అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్కాయిదా కూడా సోషల్ నెట్వర్కింగ్ బాట పట్టింది.
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్కాయిదా కూడా సోషల్ నెట్వర్కింగ్ బాట పట్టింది. అల్కాయిదా తన షముఖ్ అల్-ఇస్లామ్ వెబ్సైట్ పేరుతో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో మంగళవారం తొలి ఖాతాను తెరిచినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. సిరియాలో ఇస్లామిస్ట తిరుగుబాటుదారుల చీలిక నేపథ్యంలో వారిని ఐక్యం చేసే యత్నాల్లో భాగంగానే అల్కాయిదా ఈ ఖాతా తెరిచినట్లు ‘ఫాక్స న్యూస్’ పేర్కొంది.
సిరియాలో అల్కాయిదాకు చెందిన రెండు తిరుగుబాటు ముఠాల మధ్య విభేదాలను పరిష్కరించే దిశగా ట్విట్టర్ ఖాతా ద్వారా అల్కాయిదా తొలి ట్వీట్ చేసినట్లు తెలిపింది. అల్కాయిదా ట్విట్టర్ ఖాతా ద్వారా 29 ట్వీట్లు చేసిందని, ఆ ఖాతాను ప్రముఖ జీహాదిస్టులతోపాటు 1,532 మంది అనుసరించారని సమాచారం. ఇంటర్నెట్ సాయంతో ఆన్లైన్ జిహాద్ను ప్రోత్సహిస్తూ ఉగ్రవాద సంస్థలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయనడానికి దీనిని ఓ సూచికగా పరిగణించవచ్చని ఉగ్రవాదనిరోధక సంస్థల అధికారులు భావిస్తున్నారు.