంకటరమణ ఏపీలో ఆక్వా టూరిజం అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పందిస్తూ.. ఏపీలోని కాకినాడ, నెల్లూరులో ఆక్వా టూరిజం అభివృద్ధి చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. ► పెగాసస్ అంశంపై పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్పై వచ్చిన ప్రివిలేజ్ మోషన్లను పరిశీలిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ► రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. హైకోర్టులు, సుప్రీంకోర్టులలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తుల్లో తొలిసారిగా నలుగురు మహిళా న్యాయమూర్తులు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తాను న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ముగ్గురిని నియమించారని తెలిపారు. హైకోర్టుల్లోని 1098 మంది న్యాయమూర్తుల్లో, 83 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు. ► చాలా విరామం తర్వాత బుధవారం రాజ్యసభ అంతరాయం లేకుండా సజావుగా కొనసాగిందని చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ స్ఫూర్తి కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నాలుగో రోజు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని బుధవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
ఏపీ రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
► ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నిర్ణయ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ విభజన చట్టం అమలుపై రాజ్యసభలో కీలక ప్రశ్నలను సభ్యులు లేవనెత్తారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని మరోసారి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ►మూడో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ జీరో అవర్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంశాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రస్థలమని, టీటీడీ అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యాకలాపాల నిర్వహణకు భారీస్థాయిలో నిధులు అవసరం అవుతాయని తెలిపారు. విదేశాల నుంచి ప్రవాస భారతీయులు విరాళాలుగా పంపిస్తుంటారని గుర్తుచేశారు. కేంద్ర హోంశాఖ సాంకేతిక కారణాలతో ఎఫ్సీఆర్ఏ లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేసిందని, తగిన పత్రాలన్నీ సమర్పించినప్పటికీ లైసెన్స్ పునరుద్ధరించలేదని కేంద్రం దృష్టికి ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకువెళ్లారు. డిసెంబర్ 31 నాటికి రూ.13.04 కోట్ల నిధులు ఎఫ్సీఆర్ఏ అనుసంధాన బ్యాంకు ఖాతాలో ఉన్నాయని తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ తరహాలో లుక్ సౌత్ పాలసీని అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. బీజేపీని హిందూ జాతీయవాదానికి టార్చ్ బేరర్గా చెప్పుకుంటారని, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు ఉభయ సభలు కొలువుదీరాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి లోక్సభ, రాజ్యసభలో సభ్యులు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి బడ్జెట్ మూలధన వ్యయాన్ని 35. 4 శాతం మేర పెంచారు. వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా ఆర్థిక వ్యవస్థ వార్షిక వ్యయం పరిమాణాన్ని రూ.39.5 ట్రిలియన్కు (529 బిలియన్ డాలర్లు) పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు. -
కేంద్ర బడ్జెట్ 2022 అప్డేట్స్
-
ములాయం సింగ్కు స్మృతి ఇరానీ పాదాభివందనం, వీడియో వైరల్
Mulayam Singh Yadav blesses Smriti Irani: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ, లోక్సభ ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ మెట్లు దిగుతూ పార్లమెంటు హాల్లోకి వస్తున్న సమయంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ ములాయం పాదాలను తాకి నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమెను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం కాగా ఇటీవల ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం ఆమె కూడా లక్నోలోని తన మామ ములాయం సింగ్ ఇంటికి వెళ్లి అక్కడ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమె తలపై చేయి వేసి దీవించారు. చదవండి: బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా? #WATCH | Samajwadi Party (SP) founder-patron and MP Mulayam Singh Yadav blesses Union Minister Smriti Irani, as she greets him at the Parliament. pic.twitter.com/3ti42DXkpa — ANI (@ANI) January 31, 2022 -
బడ్జెట్ సమావేశాల లైవ్ అప్డేట్స్: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా
అప్డేట్స్ 04:00 PM ► కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం రాజ్యసభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా ఇంతకు ముందు ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా లోక్సభలో సమర్పించారు. 12: 55 PM ► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎకానామిక్ సర్వే 2021-22 ను లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ రేపటికి వాయిదా పడింది. 11: 55 AM ► పార్లమెంట్ సెంట్రల్ హల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల ఆజాదీకా అమృత్.. ఒక పవిత్ర మహోత్సవమని వచ్చే 25 ఏళ్లు అదే స్ఫూర్తితో మనమంతా పనిచేయాలన్నారు. అదే విధంగా, వ్యాక్సిన్తో కరోనాను కట్టడి చేయబోతున్నామని తెలిపారు. ఫ్రంట్లైన్ వర్కర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. దేశంలో పేదలకు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ► భారత్ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్గా మారుతోందన్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. భారీగా వస్తున్న ఎఫ్డీఐలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. మేకిన్ ఇండియాతో మొబైల్ పరిశ్రమ వృద్ధి చెందుతోందన్నారు. ► ఫసల్ బీమాతో సన్నకారు రైతులకు ప్రయోజం లభిస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల చేయూత కోసం 3 లక్షల కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు. ► 7 మెగా టెక్స్టైల్ పార్క్లతో యువతకు భారీగా ఉద్యోగాల కల్పన చేసినట్లు రాష్ట్రపతి రామ్నాథ్ తెలిపారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో 19 బీటెక్ కాలేజీల్లో 6 స్థానిక భాషలలో బోధన జరుగుందని రామ్నాథ్ పేర్కొన్నారు. ► పీఎమ్గ్రామీణ సడక్ యోజనలతో రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి రామ్నాథ్ తెలిపారు. ► ప్రస్తుతం భారతదేశం మూడో దశ కొవిడ్ను ఎదుర్కొంటుందన్నారు. భారత్లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్టపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం మూడో దశ కోవిడ్ను ఎదుర్కొంటుందన్నారు. ► భారత్లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్ ఎదుర్కోవడానికి దేశ ఫార్మారంగం ఎంతో కృషి చేసిందన్నారు. ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ► పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతో ఉపయోగపడిందన్నారు. డబ్ల్యూహెచ్వో తొలి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ భారత్లో ఏర్పాటు కాబోతుందని పేర్కొన్నారు. అదే విధంగా పద్మపురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లినట్లు వివరించారు. ► ప్రధాని గరీబ్యోజన పథకం ద్వారా 19 నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆహార సరఫరా సంస్థ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో పేర్కొన్నారు. 11: 04 AM ► పార్లమెంట్లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులకు స్వాతంత్ర్య, అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. 10: 54 AM ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ భవనంకు చేరుకున్నారు. 10.: 45 AM పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ఇది కీలక సమయమని, బడ్జెట్ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పెగాసస్, రైతు ఆందోళనలు, చైనా దురాక్రమణలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై దృష్టి సారించింది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్జోషీ, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేర్వేరుగా విపక్ష నేతలతో సమావేశమవుతారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనే బడ్జెట్ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతిగా కోవింద్ చివరి ప్రసంగం సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను సంయుక్తంగా ఉద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే జూలైలో రాష్ట్రపతిగా కోవింద్ పదవీ కాలం పూర్తికానుంది. దీంతో ఈ సమావేశాలే ఆయన రాష్ట్రపతి హోదాలో చివరిగా ప్రసంగించే పార్లమెంట్ సమావేశాలు. రాష్ట్రపతి ప్రసంగానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021–22ను, మంగళవారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. బుధవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే అంశంపై చర్చ ఆరంభమవుతుంది. ఈ చర్చ సుమారు 4 రోజులు జరగవచ్చు. ఫిబ్రవరి 7న ఈ చర్చకు ప్రధాని బదులిస్తారు. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. -
Lakhimpur Kheri violence: అజయ్మిశ్రాను తొలగించాలి!
న్యూఢిల్లీ: వివాదాస్పద కేంద్ర మంత్రి అజయ్మిశ్రాను మంత్రిమండలి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం లోక్సభలో డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ సభ్యులతో కలిసి సభలో ఆందోళనకు దిగారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన అజయ్ మిశ్రా పేరును ప్రస్తావిస్తూ లఖీంపూర్ ఖేరీ ఘటనతో మిశ్రాకు సంబంధం ఉందని ఆరోపించారు. అజయ్ మిశ్రాను తొలగించాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు అనుమతినివ్వాలని కోరారు. అయితే ముందుగా అనుకున్నట్లు రాహుల్ ఎంఎస్ఎంఈపై ప్రశ్నకు మాత్రమే పరిమితం కావాలని స్పీకర్ సూచించారు. చదవండి: కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు అయితే మిశ్రాను శిక్షించాల్సిందేనని రాహుల్ పట్టుబట్టారు. ఇదే సమయంలో పలు ప్రతిపక్షాల సభ్యులు వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం బయోడైవర్సిటీ బిల్లు పత్రాలను ప్రభుత్వం సభముందుకు తెచ్చింది. అటవీ ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో బయోడైవర్సిటీ సవరణ చట్టం –21ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ప్రతిపక్షాల నిరసన కొనసాగడంతో సభను మరుసటిరోజుకు వాయిదా వేశారు. అంతకుముందు సభ ఆరంభంలో ఇటీవల మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్కు నివాళులర్పించారు. ఇటీవల 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. అదేవిధంగా లఖీంపూర్ ఘటనను కూడా కాంగ్రెస్సభ్యులు లేవనెత్తారు. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. నిరసనల మధ్య పీడీపీ బిల్లుపై జాయింట్ కమిటీ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. సభ్యుల ఆందోళన తగ్గకపోవడంతో సభను మరుసటిరోజుకు వాయిదా వేశారు. సభ ఆరంభంలో విజయ్ దివస్ వీరులకు సభ్యులు నివాళి అర్పించారు. -
ఇక ఆ పనిచేయలేను.. అందుకే తప్పుకుంటున్నా: శశిథరూర్
సాక్షి, న్యూఢిల్లీ: 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్లపై రగడ కొసాగుతోంది. ఎంపీల సస్పెన్షన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ఎంపీ శశిథరూర్ ఎంపీలకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్కు సంబంధించిన సంసద్ టీవీ హోస్ట్గా తప్పుకున్నారు. సంసద్ టీవీలో శశిథరూర్ ‘టు ది పాయింట్’ అనే ప్రోగ్రామ్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్షన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. హోస్ట్ తాను తప్పుకుంటున్నట్లు సంసద్ టీవీ సీఈఓకు లేఖ రాశారు. ఈ నె 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజే రాజ్యసభలో 12 మంది ఎంపీలను ఛైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. (చదవండి: భార్యాభర్తల గొడవ.. కూతురిని ఒంటరిగా తీసుకెళ్లి..) గత వర్షాకాల సమావేశాల్లో సభలో వారి ప్రవర్తన సరిగాలేదంటూ వెంకయ్య వారిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఉదయం సస్పెన్షన్లను నిరసిస్తూ ఉద్యమం చేసే వాళ్లకు సంఘీభావం తెలిపి.. తర్వాత అదే పార్లమెంట్కు సంబంధించిన షోకు హోస్ట్గా వ్యవహరించడం తన వల్ల కావట్లేదని శశిథరూర్ తను రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఆయన లేఖపై సంసద్ టీవీ సీఈఓ స్పందించలేదు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా శశిథరూర్ బాటలోనే నడిచారు. సంసద్ టీవీ హోస్ట్గా ఆమె తప్పుకున్నారు. ఆమె ‘టీవీ మేరీ కహానీ ప్రోగ్రామ్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. ఎంతో బాధ, బాధ్యతతో తాను హోస్ట్ తప్పుకుంటున్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. (చదవండి: Amit Shah-Nagaland Incident: నాగాలాండ్ కాల్పులపై అమిత్ షా ప్రకటన) -
‘అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమే’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అఖిలపక్షం ఆదివారం భేటీ అయింది. ఈ సమావేశానికి దేశంలోని 32 పార్టీల నేతలు హాజరయ్యారు. లోక్ సభ స్పీకర్ అనుమతితో అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సందర్భంగా కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, సాగుచట్టాల వ్యతిరేకిస్తూ జరిపిన ఆందోళనలో మృతి చెందిన రైతులు, కరోనా మృతులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చదవండి: పార్లమెంట్లో కాంగ్రెస్తో సమన్వయంపై ఆసక్తి లేదు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మూడు సాగు చట్టాలపై రైతులను ఒప్పించలేకపోయామన్న ప్రధాని మోదీ.. మరో రూపంలో వాటిని తీసుకువచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. అయితే ఈసారి జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకాకపోవడం గమనార్హం. -
త్వరగా ముగించేందుకు సాకులు వెదుకుతోంది
న్యూఢిల్లీ: పెగసస్ అంశంపై చర్చకు నిరాకరిస్తున్న ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను ముందుగానే ముగించేందుకు సాకులు వెదుకుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్లమెంట్లో ప్రస్తుత ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ‘పార్లమెంట్ సమావేశాలను ప్రభుత్వమే అడ్డుకుంటోంది. ఈ సమావేశాలను ముందుగానే ముగించేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. అంతిమంగా ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి’ అని ఆయన మీడియాతో అన్నారు. పెగసస్ సాఫ్ట్వేర్ను ఇజ్రాయెల్ నుంచి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఏ రూపంలోనైనా ప్రభుత్వ ఏజెన్సీలు సంపాదించాయా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేకపోతోందన్నారు. ఒకవేళ ఆ సాంకేతికతను పొందితే ఎవరెవరిపై ప్రయోగించారో తెలపాలని అడిగినా ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. కాగా, షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది. -
పెగసస్ మీ నిర్వాకమేనా ?
న్యూఢిల్లీ: ‘మాది ఒకే ఒక్క ప్రశ్న. పెగసస్ను కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందా? కేంద్రమే తన సొంత మనుషులపై (సొంత పౌరులపై) పెగసస్ ఆయుధాన్ని ప్రయోగించిందా? అవునా, కాదా? దీనికి సమాధానం కావాలి’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై పార్లమెంటులో చర్చకు విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయని, ఆ చర్చ జరిగే వరకు మరే ఇతర అంశాన్ని ప్రస్తావించమని కచ్చితంగా చెప్పారు. ఈ అంశంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్ సహా 14 పార్టీలకు చెందిన నాయకులు బుధవారం సమావేశమై చర్చలు జరిపారు. ఈ అంశంపై ప్రధాని మోదీ లేదంటే హోం అమిత్ షా సమక్షంలో పార్లమెంటులో చర్చ జరగాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఈ సమావేశానికి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ హాజరు కాలేదు. సమావేశానంతరం విజయ్చౌక్లో ఇతర పార్టీ నేతల సమక్షంలో రాహుల్ మాట్లాడారు. అది దేశద్రోహమే పెగసస్ స్పైవేర్ వ్యవహారాన్ని వ్యక్తిగత గోప్యత అంశంగా తాను చూడడం లేదని, దీనిని దేశద్రోహంగా చూడాలని రాహుల్ అన్నారు. భారతదేశంపైనా, దేశ ప్రజలపైనా పెగసస్ అనే ఆయుధాన్ని ప్రధాని వాడారని ఆరోపించారు. ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాలని ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యమే ఆందోళనలో పడేలా కేంద్రం వ్యవహరిస్తోందని, అందుకే దీనిపై చర్చ జరగాల్సిందేనని డీఎంకే నేత టి.ఆర్. బాలు అన్నారు. కాగా, పెగసస్ స్పైవేర్, రైతు సమస్యల అంశంలో విపక్ష పార్టీల సభ్యులు పార్లమెంటు పరువు తీసేలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎదురు దాడికి దిగింది. -
జనాభా నియంత్రణ.. యూసీసీపై ప్రైవేటు బిల్లులు!
న్యూఢిల్లీ: రాబోయే వర్షాకాల సమావేశాల్లో జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్(యూసీసీ)పై ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఈమేరకు వారు యత్నిస్తున్న విషయాన్ని పార్లమెంట్ సెక్రటేరియట్లకు ఇద్దరు ఎంపీలు వెల్లడించారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును తెచ్చింది. అసోం సైతం ఇలాంటి బిల్లు తెచ్చే యోచనలో ఉంది. ఇదే బాటలో దేశవ్యాప్తంగా అమలయ్యేలా జనాభా నియంత్రణ బిల్లు తెచ్చేందుకు బీజేపీ ఎంపీలు యత్నిస్తున్నారు. యూపీకే చెందిన లోక్సభ ఎంపీ రవికిషన్ జనాభా నియంత్రణ బిల్లును, రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్న కిరోరి లాల్ మీనాలు యూసీసీ బిల్లును సమావేశాల జూలై 24న ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మరి కొందరు ఎంపీలు సైతం ఈ బిల్లుల కోసం నోటీసులు ఇచ్చారు. మంత్రులు కాకుండా సాధారణ సభ్యులు ప్రవేశపెట్టే బిల్లులను ప్రైవేట్ బిల్లులంటారు. వీటికి సంపూర్ణ ఆమోదం లభించకుండా చట్టరూపం దాల్చలేవు. అయితే ఈ బిల్లులు బీజేపీ ఎజెండాలో భాగం కనుక వీటిపై జరిగే చర్చలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇవన్నీ ఒక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న యత్నాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.ఈ బిల్లులోని ఏక సంతాన నిబంధనను విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకిస్తోంది. ఈ నిబంధనతో ఇప్పటికే హిందూ, ముస్లిం జనాభా అసమతుల్యత మరింత పెరుగుతుందని అభ్యంతరాలు చెబుతోంది. బిల్లు ఉద్దేశాన్ని వ్యతిరేకించడం లేదని, బిల్లులో కొన్ని క్లాజులపై అభ్యంతరాలున్నాయని సంస్థ ప్రతినిధి అలోక్ కుమార్ యూపీ లాకమిషన్కు లేఖ రాశారు. 1970 తర్వాత ఇంతవరకు ఒక్క ప్రైవేట్ బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందలేదు. -
డిస్కంలకు రూ. 21 వేల కోట్ల రుణం
సాక్షి, ఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు పునరుజ్జీవం కల్పించేందుకు సమూల సంస్కరణలు చేపట్టినట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ సంస్కరణల్లో భాగంగా ఈ రెండు రాష్ట్రాల డిస్కంలకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రూ. 21 వేల కోట్ల రుణం సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఈ రుణంలో ఆంధ్రప్రదేశ్కు రూ. 8,370 కోట్లు, తెలంగాణకు రూ.12,652 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కొన్ని షరతులకు లోబడి ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఈ రుణాన్ని డిస్కంలకు సమకూర్చుతాయని తెలిపారు. మంజూరు చేసిన రుణంలో మొదటి వాయిదా కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు రూ. 3,300 కోట్లు, తెలంగాణకు రూ. 6,287 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ స్కీమ్ కింద మంజూరు చేసే ఈ రుణం కొన్ని షరతులకు లోబడి మాత్రమే పంపిణీ జరుగుతుందని తెలిపారు. అందులో ప్రధానమైంది ప్రభుత్వ శాఖలు, విభాగాలు డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలను మూడు వార్షిక వాయిదాలలో విడుదల చేయడానికి అంగీకరిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో విద్యుత్ వినియోగానికి సంబంధించి స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు విధిగా అమర్చాని, దాని వల్ల డిస్కంలకు ప్రభుత్వ చెల్లింపులు సకాలంలో జరిగే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ వినియోగదారుల్లో కొన్ని కేటగిరీలకు ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ విధానాన్ని కూడా సమూలంగా మార్చాలన్నారు. సబ్సిడీకి సంబంధించిన బకాయలను ప్రతి మూడు మాసాలకు ఒకసారి విధిగా చెల్లించడానికి అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి షరతులకు ఆయా రాష్ట్రాలు అంగీకరించిన తర్వాత మాత్రమే తదుపరి రుణ వాయిదాల విడుదల జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలను ఆయా డిస్కంలు బాధ్యాతాయుతంగాను, పారదర్శకంగాను నిర్వహించాలని తెలిపారు. అందుకోసం ప్రతి త్రైమాసికం ముగిసే నాటికి డిస్కంలు ఎనర్జీ ఆడిట్ ఫలితాలను ప్రచురించాలన్నారు. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి ఫీడర్ వ్యాప్తంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) మార్గదర్శకాలను అనుసరించి ఎనర్జీ అకౌంటింగ్ చేపట్టాలన్నారు. ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్లో విద్యుత్ నష్టాలను గణనీయంగా తగ్గించే దిశగా డిస్కంలు ఆచరణ సాధ్యమైన కార్యాచరణను రూపొందించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ చర్యలు, సంస్కరణల ద్వారా డిస్కంలు నష్టాల ఊబి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుందని మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. -
దివ్యాంగులకు గుడ్న్యూస్: నో టోల్ ఫీజు
న్యూఢిల్లీ: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఫీజు చెల్లించనవసరం లేదని ప్రకటించింది. ఈ మేరకు గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో దివ్యాంగులకు టోల్ ఫీజు మినహాయింపు కల్పిస్తున్నారా అని బీజేపీ ఎంపీ రమేశ్ బిదురీ ప్రశ్నించారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. ఇకపై దివ్యాంగులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్ను ఎత్తివేసినట్లు ఈ సందర్భంగా గడ్కరీ గుర్తు చేశారు. యూజర్ ఫ్రెండ్లీ ఉండే రీతిలో దివ్యాంగులకు వాహనాలను డిజైన్ చేయాలంటూ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
బయోగ్యాస్ ప్లాంట్లలో కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం టాప్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక శిక్షణను కూడా అందిస్తున్నట్లు విద్యుత్, పునరుత్పాదక ఇందన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2 లక్షల 62 వేల 841 బయోగ్యాస్ ప్లాంట్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటులో కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆర్థిక, సాంకేతిక సహాయం కూడా అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఒక క్యూబిక్ మీటర్ పరిమాణంలో ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంట్కు రూ.7,500 నుంచి 25 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో ఏర్పాటుచేసే ప్లాంట్కు రూ.35 వేల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాతపూర్వకంగా చెప్పారు. అలాగే దేశంలోని వివిధ బయోగ్యాస్ అభివృద్ధి, శిక్షణ కేంద్రాలతోపాటు భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ ద్వారా కూడా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక శిక్షణ కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బయోగ్యాస్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు పెద్ద ఎత్తున బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర నోడల్ ఏజెన్సీ కృషి చేస్తున్నట్లు మంత్రి రాతపూర్వకంగా తెలిపారు. -
పార్టీ ఎంపీలతో నేడు సీఎం వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చిస్తారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ఏయే అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలో సీఎం దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం ఇవ్వాల్సిన నిధులను రాబట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ భావిస్తోంది. మరోవైపు ప్రత్యేక హోదా సాధనకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనిపైనా ఎంపీల సమావేశంలో చర్చించే వీలుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
29 నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ నెల 29వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారని గురువారం లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు తెలిపాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగుతాయి. స్టాండింగ్ కమిటీలు వివిధ శాఖలకు కేటాయించాల్సిన గ్రాంట్ల పరిశీలన, నివేదికలను సిద్ధం చేసేందుకు ఉభయ సభలు ఫిబ్రవరి 15వ తేదీన వాయిదాపడి తిరిగి మార్చి 8వ తేదీన సమావేశమవుతాయని తెలిపింది. కోవిడ్–19 నిబంధనల దృష్ట్యా గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా షిఫ్టుల వారీగా రాజ్యసభ మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ కార్యక్రమాలు జరుగుతాయి. లోక్సభ కార్యక్రమాలు రోజులో కనీసం ఐదు గంటలపాటు కొనసాగుతాయని లోక్సభ సెక్రటేరియట్ తెలిపింది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. గత సమావేశాలు తక్కువ కాలం జరగడంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసివేశారు. సభ్యులు ప్రైవేట్ బిల్లులను ఎప్పటిమాదిరిగానే శుక్రవారాల్లో మధ్యాహ్నం సమయంలో ప్రవేశపెట్టేందుకు కూడా ఈ దఫా అవకాశం ఇస్తున్నారు. చదవండి: కరోనా వ్యాక్సినేషన్ తొలి టీకా.. వీడియో ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం -
రైతుల ఆందోళన: ‘మీ భోజనం మాకొద్దు’
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం రైతులతో చర్చలు జరుపుతున్నప్పటికి.. అన్నదాతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రుల బృందం రైతులతో భేటీ అయ్యింది. మధ్యాహ్నం వరకు కూడా చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని సమాచారం. ఇక భోజన విరామ సమయంలో రైతులు ప్రభుత్వం అందించే ఆహారాన్ని నిరాకరించారు. తామే వండుకుని తెచ్చుకున్న భోజనాన్ని స్వీకరించారు. సమావేశం జరుగుతున్న విజ్ఞాన్ భవన్ లోపలి విజవల్స్ ప్రకారం రైతులంతా పొడవైన డైనింగ్ టేబుల్ దగ్గర తమతో పాటు తెచ్చుకున్న భోజనాన్ని తింటుండగా.. మరి కొందరు కింద కూర్చుని తిన్నారు. ఈ సందర్భంగా ఓ రైతు సంఘం నాయకుడు మాట్లాడుతూ.. ‘వారు మాకు భోజనం, టీ, కాఫీలు ఇవ్వాలని చూశారు. కానీ మేం వాటిని తిరస్కరించాం’ అని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఎనిమిది రోజులుగా ఢిల్లీలో సరిహద్దులో ఉద్యమం చేస్తున్నారు. ఇక నేటి భేటీలో మొదట వారు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో వివరించారు. అందులో వారు చట్టం లోపాలపై దృష్టి సారించారు. దాని గురించి ఎందుకు భయపడుతున్నారో తెలిపారు. సమావేశం రెండవ భాగంలో ప్రభుత్వ సంస్కరణపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, అతని క్యాబినెట్ సహోద్యోగి పియూష్ గోయల్, జూనియర్ మంత్రి సోమ్ ప్రకాష్ రైతులతో సమావేశం కానున్నారు. (వైరలైన రైతు ఫొటో: అసలు నిజం ఇదే!) కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల గురించి చర్చిండానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిస్తున్నారు. నూతన చట్టాల పట్ల ప్రభుత్వం కూడా స్థిరంగానే ఉంది. రైతుల నిరసనల నేపథ్యంలో వారిని శాంతింపచేయడానికి సహాయపడే ఇతర అవకాశాలను వారు పరిశీలిస్తున్నారు. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న కనీస మద్దతు ధరకు సంబంధించి ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వనున్నట్లు సమాచారం.