చైనాలోని షాంజి ప్రావిన్స్ వాయవ్య ప్రాంతంలో బస్సు లోయలోకి పడి కనీసం 33 మంది మరణించారు.
బీజింగ్: చైనాలోని షాంజి ప్రావిన్స్ వాయవ్య ప్రాంతంలో బస్సు లోయలోకి పడి కనీసం 33 మంది మరణించారు. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 30 మీటర్ల లోతున పడిపోయింది. 25 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా, మరో 8 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.