చౌతరా(కఠ్మాండు): నేపాల్ లో మంగళవారం సంభవించిన భూకంపం వల్ల ఢోలఖా జిల్లాలో సూమారు 65 మంది ప్రజలు మృతిచెందారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం ఉత్తర కఠ్మాండుకు చెందిన అధికారి ప్రేమ్ లాల్ లామిచేన్ వెల్లడించారు. నేపాల్ ప్రజలను భూకంపం భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. ప్రజలు భూకంపం సంభవిస్తుందేమోనన్న భయంతో వేలాది మంది మంగళవారం రాత్రి ఇంటి బయటే బిక్కుబిక్కుమంటూ గడిపారు. 3 వారాలకు ముందు సంభవించిన భూవిలయంలో సూమారు 8 వేల మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3 గా నమోదైంది. కఠ్మాండు, మౌంట్ ఎవరెస్టు మధ్య ప్రాంతం కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. బాధితులకు సహాయం అందించే ప్రయత్నంలో అమెరికాకు చెందిన హెలికాఫ్టర్ ఆరు మెరైన్లతో పాటు ఇద్దరు నేపాలీ సైనికులతో సహా ఈశాన్య నేపాల్ ప్రాంతంలో అదృశ్యమైన విషయం తెలిసిందే.
నేపాల్ భూకంపంలో మరో 68 మంది మృతి
Published Wed, May 13 2015 11:52 AM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM
Advertisement
Advertisement