చైనాలో పడవ బోల్తా 10 మంది మృతి | 10 dies after Boat capsizes in China | Sakshi
Sakshi News home page

చైనాలో పడవ బోల్తా 10 మంది మృతి

Published Sat, May 25 2019 8:42 AM | Last Updated on Sat, May 25 2019 8:42 AM

10 dies after Boat capsizes in China - Sakshi

బీజింగ్‌: చైనాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చైనా నైరుతి భాగంలోని గుయిజోవూలోని బీపన్‌ నదిలో ఓ పడవ బోల్తా పడడంతో 10 మంది మృతి చెందగా  మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇప్పటివరకు తాము 11 మందిని రక్షించామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవలో మొత్తం 29 మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవ యజమాని కూడా అందులోనే ప్రయాణిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement