Washington
-
న.మో. అమెరికా.. భారత ప్రధానికి అగ్రరాజ్య అప్యాయ పలకరింపు (చిత్రాలు)
-
13న ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈ నెల 13న వాషింగ్టన్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారని సోమవారం అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరిపేందుకు చర్చలు సాగుతున్నాయని విదేశాంగ శాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ రెండోసారి అమెరికా పాలనాపగ్గాలు చేపట్టాక ఇది ప్రధాని మోదీ మొట్టమొదటి అమెరికా పర్యటన కానుంది. ఫ్రాన్సులో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ఆయన వాషింగ్టన్ వెళతారని చెబుతున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక జనవరి 27వ తేదీన ప్రధాని మోదీ ఆయనతో ఫోన్లో సంభాషించారు. -
అమెరికా విమాన ప్రమాదం.. ఒబామా, బైడెన్పై ట్రంప్ సీరియస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర విమాన ప్రమాదం కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ సమీపంలో ప్యాసింజర్ విమానం, హెలికాప్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రమాదానికి గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్ పాలసీ విధానాలే కారణమని కామెంట్స్ చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా విమాన ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేపడుతామని, మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో అమెరికాలో గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్లు ఆకాశ భద్రతా ప్రమాణాలకు సంబంధించి రాజీపడ్డారు. కానీ, మేము మాత్రం భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒబామా, బైడెన్, ఇతర డెమొక్రాట్లు తమ విధానాలకే మొదటి ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. వారు కొందరికే ప్రాధాన్యత ఇచ్చారని, మేము సమర్థులైన వారినే కావాలనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎఫ్ఏఏకు తాత్కాలిక కమిషనర్ను నియమిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.ఇదే సమయంలో సుపీరియర్ ఇంటెలిజెన్స్ అవసరం అయ్యే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో అనర్హులను నియమించినట్లు ట్రంప్ విమర్శించారు. గతవారం తాను సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రమాణాల పునరుద్ధరణ సైతం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని ప్రకటించారు. ఈ ప్రమాదం చాలా మందిని కుదిపేసిందన్నారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోని ప్రజలపై దీని ప్రభావం ఉందని తెలిపారు. అలాగే, ప్రమాదంలో బాధితుల కోసం నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్ను అభినందించారు.ఇక, అంతకుముందు.. బాధితులకు ట్రంప్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కాసేపు మౌనం పాటించారు. అలాగే, విమాన ప్రమాదానికి సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ఈ ప్రమాదం తనను ఎంతో వేదనకు గురిచేసిందన్నారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో జరిగిన సంభాషణల టేపులను తాను విన్నానని తెలిపారు. విమానం సరైన మార్గంలోనే వెళ్లిందని, పైలట్ తప్పిదం లేదని పేర్కొన్నారు. అయితే అదేసమయంలో హెలికాప్టర్ అదే ఎత్తులో ఎగిరిందని, దీంతో పెను ప్రమాదం జరిగినట్లు తెలిపారు. -
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. ఈ ఐదు ప్రధాన కారణాలు!
ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఒకేరోజులో(జనవరి 29)న అమెరికా, సూడాన్లో జరిగిన విమాన ప్రమాదాల కారణంగా ఏకంగా 84 మంది ప్రాణాలు కోల్పోవడం బాధితుల కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ ప్రమాదాలకు పైలట్స్, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రమాదాలకు మాత్రం ఐదు కారణాలే ముఖ్యంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.తాజాగా సౌత్ సూడాన్లో ఘోర విమాన భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మరణించారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు. యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే, రన్వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్ సూడాన్, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది.ఇక, భారత కాలమానం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడి అగ్నిమాపక శాఖ చీఫ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలోంచి బయటకి తీసినట్లు తెలిపారు. అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, 2025 ఏడాది ప్రారంభంలోనే ఇలా ఒకే రోజున విమాన ప్రమాదాల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడంతో ప్రయాణీకులు వణికిపోతున్నారు.ఇదిలా ఉండగా.. 2000-2024 మధ్య 26 బోయింగ్ విమాన ప్రమాదాలు జరగ్గా అందుల్లో దాదాపు 10వేల మంది మరణించారు. ఒక్క 2024 ఏడాదిలో 15 విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాల్లో 50 శాతం ప్రమాదాలకు ప్రధాన కారణంగా పైలట్లే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి పైలట్లు అనుభవిస్తున్న అలసటే కారణమని అంటున్నారు. ఇక, 20 శాతం ప్రమాదాలకు విమాన సాంకేతిక లోపాలే కారణమని అంటున్నారు. 2018 తర్వాత 2024లోనే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.ఐదు కారణాలు ఇవే..పైలట్ల లోపాలు.. 50 శాతంసాంకేతిక లోపాలు.. 20 శాతంపిడుగులు, తుఫాన్లు, బ్యాడ్ వెదర్.. 15 శాతంటెర్రరిజం, మిస్సైల్ దాడులు.. 5 శాతం ఇతర ప్రమాదాలు.. 10 శాతందీనికి సంబంధించిన పలు కారణాలు విశ్లేషణతో ఈ వీడియోలో.. -
జైశంకర్కు ముందు సీటు.. మెలానియా తళుకులు.. సందడిగా సాగిన ట్రంప్ ఈవెంట్లో చిత్రాలెన్నో!
-
ఫుల్ జోష్లో ట్రంప్.. అధ్యక్ష ప్రమాణ స్వీకారంలో ప్రముఖులు (ఫొటోలు)
-
నేడే డొనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకం
వాషింగ్టన్: రెండున్నర నెలల ఎదురుచూపులు ముగిశాయి. (Donald Trump,)డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం (Oath Taking Ceremonyప్రమాణస్వీకారం చేయబోతున్నారు. (Washington)వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని తొలుత ఆరుబయట తలపెట్టినా, గడ్డకట్టించే చలి కారణంగా రొటుండా హాల్ లోనికి మార్చారు. దాంతో రొనాల్డ్ రీగన్ తర్వాత గత 40 ఏళ్లలో ఇండోర్లో అధ్యక్ష ప్రమాణం చేస్తున్న తొలి నేతగా ట్రంప్ నిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆహూతులను కూడా వేలనుంచి 500 లోపునకు కుదించారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్జెంగ్తో పాటు పలువురు దేశాధినేతలు తదితరులు కూడా హాజరవనున్నారు. 2021 క్యాపిటల్ హిల్ దాడి నిందితులు కూడా కోర్టు ప్రత్యేక అనుమతితో కార్యక్రమంలో పాల్గొంటుండటం విశేషం. ట్రంప్ శనివారం సాయంత్రమే కుటుంబసమేతంగా ఫ్లోరిడా నుంచి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్నారు. రాత్రి స్టెర్లింగ్లోని ఆయన సొంత నేషనల్ గోల్ఫ్ క్లబ్లో మొదలైన ప్రమాణ స్వీకార వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్, ఆయన సతీమణి ఉషా చిల్లకూరితో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండోసారి పగ్గాలు చేపడుతూనే ట్రంప్ తనదైన శైలిలో దూకుడు కనబరచనున్నారు. పాలన పగ్గాలు చేపట్టిన తొలి రోజే టిక్టాక్పై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేయనున్నట్టు ఆయన ఆదివారం ప్రకటించారు. అంతేగాక ఏకంగా 100కు పైగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ట్రంప్ ఓడించడం తెలిసిందే. ఆయన 2017–21 మధ్య తొలి దఫా అమెరికా అధ్యక్షునిగా పనిచేశారు. ట్రంప్ అభిమానులకు పోటీగా ఆయన వ్యతిరేకులు కూడా శనివారం నుంచే వైట్హౌస్ ముందు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఏప్రిల్లో భారత పర్యటన?ఏప్రిల్లో ట్రంప్ భారత పర్యటన ఉండే అవకా శం కనిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వీ లైనంత త్వరగా భారత్లో పర్యటించాలని ఆయ న యోచిస్తున్నట్టు ఫైనాన్షియల్ డైలీ వెల్లడించింది. ‘‘దీనిపై ఆయన ఇప్పటికే తన సలహాదారులతో లోతుగా చర్చిస్తున్నారు. డిసెంబర్ చివర్లో క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్తో ఈ దిశగా ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిగాయి’’ అని తెలిపింది. అంతకుముందే ప్రధాని మోదీని అమెరికాలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ఆహ్వానించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు వివరించింది. చైనాపై టారిఫ్లు తప్పవన్న తన వ్యాఖ్యల తాలూకు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆ దేశంలో కూడా ట్రంప్ పర్యటిస్తారని ఆయన సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కార్యక్రమానికి అతిరథులు ప్రపంచ కుబేరులు, వ్యాపార దిగ్గజాలు ఎలాన్ మస్్క, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ దంపతులు తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంబానీ దంపతులు శనివారం రాత్రే ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయనతో పాటు క్యాండిల్ లైట్ డిన్నర్లో పాల్గొన్నారు. ట్రంప్ వ్యక్తిగతంగా ఆహ్వానించిన 100 మంది జాబితాలో భారత్ నుంచి వారు మాత్రమే ఉన్నారు.ప్రమాణ స్వీకారం ఇలా... → ట్రంప్ ఆదివారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆర్లింగ్టన్ జాతీయ స్మారకం వద్ద కార్యక్రమంలో, క్యాపిటల్ వన్ ఎరీనా ర్యాలీలో పాల్గొంటారు. → సోమవారం ఉదయం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ట్రంప్ ప్రార్థనలతో కార్యక్రమాలు మొదలవుతాయి. → అనంతరం దిగిపోనున్న అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు వైట్హౌస్లో ట్రంప్కు తేనీటి విందు ఇస్తారు. → తర్వాత అంతా కలిసి క్యాపిటల్ హిల్ భవనానికి చేరుకుంటారు. → లింకన్ బైబిల్పై ప్రమాణం చేసి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. → తర్వాత ప్రారంభోపన్యాసం చేస్తారు. రెండో టర్ములో తన ప్రాథమ్యాలను క్లుప్తంగా వివరిస్తారని భావిస్తున్నారు. → అనంతరం బైడెన్, కమలా హారిస్కు లాంఛనంగా వీడ్కోలు పలుకుతారు. → తర్వాత ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తూ వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో అధికారిక పత్రాలపై సంతకాలు చేస్తారు. అధ్యక్షునిగా తొలి ఆదేశాలు జారీ చేస్తారు. → అధికారిక విందు అనంతరం సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు. -
అమెరికాలో ‘మంచు’ బీభత్సం
వాషింగ్టన్: తుఫాను కారణంగా తూర్పు అమెరికా అంతటా భారీ మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఐదుగురు మృతి చెందారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో లక్షలాది మంది అంధకారంలో ఉండిపోయారు. 2,400కు పైగా విమానాలు రద్దయ్యాయి. వాషింగ్టన్లో ఒక అడుగు వరకు మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్డబ్ల్యూఎస్) అంచనా వేసింది. పరిస్థితులను అధ్యక్షుడు జో బైడెన్ నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రభావిత రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వైట్హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికా రాజధానిలోని ఇళ్లన్నీ మంచులో కూరుకుపోయాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని పాఠశాలలు మూసివేశారు. కాన్సాస్, మిస్సోరి సహా పలు రాష్ట్రాల్లో మంచు తుఫాను పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. కెంటకీ, మిస్సోరి, వర్జీనియా, మేరీల్యాండ్ సహా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రోడ్లను క్లియర్ చేయడానికి అత్యవసర నిర్వహణ పనులు జరుగుతున్నాయని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని గవర్నర్లు, స్థానిక అధికారులు కోరారు. ఆగ్నేయ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, వడగండ్లు, టోర్నడోలు వస్తాయని ఎన్డబ్ల్యూఎస్ హెచ్చరించింది. మంచు దట్టంగా పేరుకుపోతుందని, శక్తివంతమైన గాలులతో చెట్లు కూలిపోతాయని, దీర్ఘకాలిక విద్యుత్ అంతరాయం కలిగే అవకాశముందని తెలిపింది. -
వైట్హౌస్పై మెలానియా విముఖత
వాషింగ్టన్: ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మెలానియా ట్రంప్.. శ్వేతసౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికే ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ? ఎలా? గడుపుతారనే చర్చ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్హౌస్లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ.. కాబోయే మహిళకు ఇచ్చే విందుకు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. ఆమె వెళ్ళడం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్హౌస్లోనే ఉన్న ఆమె.. ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో వైట్హౌస్ మెలానియాకు కొత్త... కానీ ‘ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు. అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు. కొడుకుకు దగ్గరగా... మెలానియా ట్రంప్.. వచ్చే నాలుగేళ్లలో ఆమె న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్బీచ్లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తరువాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడిపారు. అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తరువాత వైట్హౌస్కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నారు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేతసౌధంలో ఉండటానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ.. మెలానియా ట్రంప్ను చాలాకాలంగా గమనిస్తున్నవారికి ఇది ఆశ్చర్యం కలిగిచడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానన్న ప్రకటనకు హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పారీ్టలోనూ ఆమె పాల్గొనలేదు. ప్రైవసీకే ప్రాధాన్యత.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్తో కలిసి ఉన్నప్పటికీ, మెలానియా ట్రంప్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకో ప్లాట్ఫామ్ నిర్మించుకున్నట్టుగా మెలానియా ట్రంప్ చేయలేదు. ప్రైవసీని కోరుకున్నారు. రిపబ్లికన్ల రాజకీయ నిధుల సేకరణలో ఒక్కసారి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలైలో డోనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాశారు. ‘హింసను ప్రేరేపించే ద్వేషం, విద్వేషాలకు అతీతంగా ఉండండి. కుటుంబమే ప్రథమం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మనమందరం కోరుకుందాం’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక అబార్షన్ హక్కుల విషయంలో భర్త ట్రంప్తో విభేదించారు. గత అక్టోబర్లో.. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా, మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’అని ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తన వైఖరి భర్త డోనాల్డ్ ట్రంప్కు తెలుసని, ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని ఆ తరువాత మీడియాతో చెప్పారు. మెలానియా ట్రంప్ తన భర్తతో రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారని, సంప్రదాయ దృక్పథంతో సమస్యలపై మాట్లాడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. -
నింగిలోకి దూసుకెళ్లిన కలప ఉపగ్రహం
వాషింగ్టన్: అత్యంత కఠినమైన లోహాలతో రూపొందిన కృత్రిమ ఉపగ్రహాలు కాలంచెల్లాక కక్ష్యల్లో స్పేస్జంక్గా పోగుబడుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా కలపను భవిష్యత్తులో వాడే ఉద్దేశ్యంతో జపాన్ శాస్త్రవేత్తలు కలపతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారైన ‘లిగ్నోశాట్’ఉపగ్రహం అమెరికాలోని నాసా వారి కెన్నడీ అంతరిక్షప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ఎక్స్ రాకెట్ లో నింగిలోకి దూసుకుపోయి ందని క్యోటో వర్సిటీ హ్యూమన్ స్పేసాలజీ సెంటర్ మంగళవారం ప్రకటించింది. కేవలం అరచేయి సైజులో 10 సెంటీమీటర్ల వృత్తాకార పరిమాణంలో ఈ బుల్లిశాటిలైట్ను తయారుచేశారు. ఒక కంటైనర్లో అమర్చి పంపారు. త్వరలో ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోంది. కొద్దిరోజుల విరామం తర్వాత దీనిని ఐఎస్ఎస్ బయట ప్రవేశపెట్టనున్నారు. ఆరునెలలపాటు ఇది తన కక్ష్యలో తిరగనుంది. శూన్యంలో రోదసీ వాతావరణంలో కలప ఏ మేరకు మన్నికగా ఉంటుందనే విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఇది రోదసీలో చీకటి మొదలు తీక్షణమైన సూర్యరశ్ని దాకా అంటే మైనస్ 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్దాకా భిన్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాల్సి ఉంటుంది. కలపను దహించే ఆక్సిజన్ వంటి వాయువులు శూన్యంలో ఉండవుకాబట్టి అక్కడ కలప ధృఢంగా ఉండగలదని జపాన్లోని క్యోటో విశ్వవిద్యాలయ అటవీశాస్త్ర ప్రొఫెసర్ కోజీ మురాటా వాదిస్తున్నారు. ఖడ్గం పిడి, ఒరగా వాడే మంగోలియా జాతి హొనోకీ చెట్టు కలపను ఈ శాటిలైట్ తయారీలో వాడారు. జపాన్ సంప్రదాయక కళతో ఎలాంటి నట్లు, బోల్ట్లు, జిగురు వాడకుండానే లిగ్నోశాట్ను సిద్ధంచేశారు. కాలం చెల్లిన శాటిలైట్ తిరిగి భూవాతావరణంలోకి వచ్చేటపుడు ప్రమాదకర అల్యూమినియం ఆక్సైడ్ అణువులను వెలువరుస్తుంది. అదే కలప శాటిలైట్తో పర్యావరణానికి, కమ్యూనికేషన్ కక్ష్యలకు ఎలాంటి సమస్యలు ఉండవని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట కలపశాటిలైట్ మన్నిక బాగుందని తేలితే భవిష్యత్తులో చంద్రుడు, మార్స్పై వ్యోమగాముల ఆవాసాలకు కలపను విరివిగా వాడే అవకాశముంది. ఐఎస్ఎస్ నుంచి సరకుల రాకపోకల్లోనూ కంటైనర్లకు కలపను వాడే వీలుంది. -
అబార్షన్ మా హక్కు
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అబార్షన్ హక్కుల కోసం డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది మహిళలు రాజధాని వాషింగ్టన్తో పాటు ఇతర ప్రాంతాల్లో శనివారం ర్యాలీలతో హోరెత్తించారు. వాషింగ్టన్ వీధుల్లో నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. పురుషులు కూడా నిరసనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసమే కాకుండా అబార్షన్ హక్కుల సవరణల బ్యాలెట్పైనా ఓటేయాలని ప్రజలను కోరారు. వాషింగ్టన్లో జరిగిన విమెన్స్ మార్చ్లో స్త్రీవాద ఉద్యమకారిణి ఫన్నీ గోమెజ్ లూగో అబార్షన్ బ్యాలెట్ ఉన్న 10 రాష్ట్రాల జాబితాను చదివి వినిపించారు. మిస్సోరీలోని కాన్సాస్ సిటీలో జరిగిన ర్యాలీలో అబార్షన్ హక్కుల చట్టం కోసం ప్రజలు సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డెమొక్రటిక్ అభ్యరి్థగా హారిస్ బరిలోకి దిగినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో 30 ఏళ్ల లోపు మహిళల అబార్షన్ హక్కులు ప్రధానాంశంగా మారాయి. అబార్షన్ హక్కును రద్దు చేసి, దానిపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేస్తూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుకు నిరసనగా కార్యక్రమాలు పెరిగాయి. -
ఘనంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్ప్రదేశ్లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
హారిస్కే డెమొక్రాట్ల ఓటు
వాషింగ్టన్: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు అనధికారికంగా ఖరారు కావడంతో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఆమె ఎవరిని ఎన్నుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. డెలావెర్లోని ప్రచార ప్రధాన కార్యాలయాన్ని హారిస్ సోమవారం సందర్శించారు.అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం హారిస్ మొదటిసారి రోజంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బైడెన్ ప్రచారం బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉన్నాయని, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్పై హారిస్ విరుచుకుపడ్డారు.ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు. నేరాలను ఎత్తి చూపారు. మహిళలను వేధించిన మృగం, మోసగాడు, తన స్వార్థ ప్రయోజనాలకోసం నియమా లను ఉల్లంఘించిన వ్యక్తని విమర్శించారు. ‘ట్రంప్ ఏ రకమో నాకు తెలుసు’ అంటూ ఎద్దేవా హారిస్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవమన్నారు.ఆయన అమెరికా ప్రజలకోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు. ఇక కరోనా బారినపడి ఐసోలేషన్లో ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లైన్లో సమావేశంలో పాల్గొన్నారు. కమలా హారిస్ను గెలిపించడానికి పనిచేయాలని డెమొక్రాట్లకు విజ్ఞప్తి చేశారు. తాను కోలుకోగానే ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ట్రంప్పై విరుచుకుపడిన హారిస్.. ఇక హారిస్కు 40 మందికి పైగా డెమొక్రటిక్ సెనేటర్లు, దాదాపు 100 మంది హౌస్ సభ్యుల మద్దతు ఉంది. అత్యంత కీలకమైన మలుపు మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సైతం హారిస్కు మద్దతు పలకడం. అంతేకాదు కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్, కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్, కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్తోపాటు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్, అమెరికన్ ఫెడరేష ఆఫ్ టీచర్స్ అనే రెండు కీలక కార్మిక సంఘాలు సైతం ఆమెకు మద్దతు తెలుపుతున్నాయి.ఉపాధ్యక్ష రేసులో కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్, యుఎస్ ట్రాన్స్పోర్టేషన్ సెక్రటరీ పీట్ బుట్టిగీగ్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, ఇల్లినాయిస్ గవర్నర్ జె.బి. ప్రిట్జ్కర్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఉండొచ్చని భావిస్తున్నారు. -
హెడ్, స్మిత్ మెరుపులు.. సూపర్ కింగ్స్ చిత్తు
మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. డల్లాస్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో వాషింగ్టన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.హెడ్ కేవలం 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 53 పరుగులు చేయగా.. స్మిత్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 57 రన్స్ చేశాడు. వీరిద్దరితో పాటు మాక్స్వెల్(34), పియెనార్(33) పరుగులతో రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు, బ్రావో రెండు వికెట్లు పడగొట్టాడు. తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 164 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో సత్తాచాటగా.. జస్దీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్ తలా మూడు వికెట్లు పడగొట్టి సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్ 55 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
మేజర్ లీగ్ క్రికెట్-2024లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫ్రాంచైజీకి హెడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్లో భాగంగా శనివారం ఉదయం టెక్సాస్ సూపర్ కింగ్స్తో మ్యాచ్లో హెడ్ విధ్వంసం సృష్టించాడు.సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. తొలి ఓవర్ నుంచే సూపర్ కింగ్స్ బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు.ఓవరాల్గా ఈ మ్యాచ్లో 22 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 8 ఫోర్లు, 2 సిక్స్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో హెడ్తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్(57), ఓబుస్ పియెనార్(33) పరుగులతో రాణించారు.అసలేంటి ఈ మేజర్ లీగ్ క్రికెట్?తమ దేశంలో క్రికెట్ను అభివృద్ది చేసేందుకు అమెరికా క్రికెట్ ఆసోయేషిన్ ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని ప్రారంభించింది. తొట్ట తొలి సీజన్ గతేడాది జూలై 13 నుంచి 30 వరకు జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ రెండో సీజన్. మొత్తం ఈ క్రికెట్ లీగ్లో ఆరు జట్లు పాల్గోంటున్నాయి.ఇందులో సీటెల్ ఓర్కాస్, ఎంఐ న్యూయర్క్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇందులో ఎంఐ న్యూయర్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్రాంజైలు ఐపీఎల్ యాజమాన్యంకు సంబంధించినవే గమనార్హం. -
అమెరికాలో మరో రెండు వీసా దరఖాస్తు కేంద్రాలు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్లో కొత్తగా రెండు వీసా, పాస్పోర్టు కేంద్రాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. పసిఫిక్ తీరంలోని 9 వాయవ్య రాష్ట్రాల్లో ఉండే సుమారు 5 లక్షల మంది భారత సంతతి ప్రజల అవసరాలను ఇవి తీరుస్తాయని సియాటెల్లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా చెప్పారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్, బెల్వ్యూల్లో శుక్రవారం వీసా, పాస్పోర్టు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇటీవలే సియాటెల్లో భారత కాన్సులేట్ ఏర్పాటైంది. అలాస్కా, ఇడహో, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్, వ్యోమింగ్ రాష్ట్రాలు ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. న్యూయార్క్, అట్లాంటా, షికాగో, హూస్టన్, శాన్ఫ్రాన్సిస్కోల్లో ఐదు చోట్ల ఇప్పటికే భారత కాన్సులేట్లు నడుస్తున్నాయి. భారత ప్రభుత్వం తరఫున వీటిని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ నిర్వహిస్తోంది. -
భారత్–రష్యా సాన్నిహిత్యం
దౌత్య ప్రపంచంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. పర్యటనలైనా, ప్రసంగాలైనా, సమావేశాలైనా, ఒప్పందాలైనా– దేశాల ప్రయోజనాలతో ముడిపడివుంటాయి. సమయం, సందర్భం తప్పనిసరిగా ఉంటాయి. తమ ఆలోచనలేమిటో నిక్కచ్చిగా చెప్పడం కూడా వీటి ఉద్దేశం కావొచ్చు. ప్రధాని మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఇరుగు పొరుగు దేశాలను సందర్శించే ఆనవాయితీని పక్కనబెట్టి రష్యాను ఎంచుకున్నారు. రెండు రోజుల ఆ పర్యటన మంగళ వారం ముగియబోతుండగా అమెరికా ప్రాపకంతో 75 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన సైనిక కూటమి నాటో వజ్రోత్సవాలు వాషింగ్టన్లో మొదలయ్యాయి. ఇవి మూడురోజులపాటు సాగుతాయి. రష్యా పూర్వరూపమైన సోవియెట్ యూనియన్కు వ్యతిరేకంగా నాటో ప్రారంభమైంది. కనుక మోదీ రష్యా పర్యటన సహజంగానే అమెరికాకు కంటగింపుగా ఉండొచ్చు. ఈ పర్యటన ‘శాంతి ప్రయత్నాలకు’ తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. పైగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత అత్యంత క్రూరుడైన నేరగాణ్ణి హత్తుకోవటం ఏమిటని విమర్శించారు. జెలెన్స్కీ చెబుతున్న శాంతి ప్రయత్నాలేమిటో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా రష్యాను ఎదుర్కొనటానికి యుద్ధం మొదలైననాటి నుంచీ ఉక్రెయిన్కు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎడాపెడా ఆయుధాలు, డబ్బు సరఫరా చేయటం. అందువల్లే ఆ ఘర్షణ ఎడతెగకుండా సాగుతోంది. ఇందులో శాంతి ప్రసక్తి ఎక్కుడుందో అర్థంకాదు. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఖండించాల్సిందే. కానీ ఇందులో ఉక్రెయిన్ బాధ్యత కూడా ఉంది. దాని సంగతలావుంచితే భారత–రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధానంగా మోదీ రష్యా వెళ్లారు. ఈ సందర్భంగా వివిధ ఒప్పందాలు కూడా కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందజేశారు. అయితే మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కియూవ్లో ఒక ఆసుపత్రిపై జరిగిన క్షిపణి దాడిలో 37 మంది చనిపోయిన ఉదంతాన్ని ఖండించటానికి మోదీ వెనకాడలేదు. రష్యాతో మనకున్న మైత్రి ఈనాటిది కాదు. ఆ మైత్రికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. మోదీ అన్నట్టు రష్యా అన్ని కాలాల్లోనూ దృఢంగా మన వెనక నిలబడింది. స్నేహ హస్తం అందించింది. 1971లో పాకిస్తాన్తో మనకు యుద్ధం వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదుకుంది. ఆ యుద్ధంలో మనం సాధించిన విజయంలో సోవియెట్ పాత్ర కీలకమైనది. మన అమ్ములపొదిలో ఉన్న రక్షణ పరికరాల్లో అత్యధిక భాగం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇది కేవలం కొనుగోలుదారు– అమ్మకందారు సంబంధం కాదు. పరిశోధన, అభివృద్ధితో మొదలెట్టి ఉమ్మడి ఉత్పత్తుల వరకూ ఇరు దేశాలూ సహకరించుకుంటున్నాయి. మనకున్న రెండు విమానవాహక నౌకల్లో ఒకటి రష్యానుంచి వచ్చినదే. ఇంకా ఎస్–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ, మిగ్–29, ఎస్యూ–30 ఎంకెఐ యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, ఏకే–203 రైఫిళ్లు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు తదితరాలున్నాయి. ఇవిగాక తన టీ–90 శతఘ్నుల ఉత్పత్తికి మనకు అనుమతులిచ్చింది. విడి భాగాల దగ్గర్నుంచి నూతన పరిశోధనల వరకూ మన రక్షణ వ్యవస్థ పూర్తిగా రష్యాతో ముడిపడివుంది. అణు విద్యుత్ కర్మాగారాల స్థాపన, నిర్వహణలో తోడ్పడుతోంది. ఇరవై అయిదేళ్ల క్రితం మనకు అమెరికాతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి కూడా మనం రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తున్నాం. మనను రష్యాకు దూరం చేయాలని ఆది నుంచీ అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాకైతే ఇది మరింతగా పెరిగింది. ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ సంస్థల్ని బేఖాతరుచేసి ఘర్షణలు నివారించే పేరుమీద అమెరికా ఒక పక్షాన్ని సమర్థించటం, అవతలిపక్షంతో ఎవరూ సాన్నిహిత్యం నెరపకూడదని ఫర్మానా జారీచేయటం ఆశ్చర్యకరం. వాస్తవా ధీన రేఖ వద్ద చైనాతో మనకు అయిదేళ్లుగా లడాయి నడుస్తోంది. ఆ దేశంతో ఘర్షణలు వస్తే మనకు రష్యా నుంచి రక్షణ పరికరాలు, విడిభాగాలు అత్యవసరమవుతాయి. అంతేకాదు... రక్షణ సాంకేతి కతలు చైనాకు పోకుండా చూడటం మనకు ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రయోజనాలూ వదులుకుని తాను చెప్పినట్టల్లా నడుచుకోవాలని అమెరికా భావించటం ఎంతమాత్రం సరికాదు. పాకిస్తాన్తో మనకున్న సమస్యల విషయంలో ఏనాడూ అమెరికా సానుభూతిగా లేదు. కంటితుడుపు చర్యలు తీసుకోవటం, ఏదో వంకన ఆ దేశానికి సైనిక, ఆర్థిక సాయం అందించటం అమెరికాకు రివాజుగా మారింది. మనం మాత్రం తన ఫర్మానాలు పాటించాలని ఆ దేశం ఆశిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి వద్దన్న అమెరికా ఒత్తిడిని కాదని, రోజుకు 21 లక్షల బ్యారెళ్ల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాం. చౌకగా లభించే ఆ ముడి చమురు వల్ల మనం లాభపడటం మాట అటుంచి ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వం సాధించింది. వర్తమాన సంక్లిష్ట పరిస్థితుల్లో రష్యాతో సాన్నిహిత్యం ఇబ్బందికరమే అయినా, దేశ ప్రయోజనాల రీత్యా దాన్ని కొనసాగించాలనుకున్న మన దేశ వైఖరి మెచ్చదగినది. ఏదేమైనా రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలను మూడో దేశం ప్రభావితం చేయాలనుకోవటం, వాటిని తెంచుకోవాలని ఒత్తిడి తీసుకురావటం మంచి సంప్రదాయం కాదు. తన పర్యటన ద్వారా అమెరికాకు ఈ సంగతిని స్పష్టం చేసిన ప్రధాని మోదీ చర్య ప్రశంసించదగ్గది. -
అమెరికాలో దంచికొడుతున్న వర్షాలు.. నీటి మునిగిన కౌంటీలు
వాషింగ్టన్: అమెరికాలోని అయోవా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా చాలా కౌంటీలు నీటముగిగాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో బయటకు తీసుకువచ్చేందకు ప్రయత్నాలు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. అయోవా రాష్ట్రంలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, కౌంటీల్లో వరద నీరు చేరుతుండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, దాదాపు 4,200 మంది జీవించే రాక్వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపంలోని రాక్ నది పొంగిపొర్లుతోంది. దీంతో సైరన్లు మోగించి, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరు కారణంగా ప్రజలకు తాగునీరు కూడా అందుబాటులో లేకుండాపోయింది. Floods in Iowa prompted evacuations due to heavy rain, with Rock Valley facing severe infrastructure strain. Governor Kim Reynolds declared a disaster in 21 counties, including Sioux County. South Dakota declared an emergency as Canton received significant rainfall.… pic.twitter.com/F4WNXcD3iQ— Breaking News (@TheNewsTrending) June 23, 2024 మరోవైపు.. వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే బాధితుల వద్దకు బోట్లు చేరుకోగలగడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. ఇక్కడ ఉన్న 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సియూక్స్ కౌంటీ మొత్తం జలమయమైంది. ఎక్కడా వీధులు కనిపించడంలేదు. ఇళ్ల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక సౌత్ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు.. రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో సోమ, మంగళవారాల్లో ఇక్కడి నదులకు భారీగా వరద రావచ్చని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. 1936 తర్వాత ఆ స్థాయిలో వేడిని చవిచూస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో 37.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రిచ్మాండ్, వర్జీనియా, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, కొలంబస్, ఒహాయో, డెట్రాయిట్లో వేడి 32 డిగ్రీలు దాటింది. దీంతో, ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
‘మోదీ పాక్తో వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా’
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా శక్తిమంతమైన నాయకుడని ప్రముఖ పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ ప్రసంశలు కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ.. భారత్ను చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన మూడోసారి కూడా ప్రధాని అవుతారు. ప్రధాని మోదీ భారత్కే కాకుండా ప్రపంచానికి కూడా మంచి చేస్తున్నారు. అందుకే మోదీ వంటి నాయకుడు పాకిస్తాన్కు కావాలి. పాక్తో మోదీ వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా.ప్రశాంతంగా ఉండే పాకిస్తాన్ భారత్కు కూడా మంచిదే. ఎక్కడ చూసిన మోదీ మళ్లీ ప్రధాని అవుతారని వినిపిస్తోంది. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మోదీ ప్రజాదరణ చాలా అద్భుతం. భవిష్యత్తులో భారత్ ప్రజాస్వామ్యం నుంచి చాలా నేర్చుకుంటారు.పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక.. పీఓకేలో విద్యుత్ చార్జీల పెరగుదల కారణంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలను పాక్ వెతకటం లేదు. ఎగుమతులను పెంచటం. ఉగ్రవాదాన్ని నియంత్రణ చేయటం. శాంతి భద్రతలను మెరుగుపరటంలో చొరవ చూపటం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి సరైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నా’అని సాజిద్ తరార్ తెలిపారు. -
మాక్స్వెల్ కీలక నిర్ణయం.. ఆ టోర్నీలో ఆడేందుకు ఒప్పందం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున మాక్స్వెల్ ఆడనున్నాడు. ఈ మెరకు వాషింగ్టన్ ఫ్రీడమ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టులో తన సహచర ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లు సైతం చేరారు. తాజాగా మాక్సీ కూడా జతకట్టడంతో వాషింగ్టన్ ఫ్రాంచైజీ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కాగా ఐపీఎల్-2024 సీజన్ మధ్య నుంచి మాక్స్వెల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. మానసికంగా, శారీరకంగా బాగా ఆలిసిపోయానంటూ మాక్స్వెల్ తాత్కాలిక విరామం తీసుకున్నాడు. ఈ లీగ్లో ఆర్సీబీ జట్టుకు తన అవసరం ఎప్పుడొచ్చినా బలంగా తిరిగొస్తానని మాక్స్వెల్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మాక్సీ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన మాక్స్వెల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు డకౌట్లు అయ్యాడు. ఇక యూనైటడ్ స్టేట్స్ నిర్వహిస్తున్న ఈ మేజర్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ జూలై 4నుంచి ప్రారంభం కానుంది. -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద నిప్పంటించుకొని ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి మృతి
వాషింగ్టన్: గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసన తెలుపుతూ నిప్పంటించుకున్న అమెరికా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి మరణించాడు. సోమవారం ఈ విషయాన్ని పెంటాగన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఎంబసీ ముందు మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఇజ్రాయెల్ ఎంబసీ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి తనకు తాను నిప్పు పెట్టుకోవటం వల్ల మంటల్లో చిక్కుకున్నాడు. మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది... అతనికి తీవ్రమైన గాయాలు కావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స అందిస్తున్న సమయంలో అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. Hazmat crews arrive at Israeli Embassy for a suspicious vehicle after a man lit himself on fire pic.twitter.com/YDIrc9o5gp — Andrew Leyden (@PenguinSix) February 25, 2024 ‘పాలస్తీనాను విడిచిపెట్టండి’.. ‘మారణహోమంలో పాలుపంచుకోవద్దు’.. అంటూ నినాదాలు చేస్తూ సదరు వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియా వైరల్గా మారింది. దీంతో అమెరికా ఎయిర్ ఫోర్స్ స్పందించి.. నిరసన తెలుపుతూ నిప్పుపెట్టుకొని మృతి చెందన వ్యక్తి తమ డిపార్టుమెంట్కు చెందిన ఆరోన్ బుష్నెల్ అని గుర్తించారు. అయితే అతను ఎయిర్ ఫోర్స్లో ఏ స్థాయికి చెందని ఉద్యోగి, ర్యాంక్ ఏంటి? వంటి వివరాలు తెలియజేడానికి నిరాకరించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ ఎంబసీకి సంబంధించిన సిబ్బందికి ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎంబసీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అతను గుర్తు తెలియని వ్యక్తి అని తెలిపారు. -
వాషింగ్టన్ ఇజ్రాయెల్ ఎంబసీ.. యూఎస్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
వాషింగ్టన్: అమెరికా ఎయిర్ఫోర్స్ ఉద్యోగి ఒకరు వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు తాను మంటలంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేశాడు. మంటలంటించుకునే మందు అతడు మాట్లాడుతూ ‘గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో ఇక ఏ మాత్రం నేను భాగం కాను. ఇందుకే నిరసనగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’అని చెప్పాడు. ఈ వీడియో ట్విట్చ్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమైంది. వెంటనే అధికారులు వీడియోను డిలీట్ చేయించారు. ఘటన అనంతరం మంటలార్పి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. యూనిఫాం వేసుకుని తనను తాను కాల్చుకున్న వ్యక్తి అమెరికాలోని టెక్సాక్కు చెందిన ఎయిర్ఫోర్స్ ఉద్యోగి అని అధికారులు నిర్ధారించారు. Hazmat crews arrive at Israeli Embassy for a suspicious vehicle after a man lit himself on fire pic.twitter.com/YDIrc9o5gp — Andrew Leyden (@PenguinSix) February 25, 2024 ఇదీ చదవండి.. దుస్తులపై వివాదం.. మహిళపై మూకదాడికి యత్నం -
అమెరికా వైట్హౌజ్ గేటుపైకి దూసుకెళ్లిన కారు
వాషింగ్టన్: అమెరికా వైట్హౌజ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శ్వేత సౌధం కాంప్లెక్స్ బాహ్య ద్వారంపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్హౌజ్ కాంప్లెక్స్ వద్ద కారు ప్రమాదం జరిగినట్లు యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి.. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని సిక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. #WATCH | Washington, DC: A vehicle crashed into a gate of the White House complex on January 8. A driver was taken into custody as 'the cause and manner' of the incident is being investigated, reports Reuters citing the US Secret Service. (Source: Reuters) pic.twitter.com/WHt5ilnbWc — ANI (@ANI) January 9, 2024 ఇక.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్ను గుర్తుతెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో జోబైడెన్, జిల్ బైడెన్ క్షేమంగా బయటపడ్డారని యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: India-Maldives Row:మాల్దీవుల వివాదం: ద్వేషాన్ని భారత్ అస్సలు సహించదు -
టెట్రిస్ గేమ్ను జయించిన బాలుడు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా వీడియోగేమ్ ప్రియులకు చిరపరిచితమైన టెట్రిస్ గేమ్ను 13 ఏళ్ల అమెరికన్ టీనేజర్ ఎట్టకేలకు మొత్తం పూర్తిచేశాడు. ఈ గేమ్ విడుదలైన దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. చివరి 157వ లెవల్ దాకా ఆడి చరిత్ర సృష్టించాడు. ఓక్లహామాకు చెందిన ఈ బుల్లోడి పేరు విల్లీస్ గిబ్సన్. తాను సాధించిన రికార్డు చూసి తెగ సంబరపడిపోతున్నాడు. ‘మొదటిసారి ఆట మొదలెట్టినపుడు దీన్ని పూర్తి/క్రాష్ చేయగలనని అస్సలు అనుకోలేదు. గెలుపుతో నా చేతి వేళ్ల స్పర్శనూ నేను నమ్మలేకపోతున్నా’ అంటూ గేమ్ చిట్టచివరి 38 నిమిషాల వీడియోను మంగళవారం యూట్యూబ్లో గిబ్సన్ పోస్ట్చేశాడు. టెట్రిస్ గేమ్ ఇప్పటిదాకా కనీసం 70 విధానాల్లో 200కుపైగా అధికారిక వేరియంట్లలో విడుదలైంది. కిందకు పడిపోతున్న భిన్న ఆకృతుల ‘బ్లాక్’లను వరసగా కిందివైపు పేర్చడమే ఈ ఆట. ఇవి చదవండి: ఏఐ చెప్పిన చిలక జోస్యం...రోబో మనుషులు వస్తున్నారు! -
నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ..
వాషింగ్టన్: మానవునిలో పెద్ద పేగు దాకా ఏదైనా ఆహారం వెళ్లి దంటే అప్పటికే అది జీర్ణమైందని అర్ధం. అయితే అమెరికాలో ఓ పెద్దాయన పెద్దపేగులో ఒక ఈగ చిధ్రమవకుండా చక్కగా ఉంది. జీర్ణావస్థలోకాకుండా పేగు గోడలకు అతుక్కుని ఉన్న ఈగను చూసి అక్కడి వైద్యులు అవాక్క య్యారు. జీర్ణాశయం, చిన్నపేగును దాటి కూడా ఈ కీటకం ఎలా జీర్ణమవకుండా ఉందబ్బా? అని వైద్యులు పలు విశ్లేషణలు మొదలుపెట్టారు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ వింత ఘటన జరిగింది. ‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటెరాలజీ’లో సంబంధిత వివరాలతో కథనం వెలువడింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా 63 ఏళ్ల పెద్దాయన ఆస్పత్రికి రాగా ఆయనకు వైద్యులు కొలొనోస్కోపీ చేశారు. అందులో ఈ విషయం వెల్లడైంది. ‘‘ కొలొనోస్కోపీకి ముందు ఘన పదార్థాలు ఏవీ నేను తీసుకోలేదు. రెండు రోజుల క్రితం మాత్రం పిజ్జా, తోటకూర తిన్నాను. అసలది ఎలా లోపలికెళ్లిందో నాకైతే తెలీదు’’ అని ఆ పెద్దాయన తాపీగా చెప్పారు. ‘‘తిన్న వాటిని జీర్ణరసాలు, పొట్టలోని ఆమ్లాలు జీర్ణం చేస్తాయి. అయినాసరే ఈగ అలాగే ఉందంటే ఆశ్చర్యమే. అయితే ఇది ఇంటెస్టినల్ మయాసిస్ అయి ఉండొచ్చు. ఈగ గుడ్లు లేదా లార్వా ఉన్న ఆహారం తిని ఉండొచ్చు. అవి లోపలికెళ్లి జీర్ణమయ్యాక కూడా జీర్ణవ్యవస్థలోని అసాధారణ వాతావరణాన్ని తట్టుకుని ఒకే ఒక్క లార్వా ఇలా ఈగగా రూపాంతరం చెంది ఉంటుంది’’ అని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో గ్యాస్ట్రోఎంటెరాలజీ విభాగ సారథ మ్యాథ్యూ బెక్టోల్డ్ విశ్లేషించారు. ‘ఇలాంటి సందర్భాల్లోనూ వ్యక్తికి విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఉంటాయి. అయినా సరే ఈయనకు అవేం లేవంటే నిజంగా ఇది వింతే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన ఆ ఈగను కొలొనోస్కోపీ ద్వారా ఎట్టకేలకు బయటకు తీశారు. ఇంత జరిగినా పెద్దాయన ఆరోగ్యంగా ఉండటం విశేషం. చదవండి: మంచు‘మాయం’ -
ఖండాంతరాలు దాటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు (ఫొటోలు)
-
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్గా తీసుకున్నారు. వాషింగ్టన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం
వాషింగ్టన్: చంద్రయాన్-3 విజయం తర్వాత ప్రపంచ దేశాల చూపు భారత దేశం వైపు మళ్లింది. ప్రపంచ దేశాలు భారత్తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన నాసా-ఇస్రో SAR (NISAR) ఉపగ్రహాన్ని ప్రయోగించే బాధ్యతలను ఇస్రో చేతులకు అప్పజెప్పింది నాసా. భూమి యొక్క కక్ష్యను పరిశీలించే నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముందు ఇస్రో దీనికి తుది మెరుగులు దిద్దుతోంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం, NISAR 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి తాత్కాలికమైనా కూడా స్థిరమైన సమాచారాన్ని అందిస్తుంది. NISAR L, S డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ ఆపర్చ్యుర్ రాడార్ (SAR)ని కలిగి ఉంటుంది. ఇందులో L బ్యాండ్ SARను కాలిఫోర్నియా జెట్ ప్రపల్షన్ లేబొరేటరీ డెవలప్ చేయగా S బ్యాండ్ SARను మాత్రం ISRO అభివృద్ధి చేసింది. ఇది స్వీప్ SAR టెక్నిక్తో పనిచేస్తూ హై రిజొల్యూషన్ డేటాను అందిస్తుంది. SAR పేలోడ్లు ఇంటిగ్రేటెడ్ రాడార్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ (ఐరిస్)పై అమర్చబడ్డాయి. SUV-పరిమాణంలో ఉండే పేలోడ్ను ప్రత్యేక కార్గో కంటైనర్లో బెంగళూరుకు తరలించినట్లు యూఎస్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. బెంగళూరులోని యూ.ఆర్.రావు శాటిలైట్ సెంటర్లో ఉపగ్రహం తుదిమెరుగులు దిద్దుకుని 2024లో ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రణాళిక రూపొందించింది నాసా. Touchdown in Bengaluru! @ISRO receives NISAR (@NASA-ISRO Synthetic Aperture Radar) on a @USAirforce C-17 from @NASAJPL in California, setting the stage for final integration of the Earth observation satellite, a true symbol of #USIndia civil space collaboration. #USIndiaTogether pic.twitter.com/l0a5pa1uxV — U.S. Consulate General Chennai (@USAndChennai) March 8, 2023 ఇది కూడా చదవండి:ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు! -
యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు. చదవండి: అక్రమాల పుట్ట మార్గదర్శి.. ఆందోళనలో చందాదారులు.. రామోజీ పాపం ఫలితమే ఇదంతా! -
సాక్స్ కిల్లర్..జంటలే టార్గెట్గా హత్యలు! అతడెవరనేది ఇప్పటకీ..
అది 1985 డిసెంబర్ 12, మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. వాషింగ్టన్ లోని మినరల్ సమీపంలోని స్పానవేలో కె–మార్ట్ స్టోర్ కస్టమర్స్తో రద్దీగా ఉంది. ఆ బయట రెండేళ్ల పాప ఒక్కర్తే అయోమయంగా, అటు ఇటు తచ్చాడటాన్ని కొందరు స్టోర్ ఉద్యోగులు గమనించారు. వారు పాపను చేరదీసి, పోలీసులకు సమాచారమిచ్చారు. కాసేపటికి ఆ మార్ట్కు చేరుకున్న అధికారులు పాప పరిస్థితి చూసి, స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. పాప శారీరకంగా బాగానే ఉన్నా, ఏదో చూసి భయపడిందని గుర్తించి, తాత్కాలికంగా దగ్గర్లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్న పాప కావడంతో అందరినీ చూసి బెదిరిపోయింది. తను ఎవరు? తన వాళ్లు ఎవరు? తనొక్కర్తే అక్కడెందుకు ఉంది?’ లాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలయ్యాయి. పాప వివరాల సేకరణలో భాగంగా పత్రికలకు కూడా పాప ఫొటో ఇచ్చి ‘ఎవరీ పాప?’ అనే శీర్షికతో వార్తలు రాయించారు అధికారులు. సరిగ్గా రెండు రోజులకు పాప వార్త ఉన్న న్యూస్ పేపర్, కొన్ని రియల్ ఫొటోలు పట్టుకుని.. లూయిస్ కాన్రాడ్ అనే మహిళ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ‘మార్ట్ ముందు దొరికిన పాప నా మనవరాలే, తన పేరు క్రిస్టల్’ అంటూ ఇంట్లోని పాప ఫొటోలను ఆధారంగా చూపించింది. పాప దొరికిన రోజు (డిసెంబర్ 12) ఉదయాన్నే తన కూతురు డయానా రాబర్ట్సన్(21), అల్లుడు మైక్ రీమర్(36), క్రిస్టల్తో కలసి టకోమా సమీపంలోని పర్వతాలలో వన్ డే వెకేషన్ కోసం వెళ్లారని చెప్పింది లూయిస్. పాప ఒక్కర్తే ఒంటరిగా దొరికిందంటే.. మైక్, డయానాలకేమైందోనని కూలబడి ఏడ్చేసింది. లూయిస్ సమాచారంతో ఆ పర్వాతాల సమీపంలో మొత్తం గాలింపు చర్యలు మొదలుపెట్టారు అధికారులు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. ఇక మనవరాలు క్రిస్టల్ని ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని ‘మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు?’ అని ఆరా తీసింది లూయిస్. ఆ ప్రశ్నకు ‘మమ్మీ చెట్లలో ఉంది’ అని జవాబు ఇచ్చింది క్రిస్టల్. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం చెప్పింది. క్రిస్టల్ చిన్నది కావడంతో తనని విచారించి ప్రయోజనం లేదని అర్థమైంది. రెండు నెలలు గడిచిపోయాయి. 1986 ఫిబ్రవరి 18 ఉదయాన్నే వాషింగ్టన్లోని మినరల్కు ఉత్తరంగా ఉన్న రోడ్డుపై వాకింగ్కి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. రోడ్డు నుంచి కాస్త లోపలికి గుబురు చెట్ల మధ్య.. కరుగుతున్న మంచుపెళ్లల్లో రెడ్కలర్ ప్లిమత్ పికప్ ట్రక్ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే, దాని పక్కనే ఓ మహిళ కుళ్లిన నగ్న మృతదేహం భయపెట్టింది. ఆమె మెడకు సాక్స్తో ముడివేసి బిగించినట్లుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎన్ఏ పరీక్షలో అది డయానా శవమని తెలియడంతో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది. క్రిస్టల్ చెప్పినట్లే తన మమ్మీ చెట్ల మధ్య ఉండటం అధికారులను ఆశ్చర్యపరచింది. అంటే తన తల్లి చావుని క్రిస్టల్ చూసే ఉంటుందని అంతా అంచనాకు వచ్చారు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా మైక్ జాడ కనిపించలేదు. ఆ పికప్ ట్రక్ మైక్దే కావడంతో దానిలో అంతా క్షుణంగా పరిశీలించారు. డ్రైవర్ పక్క సీట్లో రక్తం మరకలున్నాయి. వాటి శాంపిల్స్ ల్యాబ్కి పంపిస్తే, ఆ రక్తం మనిషిదే కాని ఎవరిదో తేలలేదు. ట్రక్లో దొరికిన ఒక ఎన్వలప్ కవర్ మీద ‘ఐ లవ్యూ డయానా’ అని రాసి ఉంది. అది మైక్ హ్యాండ్ రైటింగ్ అని లూయిస్ గుర్తించింది. డయానా కడుపులో పదిహేడు కత్తిపోట్లు ఉన్నాయని, మెడ చుట్టూ బిగించిన సాక్స్ ఆమెని కదలకుండా నియంత్రించడానికి మాత్రమే వాడిన సాధనమని తేలింది. ఓ పక్క దట్టమైన మంచు దర్యాప్తుకు ఆటకం కలిగిస్తున్నా, మైక్ కోసం తీవ్రంగా గాలించారు అధికారులు. ఎక్కడా మైక్ ఆనవాళ్లు లేవు. అయితే గతంలో మైక్.. డయానా విషయంలో చాలా అనుచితంగా ప్రవర్తించేవాడని పోలీసుల దృష్టికి రావడంతో డయానాని అతడే చంపేసి పారిపోయాడని నమ్మారు. మైక్.. డయానాని చాలాసార్లు కొట్టేవాడని, చంపేస్తానని బెదిరించేవాడని, అతడి వేధింపులు భరించలేక విడిపోయి తనకు మైక్ దూరంగా ఉండాలంటూ డయానా కోర్టు ఉత్తర్వును కూడా పొందిందని, కొన్నాళ్లకు వాళ్లు మళ్లీ కలసి జీవించడం మొదలుపెట్టారని చెప్పింది. దాంతో మైక్ అనుమానితుడుగా మారాడు. అయితే కొందరు మైక్ కూడా బాధితుడు కావచ్చని, గడ్డకట్టే చలిలో మైక్ తన చలికోటును ట్రక్లో వదిలి పారిపోయే అవకాశం లేదని నమ్మారు. ఈ క్రమంలోనే డయానా మెడకు చుట్టిన సాక్స్ కీలక ఆధారమైంది. మైక్, డయానా మిస్సింగ్కి ముందు.. అంటే 1985 ఆగస్ట్ 10న స్టీఫెన్ హార్కిన్, రూత్ కూపర్ అనే జంట మర్డర్ కేసు తిరగేశారు అధికారులు. ఈ జంట వాషింగ్టన్లో తులే సరస్సు పక్కన క్యాంపింగ్కి వెళ్లి తిరిగి రాలేదు. నాలుగు రోజులకు స్టీఫెన్ తన కారు డ్రైవింగ్ సీట్లో శవమై కనిపించాడు. నుదుటి మీద బుల్లెట్ గాయం ఉంది. అతడు నిద్రిస్తున్న సమయంలోనే దాడి జరిగినట్లు తేలింది. వెంట తీసుకెళ్లిన వారి పెంపుడు కుక్క సమీపంలో బుల్లెట్ గాయాలతో చనిపోయి ఉంది. రూత్ బూట్లు తప్ప మరో ఆధారం కనిపించలేదు. సరిగ్గా రెండు నెలలకు (అంటే డయానా మర్డర్కి సరిగ్గా నెల క్రితం) స్టీఫెన్ దొరికిన మైలున్నర దూరంలో రూత్ తల, మొండెం వేరువేరుగా దొరికాయి. రూత్ మెడకు కూడా డయానా మెడకు కట్టినట్లే సాక్స్తో బిగించి ఉంది. ఆమె కడుపులో చాలాసార్లు తుపాకీతో కాల్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాల్పుల కారణంగానే మరణించింది తప్ప సాక్స్ కారణంగా కాదని తేలింది. రూత్ మెడలోని సాక్స్, డయానా మెడలోని సాక్స్ రెండూ ఒకేలా ఉన్నాయని సాంకేతిక నిపుణులు కొందరు భావించారు. ఇది కచ్చితంగా సీరియల్ కిల్లర్ పనేనని వారి నమ్మారు. అయితే మైక్ జంతువుల కోసం వలపన్నే ప్రాంతం.. రూత్, స్టిఫెన్లు మృతదేహాలు దొరికిన ప్రాంతం రెండూ ఒకటే కావడంతో అనుమానాలన్నీ మైక్ మీదకు తిరిగాయి. నిజానికి మైక్.. తన భార్యను, కూతుర్ని తీసుకుని బయలుదేరేముందే ఆ వలపన్నిన ప్రాంతాన్ని ఒకసారి సందర్శించి వస్తామని ఇంట్లో చెప్పాడట. ఇన్ని ఆధారాలతో పాటు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అని కొందరు అధికారులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఈ తరహా కేసే మరొకటి పోలీసులు దృష్టికి వచ్చింది. 1985 మార్చి 9న వాషింగ్టన్ గ్రాంట్ కౌంటీలో ఎడ్వర్డ్ స్మిత్, కింబర్లీ లావైన్ అనే ప్రేమజంట మరణం వెనుక కూడా ఇదే సీరియల్ కిల్లర్ ఉండి ఉంటాడని నమ్మారు అధికారులు. అయితే ఎడ్వర్డ్ కారులో దొరికిన వేలిముద్రల ఆధారంగా 1989లో బిల్లీ రే బల్లార్డ్ అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు ఎడ్వర్డ్, కింబర్లీ హత్యల నేరాన్ని అంగీకరించాడు కాని రూత్ జంట, డయానా జంటల హత్యలు తనకు సంబంధం లేదన్నాడు. 1986 ఆగస్ట్ 22న మిస్ అయిన రాబర్ట్, డాగ్మార్ మిస్సింగ్ కేసును కూడా కలిపి విచారించారు. తర్వాత రాబర్ట్ క్రెడిట్ కార్డ్ వినియోగించిన ఓ సీరియల్ కిల్లర్ చార్లెస్ సింక్లైర్ని అరెస్ట్ చేశారు. అయితే విచారణ సమయంలోనే అతడు మరణించాడు. కాలక్రమేణా మినరల్ పరిసరప్రాంతాల్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడని పుకార్లు స్థానికుల్ని పర్యటకులను తీవ్రంగా భయపెట్టాయి. మరోవైపు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అనే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. 2011 మార్చి 26న డయానా మృతదేహం దొరికిన మైలు దూరంలో హైకర్స్కి మనిషి పుర్రె కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దంత పరీక్షలతో ఆ పుర్రె మైక్దని తేలింది. దాంతో మైక్ కూడా ఆ సీరియల్ కిల్లర్ బాధితుడేనని, అసలు హంతకుడు వేరే ఉన్నాడని స్పష్టమైంది. మొత్తానికీ వాషింగ్టన్ మినరల్ సమీపంలోని ప్రేమ జంటలు, దంపతుల హత్యకేసులు.. రూత్, డయానా జంటల హత్యలతో కలిసి విచారించినా, ఎంతోమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా అసలు సాక్స్ కిల్లర్ ఎవరో బయటపడలేదు. క్రిస్టల్(పాప) దొరికిన రోజు.. మైక్ రెడ్ కలర్ ట్రక్ని కె–మార్ట్ స్టోర్ ముందు చూశామని కొందరు సాక్షులు చెప్పారు. అంటే పాపను ఆ కిల్లరే ఆ స్టోర్ దగ్గర వదిలివెళ్లాడా? ఆ స్టోర్ దగ్గరకు వచ్చాడా? అనేది ఎప్పటికీ తేలలేదు. వాళ్లని చంపింది ఎవరు? ఆ కిల్లర్ ఇంకా ఎంత మంది మాయం చేశాడు? ఇలా వేటికీ సమాధానాలు లేవు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: ఇప్పటకీ అంతుతేలని కేర్టేకర్ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?) -
రెండో అంతస్తులోకి దూసుకెళ్లిన కారు.. అలా ఎలా రాజా?
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వానియాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక కారు డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆశ్చర్యకరంగా పక్కన ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తులోకి దూసుకెళ్లాడు. కారు పరిమాణంలో బిల్డింగ్ పైభాగంలో పెద్ద రంధ్రం కూడా పడింది. వెంటనే ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి కారును, కారు డ్రైవరును జాగ్రత్తగా కిందకు దించారు. బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన కారు దృశ్యాలు, శిధిలమైన బిల్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. పెన్సిల్వానియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారును 20 ఏళ్ల యువకుడు డ్రైవింగ్ చేస్తున్నాడని ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అతడు అక్కడికి సమీపంలోనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని అన్నారు. అతడు కోలుకుంటేగానీ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందో తెలియదన్నారు. మాకైతేలండి యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తున్ది అన్నారు. ఇదిలా ఉండగా స్థానికులు మాత్రం దగ్గర్లోని కల్వర్టు వద్ద ఓవర్ స్పీడింగ్ వలన రైలింగును ఢీకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆ కారణంతోనే కారు గాల్లోకి లేచి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చూసినవారంతా కారును స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో డ్రైవింగ్ చేసి ఉంటారని కొందరు, గాల్లో వెళ్లడమంటే ఇదేనేమో అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని మరి కొందరు మానవతా దృక్పధంతో కూడా కామెంట్లు చేస్తున్నారు. A driver has been taken to hospital after crashing a car into the second story of a house in Pennsylvania. State Police say investigators believe it wasn’t an accident. pic.twitter.com/D2U5P0fQMn — Pop Crave (@PopCrave) August 8, 2023 ఇది కూడా చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
భారత్లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్
వాషింగ్టన్: సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ-20 సదస్సులో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చే ప్రధానం కానుందని చెబుతున్నాయి వైట్ హౌస్ వర్గాలు. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన చేశారు. ఈ దఫా జీ-20 సదస్సు భారత్లో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ ప్రథమార్ధంలో న్యూఢిల్లీ వేదికగా అజరిగే ఈ సదస్సుకు అతిరధ మహారధులంతా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొనబోయే ఈ సమావేశంలో మిగతా అంశాలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చ కూడా జరగనుందని సమావేశానికి హాజరుకానున్న అన్ని దేశాలు ఇదే అంశానికి పెద్ద పీట వేసినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్. నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నం చేయడంతో యుద్ధానికి బీజం పడింది. 2022, ఫిబ్రవరి 24న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మొదలైన యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై ఇటీవల జరిగిన సమావేశాల్లో భాగస్వామి దేశాలు సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. రష్యాతో జరుగుతున్న యుద్ధం సమసిపోతే గానీ ఉక్రెయిన్ సభ్యత్వం గురించి ఎటూ తేల్చలేమని తేల్చేశాయి. ఇటీవల సౌదీ రాజు అధ్యక్షతన ఆ దేశంలో జరిగిన సమావేశంలోనూ ప్రధానంగా ఉక్రెయిన్ గురించిన చర్చ జరిగింది. వచ్చే నెల జీ-20 సదస్సులో కూడా అదే హాట్ టాపిక్ కానుంది. ఎక్కడ సమావేశాలు జరిగినా రష్యా ఉక్రేయి యుద్ధం ప్రస్తావన వస్తూనే ఉంది. సుదీర్ఘన్గా కొనసాగుతున్న యుద్ధం తదనంతర పరిణామాల దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఎలాగైనా యుద్ధాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండడం మంచి పరిణామమే. ఇది కూడా చదవండి: 24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్.. మళ్లీ -
చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం
వాషింగ్టన్: గతనెల చికాగో వీధుల్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కనిపించిన హైదరాబాదీ యువతికి వైద్య సదుపాయాన్ని కల్పించడం తోపాటు ఆమెను తిరిగి భారత దేశానికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేసింది చికాగోలోని భారత ఎంబసీ. ఈ విషయాన్ని బాధితురాలి తల్లికి తెలియజేశామని ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. హైదరాబాద్కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ డెట్రాయిట్లోని ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించడానికి అమెరికా వెళ్లింది. కానీ అక్కడ ఆమె వస్తువులను దుండగులు దొంగిలించడంతో దిక్కుతోచని స్థితిలో చికాగో వీధుల్లో తిరుగాడుతూ కనిపించింది. అత్యంత దీనావస్థలో తినడానికి తిండిలేక దయనీయ స్థితిలో ఉండిపోయిన ఆమెను గురించి తెలంగాణలోని మజ్లీస్ బచావో తెహ్రీక్ పార్టీ నేత అజ్మద్ ఉల్లా ఖాన్ బాధితురాలి తల్లి రాతపూర్వకంగా చేసిన విజ్ఞప్తిని ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. అజ్మద్ ఉల్లా ఖాన్ ట్వీట్కు స్పందిస్తూ కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ వెంటనే విషయాన్ని చికాగోలోని భారత ఎంబసీ దృష్టికి తీసుకుని వెళ్ళగా అక్కడివారు ఆమెను కనుగొని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రయాణించే పరిస్థితుల్లో లేదని ముందు తనకు వైద్యం అవసరమని తెలిపిన యూఎస్ ఎంబసీ ట్రీట్మెంట్ పూర్తైన తర్వాత ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలిపింది. దీంతో సైదాను తిరిగి భారత్ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ అనే తల్లికి సమాచారమందించారు ఎంబసీ అధికారులు. ఇది కూడా చదవండి: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు.. -
అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు
వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు. వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్. హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు. I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW — Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు..
వాషింగ్టన్: అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తండ్రి గుండె చప్పుడు విని భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల క్రితం తన తండ్రి చనిపోగా ఆయన అవయవాలను దానం చేశారు ఆ బిడ్డలు. ఆ గుండె ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లిన ఆ అక్కాచెలెళ్లకు తండ్రి గుండెను అమర్చిన వ్యక్తి దొరికారు. వెంటనే ఆ గుండె మీద చెవులను ఆనించి తండ్రి గుండె చప్పుడు విన్నారు. మనల్ని ఇష్టపడేవాళ్లు విడిచి వెళ్లినా కూడా వారి జ్ఞాపకాలు మనలను తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వారు మన మధ్య ఉంటే బాగుండన్న భావన నిత్యం కలుగుతూ ఉంటుంది. కానీ అవయవదానం చేసిన సందర్భాల్లో వ్యక్తులు మరణించినా వారి అవయవాలు వేరే వాళ్లకి అమరిస్తే అవి సజీవంగానే ఉంటాయి. అలా అవయవదానం చేసిన ఎస్టబెన్ శాంటియాగో(39) కుమార్తెలు తన తండ్రి అవయవాల కోసం వెతుకుతూ చివరికి ఆయన గుండెను కనుగొన్నారు. కిసండ్ర శాంటియాగో(22) ఈ వెతుకులాటకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన ఆమె ప్రయత్నం నాలుగేళ్లపాటు సాగి చివరికి తన తండ్రి హృదయాన్ని ఎవరికి అమర్చారో కనిపెట్టింది. వెంటనే తన చెల్లెళ్లను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లి వారు ఆయన గుండెల మీద తల ఆనించి గుండె చప్పుడును విని ఉద్వేగానికి లోనయ్యారు. కిసండ్ర శాంటియాగో మాట్లాడుతూ.. మా నాన్న నిజంగా సంతోషించేవారు. మా నాన్న కోమాలోకి వెళ్లి చనిపోయాక ఆయన అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిపించింది. చివరకు ఎలాగో అంగీకరించాను. ఆ రోజు నుంచి నా గుండె భారంగానే ఉంది. ఈరోజు ఆయన గుండె చప్పుడు విన్నాక అది తేలికైందని చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఈ మొత్తం దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విశేషమైన స్పందన వస్తోంది. View this post on Instagram A post shared by TODAY (@todayshow) ఇది కూడా చదవండి: దుబాయ్లో భారతీయుడి జాక్పాట్.. నెలకు రూ.5.59 లక్షలు.. -
కేసులతో సంబంధమే లేదు.. పోలీసులను చూడగానే పరుగందుకుని..
వాషింగ్టన్: పోలీసులను రక్షకభటులని అంటారు. కానీ దొంగల కంటే వారిని చూస్తేనే ఎక్కువగా భయపడుతుంటారు జనం. ఆ భయమే అమెరికాలో ఓ అభాగ్యుడిని పొట్టనబెట్టుకుంది. పోలీసులు ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకోకుండా వారు కనపడగానే భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు. కొద్దిసేపు ఈత కొట్టే ప్రయత్నం చేసిన అతను చూస్తుండగానే నీటమునిగిపోయాడు. గ్రీన్విల్లే కౌంటీ పోలీసు అధికారులు బెయిలుపై ఉన్న ఒక వ్యక్తికి అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు కన్నింగ్ హాం రోడ్డులోని ఒక ఇంటిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్నాడు చక్ గిల్బర్ట్ షెల్టన్ జూనియర్ (38). కేసుతో అసలు ఏమాత్రం సంబంధం లేని అతడు పోలీసులను చూస్తూనే పరుగందుకున్నాడు. అది చూసి బిత్తరపోయిన పోలీసులు వాడెందుకు పరిగెడుతున్నాడన్న డైలమాలో ఉండిపోయారు. అంతలోనే గిల్బర్ట్ షెల్టన్ దగ్గర్లో ఉన్న కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు. ఒడ్డు నుండి 15-20 అడుగుల దూరం ఈత కొట్టుకుంటూ వెళ్లిన షెల్టన్ క్రమక్రమంగా మునిగిపోయాడు. వెంటనే గ్రీన్విల్లే పోలీసులు, స్థానిక ఈతగాళ్లు కొందరు కాలువలోకి దూకి వెతికినా ప్రయోజనం లేకపోయింది. సుదీర్ఘంగా కొనసాగిన గాలింపుల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు. అతను ఎందుకు పారిపోయాడు? అతడిపై నేరారోపణలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏదైతేనేం భయం దెయ్యం కంటే చెడ్డదని మరోసారి రుజువైంది. ఇది కూడా చదవండి: ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు.. -
ఏకాంతంగా బ్రతకాలనుకున్నారు.. చివరికి...
వాషింగ్టన్: అమెరికాలో ఒక కుటుంబంలోని అక్కాచెల్లెళ్ల తోపాటు వారిలో ఒకరి కుమారుడు.. ముగ్గురికీ ప్రపంచ పోకడ నచ్చక జనాల ఉనికంటూ లేని ప్రదేశానికి వెళ్లి బ్రతకాలనుకున్నారు. చివరికి కొలరాడోలో కఠినాతి కఠినమైన పరిస్థితులకు తాళలేక పస్తులుండి కన్నుమూశారు. గన్నిసన్ కౌంటీ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను అటాప్సీ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గన్నిసన్ కౌంటీ అధికారి మైకేల్ బార్నెస్ తెలిపిన వివరాల ప్రకారం మృతులను క్రిస్టీన్ వాన్స్(41), రెబెక్కా వాన్స్(42), రెబెక్కా వాన్స్ కుమారుడు(14) గా గుర్తించారు. కొలరాడోలోని ఓహియో సిటీకి 14 కిలోమీటర్లకు దూరంలో వీరు దయనీయ స్థితిలో చనిపోయి ఉన్నారని తెలిపారు. ఆకలి బాధలకి తాళలేక ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోయి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా రెబెక్కా వాన్స్ బంధువుల్లో ఒకరిని ఆరా తీయగా రెబెక్కాకు ప్రపంచం తీరు నచ్చేది కాదు. తనతోపాటు క్రిస్టీన్ ను తన కుమారుడిని కూడా జనజీవన స్రవంతికి దూరంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లి ఒంటరిగా జీవించాలని చెప్తూ ఉండేదని తెలిపారు. అజ్ఞాతంలోకి వెళ్లి బ్రతకడమెలా అని యూట్యూబ్ వీడియోలు చూసి అరకొర అవగాహనతో నిర్మానుష్య ప్రాంతానికి సరైన సిద్ధపాటు లేకుండా వెళ్లిపోవడం వలననే వారు దయనీయంగా మృతి చెందారని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: అమెరికా శత్రువులంతా ఒకేచోట.. ఎందుకంటే.. -
కూతురు అబార్షన్కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఇంటికే పరిమితం చేసినా లాక్ డౌన్ సమయంలో అమెరికాకు చెందిన ఒక యువతి చట్ట విరుద్ధమైన పనికి పాల్పడింది. సంతానం వద్దనుకున్న కారణంగా ఓ యువతి అబార్షన్ చేసి కడుపులోని బిడ్డని కడతేర్చింది. నెబ్రాస్కాలో 20 నెలల గర్భస్థ శిశువును చంపడం నేరం కాగా ఆమె 28 వారాలు నిండిన తర్వాత ఈ ఘోరానికి పాల్పడింది. దీంతో ఈ నేరం కింద అరెస్టైన ఆ యువతికి కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటు అదనంగా మరో రెండేళ్ల ప్రొబేషన్ కూడా విధించింది. . వివరాల్లోకి వెళితే.. నెబ్రాస్కాకు చెందిన సెలెస్టె బర్గస్(19) లాక్ డౌన్ సమయంలో కడుపులోని 28 నెలల పిండాన్ని చంపుకుంది. అందుకు ఆమె తల్లి జెస్సికా బర్గస్(42) సహకరించింది. కానీ నెబ్రాస్కా దేశ చట్టం ప్రకారం 20 నెలల పిండాన్ని అబార్షన్ చేస్తే అది చట్టరీత్యా నేరం. అయితే ఆ యువతి గర్భాన్ని తొలగించడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. చివరకు తన తల్లి సాయంతో అబార్షన్కు పాల్పడి కటకటాల పాలయ్యింది. తన కూతురు గర్భాన్ని తొలగించడానికి సాయం చేసిన ఆ తల్లిపైన కూడా కేసు నమోదు చేశారు నెబ్రాస్కా పోలీసులు. నిజాన్ని దాచి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కూతురిపైనా.. సాక్ష్యాధారాలు లేకుండా చేసినందుకు తల్లిపైనా అభియోగాలు మోపారు నెబ్రాస్కా పోలీసులు. ఇద్దరికీ శిక్ష ఖరారు కాగా సెప్టెంబరు నుండి అమల్లోకి వస్తుంది. మొదట పోలీసు విచారణలో డెలివరీ అయ్యిందని, కానీ మృత శిశువు జన్మించిందని అబద్ధం చెప్పింది ఆ యువతి. తీరా ఆమె ఫేస్బుక్ మెసేజులు పరిశిలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్లో గర్బనిరోధక మాత్రలు గురించి, పిండాన్ని మాయ చేసే ఉపాయం గురించి తన తల్లితో చేసిన చాటింగ్ను పోలీసులు కనుగొనడంతో ఈ విషయం బయటపడింది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. మహిళ ఏం చేసిందంటే..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ మహిళను టాయిలెట్కు వెళ్లకుండా అడ్డుకున్నారు అందులోని ఫ్లైట్ అటెండెంట్లు. రెండు గంటలపాటు ఓపిక పట్టిన ఆ మహిళ ఇంక ఆపుకోలేక విమానం ఫ్లోర్ మీదే మూత్రవిసర్జన చేసింది. క్యాబిన్ క్రూ బృందంలోని ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఫ్లైట్లలో జరుగుతున్న విచిత్ర సంఘటనలు కొన్ని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఓ ప్రయాణికుడు ఫుల్లుగా తాగి తోటి ప్రయాణికుడి మీద మూత్రం పోయడం, ప్రయాణికులను మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన పైలట్.. ఇలా వరుసగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లో జరిగిన అలాంటి ఓ సంఘటన హెడ్ లైన్స్ లో నిలిచింది. జులై 20న స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆఫ్రికన్ అమెరికా మహిళ ఒకరు తనకు టాయిలెట్ అర్జెంటని అక్కడి సిబ్బందితో చెప్పగా వారు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే అనుమతించడం కుదరదని చెప్పారు. అలాగే ఆమెను నీళ్లు ఎక్కువగా తాగమని లేదంటే మూత్రవిసర్జన చేసినప్పుడు ఫ్లైటంతా దుర్వాసన వస్తుందని కూడా ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె చాలాసేపు ఓపికపట్టి కూర్చుంది. ఆలా రెండు గంటలు ఓపిగ్గా ఎదురు చూసిన తర్వాత కూడా సిబ్బంది టాయిలెట్కు అనుమతించకపోవడంతో ఆమె ఫ్లోర్ మీదనే మూత్రవిసర్జన చేసింది. అనంతరం ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నించగా.. మీ అనుమతి కోసం ఎంతసేపు ఆగాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సదరు మహిళ. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఇష్టానుసారంగా స్పందిస్తున్నారు. ఫ్లైట్ సిబ్బంది తీరు అమానుమని కొందరంటే.. మా పెంపుడు పిల్లి చాలా శుభ్రాన్ని పాటిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ఎవరో ఎదో అన్నారని కాదుగానీ టాయిలెట్ విషయంలో ఇరుపక్షాల్లో నిర్లక్ష్యం సరికాదని అత్యధికులు స్పందించడం కొసమెరుపు. 🇺🇸 ÉCART CIVILISATIONNEL : 20/07/2023 Une Afro-américaine à bord d'un vol @SpiritAirlines urine sur le sol parce qu'elle ne veut pas attendre qu'ils ouvrent les toilettes après le décollage. Les hôtesses de l'air, quant à elles, lui disent qu'elle devrait boire de l'eau "parce… pic.twitter.com/EQbPGy0NFK — Valeurs Occidentales (@ValOccidentales) July 21, 2023 ఇది కూడా చదవండి: భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి -
కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి..
వాషింగ్టన్: అపాయంలో ఉండగా ఉపాయం తట్టాలే కానీ ఎంతటి అగాధాన్నైనా జయించవచ్చని నిరూపించింది అమెరికాలోని ఓ మైనర్ బాలిక. కాలిఫోర్నియాలో కిడ్నాప్కు గురైన ఒక మైనర్ బాలిక అగంతకుడు లేని సమయం చూసి బాలిక చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల వారికి తాను ప్రమాదంలో ఉన్న విషయం తెలిసేలా సందేశాన్నిచ్చి కిడ్నాపర్ చెర నుంచి బయటపడింది. కిడ్నాప్ జరిగిందిలా.. టెక్సాస్కు చెందిన స్టీవెన్ రాబర్ట్ సబలాన్(61) జులై 6న సాన్ ఆంటోనియోలో తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోన్న 13 ఏళ్ల బాలికను గన్ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి 1400 మైళ్ళు ప్రయాణించి కాలిఫోర్నియా వరకు తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యలో బాలికపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. కిడ్నాపర్ దొరికిందిలా.. లాంగ్ బీచ్ చేరిన తర్వాత అక్కడ బాలికలను బట్టలు విప్పి ఇవ్వమని అడిగి వాటిని తీసుకుని ఒక లాండ్రీ షాపులోకి వెళ్ళాడు సబలాన్. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్నవారికి తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ ఒక కాగితం మీద "హెల్ప్ మీ" అని రాసి చూపించింది. అది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. కటకటాల పాలు.. లాంగ్ బీచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాన్ ఆంటోనియోకి చెందిన మైనర్ బాలిక తన ఇంట్లో వారికి చెప్పకుండా తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయటకు వచ్చిందని అదే సమయంలో సబలాన్ తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. కారు నెంబరు ప్లేటు ఆధారంగా చూస్తే సబలాన్ మీద అప్పటికే టెక్సాస్లో దొంగతనం అభియోయోగం మోపబడిందని అన్నారు. తాజాగా అతడిపై కిడ్నాప్, మైనర్ బాలికపై వేధింపులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు లాంగ్ బీచ్ పోలీసులు. ఇది కూడా చదవండి: భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది -
ఆరు వికెట్లతో అదరగొట్టాడు.. ఎవరీ సౌరబ్ నేత్రావల్కర్?
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో వాషింగ్టన్ ఫ్రీడమ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్.. భారత సంతతికి చెందిన సౌరబ్ నేత్రావల్కర్ ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థిని శాసించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. మొయిసిస్ హెన్రిక్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పియనార్ 29, అండ్రీస్ గౌస్ 23 పరుగులు చేశారు. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో హారిస్ రవూఫ్ మూడు వికెట్లు తీయగా.. ప్లంకెట్ రెండు, స్టోయినిస్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. సౌరబ్ నేత్రావల్కర్ బౌలింగ్ దాటికి టాపార్డర్ కకావికలమైంది. మధ్యలో కోరే అండర్సన్ (34 పరుగులు), ఆరోన్ ఫించ్ (14 పరుగులు) ప్రతిఘటించినప్పటికి లాభం లేకపోయింది. ఆ తర్వాత నేత్రావల్కర్ టెయిలెండర్ల పని పట్టడంతో శాన్ఫ్రాన్సిస్కో ఓటమి పాలైంది. ఎవరీ నేత్రావల్కర్? భారత్ సంతతికి చెందిన సౌరబ్ నేత్రావల్కర్ ముంబై ప్రాంతంలో జన్మించాడు. అండర్-19 క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇక్కడ అవకాశాల్లేక అమెరికాకు వెళ్లిపోయాడు. మంచి లెఫ్టార్మ్ పేసర్గా ఎదిగిన నేత్రావల్కర్ ప్రస్తుతం అమెరికా జట్టులో కీలక బౌలర్గా ఉన్నాడు. యూఎస్ఏ తరపున 2019లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నేత్రావల్కర్ 48 వన్డేల్లో 73 వికెట్లు, 9 టి20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అమెరికా జట్టుకు నేత్రావల్కర్ కెప్టెన్గానూ వ్యవహరించడం విశేషం. "KING OF SWING"😎 Saurabh Netravalkar takes a BRILLIANT😍 SIX-FOR to set his team up for success! pic.twitter.com/oY6o1cMqrK — Major League Cricket (@MLCricket) July 23, 2023 చదవండి: #LinDan: సినిమాల్లో 'డాన్'లు చాలా మందే.. బ్యాడ్మింటన్లో మాత్రం ఒక్కడే 'డాన్' -
కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..?
ప్యోంగ్ యాంగ్: అమెరికాకు చెందిన సైనికుడు అక్రమంగా నార్త్ కొరియాలోకి చొరబడ్డాడన్న కారణంతో అతడిని బంధించింది అక్కడి సైన్యం. దీంతో నార్త్ కొరియా చెర నుండి అమెరికా సైనికుడు అసలు బయటపడతాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా అమెరికాకు చెందినవారు 18 మంది నార్త్ కొరియాలో బందీలుగా ఉన్నారు. కానీ అందులో ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన వారంతా రెండు నెలల్లోనే విడుదలయ్యారు. ఎవరీ ట్రావిస్ కింగ్? అమెరికా సైనికుడు ట్రావిస్ కింగ్(23) విస్కాన్సిన్లో అమెరికా దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం 2021 జనవరిలో యూఎస్ ఆర్మీలో చేరిన కింగ్ కొన్ని నెలల క్రితం దక్షిణ కొరియాలో కూడా ఇలాగే అక్రమంగా చొరబడ్డాడు. రెండు నెలల పాటు అక్కడ జైలు జీవితం గడిపిన తర్వాత అతడిని టెక్సాస్ తిరిగి పంపించేయాలని నిర్ణయించాయి దక్షిణకొరియా వర్గాలు. కానీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అప్పటికే అమెరికా సైన్యం నుండి బహిష్కరించబడిన ట్రావిస్ కింగ్ వారి నుండి ఎలాగో తప్పించుకుని ఉభయ కొరియాలకు మధ్యలో పన్ముంజోన్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుండి ఉత్తర కొరియా చేరుకొని అక్కడ కోమ్ జోంగ్ బలగాలకు పట్టుబడ్డాడు. అతడు ఎందుకిలా దేశాటన చేస్తున్నాడన్న విషయంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. తిరిగొచ్చేనా? పెంటగాన్ వర్గాలు అసలు ట్రావిస్ నార్త్ కొరియా ఎందుకు వెళ్లాడన్న కోణం నుండి దర్యాప్తు ప్రారంభించింది. మరో పక్క ప్యోంగ్ యాంగ్, పెంటగాన్ వర్గాల నుంచి చర్చలకు పిలుపు వస్తుందేమోనని ఎదురుచూస్తోంది. అసలే అమెరికా ఉత్తర కొరియ మధ్య పచ్చగాడి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో అసలు అమెరికా సైనికుడిని వారు విడిచి పెడతారా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ట్రావిస్ కింగ్ తల్లి కూడా తన కుమారుడు అలా చేశాడంటే నమ్మలేకపోతున్నానని, వాడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కూడా అమెరికా నుండి 18 మంది నార్త్ కొరియాలోకి అక్రమంగా చొరబడగా వారిలో చార్లెస్ రాబర్ట్ జెన్కిన్స్ మినహాయిస్తే మిగతా వారందరిని రెండు నెలలలోపే తిరిగి పంపించేసింది. చార్లెస్ జెన్కిన్స్ ను మాత్రం 1965 లో అదుపులోకి తీసుకుని 2004లో విడుదల చేసింది. ఇది కూడా చదవండి: తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక -
Pakistan Crisis : ఆర్ధిక సంక్షోభంతో ఆస్తులను అమ్ముకుంటున్న పాకిస్తాన్..
వాషింగ్టన్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. చాలాకాలంగా బకాయిపడ్డ ఉద్యోగుల వేతనాలు, భారీగా పెరిగిన అప్పులు తీర్చేందుకు వేరే మార్గం లేక వాషింగ్టన్ లోని పాకిస్తాన్ ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలోని అమ్మకానికి పెట్టిన ఎంబసీ 7.1 మిలియన్ డాలర్లకు అమ్ముకుంది. వాషింగ్టన్లోని పాకిస్తాన్ చారిత్రాత్మక భవనమైన ఎంబసీ 2003 నుంచి ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉన్న కారణంగా 2018లో దౌత్య హోదాను కూడా కోల్పోయిన ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్కు చెందిన ఓ రియాల్టీ సంస్థతో సహా పలు సంస్థలు పోటీపడగా చివరకు పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త హఫీజ్ ఖాన్ దీన్ని 7.1 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. పాకిస్థాన్కు వాషింగ్టన్లో రెండు చోట్ల ఎంబసీ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్ స్ట్రీట్లో ఉన్న ఈ భవనాన్ని1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. క్రమేపీ అందులో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఈ భవనాన్ని దుర్భర స్థితిలో ఉన్న ఆస్తుల లెక్కలో చేర్చడంతో దీని అంచనా విలువపై టాక్స్ కూడా భారీగా పెరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు గతేడాది బిడ్ లను ఆహ్వానించింది పాకిస్తాన్ ప్రభుత్వం. తర్వాత భవనం తరగతిని మార్చిన పాకిస్తాన్ అధికారిక వర్గం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఒకపుడు క్లాస్ -2 హోదాలో ఉన్న ఈ భవనం తర్వాత క్లాస్-3 కి ఇప్పుడు క్లాస్-4 స్థాయికి పడిపోయింది. ఇది కూడా చదవండి: పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధుల కుమ్ములాట -
స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!
‘స్టీలు సామాన్లు కొంటాం.. పాత ఇనుప సామాన్లు కొంటాం..’ అనేది పాతదే. త్వరలోనే ‘స్టీలు ఇళ్లను కొంటాం..’ అని కూడా వినపడొచ్చు. ఎందుకంటే, భవిష్యత్తులో చాలామంది స్టీలు ఇళ్లల్లోనే నివసించనున్నారు. ఈ మధ్యనే వాషింగ్టన్లోని ఓ ప్రైవేటు సంస్థ నాలుగు స్టీల్ గ్రెయిన్ హౌస్లను నిర్మించింది. చూడటానికి పాతకాలపు ధ్యానపు డబ్బాల్లా ఉన్నాయి. కానీ, వీటిలోపల విశాలమైన బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ఇందులోని టెంపరేచర్ సిస్టమ్ పనిచేస్తుంది. పైగా ఇన్బిల్ట్ సీసీ కెమెరాలతో పనిచేసే స్మార్ట్ హోమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటిని కంటికిరెప్పలా కాపాడుతుంది. దీన్ని మడతేసి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లచ్చు కూడా. అవుట్డోర్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవారికి ఈ ఇల్లు భలే బాగుంటుంది. అయితే ఈ ఇంటి ధర 1.6 మిలియన్ డాలర్లు (అంటే రూ. 13 కోట్లు). ఈ ఇళ్ల ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. త్వరలోనే ఈ స్టీలు ఇళ్లను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. (చదవండి: కొండను కొంటారా? ఔను! అమ్మకానికి సిద్ధంగా ఉంది!) -
మోదీకి పాతకాలపు కెమెరా.. బైడెన్కు ఉపనిషత్తుల కాపీ
అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్ష భవనం వైట్ హౌజ్కు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ బిల్ బైడెన్లు మోదీని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించారాయన. సరదాగా కబుర్లతో పాటు ప్రపంచ పరిణామాలపైనా ఈ ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం విందులో పాల్గొన్నారు. బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి విదితమే. కానుకలు.. ఇక మోదీకి జో-జిల్ బిడెన్లు కానుకలు సమర్పించారు. 20వ శతాబ్ద ప్రారంభపు కాలానికి చెందిన.. పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని ఆ దంపతులు కానుకగా ఇచ్చారు. అలాగే బైడెన్ పర్సనల్గా మోదీకి పాతకాలపు ఓ అమెరికన్ కెమెరాను బహుమతిగా ఇచ్చారు. దానితో పాటుగా జార్జ్ ఈస్ట్మన్ మొదటి కొడాక్ కెమెరా పేటెంట్ ఆర్కైవల్ ఫాక్సిమైల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. ఇక ఆయన భార్య జిల్ బైడెన్ ప్రధాని మోదీకి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సంకలన సంతకం మొదటి ఎడిషన్ కాపీని బహుమతిగా ఇచ్చారు. భారత్లో అనుబంధం ఉన్న ఐరిష్ రచయిత, నోబెల్ విన్నర్ డబ్ల్యూబీ యేట్స్ ‘భారత ఉపనిషత్తుల’ ఆంగ్ల తర్జుమా కాపీ(శ్రీ పురోహిత్ స్వామి సహరచయిత) కాపీని బైడెన్కు భారత ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. దీనిని లండన్కు చెందిన ఫెబర్ అండ్ ఫెబర్ లిమిటెడ్ వాళ్లు.. యూనివర్సిటీ ప్రెస్ గ్లాస్గోలో ముద్రించారు. కాళిదాసుడి రచనల ప్రభావం తనపై ఎంతో ఉందని డబ్ల్యూబీ యేట్స్ పలుమార్లు చెప్పుకున్నారు. అంతేకాదు.. రవీంధ్రనాథ్ ఠాగూర్ సమకాలీకుడిగా పేరున్న యేట్స్.. 1923లో సాహిత్య రంగంలో నోబెల్ అందుకున్నారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని(గ్రీన్ డైమండ్) బహుమతిగా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ వజ్రం.. పర్యావరణ అనుకూలమైంది. సోలార్, విండ్ పవర్ లాంటి వనరులను ఉపయోగించి దీనిని రూపొందించారు. #WATCH | Prime Minister Narendra Modi met US President Joe Biden and First Lady Jill Biden at the White House in Washington DC and exchanged gifts with them. pic.twitter.com/kac0i1u9ZN — ANI (@ANI) June 22, 2023 In 1937, WB Yeats published an English translation of the Indian Upanishads, co-authored with Shri Purohit Swami. The translation and collaboration between the two authors occurred throughout 1930s and it was one of the final works of Yeats. A copy of the first edition print… pic.twitter.com/yIi9QW290r — ANI (@ANI) June 22, 2023 PM Narendra Modi gifts a copy of the first edition print of the book, ‘The Ten Principal Upanishads’ published by Faber and Faber Ltd of London and printed at the University Press Glasgow to President Joe Biden pic.twitter.com/95kKhQS267 — ANI (@ANI) June 22, 2023 I thank @POTUS @JoeBiden and @FLOTUS @DrBiden for hosting me at the White House today. We had a great conversation on several subjects. pic.twitter.com/AUahgV6ebM — Narendra Modi (@narendramodi) June 22, 2023 మేము అనేక విషయాలపై గొప్ప విషయాలపై మాట్లాడుకున్నాం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు కూడా. PM Narendra Modi gifts a lab-grown 7.5-carat green diamond to US First Lady Dr Jill Biden The diamond reflects earth-mined diamonds’ chemical and optical properties. It is also eco-friendly, as eco-diversified resources like solar and wind power were used in its making. pic.twitter.com/5A7EzTcpeL — ANI (@ANI) June 22, 2023 -
బ్రేవ్ గర్ల్..! అడవిలో తప్పిపోయి.. ధైర్యంగా రాత్రంతా చలిలోనే..
దట్టమైన వాషింగ్టన్ అడవుల్లో పదేళ్ల చిన్నారి. ఎక్కలేని కొండలు. క్రూర మృగాల భయం. వీటన్నింటిని మించి వేళ్లు వంకర్లు పోయేంత చలి. ఇన్ని ప్రతికూల పరిస్థితులను దాటుకుని 24 గంటలపాటు నిలవగలిగింది ఆ చిన్నారి. అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఫ్యామ్లీ గ్యాధరింగ్(కుటుంబ సమ్మేళనం)మీటింగ్లో తప్పిపోయిన చిన్నారి ఎలా చివరకు తన కుటుంబాన్ని చేరుకుంది? అడవిలో తాను ఎదుర్కొన్న సవాళ్లేంటో వివరించింది. అలా తప్పిపోయి.. శుంగ్లా మష్వానీ(10) కుటుంబం ఆఫ్గానిస్థాన్కు చెందింది. రెండేళ్ల క్రితమే వారు వాషింగ్టన్లో స్థిరపడ్డారు. వేరు వేరు ప్రదేశాల్లో ఉండే 20 మంది కుటుంబ సభ్యులు ఆదివారం రోజున ఫిష్ లేక్ రోడ్డులోని క్యాథడ్రల్ పాస్ ట్రైల్హెడ్ వద్ద కలుసుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేయడానికి క్లీ ఈలమ్ నదిపై ఉన్న వంతెన వెంట నడుస్తున్నారు. అప్పుడు శుంగ్లా తప్పిపోయినట్లు గుర్తించి చుట్టుపక్కల వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాత్రంతా అడవిలోనే.. అయితే.. తప్పిపోయిన శుంగ్లాకు ఎంతసేపటికీ వారు నడిచిన వంతెన కనిపించలేదట. వెతికే కొద్ది తనవారికి తాను దూరమైనట్లు గుర్తించిన ఆ చిన్నారి.. ఎంతో ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. కొండలను దాటుతూ.. నది వెంటే నడుచుకుంటూ వెళ్లడం సరైన విధానమని గుర్తించినట్లు తెలిపింది. రాత్రి మొత్తం చెట్ల మధ్యే చలిలో గడిపినట్లు వెల్లడించింది. ఏ మాత్రం భయపడలేదని చెబుతోంది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాలికను గుర్తించినట్లు తెలిపారు. కుటుంబంతో బాలికను కలిపినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి:విహారంలో అపశృతి..టూరిస్టు స్విమ్మింగ్ చేస్తుండగా.. సొర ఎంట్రీ..క్షణాల్లోనే.. -
దడ పుట్టించిన చేజింగ్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ చిన్న విమానాన్ని జెట్ విమానం వెంబడించడం కలకలం రేపింది. అసాధారణ వేగంతో ప్రయాణిస్తూ యుద్ధ విమానం నుంచి వెలువడిన సోనిక్ శబ్ధం వాషింగ్టన్ వాసుల గుండెల్లో దడ పుట్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏవియేషన్ విభాగం సమాచారం ప్రకారం.. ఆ సెస్నాసైటేషన్ విమానం టెన్నెస్సీలోని ఎలిజెబెత్టన్ నుంచి బయలుదేరింది. లాంగ్ ఐల్యాండ్లోని మెక్ ఆర్థర్ ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా, న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ మీదుగా, సరాసరి వాషింగ్టన్ డీసీ వైపుగా వచ్చింది. దేశ రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన నిషిద్ధ ప్రాంతాల మీదుగా అది వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేడియో సిగ్నళ్లకు పైలట్ స్పందించకపోవడంతో వెంటనే ఎఫ్–16 జెట్ విమానాన్ని పంపారు. అది సోనిక్ శబ్ధంతో ప్రయాణిస్తూ దూసుకెళ్లింది. ఆ శబ్దం వాషింగ్టన్తోపాటు, మేరీల్యాండ్, వర్జీనియాలోని కొన్ని ప్రాంతాల వారికి సైతం వినిపించింది. సదరు విమానం పైలట్ దృష్టిలో పడేందుకు ఫైటర్ జెట్ ఎఫ్–16 విమానం మంటలను సైతం వదులుతూ వెళ్లింది. భూమిపైని వారి భద్రతను, సదరు విమానం భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ మేరకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వర్జీనియాలోని మౌంట్ మొంటెబెల్లోకు సమీపంలోని పర్వత ప్రాంతంలో చివరికి చిన్న విమానం కుప్పకూలింది. విమానం మండిపోయిందని, అందులో వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు. చివరి క్షణంలో అది నిమిషానికి 30 వేల అడుగుల చొప్పున వేగంగా నేలవైపుగా దూసుకొచ్చిందని ఫ్లైట్ ట్రాకింగ్ రికార్డులు చెబుతున్నాయి. పర్వత ప్రాంతంలో విమానం కూలిన చోటుకు కాలినడకన చేరుకునేందుకు పోలీసులకు దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఫ్లోరిడాకు చెందిన ఎన్కోర్ మోటార్స్ పేరిట ఆ విమానం రిజిస్టరై ఉంది. ఈ కంపెనీ నిర్వాహకుడు జాన్ రంపెల్ మాట్లాడుతూ..ఆ విమానంలో పైలట్తోపాటు తన కూతురు, రెండేళ్ల మనవరాలు, ఆయా ఉన్నారన్నారు. వీరు నార్త్ కరోలినా నుంచి ఈస్ట్ హాంప్టన్కు వస్తున్నారన్నారు. విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు తనకు తెలియదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇది 1999 నాటి ఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పట్లో లీయర్జెట్ విమానం సాంకేతిక లోపం తలెత్తి అడ్డదిడ్డంగా తిరుగుతూ సౌత్ డకోటా ప్రాంతంలో కూలిపోయింది. అందులోని ఆరుగురూ చనిపోయారు. -
సార్వత్రిక ఎన్నికపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..!
-
భారత్లోని ముస్లింలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
వాషింగ్టన్: భారత్లోని ముస్లింలపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో కంటే భారత్లో ముస్లింలు ఎంతో మెరుగైన జీవనాన్ని గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. పాక్లో మైనార్టీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని వారి పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. దేశంలో ముస్లింలపై వివక్షత, దాడులు జరుగుతున్నాయంటూ పాశ్చాత్య పత్రికల్లో వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. ప్రపంచంలోని ముస్లిం జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కాగా ప్రస్తుతం కేంద్ర మంత్రి వాషింగ్టన్లో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF), ప్రపంచ బ్యాంక్తో సహా వివిధ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆమె అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (PIIE)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. . భారత్ పెట్టుబడులపై పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ఆమె తప్పుబట్టారు. తనకంటే భారత్కు వస్తున్న పెట్టుబడిదారులే దీనికి సరైన సమాధానం చెప్తారని అన్నారు. ‘ఇండియాలో పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి ఉన్న వారిని నేను ఒకటే కోరుతున్నా..ఎవరో చెప్పింది వినడం కంటే.. #WATCH | "Union Finance Minister Nirmala Sitharaman responds to a question on 'violence against Muslims' in India and on ‘negative Western perceptions' of India pic.twitter.com/KIT9dF9hZC — ANI (@ANI) April 11, 2023 భారత్కు రండి.. దేశంలో వాస్తవంగా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి’ అని పీఐఐఈ ప్రెసిడెంట్ ఆడమ్ ఎస్ పోసెన్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలోని ఎంపీలు హోదా కోల్పోతున్నారని, భారతదేశంలోని ముస్లిం మైనారిటీలు హింసకు గురవుతున్నారని పాశ్చాత్య పత్రికల్లో వచ్చిన వార్తలపై సీతారామన్ను ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉందన్నారు. ముస్లింలా జనాభా సంఖ్యాపరంగా పెరుగుతోందన్నారు. ముస్లింలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని, వ్యాపారాలను హాయిగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. భారత్లో 1947 తరువాత ముస్లింల జనభా తగ్గడం గానీ, మరణాలు పెరగడం గానీ జరిగాయా అని ప్రశ్నించారు ‘భారత్ ఏర్పడిన సమయంలోనే పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. పాక్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది. మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు కానీ అక్కడ మైనారిటీల పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. అంతేగాక ముస్లింలోని కొన్ని తెగలు సైతం క్షీణిస్తున్నాయి. అక్కడి మైనార్టీలపై చిన్న చిన్న ఆరోపణలకే తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారు. వ్యక్తిగత కోపాలను తీర్చుకునేందుకు కఠిన శిక్షలు, మరణశిక్షలు విధిస్తున్నారు .విచారణ లేకుండానే అనేకమంది బాధితులను వెంటనే దోషులుగా మార్చుతున్నారు. పాక్లోని ముస్లింల కంటే భారతదేశంలోని ముస్లింలు మెరుగ్గా పనిచేస్తున్నారు’ అని నిర్మలా పేర్కొన్నారు. చదవండి: జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి? -
అమెరికాలో భారత ఎంబసీపై దాడికి విఫలయత్నం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఖలిస్తానీ మూకలు మళ్లీ పేట్రేగాయి. ఈసారి అమెరికాలో వాషింగ్టన్లోని భారత దౌత్య కార్యాలయాన్ని లక్ష్యం చేసుకున్నాయి. దానిపై దాడికి ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన యత్నాన్ని సీక్రెట్ సర్వీస్ పోలీసులు విఫలం చేశారు. ఎంబసీ ఎదుట వారు హింసను ప్రేరేపించేలా ప్రసంగించారు. ఆ సమయంలో కార్యాలయంలో లేని దౌత్యాధికారి తరన్జిత్ సంధును బహిరంగంగానే బెదిరించారు! ఎంబసీ కిటికీలు, అద్దాలు పగులగొట్టేందుకు కర్రలను తెచ్చిపెట్టుకున్నారు. నిరసనలను కవర్ చేస్తున్న పీటీఐ ప్రతినిధినీ దూషించారు. ఆయన్ను నెట్టేస్తూ, ఖలిస్తానీ జెండా కర్రలతో కొట్టేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. త్రివర్ణ పతాకమున్న పోల్ను విరగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలను వమ్ము చేశారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్, లండన్లోని భారత హైకమిషన్ వద్ద కూడా ఖలిస్తానీ మూకలు గొడవలకు దిగడం తెలిసిందే. కెనడాలోని తమ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లపై తీవ్రవాద, వేర్పాటువాద శక్తుల దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడా హైకమిషనర్కు సమన్లు జారీ చేసింది. -
రాణి వెడలె.. బై బై బోయింగ్ 747
విమానయాన చరిత్రలో మహరాణిగా వెలుగొందిన బోయింగ్ 747 విమానం కథ కంచికి చేరింది. 50 ఏళ్లకు పైగా అద్భుతమైన సేవలతో అలరించిన ఈ విమానాల తయారీని బోయింగ్ నిలిపేసింది. చిట్టచివరి విమానం డెలివరీ కూడా తాజాగా జరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 పై చిలుకు బోయింగ్ 747లు సేవలందిస్తున్నాయి. అవన్నీ పూర్తిగా మూలకు పడ్డ అనంతరం ఈ ముచ్చటైన మోడల్ శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి జారుకుంటుంది... 1968, సెప్టెంబర్ 30 అమెరికాలోని వాషింగ్టన్ ఎవెరెట్టెలో కంపెనీ ప్లాంట్ బోయింగ్ 747 మొట్టమొదటి విమానం రాచఠీవితో నిల్చొని ఉంది. భారీ రెక్కలతో ఇంద్రభవనంలా మెరిసిపోతున్న ఆ విమానాన్ని చూడానికి వేలాది మంది అక్కడికి తరలివచ్చారు. అంత పెద్ద విమానాన్ని అప్పటివరకు చూసి ఎరుగని జనం దానినో అద్భుతంలా చూడసాగారు. భవనం లాంటి విమానం అసలు గాల్లో ఎలా ఎగరగలదని చర్చించుకోవడం మొదలు పెట్టారు. అప్పట్నుంచి ఈ విమానం అంతర్జాతీయ ప్రయాణ రూపురేఖల్ని మార్చేసింది. అందుకే బోయింగ్ 747ని క్వీన్ ఆఫ్ స్కైస్ అని పిలుస్తారు. 2023, ఫిబ్రవరి 1 55 సంవత్సరాల తర్వాత.. సరిగ్గా అదే స్థలం ఆకాశానికి రాణిలాంటి బోయింగ్ 747కి సిబ్బంది ఘనమైన వీడ్కోలు పలికారు. చిట్టచివరి విమానాన్ని గురువారం అట్లాస్ ఎయిర్లైన్స్ సంస్థకు అందజేశారు. ప్రయాణికుల విమానంగా మొదలైన దాని ప్రస్థానం కార్గో విమానంగా ముగిసింది. వీటి తయారీ నిలిపివేస్తున్నట్టు 2020లోనే కంపెనీ ప్రకటించింది. వేలాది మంది ఉద్యోగులతో పాటు ఔత్సాహికులు ఈ వీడ్కోలు కార్యక్రమానికి తరలి వచ్చారు. అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన విమానాన్ని మళ్లీ చూడలేమని బాధాతప్త హృదయంతో చర్చించుకున్నారు. విమానమే ఒక ఇంద్రభవనం విమాన ప్రయాణాల చరిత్రలో బోయింగ్కి ముందు, బోయింగ్ తర్వాత అని స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు. గంటల తరబడి కూర్చొని దేశ విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణాలు బోయింగ్ రాకతో అత్యంత సౌకర్యవంతంగా మారాయి. సువిశాలంగా ఉండే బోయింగ్ 747 ఎదుట ఇతర విమానాలు ఒక మరుగుజ్జుగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బోయింగ్ విమానం ప్రపంచాన్ని కుదించింది. కళ్లు చెదిరే సదుపాయాలతో వీవీఐపీ ప్రయాణికులు మోజు పడేలా 747 విమానాలు రూపుదిద్దుకున్నాయి. బార్లు, డైనింగ్ హాళ్లు, మూవీ స్క్రీన్లు, లగ్జరీ ఇంటీరియర్లు, లాంజ్లు, లివింగ్ రూమ్లు ఒకటేమిటి ఇదసలువిమానమా, గాల్లో ఎగిరే ఇంద్రభవనమా అని అందరూ అవాక్కయ్యారు. తయారీ నిలిపివేత ఎందుకు? అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. బోయింగ్ విమానానికయ్యే ఇంధనం ఖర్చు చాలా ఎక్కువ. 2007లో ఏ380 ఎయిర్ బస్ వచ్చిన దాకా బోయింగ్ 747 ప్రభ వెలిగిపోతూనే ఉంది. చమురు రేట్లు ఆకాశాన్నంటుతూ ఉండడంతో బోయింగ్ 747 కొనుగోలు చేసే ఎయిర్లైన్స్ సంస్థలు కరువయ్యాయి. యూరప్కి చెందిన ప్రత్యర్థి కంపెనీ ఎయిర్బస్ తక్కువ చమురు ఖర్చుతో విమానాలు రూపొందించడంతో బోయింగ్ డిమాండ్ పడిపోయింది. ఏ ఎయిర్లైన్స్ కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీంతో 2020లో బోయింగ్ 747 విమానాల తయారీ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రత్యామ్నాయం ఏంటి ? జంబో జెట్లతో చమురు ధరాభారం ఎక్కువగానే ఉన్నా అత్యంత పెద్ద విమానాన్ని రూపొందించడానికి బోయింగ్ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. రెండు ఇంజిన్లు ఉండే 776ఎక్స్ అని పిలిచే ఈ సరికొత్త జంబో జెట్ 2020లోనే మార్కెట్లోకి రావాల్సి ఉండేది. కానీ కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలు పడడంతో విమానాల తయారీ ఆలస్యమవుతోంది. 2025 నాటికి ఈ సరికొత్త విమానాలు తేవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొట్ట మొదటి విమానం ఇలా..! బోయింగ్ 747 కంటే ముందు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన 707 బోయింగ్ విమానం చాలా ఇరుగ్గా ఉండేది. సీట్ల మధ్య రాకపోకలు సాగించడానికి ఒక్కటే మార్గం ఉండేది. దీంతో విమాన ప్రయాణాలపై ప్రజలకి ఒక రకమైన వ్యతిరేకత నెలకొంది. బోయింగ్ 747 రెండు అంతస్తులుతో, నడిచి వెళ్లడానికి రెండు మార్గాలతో అత్యంత సువిశాలంగా ఉండేది. బోయింగ్ 707 విమానం 200 మంది కంటే తక్కువ మంది ప్రయాణికులతో ఏకబిగిన 3 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే, 400 మంది ప్రయాణికుల్ని మోసుకువెళుతూ బోయింగ్ 747 ఏకబిగిన 5వేల నాటికన్ మైళ్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఎన్నో ప్రత్యేకతలు ► మొట్టమొదటి విమానాన్ని పాన్ యామ్ సంస్థ జనవరి 15, 1970లో కొనుగోలు చేసింది. తొలిసారి నిర్మించిన 747 విమానం 225 అడుగుల పొడవు ఉంది. దాని తోకభాగం ఆరు అంతస్తుల భవనం ఎంత పొడవు ఉంటుందో అంత ఉండేది. ► జంబో జెట్కి చమురు ఖర్చు ఎక్కువ కావడంతో డిజైన్ రూపొందించినప్పుడే కార్గో అవసరాలకు మార్చుకునే విధంగా రూపొందించారు. 3,400 బ్యాగేజ్లను తీసుకువెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. అదే ఈ విమానాలను ఇన్నాళ్లూ కాపాడుతూ వచ్చింది. ► 1990లో తొలిసారిగా బోయింగ్ 747–200 విమానాన్ని అమెరికా అధ్యక్షుడు వాడే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంగా మార్చారు. ► ఇప్పటివరకు 1,574 విమానాలను తయారు చేశారు. ఇప్పటికీ 500 విమానాలు వాడుకలో ఉన్నాయి. ► ప్రయాణికుల, రవాణాతో పాటు అవసరమైనప్పుడు అంతరిక్షం నుంచి రాకపోకలకి అనుగుణంగా ఈ విమానాన్ని ఆధునీకరించారు. ► ఎయిర్ ఇండియా కూడా ఈ విమానాలను కొనుగోలు చేసి విస్తృతంగా వినియోగించింది. 1971లో తొలి విమానాన్ని కొనుగోలు చేసింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ ఆర్థిక కష్టాలు.. అమ్మకానికి అమెరికాలోని ఎంబసీ ఆస్తులు
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్థాన్. చేసిన అప్పులు తీర్చేందుకు, ఉద్యోగులకు జీతాలు సైతం ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతూ ఆస్తులు అమ్ముకుంటోంది. తమకు సాయం చేయాలని అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ దేశాలను వేడుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్లోని పాత ఎంబసీ బిల్డింగ్ను అమ్మకానికి పెట్టగా కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు పాకిస్థాన్ స్థానిక మీడియా వెల్లడించింది. భారత సంస్థ బిడ్.. వాషింగ్టన్లోని పాక్ ఎంబసీ భవనాన్ని కొనుగోలు చేసేందుకు అత్యధికంగా 6.8 మిలియన్ డాలర్లకు జువిష్ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఆ భవనం స్థానంలో ప్రార్థనా మందిరం నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత రెండోస్థానంలో భారత్కు చెందిన ఓ రియాల్టీ సంస్థ బిడ్ వేసింది. 5 మిలియన్ డాలర్లకు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే.. పాకిస్థాన్కు చెందిన రియాల్టీ సంస్థ 4 మిలియన్ డాలర్లకు కోట్ చేసినట్లు పాక్ డాన్ పత్రిక వెల్లడించింది. మరోవైపు.. ప్రైవేటీకరణపై ఏర్పడిన పాకిస్థాన్ కేబినెట్ కమిటీ ఆర్థిక మంత్రి ఇషాక్ డార్ నేతృత్వం సోమవారం భేటీ అయింది. న్యూయార్క్లోని రూసెవెల్త్ హోటల్ సైట్ను లీజుకు ఇచ్చేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్ను నియమించాలని ప్రైవేటీకరణ కమిషన్కు సూచించినట్లు డాన్ పత్రిక తెలిపింది. పాకిస్థాన్కు వాషింగ్టన్లో రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. ఆర్ స్ట్రీట్లో ఉన్న భవనాన్ని 1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. పాత భవనాన్ని అలాగే అమ్మేయాలా? లేక పునరుద్ధరణ పనులు చేయించి విక్రయించాలా? అనే అంశంపై ఎంబసీ అధికారులు చర్చిస్తున్నట్లు పాక్ పత్రిక పేర్కొంది. ఇదీ చదవండి: ‘ఏ దోస్త్ మేమున్నాం’.. పాకిస్థాన్కు జిన్పింగ్ భరోసా -
నేడే ఓరియాన్ రాక
వాషింగ్టన్: చంద్రునిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆర్టెమిస్ 1 ద్వారా దాదాపు నెల క్రితం ప్రయోగించిన ఓరియాన్ స్పేస్క్రాఫ్ట్ విజయవంతంగా పని పూర్తి చేసుకుని తిరిగి రానుంది. ఏకంగా 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఎట్టకేలకు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి భూమిని చేరనుంది. అయితే ఇది ఆద్యంతం హై రిస్కుతో కూడుకున్న తిరుగు ప్రయాణమని నాసా చెబుతోంది. ఎందుకంటే భూ వాతావరణంలోకి ప్రవేశించాక ఓరియాన్ ఏకంగా గంటకు పాతిక వేల మైళ్ల వేగంతో దూసుకురానుంది. ఈ క్రమంలో ఏర్పడే ఘర్షణ వల్ల ఏకంగా 2,760 డిగ్రీల వేడి కూడా పుట్టుకొస్తుంది. అంటే సూర్యునిపై ఉండే వేడిలో సగం! అంతటి వేగాన్ని, వేడిని తట్టుకుంటూ ఆర్టెమిస్ పసిఫిక్ మహాసముద్రంలో కాలిఫోర్నియాలోని శాన్ డియాగో వద్ద తీరానికి దాదాపు 50 మైళ్ల దూరంలో క్షేమంగా దిగాల్సి ఉంటుంది. ఇది పెను సవాలేనని నాసా సైంటిస్టులంటున్నారు. అందుకే వారిలో ఇప్పట్నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైగా ఓరియాన్ ల్యాండింగ్ కోసం నాసా తొలిసారిగా ‘స్కిప్ ఎంట్రీ’ టెక్నిక్ను వాడుతుండటం ఉత్కంఠను మరింత పెంచుతోంది. దీనిప్రకారం నీళ్లలోకి విసిరిన రాయి మాదిరిగా ఓరియాన్ భూ వాతావరణం తాలూకు పై పొరలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా దాని అపార వేగం చాలావరకు తగ్గడమే గాక వేడి కూడా అన్నివైపులకూ చెదిరిపోతుందట. అంతిమంగా ఓరియాన్ వేగాన్ని గంటకు 20 మైళ్లకు తగ్గించాలన్నది లక్ష్యం. ఇందుకోసం 11 భిన్నమైన పారాచూట్లను వాడనున్నారు. అయితే వేగం అదుపులోకి వచ్చేలోపు 2,760 డిగ్రీల వేడిని ఓరియాన్ ఏ మేరకు తట్టుకుంటుందన్నది అత్యంత కీలకం. ‘‘దీనికి ప్రస్తుతానికి మా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే, ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం’’ అని నాసా సైంటిస్టు ఒకరు చెప్పుకొచ్చారు. ఆ అపార వేడిని సమర్థంగా తట్టుకునేందుకు రక్షణ పరికరాల ఉత్పత్తి దిగ్గజం లాక్హీడ్–మార్టిన్ తయారు చేసిన అత్యంత మందమైన హీట్ షీల్డ్ను ఓరియాన్కు అమర్చారు. ఆ ఏడు నిమిషాలే కీలకం...: ఓరియాన్ భూ వాతావరణంలోకి ప్రవేశించాక తొలి ఏడు నిమిషాలను అత్యంత కీలకమైనవిగా నాసా అభివర్ణిస్తోంది. ఆ సందర్భంగా కనీసం 10 నిమిషాల పాటు స్పేస్క్రాఫ్ట్తో అన్నిరకాల సమాచార సంబంధాలూ తెగిపోతాయని చెబుతోంది. -
కరోనా వైరస్.. మానవ నిర్మితమే
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా వైరస్ మానవ నిర్మితమేనని చైనాలోని వూహాన్ ల్యాబ్లో పని చేసిన అమెరికా శాస్త్రవేత్త, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ చెప్పారు. తాజాగా విడుదల చేసిన తన పుస్తకం ‘ది ట్రూత్ ఎబౌట్ వూహాన్’లో సంచలన విషయాలు బయటపెట్టారు. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(డబ్ల్యూఐవీ) నుంచి రెండేళ్ల క్రితం కరోనా వైరస్ లీక్ అయ్యిందని వెల్లడించారు. చైనా ల్యాబ్లో వైరస్లపై పరిశోధనలకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ అనేది జన్యుపరంగా రూపొందించిన ఏజెంట్ అని చైనాకు తెలుసని వివరించారు. చైనాకు అమెరికా బయోవెపన్ సాంకేతికతను అందజేస్తోందన్నారు. సరైన భద్రతా చర్యలు లేని ప్రయోగాల కారణంగా వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా బయటకు వచ్చిందని స్పష్టం చేశారు. జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్ వంటి చర్యలు ఆ ల్యాబ్లో లేవని ఆండ్రూ హఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్)తో చైనాలోని వూహాన్ ల్యాబ్కు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ఎన్ఐహెచ్ నుంచి అందే నిధులతో గబ్బిలాల్లోని కరోనా వైరస్లపై వూహాన్ ల్యాబ్ అధ్యయనం చేస్తోందని తన పుస్తకంలో ప్రస్తావించారు. -
జీ 20 భేటీ...
వాషింగ్టన్లో జరిగిన జీ 20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల 4వ సదస్సులో ప్రసంగిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ను చిత్రంలో తిలకించవచ్చు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ప్రపంచ దేశాలు ఐక్యంగా ఎదుర్కొనాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుంచి స్వీకరించనుంది. డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల సమయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి జీ–20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్లతో జరిపిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి వాషింగ్టన్ వచ్చిన నిర్మలా సీతారామన్, పలు దేశా ల ఆర్థికమంత్రులు, సంస్థల చీఫ్లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
పలు దేశాల ఆర్థిక మంత్రులు, సంస్థల చీఫ్లతో నిర్మలా సీతారామన్
ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో భాగంగా రెండో రోజు వాషింగ్టన్ డీసీలో వివిధ దేశాల ప్రతినిధులు ఆర్థికమంత్రులతో సమావేశమయ్యారు. భారత్దేశం పురోభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాల వంటి అంశాలపై వారిపై చర్చలు జరిపారు. అప్పటి ఫొటోలను పక్కన తిలకించవచ్చు. తొలిరోజు పర్యటనలో భాగంగా బుధవారం అమెరికా ఆర్థికమంత్రి జనెత్ యెల్లెన్ నేతృత్వంలోని బృందంతో చర్చలు జరిపిన సీతారామన్, ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి కూడా ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రెసిడెంట్ రాజ కుమార్తో భేటీ ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి సిగ్రిడ్ కాగ్తో సమాలోచనలు జపాన్ ఆర్థికమంత్రి షుజుకితో భూటాన్ ఆర్థిక మంత్రి లియోన్పో నామ్గే షెరింగ్తో చర్చలు -
రష్యా ఆయిల్ కొనొద్దని ఎవరూ కోరలేదు
వాషింగ్టన్: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్ తనకు అనువైన దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటుందని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దని భారత్ను ఏ దేశం కోరలేదని స్పష్టంచేశారు. శుద్ధ ఇంధనంకు సంబంధించి వాషింగ్టన్లో అమెరికా ఇంధన మంత్రి జెన్నీఫర్ గ్రహోల్మ్తో భేటీ సందర్భంగా హర్దీప్ మీడియాతో మాట్లాడారు. ‘ పెట్రోల్, డీజిల్ వినియోగం అత్యంత ఎక్కువగా ఉండే భారత్ విషయంలో ఇలాంటి చర్చ అనవసరం. తనకు అనువైన దేశం నుంచే భారత్ చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇండియా–అమెరికా గ్రీన్ కారిడార్ ఆలోచనపై జెన్నీఫర్ సానుకూలంగా స్పందించారు’ అని హర్దీప్ చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా రష్యాపై గుర్రుగా ఉన్న పశ్చిమదేశాలు ఆంక్షల కొరడా ఝులిపించాయి. దీంతో తక్కువ ధరకే అందివచ్చిన రష్యా చమురును భారత్ భారీస్థాయిలో దిగుమతిచేసుకున్న విషయం విదితమే. -
ఎవర్నీ ఫూల్ చేయాలనుకుంటున్నారు!.. విదేశాంగ మంత్రి ఫైర్
వాషింగ్టన్: పాక్ అమెరికాల బంధం అంత తేలిగ్గా ముగిసిపోయేది కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చమత్కరించారు. పాక్కి అమెరికా సేవలందించడం లేదా అమెరికా తన ప్రయోజనాల కోసం పాక్ సేవలు అందించడం వంటి విడదీయరాని బంధం అని వ్యగ్యంగా అన్నారు. ఈ మేరకు జై శంకర్ వాషింగ్టన్లోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి అమెరికా 450 మిలయన్ డాలర్ల వ్యయంతో ఎఫ్-16 ఫైటర్ జెట్ సస్టైన్మెంట్ ప్రోగ్రామ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు భారత్ ఆందోళనలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు తెలియజేశారు కూడా. ఐతే అమెరికా మాత్రం అది విక్రయమే తప్ప భద్రతా సాయం కాదని చెప్పుకొచ్చింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..ఇలాంటి మాటలతో ఎవర్నీ మోసం చేయాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. అలాగే పాక్ ప్రభుత్వంతో ఈ ఎఫ్ 16 జెట్ విమానాల విక్రయాలతో అమెరికాకు ఒనగగురే ప్రయోజనం ఏమిటో తనకు తెలుసునని అన్నారు. అదీగాక ఎఫ్ 16 జెట్ విమానం ఎంత సామర్థ్యం గలవో వాటి ఉపయోగం ఏమిటో మనందరికి తెలుసునని నొక్కి చెప్పారు. (చదవండి: విక్రయమే తప్ప సాయం కాదన్న అమెరికా... టెన్షన్లో అమెరికా) -
పెయింటింగ్ అనుకుంటున్నారా?.. అస్సలు కాదండోయ్.. మరేంటి!
ఈ ఫొటో చూశారా? చేయి తిరిగిన రెజిన్ ఆర్టిస్ట్ గీసిన రంగురంగుల హరివిల్లులా ఉంది కదూ! కానీ, ఇది పెయింటింగ్ కాదు.. ఫొటోగ్రాఫ్. వాషింగ్టన్లో ఉన్న మౌంట్ రైనర్ నేషనల్ పార్క్లోని ఓ మంచు గుహలో తీసిన చిత్రం. మంచుకు అన్ని రంగులెలా వచ్చాయంటే... ఆ గుహకు ఉన్న ఒక ద్వారం గుండా సూర్యరశ్మి లోపలికి ప్రవేశించి, మంచుపై పడి ఇలా ప్రతిఫలిస్తుందన్నమాట. వీటిని చూడటానికి పర్యాటకులు, ఫొటోగ్రాఫర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు మాత్రం అది ప్రమాదమని ప్రవేశాన్ని నిషేదించారు. ‘ ‘నిత్యం కరుగుతోన్న ఆ మంచు గుహలు ఎప్పుడైనా విరిగిపడొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల.. లోపలికి వెళ్లినవాళ్లకు ఊపిరి అందకుండా పోయే ప్రమాదమూ ఉంది’’ అని హెచ్చరించారు. మంచు కరిగి ప్రవహిస్తున్న నీటిపాయ గుహ రాళ్ల మధ్య కనిపిస్తోంది కదా! నిజానికి ఒకప్పుడు ఈ పార్కు మంచు గుహలకే ప్రత్యేకం. కానీ.. వాతావరణంలో వస్తున్న మార్పులతో కరిగి అంతరించి పోతున్నాయి. కరిగిన మంచు చిన్నపాటి కారు సైజులో విరిగి పడుతుండటంతో ప్రమాదమని 1980లోనే గుహలను మూసేశారు. అయితే ప్రాణాలకు తెగించి తీసిన ఫొటోలను ఫోటోగ్రాఫర్ మాథ్యూ నికోల్స్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, అవి వైరలవుతున్నాయి. -
వాషింగ్టన్లో కాల్పుల కలకలం... ఇద్దరికి గాయాలు
న్యూయార్క్: వాషింగ్టన్ లీస్ట్రీట్ వీధిలోని ఐడియా పబ్లిక్ చార్టర్ స్కూల్ బ్లాక్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతలో ఘటన జరిగినట్టు వాషింగ్టన్ పోలీస్ రాబర్ట్ కాంటె తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 15 ఏళ్ల యువకుడు ఆ స్కూల్లోని ఇద్దరు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సదరు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న దాదాపు 350 మంది విద్యార్థులను, స్కూల్ సిబ్బందిని ఈ విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ అధికారులు మాట్లాడుతూ...ఈ ఏడాది సుమారు రెండు వేల అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే అదనంగా 800 అక్రమ ఆయుధాలు ఎక్కు ఉన్నాయన్నారు. అదే బుధవారం వేరొక ఘటనలో ఒక భవనం వద్ద మరో బాలుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు. (చదవండి: 20 ఏళ్ల యుద్ధానికి తెరపడిన రోజు... అఫ్గాన్లో మిన్నంటుతున్న సంబరాలు) -
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన యూఎస్ సౌత్ కొరియా
Washington and Seoul officials Warned: ఉత్తర కొరియా రెండు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు సియోల్ రక్షిణ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నెలరోజుల విరామం తర్వాత ఉత్తర కొరియా రికార్డు బ్రేక్ చేస్తూ రెండు క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున దక్షిణ కొరియా ప్యోంగాన్ ప్రావిన్స్లోని ఓంచోన్ నుంచి పశ్చిమ సముద్రంలోకి ఉత్తర కొరియా రెండు క్రూయిజ్ క్షిపణులను పేల్చినట్లు గుర్తించామని రక్షణ మంత్రిత్వశాఖ అధికారి పేర్కొన్నారు. దీంతో యూఎస్, దక్షిణ కొరియా సైనిక అధికారులు ఎంద దూరం నుంచి ఈ క్షిపణుల ప్రయోగం జరిగిందని పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా విశ్లేషిస్తున్నరు. ఈ మేరకు ఉత్తర కొరియా చివరిసారిగా జులై 10న ఆయుధ పరీక్షను నిర్వహించింది. ఇది బహుళ రాకెట్ లాంచర్లను ఫైర్ చేయగల క్షిపణి. ఐతే ఉత్తరకొరియా న్యూస్ ఛానెల్ ఒక్క క్రూయిజ్ క్షిపణినని ప్రయోగించలేదని, తమ దేశంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించలేదని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఉత్తరకొరియా 2017 నుంచి పూర్తి తొలిసారిగా పూర్తి స్థాయిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అప్పటి నుంచి పలుమార్లు ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘిస్తూ పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఉత్తర కొరియా దూకుడు వ్యవహరంతో యూఎస్, దక్షిణ కొరియా అధికారులు కూడా అణు పరీక్షలకు సిద్ధమవుతున్నమని గట్టిగా హెచ్చరించారు. తదుపరి ఉత్తర కొరియా ఏడోవ అణు పరీక్ష ఏం నిర్వహించనుందో తెలియదు కానీ తాము మాత్రం అణుపరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు కరాఖండీగా చెప్పాయి. (చదవండి: కిమ్ జోంగ్ ఉన్కి పుతిన్ లేఖ) -
యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ వద్ద కలకలం
వాషింగ్టన్: వాషింగ్టన్లోని యూఎస్ క్యాపిటల్ భవన సముదాయం వద్ద ఆదివారం వేకువజామున అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుతో వచ్చి క్యాపిటల్ వద్ద బారికేడ్లను ఢీకొట్టాడు. వాహనం దిగి గాల్లోకి కాల్పులు జరిపాడు. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అతడు దిగగానే మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో భవన సముదాయంలో కొద్ది మంది సిబ్బందే ఉన్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్లో ఎఫ్బీఐ సోదాలు జరిపినప్పటి నుంచి ఫెడరల్ అధికారులకు బెదిరింపులు, ప్రభుత్వ భవనాలపై దాడులు జరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. -
జేమ్స్ వెబ్ కంటికి చిక్కిన... తొలి సూపర్నోవా
వాషింగ్టన్: భూమికి 30 లక్షల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో ఉన్న ఓ పాలపుంతలో భారీ సూపర్నోవాను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. జేమ్స్ వెబ్ కంటికి చిక్కిన తొలి సూపర్నోవా ఇదే. నక్షత్రం తన ఉనికిని కోల్పోయే క్రమంలో పేలిపోయినప్పుడు వెలువడే అపారమైన కాంతిని సూపర్నోవాగా పిలుస్తారు. అంతరిక్షంలో జరిగే అతి పెద్ద పేలుళ్లు ఇవేనంటారు. 2011లో హబుల్ టెలిస్కోప్ ఇదే పాలపుంతను క్లిక్మనిపించినా ఈ సూపర్నోవా మాత్రం దాని కంటికి చిక్కలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జేమ్స్ వెబ్ను ఇలాంటి అంతరిక్ష పేలుళ్లను గుర్తించేలా డిజైన్ చేయలేదు. అయినా దాని కెమెరా కన్ను సూపర్ నోవాను బంధించడం విశేషమేనంటూ నాసా శాస్త్రవేత్తలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వయసు మళ్లిన హబుల్ టెలిస్కోప్ స్థానంలో ఇటీవలే అంతరిక్షంలోకి పంపిన జేమ్స్ వెబ్ విశ్వపు తొలినాళ్లకు, అంటే దాదాపు 1,350 కోట్ల సంవత్సరాల నాటి విశ్వానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను అందించడం తెలిసిందే. చదవండి: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..? -
సియాటెల్లో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు: స్పెషల్ ఫుడ్ డ్రైవ్
వాషింగ్టన్: జులై 8న మహానేత డా.వైయస్సార్ 73వ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైయస్సార్ అభిమానులు ఫుడ్ డ్రైవ్ సేవాకార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలనతో, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన చెరగని ముద్రవేసి ప్రజలగుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానేత డా. వైఎస్సార్ అని కొనియాడారు. ఈ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైఎస్సార్ అభిమానులు రెండు వేల డాలర్లతో ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సేవాకార్యక్రమాలలో పాల్గొని స్వయానా ఫుడ్ డ్రైవ్ డ్రాప్ బాక్సులు, ఫుడ్ డ్రైవ్ ప్యాకెట్లు తయారు చేసివాటిని ఆకలితో ఉన్నవారికి అందించి మహానేత జయంతిని ఘనంగా నిర్వహించారు. మహానేత సువర్ణపాలన, గొప్ప నాయకత్వ లక్షణాలు, ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ పలువురు అభిమానులు వైఎస్సార్కు ఘన నివాళులర్పించారు. ఆయన గొప్పతనం తెలుసుకున్న స్థానిక అమెరికన్లు సైతం అబ్బురపోవడం విశేషం. అలాంటి నాయకులను పొందడం అదృష్టం అని పేర్కొన్నారు. ఆ మహానేత పేరుతో క్రమం తప్పకుండా తమ ప్రాంతాలలో ఫుడ్ డ్రైవ్లు, సేవా కార్యక్రామాలు ఏర్పాటు చేస్తున్న అభిమానులని అభినందించి కృతజ్ఞతలు తెలియజేసారు.. ఈ వేడుకలలో భాగంగా ఫుడ్ డ్రైవ్ & సేవాకార్యక్రమాలలో తమ సహాయసహకారాలు అందించిన విక్రమ్ రెడ్డి గార్లపాటి సువీన్ రెడ్డి గారికి, చెన్నా రెడ్డి మహీధర్ రెడ్డి రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు జేసి రెడ్డిమునీశ్వర్ రెడ్డి , దామోదర్ అన్నకు, రామ్ , లోకనాథ్ , శేఖర్ గుప్త, విన్నకోట, భాస్కర్ రావికంటి , Dr వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ - USA అండ్ ఆళ్ళ రామిరెడ్డితోపాటు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయసహకారాలు అందించిన అందరికీ వైఎస్సార్ అభిమాని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు -
అమెరికాలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. యూఎస్ఏ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వామి వారి కళ్యాణం తిరుమల నుంచి వచ్చిన టీటీడీ అర్చకుల చేతుల మీదుగా సంప్రదాయ బద్ధంగా జరిగింది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించగా..ప్రముఖ గాయని శోభారాజు తన గానంతో భక్తుల్ని అలరించారు. ఈ కార్యకార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువనేశ్, కన్వెన్షన్ కన్వీనర్ సుధీర్ బండారు, కిరణ్ పోశామ్, ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులు రత్నాకర్ పండుగాయల,హరి ప్రసాద్ లింగాల, మేడపాటి వెంకట్, వైఎస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి వల్లూరి తదితరులు పాల్గొన్నారు. -
ఆటా వేడుకలకు వేదిక ముస్తాబు (ఫొటోలు)
-
అమెరికా రక్షణ శాఖలో కీలక పదవిలో రాధా అయ్యంగార్
వాషింగ్టన్: ఇండియన్ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్ ప్లంబ్కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ సర్కారు ఆమెను నామినేట్ చేసింది. ఆమె ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్ సెక్రటరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్నారు. మరో ఇండియన్ అమెరికన్ గౌతమ్ రానా స్లొవేకియాలో అమెరికా రాయబారిగా నియమితులు కానున్నారు. అసలు ఎవరు ఈ రాధా అయ్యంగార్ ? ఎకనామిక్స్లో ఎంఎస్, పిహెచ్డి పూర్తి చేసిన ఆమె లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గానూ పని చేశారు. రాధా అయ్యంగార్ ప్రస్తుతం డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ చీఫ్ స్టాఫ్గా వ్యవహరిస్తున్నారు. చీఫ్స్టాఫ్గా నియమకానికి ముందు.. ఆమె ప్రముఖ సంస్థ అయిన గూగుల్లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ కోసం రీసెర్చ్ అండ్ ఇన్సైట్స్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. -
శవం కూడా దక్కది అనుకున్నారు! కానీ..
వాషింగ్టన్: పాలబుగ్గల చిన్నారి.. స్నేహితులతో ఆటల్లో మునిగిపోయింది. సరదాగా హైడ్ అండ్ సీక్ ఆడుతూ.. ఒక్కసారిగా చెట్టు చాటు నుంచి స్నేహితురాలిని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది. కానీ, ఊహించని సర్ప్రైజ్ ఆమెకు ఎదురైంది. ఆమె జీవితాన్ని ఛిద్రం చేసింది. అదృష్టంకొద్దీ ప్రాణం మిగలడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. లిల్లీ క్రైజానివిస్కీ.. వయసు తొమ్మిదేళ్లు. ఐదు రోజుల కిందటి వరకు ఆమె జీవితం మిగతా వాళ్లలాగే సరదాగా గడిచింది. కానీ, ఇప్పుడు ఆమె ఆస్పత్రి బెడ్పై సగం చిధ్రమైన స్థితిలో పడి ఉంది. ఓ కౌగర్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి.. మృత్యువు ముఖం నుంచి బయటపడింది. కౌగర్.. పిల్లి జాతికి చెందిన భారీ జంతువు.. మౌంటెన్ లయన్. బరువు 35 నుంచి 115 కేజీల మధ్య ఉంటుంది. ఇవి దాడి చేస్తే మనుషి బతకడం చాలా కష్టం. 1924 నుంచి వాషింగ్టన్ స్టేట్లో 20 మందిపై దాడులు చేశాయి ఇవి. దాడి చేస్తే రక్తమాంసాలు కూడా మిగల్చకుండా తినేస్తాయి. అలాంటి క్రూర జంతువు దాడిలో గాయపడి.. బతకడం లిల్లీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. లిల్లీ కుటుంబం వెస్ట్రన్ యునైటెడ్ స్టేట్స్కు విహారయాత్రకు వెళ్లింది. అధికారులను హెచ్చరికలను ఆ కుటుంబాలు పట్టించుకోలేదు. పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపించారు. అక్కడే స్నేహితులతో ఆడుకుంటున్న టైంలో.. ఆ చిన్నారిపై కౌగర్ దాడి చేసింది. ముఖంతో పాటు మొత్తం ఆ చిన్నారిని చీల్చి పడేసింది. నోట కరుకుకుని లాక్కుని పోయింది. ఆ హఠాత్ పరిణామంతో తోటి పిల్లలు గట్టి గట్టిగా అరిచారు. అంతా వచ్చి చూసేసరికి రక్తపు మరకలు తప్ప బిడ్డ కనిపించలేదు. అంతా కలిసి వెతకగా.. కొద్దిదూరంలో రక్తపు మడుగులో పడి ఉంది ఆ చిన్నారి దేహం. అధికారుల సాయంతో వెంటనే లిల్లీని ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. ఆమె ముఖం, శరీర పైభాగం దాడిలో ఘోరంగా దెబ్బతింది. చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునేందుకు ఆ కుటుంబానికి డబ్బు అవసరం పడింది. అందుకే ఆమె అంకుల్ గోఫండ్మీ ద్వారా విరాళాలు సేకరించారు. చిన్నారి పరిస్థితిని ఫొటోల ద్వారా చూసి చలించి.. విరాళాలు ధారల వెల్లువెత్తాయి. మొత్తానికి సోమవారం సర్జరీ జరిగింది. ఐసీయూ నుంచి, అంతకు మించి కోమా నుంచి లిల్లీ బయటకు వచ్చింది. కానీ, ఆమె మామూలుగా తిరగగలుతుందా? అనేది మాత్రం ఆరునెలలు గడిచాకే చెబుతాం అంటున్నారు వైద్యులు. -
బూస్టర్ డోస్ వేసుకున్నా కమలా హారిస్కు కరోనా
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కరోనా (57) బారిన పడ్డారు. మంగళవారం చేసిన రాపిడ్, పీసీఆర్ పరీక్షలు రెండింట్లోనూ ఆమెకు పాజిటివ్గా తేలింది. అయితే వ్యాధి లక్షణాలేమీ కన్పించలేదు. నెగెటివ్గా తేలేదాకా ఆమె ఐసోలేషన్లో ఉంటూ ఇంటినుంచే పని చేయనున్నారు. కమల నుంచి అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్యకు కరోనా సోకే ప్రమాదమేమీ లేదని ఆమె ప్రెస్ సెక్రెటరీ కిర్స్టెన్ అలెన్ తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి వారిని ఆమె కలవలేదని వివరించారు. కమల కరోనా రెండు డోసులతో పాటు రెండు బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. ఆమె భర్త డగ్ ఎమోఫ్ నెల క్రితమే కరోనా బారిన పడి కోలుకున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు, వైట్హౌస్ ఉన్నతాధికారులకూ కరోనా సోకింది. చదవండి: (4,800 కోట్ల డాలర్లతో జపాన్ అత్యవసర ప్యాకేజీ) -
భారత్కు నమ్మదగ్గ.. నేస్తం మేమే: అమెరికా
వాషింగ్టన్: చైనా విసురుతున్న ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్, ఆస్ట్రేలియాలతో అమెరికా బంధం మరింత బలపడాలని ఆ దేశ కాంగ్రెస్ సభ్యుడు, హౌస్ ఆరమ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఆడమ్ స్మిత్ అన్నారు. ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, భారత్కు అత్యంత విశ్వసనీయమైన నేస్తం రష్యా కాదని, అమెరికానే అని ఆ దేశ విదేశాంగ శాఖ కౌన్సెలర్ డెరెక్ చాలెట్ అభిప్రా యపడ్డారు. భారత్ రక్షణ అవసరాలన్నింటినీ అమెరికా తీరుస్తుందని చెప్పారు. భారత్కు ఆయుధాలు సరఫరా చేయడానికి అమెరికా ఎంతో ఉత్సాహంగా ఉందని వెల్లడించారు. చదవండి: (Russia-Ukraine war: మారియుపోల్లో మారణహోమం?) -
మరో భారతీయ అమెరికన్కు కీలక హోదా
వాషింగ్టన్: భారతీయ మూలాలున్న మరో అమెరికన్కు అధ్యక్షుడు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. దౌత్యాధికారి రచనా సచ్దేవ కొర్హొనెన్ను మాలిలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆమె స్వస్థలం న్యూజెర్సీలోని ఫ్లెమింగ్టన్. నెల వ్యవధిలో భారతీయ మూలాలున్న పునీత్ తల్వార్ను మొరాకో రాయబారిగా, షెఫాలీ రజ్దాన్ దుగ్గల్ను నెదర్లాండ్స్ ప్రతినిధిగా అధ్యక్షుడు నియమించారని వైట్హౌస్ గుర్తు చేసింది. చదవండి: (లక్షన్నర డాలర్ల పన్ను కట్టిన బైడెన్) -
మాస్కో మేయర్ భార్య హంటర్ బైడెన్కు అంత సొమ్ము ఎందుకిచ్చారు?
వాషింగ్టన్: రష్యాలోని బడా బాబులతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆయన తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. బైడెన్ కుటుంబానికి ఇబ్బంది కలిగించే ఎలాంటి సమాచారం ఉన్న తనకు అందజేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరారు. ‘హంటర్ బైడెన్కు రష్యాలోని మాస్కో సిటీ మేయర్ భార్య 3.5 మిలియన్ డాలర్లు ఇచ్చారు. హంటర్కు అంత డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో పుతిన్కు తెలుసు. కారణం పుతిన్ బయటపెట్టాలి’ అని ట్రంప్ అన్నారు. హంటర్కు రష్యాతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. చదవండి: (పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన) -
కోల్డ్ బ్లడెడ్ కిల్లర్: అతని టార్గెట్ ఒంటరి పురుషులే
Targeting sleeping homeless men: యూఎస్లో తుపాకీలతో దాడుల జరిపే కొంతమంది నేరస్తుల గురించి విన్నాం. జాతి వివక్షతతో దాడులు చేసేవాళ్లు కొందరైతే. మరికొందరూ మా దేశంలోకి ఎందుకు వచ్చారంటూ స్థానిక రౌడిలు కాల్పులు జరపడం చూశాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒంటరిగా ఉన్న పురుషుల పైనే దాడి చేస్తాడంటా. పైగా వారిని హతమార్చేంత వరకు వదలడట. వివరాల్లోకెళ్తే...న్యూయార్క్ వాషింగ్టన్ డీసీలలో వరుస హత్యలు జరిగాయి. ఈ జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉన్న పురుషుల పైనే నిందితుడు దాడి చేశాడు. అతను ఇప్పటి వరకు ఐదుగురుని మట్టుబెట్టడు. పైగా గత రెండు రోజుల్లో చేసిన దాడిలో ఇద్దరూ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతను ఒంటరిగా ఉన్న పురుషులనే టార్గెట్ చేస్తున్నాడని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, డీసీ వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్లు అనుమానం వ్యక్తం చేశారు. వారు ఆ నేరస్తుడిని కోల్డ్ బ్లడెడ్ కిల్లర్గా వ్యవహరించారు. అలాగే అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు మేయర్లు జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉండే పురుషుల కోసం ఒక హెచ్చరిక జారీ చేశారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును విచారిస్తుంది. అంతేకాదు దర్యాప్తులో.. అతను నిరాశ్రయుల పైన దాడులు జరుపుతున్నాడని, తాజాగా మాన్హట్టన్లోని ట్రిబెకా ప్రాంతంలో 43 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చడాని వెల్లడించారు. పోలీసుల నిందుతుడి ఫోటోను కూడా విడుదల చేశారు. పైగా నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ. 19 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. Tonight, Washington, DC Mayor Muriel Bowser and @NYCMayor spoke about ongoing investigations by the @DCPoliceDept and the @NYPDnews. Following their conversation, Mayor Bowser and Mayor Adams released the following joint statement: https://t.co/MpcefoOowL pic.twitter.com/dbWmLxg1Tb — Mayor Muriel Bowser (@MayorBowser) March 14, 2022 (చదవండి: ఆయువు తీసిన ఆన్లైన్ గేమ్స్!) -
యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు
Ukraine's two breakaway regions announced a general mobilisation: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్దం అని ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్లో రష్యా ఆక్రమణ దాడులు మరింత తీవ్రతరం అవుతాయనే భయాలు మొదలయ్యాయి. యూరప్లోని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ నిపుణులు రష్యా అనుకూల తిరుగుబాటుదారులచే నియంత్రించబడుతుందని, తూర్పు ఉక్రెయిన్లోని కొన్ని భాగాలలో దాడులు గణనీయంగా పెరిగాయని నివేదిక ఇచ్చిన కొద్ది వ్యవధిలోనే ఈ ప్రకటనలు వెలువడటం గమనార్హం. ఈ మేరకు శనివారం తాజాగా జరిగిన దాడులపై ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ నాయకుడు డెనిస్ పుషిలిన్ తన తోటి సైనికులను సైనిక నిర్భంధ కార్యాలయానికి రావాలని కోరడమే కాక తాము యుధ్దానికి సిధ్దం అనే డిక్రి పై సంతకం చేసిన విషయం గురించి ఒక వీడియోలో వెల్లడించారు. లుగాన్స్ వేర్పాటువాద ప్రాంతం నాయకుడు లియోనిడ్ పసెచ్నిక్, అదే సమయంలో తన ప్రాంతంలోని దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధం అని సంతంకం చేసిని డిక్రిని ప్రచురించాడు. అయితే ఉక్రెయిన్ భద్రతా దళాలే దాడులు మొదలుపెట్టాయని.. తాము ఆ దాడులను అడ్డుకున్నామని వేర్పాటువాద నాయకుడు పుషిలిన్ పేర్కొన్నాడు. అంతేకాదు తాము కలిసి విజయాన్ని సాధించడమే కాక రష్యా ప్రజలను రక్షిస్తాం అని ప్రకటించాడు. మరోవైపు వాషింగ్టన్ కూడా ఏ క్షణంలోనే రష్యా దాడులు చేస్తోందంటూ హెచ్చరిస్తోంది. ఇవన్నీ ఉక్రెయిన్ని ప్రధానంగా భయపెడుతున్న అంశాలు. 2014లో రష్యాలో విలీనం అయిన క్రిమియన్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునే నిమిత్తం ఉక్రెయిన్ వేర్పాటు వాదులపై దాడులు జరుపుతోందంటూ వస్తున్న ఆరోపణలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఖండించింది. అంతేకాదు 2014లో వేర్పాటు దారులు చేసిన దాడులలో ఉక్రెయిన్ సైన్యం సుమారు 14 వేల మంది చనిపోయారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం బలగాలు వెనుకకు వచ్చేసినట్లు చెబుతుండటం విశేషం. ఉపగ్రహ చిత్రాలలో ఉక్రెయిన్ చుట్టూ రష్యా దళాలు మోహరింపు స్పష్టంగా కనిపిస్తోంది.బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాలోని అనేక కీలక ప్రదేశాలలో రష్యా సైన్యం కార్యకలాపాల పరిధిని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరదని హామీ పై బలగాలను వెనుక్కుతగ్గుతాయని రష్యా చెప్తుండడం తెలిసిందే. (చదవండి: : రష్యా అణు విన్యాసాలు) -
అనుమానంతో కూతుర్ని కాల్చి చంపిన తండ్రి
వాషింగ్టన్: ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఇంట్లోని అలారం మోగడంతో ఎవరో ఆగంతకులు చొరబడ్డారని ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. కాసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా తన కూతరు జానే హెయిర్స్టన్ అక్కడ పడిపోయిఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఈ ఘటనపై బుధవారం ఉదయం 4:30గంటల ప్రాంతంలో ఆమె తల్లి అత్యవసర సేవలకు కాల్చేసి తెలియజేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అత్యవసర బృందం సాయంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ హెయిర్స్టన్ చికిత్స పొందుతూ 5:42 గంటల ప్రాంతంలో మరణించినట్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చైనా జెట్ విమానాలు కొన్న పాక్) -
వదల బొమ్మాలి.. వదల.. పెంపుడు కుక్కపై పిట్బుల్ దాడి
వాషింగ్టన్: సాధారణంగా కొందరు కుక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటికి తిండిపెట్టడం, స్నానం చేయించడం లాంటి పనులు చేస్తుంటారు. వాటిని ఎక్కడికి వెళ్లిన తమతో పాటు తీసుకెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని సార్లు యజమానులు తమ పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్తున్నప్పుడు వేరే కుక్కలు వాటిపై అరుస్తూ వెంట పడటం, దాడి చేయడం మనకు తెలిసిందే. తాజాగా ఇలాంటి ఒక ఘటన యూఎస్లోని లాస్వేగాస్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 19 ఏళ్ల లారెన్ రే అనే యువతి తన పెంపుడు కుక్క మ్యాక్స్ను తీసుకొని ఇంటినుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఆమెకు ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. ఒక పిట్ బుల్ కుక్క ఆమె.. పెంపుడు కుక్కవైపు పరిగెత్తుకు వచ్చింది. అంతటితో ఆగకుండా మ్యాక్స్పై దాడిచేయడానికి ప్రయత్నించింది. పాపం.. లారెన్.. ఎంత తప్పించాలని చూసిన ఆ శునకం మాత్రం దాన్ని కరవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అప్పుడు ఒక అమెజాన్ డ్రైవర్ యువతి అరుపులు విని వారి ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత.. చాకచక్యంగా యువతిని తప్పించి ఇంటి లోపలికి పంపించి వేశాడు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లిపోయి ఇంటి తలుపులు మూసేసింది. ఆ వీధి శునకం కూడా కాసేపటికి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయకరంగా దాడిచేస్తుంది..’,‘నీ తెలివికి హ్యట్సాఫ్..’, ‘పాపం.. చిన్న కుక్క దొరికితే దానిపని అంతే..’, ‘వదల బొమ్మాలి.. వదల అంటూ దాడి చేస్తోందంటూ’ కామెంట్లు పెడుతున్నారు. An #Amazon delivery driver has saved a woman and her dog from a vicious pit bull attack in #LasVegas. The heroic courier, who saved the woman and her #dog from the attack, has conquered hearts across social media.#dogs #dogattack #pitbull #anews pic.twitter.com/3f1yKZ5jLd — ANews (@anews) December 21, 2021 -
77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!
77 year Old Astrophysicist Battling Stage 4 Prostate Nails Ice Skating: మనషి ఎప్పుడూ నిత్య విద్యార్థిలా చివరి దశ వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆచరణ వరకు వస్తే అంతగా ఎవరూ పూర్తి స్థాయిలో చేయడానికి ఆసక్తి చూపరనే చెప్పాలి. ఏదో ఒక కారణంతో మన కలలను, లక్ష్యాలను వదిలేసి మనం ఇంతవరకే సాధించగలం అని సరిపెట్టేసుకుంటారు. కానీ ఇక్కడొక వృద్ధుడు మరణానికి దగ్గరలో ఉన్నా కూడా ఐస్ స్కేటింగ్ చేయాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. అసలు విషయంలోకెళ్లితే...రిచర్డ్ ఎప్స్టీన్ అనే 77 ఏళ్ల వృద్ధుడు రెండేళ్లకు పైగా క్రానిక్ లింఫాటిక్ లుకేమియా (సిఎల్ఎల్)తో పోరాడి బయట పడిన తర్వాత మళ్లీ 2020లో స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్ భారిన పడతాడు. అయితే అవేమి ఆ వృద్ధడు పెద్దగా పట్టించకోడు. పైగా ఐస్ స్కేటింట్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు దీని కోసం ఒక స్కేటింగ్ టీచర్ వద్ద ట్రైయినింగ్ కూడా తీసుకుంటాడు. ఈ మేరకు అతని కూతురు మహిళ రెబెకా బాస్టియన్ తన తండ్రి విజయవంతంగా ఐస్ స్కేటింగ్ నేర్చుకోవడమే కాక గురువుతో కలిసి స్కేటింగ్ చేస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు తన తండ్రి ఖగోళ శాస్త్రవేత్త అని మౌంట్ రైనర్ను అధిరోహించిన సాహసి అని కూడా వెల్లడిస్తుంది. పైగా నేర్చకునే వయసు అయిపోయింది, నా పరిస్థితి ఏం బాగోలేదు అని కూర్చోకూడదని కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ జీవితాన్ని ఆస్వాదించాలంటూ ట్విట్టర్లో పేర్కొంటుంది. అయితే ప్రసుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. My father is 77 years old and has stage 4 prostate cancer. He decided to learn how to ice skate a few years ago, and just did this performance with his teacher. For anyone that thinks it’s too late to try something new… ❤️ pic.twitter.com/0SZ3FmbNGE — Rebekah Bastian (@rebekah_bastian) December 9, 2021 -
కరోనా వెల్లడికి ముందే చైనా అప్రమత్తం !
వాషింగ్టన్: ప్రపంచానికి కరోనా మహమ్మారిని పరిచయం చేయడానికంటే చాలా నెలలకు ముందే చైనా ఈ విషయంపై సీరియస్గా దృష్టిపెట్టిందనే బలమైన ఆధారాలు తాజాగా బహిర్గతమయ్యాయి. తమ దేశంలో ఎంత మందికి కరోనా సోకిందో, ఎంతగా దేశవ్యాప్తంగా విస్తరించిందో తెల్సుకునేందుకు పీసీఆర్ టెస్ట్ కిట్లను ముందుగా ఆర్డర్ చేసిందని ‘ఇంటర్నెట్ 2.0’ అనే సైబర్ సెక్యూరిటీ పరిశోధన సంస్థ తాజా నివేదికలో వెల్లడైంది. డిజిటల్ ఫోరెన్సిక్, నిఘా ఫలితాల విశ్లేషణలో ‘ఇంటర్నెట్’ అనే ఈ అమెరికా–ఆస్ట్రేలియా సంస్థకు అపార అనుభవం ఉంది. చదవండి: (అంతరిక్షంలో సినిమా షూటింగ్) తమ దేశంలో కరోనా అనే కొత్త వైరస్ విజృంభిస్తోందని తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా 2019 డిసెంబర్ 31న అధికారికంగా తెలియజేసింది. అయితే, ఆ తేదీకి చాలా నెలల ముందే, అంటే మే నెలలోనే చైనా కోవిడ్ కట్టడికి భారీ స్థాయిలో ఏర్పాట్లు మొదలుపెట్టిందని ‘ఇంటర్నెట్ 2.0’ సంస్థ వాదిస్తోంది. ఇందుకు.. చైనాలో ఒక్కసారిగా పెరిగిన పీసీఆర్(పాలిమర్ చైన్ రియాక్షన్) టెస్టింగ్ కిట్ల కొనుగోలు పరిమాణాలను ఆధారంగా చూపుతోంది. వూహాన్ సిటీ ఉన్న హూబే ప్రావిన్స్లో 2019 ఏడాది ద్వితీయార్ధంలో ఈ కిట్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. చైనా ప్రభుత్వ వెబ్సైట్లోని కొనుగోళ్ల వివరాల ఆధారంగానే ఈ నివేదికను రూపొందించామని సంస్థ సహ సీఈవో, ఆస్ట్రేలియా సైనిక నిఘా మాజీ ఉన్నతాధికారి రాబిన్సన్ చెబుతున్నారు. ఈ వాదనలను చైనా తేలిగ్గా కొట్టిపారేసింది. చదవండి: (ఆ ఇంట్లో కనకవర్షం.. రూ.5,215 కోట్ల లాటరీ) అయితే, ఇంత భారీగా కొన్న కిట్లను ఏ వ్యాధి నిర్ధారణకు వినియోగించారనే విషయాన్ని చైనా బహిర్గతం చేయకపోవడం గమనార్హం. అయితే, తమ తదుపరి నివేదికలో మరిన్ని కొత్త విషయాలు బయటపెడతామని ఇంటర్నెట్ 2.0 సహ సీఈఓ ఒకరు చెప్పారు. అయితే, ముందే చైనాకు అంతా తెలుసు అనే వాదనను ఇంటర్నెట్ 2.0 నివేదిక ఆధారంగా బలపరచలేమని కొందరు వైద్య నిపుణులు వ్యాఖ్యానించారు. నివేదికలోని అంశాలు అందుకు సరిపోవన్నారు. కరోనా కాకుండా ఇతర వైరస్ సంక్రమిత వ్యాధుల నిర్ధారణకూ పీసీఆర్ టెస్ట్ కిట్లను దశాబ్దాలుగా వాడుతున్నారని వారు ఉదహరించారు. -
Abortion Rights: టెక్సాస్ కొత్త అబార్షన్ చట్టానికి మహిళల నిరసన సెగ..!!
అబార్షన్ (గర్భస్రావం) పై ఆంక్షలను విధించడాన్ని నిరసిస్తూ అమెరికా దేశవ్యాప్తంగా వేలాది మహిళలు రోడ్డెక్కారు. చట్టప్రకారం తమకు దక్కవలసిన హక్కులను కొనసాగించాలని టెక్సాస్ నగర వీధుల్లో ప్లకార్డులతో నినదిస్తున్నారు. దీంతో 50 రాష్ట్రల్లో మహిళల నిరసనల సెగలు మిన్నంటాయి. గత నెలలో టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో గవర్నర్ గ్రెగ్ అబాట్ సంతకం చేసిన ‘హార్ట్ బీట్’ చట్టాన్ని వందలాది మంది వ్యతిరేకిస్తున్నారు. అమల్లోకొచ్చిన ఈ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏమిటీ చట్టం? టెక్సస్ కొత్త చట్టం ప్రకారం.. గర్భస్థ పిండం గుండె కొట్టుకోవడం ప్రారంభమైతే అబార్షన్ చేయించుకోవడం నిషేదం. సాధారణంగా గర్భంలో 6 వారాలకు పిండం గుండె కొట్టుకోవడం మొదలౌతుంది (చాలా మంది మహిళలు తాము గర్భవతులని తెలియక ముందే 85 నుంచి 95 శాతం ముందుగానే అబార్షన్లు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు). అత్యచార బాధితులు, అక్రమ సంబంధం ద్వారా గర్భవతులైన వారికి కూడా ఈ చట్టం నుంచి ఎటువంటి మినహాయింపు లేదు. అంతేకాకుండా ఈ నిషేధాన్ని అతిక్రమించి అబార్షన్కు పాల్పడినట్లు రుజువుచేసిన వారికి అక్కడి ప్రభుత్వం పది వేల డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. ఇది అత్యంత నిర్భందమైనదని, ఈ చట్లాన్ని రద్దు చేయాలంటూ అక్కడి మహిళలు ఆందోళనలు చేపట్టారు. మిసిసిసీలో ఈ చట్టముంది ఐతే వాషింగ్టన్ నిరసనకారులు రెండు రోజులు ముందుగానే యూఎస్ సుప్రీంకోర్టులో ఈ చట్టం రూపొందకుండా పిటిషన్ వేశారు. 1973లో రో వర్సెస్ వేడ్ మిసిసిసీ కేసులో ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ ఈ చట్టం రూపొందకుండా అడ్గుకునేందుకు ప్రయత్నించారు. ఈ మిసిసిసీ కేసులో 15 వారాల తరువాత మహిళలు అబార్షన్ చేయించుకోకూడదనే నిబంధన ఉంది. సెప్టెంబర్ 1 నుంచి.. ఒక వేళ న్యాయస్థానం ముందుగానే ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలుచేయడానికి రాజ్యంగ బద్ధంగా రాష్ట్రాలకు సర్వహక్కులు ఇవ్వబడతాయి. కాగా ఈ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన పిటీషన్లన్నింటినీ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో సెప్టెంబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకొచ్చింది. ఐతే అనతి కాలంలోనే ఈ చట్టం వివాదాస్పదంగా మారింది. రెండోసారి.. కాగా 2017 మార్చిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మొదటి సారి ర్యాలీ చేపట్టారు. అదే స్థాయిలో ఇప్పుడు రెండో సారి నిరసనల గళం వినబడుతోందని ఉమెన్ మార్చ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ రాచెల్ ఓ లియరీ కార్మొనా అన్నారు. చదవండి: కాలిఫోర్నియా బీచ్లో ముడిచమురు లీక్.. పర్యావరణానికి తీవ్ర నష్టం! -
మరో ఆయుధం సిద్ధం: కరోనాను కట్టడి చేస్తున్న కొత్త మందు
వాషింగ్టన్: కరోనాపై చేస్తున్న యుద్ధానికి మాత్ర రూపంలో మరో ఆయుధం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మెర్క్ రూపొందించిన మందు మాల్నుపిరవిర్ కోవిడ్పై పోరులో ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలింది. మొత్తం 775 మంది వాలంటీర్లపై ఈ మందుతో ప్రయోగాలు జరిపారు. కోవిడ్ సోకి అయిదు రోజులు గడిచిన రోగులకు ఈ మందును ఇచ్చి చూశారు. ఇతరులతో పోలిస్తే ఈ మందు తీసుకున్నవారు త్వరగా కోలుకోవడం, ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేకపోవడం, మరణాలు తక్కువగా నమోదవడం వంటి ఫలితాలు వచ్చాయన్నారు. అత్యవసర అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. చదవండి: (కేన్సర్ కోరలు చాస్తోంది!) -
పాక్ 12 ఉగ్ర సంస్థలకు నిలయం
వాషింగ్టన్: అమెరికా విదేశీ ఉగ్ర సంస్థలుగా గుర్తించిన 12 గ్రూపులు పాకిస్తాన్లోనే ఊపిరి పోసుకున్నాయని అమెరికా కాంగ్రెషనల్ కమిటీ తెలిపింది. వీటిలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి అయిదు సంస్థలు కేవలం భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ‘టెర్రరిస్ట్ అండ్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్తాన్’అంశంపై స్వతంత్ర కంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్ఎస్) రూపొందించిన ఆ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థల్లో కొన్ని 1980ల నుంచే అక్కడ ఉన్నాయని తెలిపింది. వీటిల్లో కొన్ని ప్రపంచవ్యాప్తంగా, మరికొన్ని అఫ్గానిస్తాన్ లక్ష్యంగా, ఇంకొన్ని భారత్, కశ్మీర్ లక్ష్యంగా, కొన్ని షియా వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వివరించింది. 2008లో ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా 1980ల్లోనే పాకిస్తాన్లో అవతరించగా అమెరికా దీనిని విదేశీ ఉగ్రసంస్థ(ఎఫ్టీఓ)గా 2001లో గుర్తించింది. కశ్మీర్ ఉగ్రనేత మసూద్ అజార్ నేతృత్వంలో 2000లో జైషే మొహమ్మద్ ఏర్పాటైంది. భారత పార్లమెంట్పై దాడికి పాల్పడిన ఈ సంస్థను అమెరికా 2001లో ఎఫ్టీఓ గుర్తించింది. మరో సంస్థ హర్కతుల్ జిహాద్ ఇస్లామీ 1980లో ఏర్పాటై అఫ్గాన్లో సోవియెట్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడింది. 1989 నుంచి ఈ గ్రూపు భారత్, బంగ్లాదేశ్, అఫ్గాన్, పాక్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థను అమెరికా 2010లో ఎఫ్టీఓగా ప్రకటించింది. 1989లో పాక్లో ఆవిర్భవించిన హిజ్బుల్ముజాహిదీన్ను కూడా అమెరికా 2017లో ఎఫ్టీఓ ప్రకటించింది. కశ్మీర్లో కార్యకలాపాలు సాగించే అతిపెద్ద గ్రూపు ఇదే. మరో ఉగ్ర సంస్థ అల్ ఖాయిదా కూడా పాకిస్తాన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సీఆర్ఎస్ తెలిపింది. ఈ సంస్థకు పాక్లోని అనేక గ్రూపుల నుంచి మద్దతు అందుతోందని పేర్కొంది. ఇవికాకుండా, ఇస్లామిక్ స్టేట్–ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ, ఐఎస్–కె), అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్వర్క్, తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ), బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, జుందల్లా, సిపాహ్ సహాబా పాకిస్తాన్, లష్కర్–ఇ–జంగ్వి వంటివి కూడా పాకిస్తాన్లో ఉన్నాయని వివరించింది. చుట్టుపక్కల దేశాలే లక్ష్యంగా పనిచేసే అనేక ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ నిలయంగా మారిందంటూ 2019లో విదేశాంగ శాఖ రూపొందించిన నివేదికను సీఆర్ఎస్ ఉటంకించింది. కాగా, సీఎస్ఆర్ నివేదిక అమెరికా కాంగ్రెస్ అధికార నివేదిక కాదు. దీనిని స్వతంత్ర నిపుణులు తయారు చేసి, చట్టసభల ప్రతినిధులకు అందజేస్తుంటారు. -
ఎన్నారైలు ఎంతో ప్రత్యేకం: మోదీ
వాషింగ్టన్: అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వాషింగ్టన్ విమానాశ్రయంలో పలువురు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని తాను బస చేసిన హోటల్లో ఎన్నారైలతో ముచ్చటించారు. ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన వారు ప్రత్యేకంగా కనిపిస్తారని ప్రధాని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నారైలే మన దేశ బలమని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. వారితో సమావేశమైన ఫొటోలు షేర్ చేశారు. చదవండి: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు ప్రధాని మోదీ ఏ దేశం వెళ్లినా ప్రవాస భారతీయులతో కచ్చితంగా సమావేశమవుతారు. ఈసారి కోవిడ్–19 కారణంగా పెద్ద పెద్ద సమావేశాలేవీ పెట్టుకోలేదు. 2014లో ప్రధానమంత్రి అయ్యాక మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది ఏడోసారి. అమెరికాలోని ఎన్నారైల్లో ప్రధానికి మంచి ఆదరణ ఉంది. దీంతో ఆయనకు ప్రవాస భారతీయుల నుంచి ఘనంగా స్వాగతం లభించింది. -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టులో మోదీకి ఘనస్వాగతం
-
వాషింగ్టన్ ఎయిర్పోర్టులో మోదీకి ఘనస్వాగతం
-
వాషింగ్టన్ చేరుకున్న ప్రధాని మోదీ
-
అల అగ్రరాజ్యంలో...
-
మోదీకి నిద్రలేకుండా చేస్తాం.. ఎస్ఎఫ్జే గ్రూప్ హెచ్చరిక
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24న మోదీ అగ్రరాజ్యానికి వెళ్తున్న సందర్భంగా ఆ సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు వైట్ హౌస్ వెలుపల కూడా నిరసన కార్యక్రమాలు చేసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే తొలిసారి ప్రత్యక్ష క్వాడ్ సమావేశంతోపాటు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొనడానికి మోదీ అమెరికాకు వెళ్తున్నారు. కాగా భారత్లో రైతులపై హింసకు వ్యతిరేకంగా తాము ఈ నిరసనలు చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్జే సంస్థ పేర్కొంది. ఆ గ్రూపు జనరల్ కౌన్సిల్ గుర్పత్వంత్ సింగ్ పన్నన్ మాట్లాడుతూ .. అమెరికాలో మోదీకి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తామని తెలపడం గమనార్హం. వీటితో పాటు పన్నన్.. యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్ దేశాలు తాలిబాన్లను గుర్తిస్తే, ఎస్ఎఫ్జే కూడా ఖలిస్తాన్ మద్దతు కోసం తాలిబాన్లను సంప్రదిస్తామని పేర్కొన్నాడు. లండన్లో ఆగస్ట్ 15న ఖలిస్థాన్ రెఫరెండమ్ జరుగుతుందని గతేడాది ఈ గ్రూపు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత కొవిడ్ కారణంగా అక్టోబర్కు వాయిదా వేశారు. ఎస్ఎఫ్జే సమస్యపై చర్చించడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల ఢిల్లీలో పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఉన్నత వర్గాల సమాచారం. ముఖ్యంగా ఈ నిషేధిత సంస్థ పంజాబ్ యువతను విద్రోహ కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం ప్రయత్నిస్తోంది. ఎస్ఎఫ్జే గ్రూప్ తమ ప్రచారం కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసింది. అందులో పాకిస్థాన్, ఐఎస్ఐ ఏజెంట్ల నంబర్లు కూడా ఉన్నాయి. అయితే చట్టానికి వ్యతిరేకంగా వారి కార్యకలాపాలు ఉన్నాయని భారత ప్రభుత్వం ఈ గ్రూపును జులై 10, 2019న నిషేధించిన సంగతి తెలిసిందే. చదవండి: Jeff Bezos: జెఫ్బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! -
సెప్టెంబర్ 24న క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ
-
ప్రపంచ దేశాధినేతల్లో టాపర్గా ప్రధాని మోదీ
వాషింగ్టన్: అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ రేటింగ్ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ డేటా ప్రకారం.. 13 మంది గ్లోబల్ లీడర్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక రేటింగ్ కలిగి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ 64శాతంతో రెండో స్థానంలో నిలువగా.. ఇటలీ ప్రధాని మారియో డ్రాగ్నీ 60శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. చదవండి: Nasa Evtol Aircraft: ఎలక్ట్రికల్ ఎయిర్ టాక్సీలపై నాసా ప్రయోగాలు ఇక జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 52శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 48శాతం ఓట్లతో ఐదో స్థానంతో సరి పెట్టుకున్నారు. అఫ్గాన్లో బలగాల ఉపసంహరణ, తాలిబన్ల ఆక్రమణ వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు ఐదో స్థానానికి పడిపోయారు. చదవండి: Titanic Ship: ‘టైటానిక్’ చరిత్ర మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత.. -
న్యూయార్క్లో ఇడా తుపాను బీభత్సం
-
తాలిబన్లను ప్రశ్నించిన ఎలన్ మస్క్, వైరల్
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మొదటిసారిగా తాలిబన్లపై స్పందించారు. తాలిబన్లు మాస్క్లు లేకుండా ఓ చోట సమావేశమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ గురించి తాబలిన్లకు తెలియదా.. దాని గురించి వినలేదా అని ఎలన్ మస్క్ తాలిబన్లకు ట్విటర్ వేధికగా ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరలువుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "నిజమేనా? మీరు దానిపై తాలిబన్లను విమర్శించబోతున్నారా? యూఎస్ 20 సంవత్సరాల పాటు చేయలేనిది.. వారు 19 రోజుల్లో సాధించిన దాని గురించి కాదా.. అది అంత ప్రాధాన్యం లేనిదా? ఈ సమయంలో డెల్టాకు ప్రాధాన్యత లేదని నేను భావిస్తున్నాను" అని ఓ ట్విట్టర్ వినియోగదారు వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. "అవును, అది దృష్టి పెట్టవలసిన ప్రధాన అంశం" అంటూ చమత్కరించాడు. చదవండి: కాబూల్ ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు మృతి కాగా తాలిబన్లు అఫ్గాన్ను స్వాధీనం చేసుకోవడంతో.. ఆ దేశాధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. గత పదిహేను రోజులుగా తాలిబన్లకు, అఫ్గన్ దళాలకు జరిగిన పోరులో ఆ దేశ రక్షణ దళాలు చేతులెత్తేశాయి దీంతో తాలిబన్లు గతవారం రాజధాని కాబూల్లోకి ప్రవేశించారు. దీంతో అమెరికా, జర్మనీ తమ పౌరులను కాబూల్ విమానాశ్రయానికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ గందరగోళం మధ్య ఆస్ట్రేలియా రాత్రికి రాత్రే అనేక మంది తమ దేశ పౌరులను అఫ్గాన్ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు ప్రకటించింది. అయితే కనీసం 15,000 మంది అమెరికన్లు, 50,000-60,000 మంది అఫ్గాన్ మిత్రదేశాలకు చెందిన వారు ఆ దేశం నుంచి ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. pic.twitter.com/EOBHkQvFPR — Elon Musk (@elonmusk) August 20, 2021 చదవండి: లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం -
ప్రపంచాన్ని రక్షిస్తానంటూ.. కన్న బిడ్డలను చంపేశాడు..!
వాషింగ్టన్: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో బ్రెయిన్ వాషింగ్ అనేది కూడా ఓ ప్రమాదరమైన ఆయుధం వంటిదే. ఇటీవల ఆమెరికాకు చెందిన ఓ తండ్రి తన పిల్లలను చంపిన సంఘటనే దానికి రుజువు నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన మాథ్యూ టేలర్ కోల్మన్(40) అనే వ్యక్తి తన పిల్లలను క్యాంపింగ్కు తీసుకెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో.. ఎప్పుడు తీసుకువస్తాడో అతని భార్యకు చెప్పడానికి నిరాకరించాడు. అంతే కాకుండా ఆమె మెసేజ్లు, కాల్ చేసినపుడు కూడా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు యుఎస్కు తిరిగి వచ్చే క్రమంలో సరిహద్దు వద్ద ఆగస్టు 7న అతడిని ఎఫ్బిఐ అరెస్టు చేసింది. భవిష్యత్తులో ‘‘రాక్షసులు’’గా ఎదుగుతారని.. కాగా పోలీసు అధికారులు అతడి ఫోన్ని ఫైండ్ మై ఐఫోన్ యాప్ ద్వారా ట్రాక్ చేశారు. ఇది మెక్సికోలోని రోసారిటోగా అతని చివరిగా ఉన్నట్లు చూపించింది. దీంతో అప్రమతమైన ఎఫ్బిఐ అతడిని అరెస్టు చేసి ప్రశ్నించింది. ఇంటరాగేషన్లో కోల్మన్ తన పిల్లలను ఈటెల ఫిషింగ్ గన్తో చంపి, వారి మృతదేహాలను మెక్సికోలో పడవేసినట్లు ఒప్పుకున్నాడు. వారి మృతదేహాలను మెక్సికో అధికారులు కనుగొన్నారు. కాగా తన భార్య ‘‘సర్పెంట్ డీఎన్ఏ’’ తన పిల్లలు కలిగి ఉన్నారనే కారణంతో వారిని చంపేశానని, ఈ ‘‘సర్పెంట్ డీఎన్ఏ’’ ను కలిగి ఉన్నందరున వారు భవిష్యత్తులో ‘‘రాక్షసులు’’గా ఎదుగుతారని ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలియజేశాడు. భవిష్యత్తులో ప్రపంచం "రాక్షసులతో" నిండి ఉంటుందని క్యూఆనన్, ఇతర కుట్ర సిద్ధాంతాల ద్వారా "జ్ఞానోదయం" పొందానని కోల్మన్ తెలిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది ప్రపంచాన్ని రక్షించే ఏకైక చర్య అని నిందితుడు కోల్మన్ చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పెంటగాన్ భవనం బయట ఉన్న మెట్రో బస్ ప్లాట్ఫామ్పై దుండగులు కాల్పులకు తెగపడ్డారు. పెంటగాన్ లోపలకు వచ్చే మార్గం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పెంటగాన్ను అధికారులు మూసివేశారు. ప్రజలెవరూ పెంటగాన్ సమీపంలోకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ తొలిసారిగా దేశంలోని తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దేశంలో గన్స్ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా వైట్హౌస్ వర్గాలు వెల్లడించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. -
వైరల్: టీవీలో సీన్ చూసిన పిల్లి పరుగో.. పరుగు..!
Cat Funny Videos: టామ్ అండ్ జెర్రీ ఎపిసోడ్ సిరీస్ ఇష్టపడని వారుండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో సమయంలో దానికి కనెక్ట్ అయ్యే ఉంటారు. అయితే తాగాజా టామ్ అండ్ జెర్రీ ఎసిసోడ్లోని ఓ సీను చూసిన పిల్లి భయంతో పరుగు లంకించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ పెంపెడు పల్లి టామ్ అండ్ జెర్రీలోని సీన్ చూస్తుంది. దానిలో జెర్రీ నెత్తిపైన టామ్ ఓ మొట్టికాయ కొడుతుంది. దీంతో జెర్రీ చేయిని పెద్దగా చేసి టామ్ను ఓ గుద్దు గుద్దుతుంది. అంతే టామ్ ఎక్కడో పడుతుంది. అయితే టామ్ కొట్టినప్పుడు ఆసక్తిగా ముందుకు వచ్చి చూసిన పిల్లి.. టామ్ని జెర్రీ కొట్టగానే తర్రున భయంతో పారిపోతుంది. ఈ వీడియో మాజీ బాస్కెట్బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 1.2 మిలియన్లకు పైగా నెటిజనులు వీక్షించారు. వేల మంది లైక్ కొట్టి, కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ ఇది ఓ ఎడిట్ చేసిన వీడియో. అక్కడ నిజంగా పిల్లి ఉండటంతో భయపడి పారిపోయింది.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘‘ ఏమైనప్పటికీ ఈ వీడియోను చూసిన వెంటనే.. నా పెదవులపై చిరునవ్వును చిందించాయి.’’ అంటూ రాసుకొచ్చారు. In case you could use a smile today… pic.twitter.com/4rXFuSGPIK — Rex Chapman🏇🏼 (@RexChapman) July 25, 2021 -
ఘోర ప్రమాదం: ఇసుక తుఫాను బీభత్సం... 22 వాహనాలు ఢీ
వాషింగ్టన్(కానోష్): అమెరికాలోని ఉతాహ్ రాష్ట్రంలో ఇసుక తుఫాను కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కానోష్ నగరంలోని ఇంటర్ స్టేట్ హైవే 15 మీద ఈ ప్రమాదం జరిగింది. ఇసుకు తుఫాను కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో, దాదాపు 22 వాహనాలు ఢీకొట్టుకొని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. దీంతో 8 మంది మరణించారు. బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను ఉపయోగించారు. ఇసుక తుఫాను, రోడ్డు ప్రమాదం కారణంగా హైవే 15ను ఆదివారం మూసేశారు. -
వైరల్: అయ్యో.. బర్త్ డే అనుకుంటే.. డెత్ డేకు దాపురించిందే..!
జీవితంలో కొన్ని సరదా క్షణాలు ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. అది పుట్టిన రోజైతే చాలా మంది స్పెషల్గా ప్లాన్ చేస్తారు. ఆ మదుర క్షణాలు గుర్తు చేసుకున్నప్పడు మనసులో అదో రకమైన ఫీలింగ్ కలగాలి అనుకుంటారు. దాన్ని వర్ణించడం మాటల కందని విషయంగా.. అది మనిషిలో ఓ తెలియని భావాన్ని కలిగించేలా.. ఎంత బాగుండు అనిపిస్తుంది. అప్పుడప్పుడు గాల్లో ఎగరాలి అనిపించడం, రోలర్ కోస్టర్పై సరదాగా తిరగాలి అనిపించడం కూడా ఈ కోవలోకే వస్తాయి. వాషింగ్టన్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇద్దరు అమ్మాయిలు తమ పుట్టిరోజును సరదాగా గడపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా రోలర్ కోస్టర్పై ఎక్కారు. అయితే భయంతో కూడిన ఉత్సాహంతో రైడ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో రోలర్ కోస్టర్ రైడ్ మొదలైన కొద్ది సేపటికే ఓ సీగల్ పక్షి వచ్చి ఓ అమ్మాయిపై పడింది. దీంతో చచ్చేంత భయంతో చెవులు గల్లలు పోయేల మొత్తుకుంది. కానీ ఆ అరుపు గాల్లో అలాగే కలిసి పోయింది. చివరకు ధైర్యం చేసి పక్షిని తనే స్వయంగా తీసివేసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న మరో బాలిక కళ్లు బిగ్గరగా మూసుకోవడంతో ఇవేవీ గమనించలేదు. ఈ వీడియోను టైరోన్ పవర్ సోషల్ మీడియా యూజర్ నెట్టింట పంచుకోగా తెగ వైరలవుతోంది. దీని పై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు! మీ భయం నిజం అయ్యింది. దెబ్బకు చచ్చినంత పనైంది.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘‘ భయపడనేలా.. రోలర్ కోస్టర్ను ఎక్కనేలా.. ఇది మీకు మంచి అనుభవాన్నే ఇచ్చినట్టుంది?’’ అంటూ రాసుకొచ్చారు. -
భర్త మరణించిన ఆరు నెలలకు గర్భం..!
సృష్టిలో దేవతలకు కూడా దక్కని అపూర్వ బహుమతి మనుషులకు దక్కింది. అమృతం తాగిన వాళ్లు దేవతలు దేవుళ్లు.. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు అంటారు. ప్రతి మహిళ తన జీవితంలో అమ్మ అనిపించుకోవాలి అనుకుంటుంది. వాషింగ్టన్: ఓక్లహామాకు చెందిన సారా షెలెన్బెర్గర్(40) అనే మహిళ తన భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన సారా మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్ సహకారంతో ఆమె ఈ ప్రక్రియను కంప్లీట్ చేసింది. ‘‘చిన్నారి రాకతో నా మాతృహృదయం ఉప్పొంగింది. బిడ్డను గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవాన్ని ఇస్తోంది.’’ అని తెలిపింది. కాగా, దక్షిణ నజరేన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు సారా, స్కాట్ కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. సెప్టెంబర్ 2018 లో వివాహం చేసుకున్నారు. కనీసం ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలని కోరుకున్నారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. ఆమె భర్త స్కాట్(41) గతేడాది ఫిబ్రవరిలో గుండు పోటుతో కన్నుమూశారు. మరి ఎలా సాధ్యమైంది? పిల్లల కోసం ఈ జంట చాలాకాలం నిరీక్షించింది. అయితే వైద్యులు ఐవీఎఫ్ను ఎంచుకోవాలని వారికి సలహా ఇచ్చారు. యుఎస్లో ఐవిఎఫ్ పద్దతిలో బిడ్డను కనడం చాలా ఖర్చుతో కూడుకున్నది. దీంతో ఈ జంట బార్బడోస్ ఫెర్టిలిటీ సెంటర్కు వెళ్లారు. కానీ, బిడ్డ పుట్టకముందే ఆమె భర్త కన్నుమూశారు. అయితే పిండం ప్రక్రియను ప్రారంభించడానికి ముందు సారా, ఆమె భర్త అందుకు చేయాల్సిన పనులను పూర్తి చేశారు. జీవిత భాగస్వామి చనిపోతే పిండాలకు సంబంధించి తదుపరి ప్రక్రియ ఎలా అనుసరించాలో అందులో రాసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆమెకు బిడ్డను కనేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. పిండాన్ని ఐవిఎఫ్ పద్దతిలో అప్పటికే స్టోర్ చేసి ఉంచడం ద్వారా సారా షెలెన్బెర్గర్ బిడ్డకు జన్మనిచ్చింది. రెండో బిడ్డను కనేందుకు ఆసక్తి ‘‘తన భర్త ఇప్పుడు లేడు. కానీ ఈ సమయంలో బిడ్డకు జన్మనివ్వాలన్న నిర్ణయానికి తన భర్త మద్దతు ఉందని కచ్చితంగా చెప్పగలను. బిడ్డ పుట్టినప్పటి నుంచి నా జీవితానికి ఓ అర్థం దొరికినట్లు ఉంది. పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతాను. అంతేకాకుండా మరో పిండం కూడా భద్రపరచి ఉంది. అదే చివరిది… దానితో వచ్చే ఏడాది చివరి నాటికి రెండో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’’ అని సారా షెలెన్బెర్గర్ చెప్పారు. ఇక సారా తన భర్త, బిడ్డతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by 🌵Sarah Shellenberger🌵 (@sarahrshellenberger) -
వైరల్: పడిపోతున్న ప్రపంచ జనాభా.. ఎలాన్ మస్క్ కాపాడాలంటూ సలహా!
వాషింగ్టన్: ఎలాన్ మస్క్ పరిచయం అక్కరలేని పేరు. 58 మిలియన్ల నెటిజన్లు ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్లుగా ఉన్నారు. కాగా మంగళవారం మస్క్ అభిమాన క్లబ్ ట్విట్టర్ హ్యాండిల్ - ఈస్ట్ బే జనాభా పెరుగుదల తగ్గవచ్చంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచ జనాభా పడిపోతోంది. ఎలాన్ మస్క్ ఈ ఉపద్రవం నుంచి ప్రపంచాన్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎలాన్ మస్క్ ఏడుగురు పిల్లల తండ్రి అనే సంగతి తెలిసందే. అంగారక గ్రహంపై ప్రస్తుతం జనాభా సున్నా. అందువల్ల అక్కడ జనాభా అవసరం. స్పేస్ఎక్స్ అధినేతకు భూమికి పొరుగు ఉన్న గ్రహంలో మనుషులు ఆవాసం ఏర్పాటు చేసుకోవాలనే జీవితకాల కల ఉందని పేర్కొన్నారు. "మానవులు భూమిపై ఇతర జీవుల సంరక్షకులు. అలాగే మార్స్కు ప్రాణం పోద్దాం!" అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. ‘‘జనాభా పతనం అనేది ప్రజలు గ్రహించిన దానికంటే చాలా పెద్ద సమస్య, అది భూమికి మాత్రమే" అంటూ కామెంట్ చేశారు. ఇక ఓ నెటిజన్ స్పందిస్తూ.. తనకు ఆడ పిల్ల పుట్టాలని ఆశిస్తున్నానని అన్నాడు. మస్క్ కూడా అదే కోరుకుంటున్నట్లు తెలిపారు. తన తదుపరి సంతానంగా అమ్మాయి పుడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎలాన్ మస్క్కు ఎనిమిది మంది సంతానం. వారు బేబీ ఎక్స్(1) జేవియర్ (17), గ్రిఫిన్ (17), డామియన్ (15), సాక్సన్ (15), కై (15) నెవాడా అలెగ్జాండర్. కాగా మస్క్ అతని మొదటి భార్య జెన్నిఫర్ జస్టిన్ విల్సన్కు ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే మొదటి జన్మించిన నెవాడా అలెగ్జాండర్ 2002లో పుట్టిన 10 వ వారంలో మరణించాడు. 2050, 2100 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ 2020 పేర్కొంది. ప్రపంచ సంతానోత్పత్తి రేటు 2017 లో దాదాపు 2.4 కి సగానికి పడిపోయింది. 2100 నాటికి 1.7 కి తగ్గుతుందని పేర్కొంది. Population collapse could be upon us, but we appreciate that you good sir are still making tangible efforts to stave it off. @elonmusk 👶🏻💚🌎 pic.twitter.com/qlwz1JBUhj — Tesla Owners of the East Bay (@TeslaOwnersEBay) July 14, 2021 Me too! — Elon Musk (@elonmusk) July 14, 2021 -
వైరల్ వీడియో: ముఖం మొత్తం మేకప్.. చూస్తే గానీ తెలియదు!
వాషింగ్టన్: కాలం వేగంగా మారిపోతోంది. దాంతో పాటు మనుషుల అలవాట్లు మారుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వయసు దాచుకోవాలని చూస్తున్నారు. అందుకే బ్యూటీ పార్లర్లకు ఫుల్ గిరాకీ. మరోవైపు అందంగా కనిపించాలంటే చాలా సమయం, శ్రమ వెచ్చించాలనుకుంటారు చాలా మంది అమ్మాయిలు. అయితే తాజాగా ఓ అమ్మాయి వేసుకున్న మేకప్ నెటిజన్లకు పరీక్ష పెడుతోంది. చూస్తే గానీ ఏది ముక్కు, ఏవి పెదాలు, ఏవి కళ్లు తెలియడం లేదు. ఈ వీడియోలోని ముఖం మొత్తం కళ్లు, పెదాలు, చెవులు ఉన్నాయి. ఈ వీడియోను అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరలవుతోంది. మేకప్ వేసుకున్న అమ్మాయి పెదవులపై లిప్స్టిక్ను పెట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ, కళ్లు తెరిచే సరికి అసలు విషయం తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 4.70 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ ఈ వీడియో నన్ను కాసేపు అయోమయంలో పడేసింది. ఏంటి ఈ పరీక్ష?’’ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ ‘‘మేకప్ అదిరిపోయింది. అరే ఏవి ఎక్కడ వున్నాయో తెలియడం లేదు.. గోడపై పెయింటింగ్లా భలే ఉంది.’’ అంటూ చమత్కరించాడు. When the edibles hit… pic.twitter.com/BSeBnAAES9 — Rex Chapman🏇🏼 (@RexChapman) July 15, 2021 -
అమెరికాలో ఆదిలాబాద్ యువకుడి మృతి
సాక్షి, ఇచ్చోడ (బోథ్): అమెరికాలోని వాషింగ్టన్లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏలేటి ని హార్రెడ్డి (32) ఓ ప్రమాదంలో మృతిచెందాడు. ఆదివారం సాయం త్రం సీఆర్టీ సిటీలోని షమ్మిమిష్లేక్ జలపాతం లో నిహార్ కాలుజారి గల్లంతు కాగా మంగళవారం రాత్రి మృతదేహం లభించింది. బోరిగామకు చెందిన ఏలేటి లక్ష్మారెడ్డి, శోభ దంపతులకు నిఖిల్రెడ్డి, నిహార్రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నిఖిల్రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇదివరకే అక్కడ స్థిరపడ్డాడు. కాగా, మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన నిహార్రెడ్డి వాషింగ్టన్ రాష్ట్రంలోని సీఆర్టీ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం నిహార్ స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళ్లాడు. అక్కడి జలపాతంలో కాలుజారి గల్లంతయ్యాడు. -
64 రౌండ్లు కాల్పులు.. తూట్లు పడ్డ బాడీ!
గన్ కల్చర్కి కేరాఫ్ అడ్రస్ అమెరికా అనేది చాలా మంది చెప్పే మాట. అక్కడి ప్రభుత్వాలు తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడాలని ఎంత దృష్టి సారించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే ఇలాంటి హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. వాషింగ్టన్: చికాగో జైలు నుంచి విడుదలైన వారం రోజుల్లో యూస్కి చెందిన రాపర్ కెటీఎస్ డ్రే అకా లోండ్రే సిల్వెస్టర్ (31) అనే వ్యక్తిపై ఓ దుండగుల ముఠా 64 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘రెండు వేర్వేరు వాహనాల్లో వచ్చిన దుండగులు సిల్వెస్టర్పై బుల్లెట్ల వర్షం కురిపించారిని తెలిపారు. దీంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. అదే సమయంలో ఇద్దరు మహిళల (60), (35)కు కూడా బుల్లెట్లు తగలడంతో తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. వారిని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇక చికాగోలో వారం రోజుల్లో 40 మందిపై దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనల్లో 10 మంది మరణించారు. ఇక కేటీఎస్ అనగా.. ‘కిల్ టు సర్వైవ్’, ఈ పదాన్ని సిల్వెస్టర్ తన మెడలో వేసుకున్నాడు. అంతేకాకుండా అదే సింబల్తో టాటూ కూడా వేయించుకున్నాడు. పోలీసు నివేదికలు సిల్వెస్టర్ను గ్యాంగ్స్టర్ శిష్యుల లేక్సైడ్ వర్గంలో సభ్యుడిగా గుర్తించాయి. -
ఆశలు రేపుతున్న నాసల్ వ్యాక్సిన్
వాషింగ్టన్: కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందిస్తున్న నాసల్ వ్యాక్సిన్(ముక్కు ద్వారా అందించే టీకా) ఆశాజనక ఫలితాలనిస్తోంది. క్లీనికల్ ప్రయోగాల్లో భాగంగా ఎలకలకు, ఫెర్రెట్లకు(ముంగీస వంటి ఒక జంతువు) సింగిల్డోస్లో ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. టీకాతో ఎలకల్లో కరోనా నుంచి సంపూర్ణమైన రక్షణ కనిపించింది. ఫెర్రెట్లలో కరోనా వైరస్ వ్యాప్తిని టీకా సమర్ధవంతంగా అడ్డుకుంది. ఈ ప్రయోగ ఫలితాలు జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురితమయ్యాయి. ఫ్లూ వ్యాధికి ఇచ్చే నాసల్ టీకాను ఇచ్చినట్లే నాసల్ స్ప్రే ద్వారా ఈ టీకాను జంతువులకు ఇచ్చారు. ‘‘ప్రస్తుతం కరోనాకు వ్యతిరేకంగా వాడుతున్న టీకాలు విజయవంతమైనవే, కానీ ప్రపంచ జనాభాలో మెజార్టీ ప్రజలు ఇంకా టీకా పొందలేదు. ఈ దశలో సులభంగా వాడే వీలున్న సమర్ధవంతమైన టీకా అవసరం ఎంతో ఉంది.’’ అని జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పౌల్ మెక్క్రే అభిప్రాయపడ్డారు. నాసల్ టీకా మానవులపై సత్ఫ్రభావాలనిస్తే, కరోనాను విజయవంతంగా అడ్డుకోవచ్చన్నారు. ఈ టీకాను ఒక్క డోసు ఇస్తే చాలని, సాధారణ రిఫ్రిజిరేటర్లలో మూడు నెలల పాటు భద్రపరచవచ్చని పరిశోధకలు చెప్పారు. ముక్కు ద్వారా ఇవ్వడం వల్ల సూదిమందంటే భయమున్న వారు కూడా సులభంగా దీన్ని అంగీకరిస్తారన్నారు. ఫ్లూ వైరస్తో ప్రయోగాలు నాసల్ వ్యాక్సిన్ కోసం పరిశోధకులు పారాఇన్ఫ్లుయెంజా వైరస్5(పీఐవీ5)ను ఉపయోగించారు. దీన్ని జంతువులపై ప్రయోగించగా ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించినట్లు పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ బయో పేర్కొన్నారు. పీఐవీ 5 వైరస్ సైతం కరోనా వైరస్ లాగానే స్పైక్ ప్రోటీన్ ఉపయోగించుకొని మానవకణాల్లోకి చేరుతుంది. నాసల్ వ్యాక్సిన్ ముక్కుద్వారా ప్రవేశించగానే వాయునాళాల్లోని శ్లేష్మ పొరలో వైరస్ కణాలను లక్ష్యంగా చేసుకొంటాయి. ముక్కులోకి ఇచ్చిన టీకా స్థానికంగా ఇమ్యూన్ రెస్పాన్స్ను ప్రేరేపిస్తుంది, దీంతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడమే కాకుండా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందనివ్వదన్నారు. -
అమ్మలా చేసింది.. ఎందరినో మెప్పించింది!
వాషింగ్టన్: కరోనా వల్ల చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి, ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. దీంతో పిల్లలైతే.. తల్లిదండ్రుల పనులు చేస్తామంటూ.. ఆ స్థానాల్లో కూర్చుని అల్లరి చేసినవి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని వర్జీనియాకు చెందిన 8 ఏళ్ల అడెల్లె అనే చిన్నారి తల్లిని అనుకరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 1 నిమిషం 23 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఆ అమ్మాయి తన తల్లి డెస్క్ వద్ద కూర్చుని, కంప్యూటర్లో పనిచేస్తున్నప్పుడు తల్లి ఎలా ఉంటుంది. ఆ సమయంలో ఫోన్ కాల్స్కి స్పందించడం. పిల్లలు గదిలోకి ప్రవేశించినపుడు ఆమె తల్లి ఎలా ప్రవర్తిస్తుందని నటిస్తూ చూపించింది. కొలీన్ చులిస్ ఏప్రిల్లో తన కుమార్తె వీడియోను లింక్డ్ఇన్లో షేర్ చేయగా.. 5 మిలియన్లకు పైగా లైక్లు, 15 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. ఇక కొలీన్కు ముగ్గురు పిల్లలు లూకా (10), అడెల్లె (8), డెక్లాన్ (6) ఉన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ చాలా బాగా చేశారు. నీ నటనకు ఫిదా చిట్టి తల్లి.’’ అంటూ కామెంట్ చేశాడు. -
ప్రపంచంలోనే ఎత్తైన గుర్రం బిగ్ జాక్ మృతి..!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైయిన ‘గిన్నిస్’కు ఎక్కిన బెల్జియన్ జాతి గుర్రం బిగ్ జాక్ ఇకలేదు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కొలంబియా కౌంటీలోని పోయ్నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాలలో మృతి చెందింది. ప్రస్తుతం బిగ్ జాక్ వయసు 20 ఏళ్లు. కాగా, రెండు వారాల క్రితం ఆ గుర్రం మరణించిందని దాని యజమాని జెర్రీ గిల్బర్ట్ భార్య వలీషియా గిల్బర్ట్ వెల్లడించారు. ఇక బిగ్ జాక్ 6.10 అడుగులు ఎత్తు (2.1 మీటర్లు) ఉండేది. దాని బరువు 1,136 కిలోలు (2,500 పౌండ్లు). దీంతో బతికున్న వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైయిన గుర్రంగా బిగ్ జాక్ గిన్నిస్ బుక్ రికార్డ్స్ల్లోకి ఎక్కింది. కాగా, నబ్రాస్కాలో పుట్టిన బిగ్ జాక్ పుట్టినప్పుడు దాని బరువు 109 కిలోల (240 పౌండ్లు). సాధారణంగా బెల్జియన్ జాతి గుర్రాలు 100 నుంచి 140 పౌండ్ల (45 నుంచి 65 కిలోల) బరువుతో పుడుతాయని, కానీ తన గుర్రం అసాధారణంగా 100 పౌండ్ల అధిక బరువుతో పుట్టిందని జెర్రీ గిల్బర్ట్ తెలిపారు. అంతేకాకుండా బిగ్ జాక్ జ్ఞాపకంగా ఇంతకాలం అది నివసించిన స్టాల్ను ఖాళీగా ఉంచుతామని జెర్రీ గిల్బర్ట్ చెప్పారు. స్టాల్ బయట ఒక ఫలకం ఏర్పాటు చేసి దానిపై బిగ్ జాక్ పేరుతోపాటు బొమ్మ వేయిస్తామని అన్నారు. -
12 అంతస్తుల భవనం.. క్షణాల్లో నేలమట్టం
వాషింగ్టన్: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 121 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. అయితే ప్రస్తుతం ఉత్తర మియామీ సమీపంలోని 12 అంతస్తుల నివాస భవనం జూన్ 24 తెల్లవారుజామున కూలిపోగా.. 2021, జూలై 4న పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో అక్కడి సిబ్బంది కూల్చివేశారు. ఇందుకోసం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు స్థానిక ఇంజనీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఈలోగా ప్రమాదం జరిగింది. కాగా, వచ్చే వారంలో ఎల్సా తుపాను వచ్చే అవకాశం ఉండటంతో.. సర్ఫ్సైడ్లోని మిగిలిన 12-అంతస్తుల చాంప్లైన్ టవర్స్ సౌత్ను అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10:30 తర్వాత కూల్చివేశారు. తుపాను ముప్పు కాగా, చాంప్లైన్ సౌత్ టవర్ కూల్చివేతను చూడటానికి పెద్ద మొత్తంలో ప్రజలు అక్కడి చేరుకున్నారు. ఈ ఘటనపై కౌంటీ మేయర్ లెవిన్ కావా మాట్లాడుతూ.. ఉష్ణమండల తుఫాను ఎల్సా కరేబియన్ మీదుగా ఉత్తరం వైపు వస్తుండటంతో.. అధికారులు బిల్డింగ్ కూల్చివేత షెడ్యూల్ను వేగవంతం చేశామని తెలిపారు.. గతవారం ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల బంధువులను ఓదార్చారు. అంతే కాకుండా రెస్క్యూ కార్మికులను కలుసుకుని వారి పనితీరుని ప్రశంసించారు. WATCH: The portion left standing of the partially collapsed Champlain Towers South condo building in Surfside, Florida, was demolished.https://t.co/ssfxO7WmMN pic.twitter.com/hKOS0nAr4e — CBS 21 News (@CBS21NEWS) July 5, 2021 -
నాసా ఉపయోగించే ప్రోగ్రామ్స్ ఇకపై ప్రజలకు...
అంతరిక్ష రంగంలో అనేక విజయాలను సాధించిన సంస్థ నాసా. పలు అంతుచిక్కని విషయాలను విశదీకరించడంలో నాసా పాత్ర ఎంతగానో ఉంది. బ్లాక్ హోల్స్, ఇతర గెలాక్సీలు, ఇతర గ్రహాలను క్షుణంగా పరిశీలించడానికి అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లను ఉపయోగిస్తారు. గతంలో నాసా జరిపిన ఈవెంట్ హరిజోన్లో భాగంగా తొలిసారిగా బ్లాక్ హోల్ చిత్రాన్ని తీసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం వెనుక ఎంతగానో శ్రమ దాగి ఉంది. ఈవెంట్ హరిజోన్లో భాగంగా టెలిస్కోప్లు గ్రహించిన విషయాలను సూపర్ కంప్యూటర్తో గణించి చిత్ర రూపంలో తీశారు. కాగా ప్రస్తుతం నాసా కీలక నిర్ణయం తీసుకుంది. నాసా ఉపయోగించే పలు ఆవిష్కరణలకు ఉపయోగించే సాఫ్టువేర్లను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆవిష్కరణలతో నిజ ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టవచ్చునని నాసా పరిశోధకులు ఆశాభావం వ్యక్తంచేశారు. నాసా అధికారిక వెబ్ సైట్లో సుమారు 800 ప్రోగ్రాంలను అందుబాటులో ఉంచనున్నట్లు ఒక ప్రకటనలో నాసా తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నిల్సన్ పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్స్తో ఏరోనాటిక్స్, అటానమస్ సిస్టమ్స్, బిజినెస్ సిస్టమ్స్, ప్రాజెక్ట్ మేనెజ్మెంట్ , డేటా అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్, డిజైన్ అండ్ ఇంటిగ్రేషన్ టల్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించిన వాటికి పరిష్కారం చూపవచ్చునని నాసా భావిస్తోంది. నాసా అందించనున్న 832 ప్రోగ్రామ్స్ను ప్రజలకు జూలై 13 న అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేరోజు ఒక వెబినార్ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు సులువుగా ప్రోగ్రాంలను ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాలను వివరించనున్నారు. -
అమెరికా, కెనడాలలో ఎండ ప్రచండం
సలేమ్(అమెరికా): అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్తోపాటు కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. పలు నగరాల్లో ఆల్టైమ్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల ధాటికి రాబోయే రోజుల్లో వందలాది మరణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒరెగాన్ రాష్ట్రంలో ఎండల కారణంగా 60 మందికి జనం మృతిచెందినట్లు అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన ముల్ట్నోమాలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 45 మంది మరణించారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో శుక్రవారం నుంచి బుధవారం మధ్య కనీసం 486 మంది ఆకస్మికంగా ప్రాణాలు విడిచారని అధికార వర్గాలు తెలిపాయి. వాంకోవర్, బ్రిటీష్ కొలంబియాలో చాలా ఇళ్లల్లో ఏసీ సదుపాయం లేదని, వృద్ధులు ఎండ వేడిని తట్టుకోలేక చనిపోతున్నారని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో ప్రతికూల వాతావరణం కారణంగా 20కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. సియాటెల్, పోర్ట్ల్యాండ్తోపాటు పలు నగరాల్లో రికార్డు స్థాయిలో 115 డిగ్రీల ఫారెన్హీట్(46 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. వాషింగ్టన్, ఒరెగాన్, ఇడాహో, మోంటానా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండల ధాటికి 44 నుంచి 97 ఏళ్లలోపు వారే ఎక్కువగా చనిపోతున్నారని ఒరెగాన్ రాష్ట్రం ముల్ట్నోమా కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ తెలిపారు. -
వైరల్: టూర్ బోటుతో 400 డాల్ఫిన్ల పోటీ.. 95 మిలియన్ల వ్యూస్!
వాషింగ్టన్: నీటిలో ఉండేవన్నీ చేపలు కాదు. నీటిలో క్షీరదాలుకూడా ఉంటాయి. తిమింగలాలు, డాల్ఫిన్లు, పోర్పోయిస్ నీటిలో నివసిస్తాయి. కానీ అవి సెటాసియన్స్ (సెహ్-టే-షున్స్) అని పిలిచే నీటిలో ఉండే క్షీరదాలు. అయితే సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు తెలిగలవిగా పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. డాల్ఫిన్లు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లోతులలో డైవింగ్ చేయగలవు. టూర్ బోటుతో పోటీ తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్ ద్వారా ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్ తీరంలో తీశారు. దీన్ని డాల్ఫిన్ టూర్ క్రూయిజ్లను అందించే న్యూపోర్ట్ వేల్ అనే సంస్థ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. హర్ష్ గోయెంకా షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియోను 84.6 వేల మంది నెటిజన్లు వీక్షించగా.. దీని న్యూపోర్ట్ వేల్స్ షేర్ చేసిన వీడియోను 95 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. 46 సెకన్ల నిడివి గల వీడియోలో.. టూర్ బోటుతో సుమారు 400 డాల్ఫిన్లు డైవ్ చేస్తూ పోటీ పడ్డాయి. దీన్ని బోటులో ఉన్న వారు ఎగబడి మరీ చూశారు. తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధిస్తూ.. తెగ ఎంజాయ్ చేశారు. ఈ దృష్యం చాలా అందంగా ఉంది. నిజంగా ఇది చూడటం ఓ అదృష్టం అంటూ కామెంట్ చేశారు. ‘‘సముద్రంలో డాల్పిన్ల పోటీ.. మరి గెలుపెవరిది.’’ అంటూ రాసుకొచ్చారు. ఆక్సిజన్ను గ్రహించలేని జలచరాలు ఇక నీటిలోనే ఉన్నప్పటికీ నీటిలోని ఆక్సిజన్ను గ్రహించలేని జలచరాలు నీటి పాములు, తాబేళ్లు, మొసళ్లు, సీల్స్, డాల్ఫిన్లు, తిమింగలాలు. ఈ జీవులకు మొప్పలు ఉండవు. చర్మపు నిర్మాణం కూడా నీటిలోని ఆక్సిజన్ను తీసుకోగల స్థితిలో ఉండదు. గాలిలోని ఆక్సిజన్ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ (పల్మనరీ శ్వాసక్రియ) మాత్రమే వీటిలో ఉంటుంది. అందువల్లనే ఇలాంటివి సముద్రంలోనే ఉన్నా పదేపదే నీటి ఉపరితలం పైకి వచ్చి గాలిని వదిలి, కావలసినంత గాలిని పీల్చుకుని తిరిగి నీటిలోకి వెళ్లిపోతూ ఉంటాయి. This is a race I would have loved to participate in…pic.twitter.com/5aPtTj4Bsp — Harsh Goenka (@hvgoenka) June 25, 2021 చదవండి: టీకాకు భయపడి.. భార్య ఆధార్తో రోజంతా చెట్టుపైనే.. ఈ ఫోటోలో మరో చిరుత కూడా ఉందండోయ్.. గుర్తుపట్టారా? -
వైరల్: అయ్యో.. ఇంటర్వ్యూ తీసుకోకుండా.. అలా పారిపోతున్నారేంటి!
వాషింగ్టన్(చిలి): దక్షిణ అమెరికాలో మాంసాహార సముద్ర జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి సీ లయన్స్ వలస బాట పట్టాయి. దాదాపు 300 సీ లయన్స్ టోమ్కు సమీపంలో చిలీ పట్టణంలోని బయో బయో ప్రాంతంలో సేద తీరుతున్నాయి. అయితే ఈ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఓ విలేకరి స్థానికంగా ఉండే మత్స్యకారుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సీ లయన్కి కోపం వచ్చిందో.. ఏమో గానీ.. గేటు తీసుకుని వారి పై దాడి చేయడానికి ప్రయత్నించిది. బయటకు వచ్చి వాళ్లని దూరంగా తరిమింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీని పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘నా(సీ లయన్) గురించి కావాలంటే నన్ను అడుగకుండా.. వేరెవరినో అడుగుతావా.. ఎంత ధైర్యం.’’ అంటూ చమత్కరించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ నా ఇంటర్వ్యూ కూడా తీసుకోండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటి?’’ అంటూ రాసుకొచ్చారు. A "plague of sea lions" has hit a town in the Bio Bio region of Chile, possibly fleeing predators like orcashttps://t.co/MUS0jahzyU RT @BBCWorld pic.twitter.com/3kpDh4yjqg — 🌎Animal Watch🌍 (@Animal_Watch) June 25, 2021 చదవండి: పారదర్శకంగా రాష్ట్రాలకు టీకా పంపిణీ -
హెచ్–1బీ వీసాలను రెట్టింపు చేయండి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత నానాటికీ తీవ్రమవుతోందని యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ప్రొఫెషనల్ వర్క్ఫోర్స్ అవసరం భారీగా పెరుగుతోందని గుర్తుచేసింది. కొరతను అధిగమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జో బైడెన్ ప్రభుత్వానికి, కాంగ్రెస్కు(పార్లమెంట్) విజ్ఞప్తి చేసింది. విదేశీ నిపుణులను రప్పించడానికి వీలుగా హెచ్–1బీ వీసాల సంఖ్యను రెట్టింపు చేయాలని సూచించింది. గ్రీన్కార్డుల జారీ విషయంలో అమల్లో ఉన్న దేశాలవారీ కోటా వ్యవస్థను ఎత్తివేయాలని పేర్కొంది. తగినంత మంది వృత్తి నిపుణులు అందుబాటులో లేకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుజానే క్లార్క్ చెప్పారు. ఈ పరిణామం నూతన ఉద్యోగాల సృష్టికి అడ్డంకిగా మారుతుందని అన్నా రు. ఎంప్లాయ్మెంట్ ఆధారిత వీసాలను ప్రతిఏ టా కేవలం 1,40,000 మాత్రమే ఇస్తున్నారని, వీటిని 2,80,000 పెంచాలని విజ్ఞప్తి చేశారు. -
Guinness World Record: బతికే ఛాన్స్ జీరో.. బర్త్ డే వేడుకలు..
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత తక్కువ రోజులకే భూమిపైకి వచ్చిన ఓ బుడతడు తన మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. అమెరికాకు చెందిన బెత్, రిక్ దంపతులకు 2020, జూన్ 5న రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ జన్మించాడు. అయితే రిచర్డ్ బతికే ఛాన్స్ జీరో అని అప్పట్లో డాక్టర్లు తేల్చేశారు. కానీ తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణలో రిచర్డ్ తన ఫస్ట్ బర్త్ డే వేడుకలను జరుపుకున్నాడు. 21 వారాల 2 రోజులకు జన్నించి బతికిన శిశువుగా రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 340 గ్రాముల బరువు.. 26 సెంటీ మీటర్ల పొడవు నిజానికి బెత్ హచిన్సన్ డెలివరీ డేట్ 2020 అక్టోబర్ 13. అయితే కొన్ని సమస్యల కారణంగా ముందే బిడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి వచ్చింది. దీనిపై వైద్యులు బెత్ హచిన్సన్ భర్త రిక్ హచిన్సన్తో తీవ్రమైన చర్చలు జరిపిన తరువాత బిడ్డను బయటకు తీశారు. రిచర్డ్ స్కాట్ జన్మించినపుడు కేవలం 340 గ్రాముల బరువు.. 26 సెంటీ మీటర్ల పొడవు.. ఓ అరచేతిలో సరిపోయే సైజు మాత్రమే ఉన్నాడు. ఇక అతడి బరువు పూర్తికాల నవజాత శిశువు సగటు బరువులో పదోవంతు అన్నమాట. బతకడం జీరో ఛాన్స్ అన్న డాక్టర్ రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ పుట్టినప్పుడు అతడు బతకడం జీరో ఛాన్స్ అని మిన్నియాపాలిస్లోని చిల్డ్రన్స్ మిన్నెసోటా ఆసుపత్రిలోని డాక్టర్ నియోనాటాలజిస్ట్ స్టేసీ కెర్న్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఓ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటలకు రావడానికి 40 వారాల సమయం పడుతుందని తెలిపారు. ఇక గతంలో కెనడాలోని ఒట్టావాలో బ్రెండా, జేమ్స్ గిల్ దంపతులకు 1987, మే 20న జన్మించిన జేమ్స్ ఎల్గిన్ గిల్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉండేది. జేమ్స్ తల్లి గర్భంలో 21 వారాల 5 రోజులు మాత్రమే ఉన్నాడు. చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్.. ప్రాణాలు గాల్లో.. -
విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అలెక్స్ హార్విల్(28) అనే యువకుడు వరల్డ్ రికార్డ్ కోసం బైక్తో స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్లోని మోసెస్ లేక్ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్టంట్ మాన్ హార్విల్ 351 అడుగులు జంప్ చేసి గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టాలనుకున్నాడు. దీని కోసం మోటార్ సైకిల్ రాంప్ ఏర్పాటు చేసి, ఓ మట్టి దిబ్బపై జంప్ చేయడానికి ప్రయత్నించాడు . ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన హాలెక్స్ అక్కడే కుప్పకూలి చనిపోయాడు. స్టంట్ మాన్ అలెక్స్ హార్విల్ మరణం డర్ట్ బైక్ జంపింగ్ డేర్ డెవిల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, అలెక్స్ హార్విల్ స్టంట్ కోసం ప్రయత్నిస్తూ.. మరణించినట్లు గురువారం గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధృవీకరించింది. అలెక్స్ మృతి పట్ల అతడి కుటుంబానికి, స్నేహితులకు, ప్రియమైనవారికి గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. కాగా, కాలిఫోర్నియాలోని కరోనాలో జన్మించిన హార్విల్ ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డ్ సాధించాడు. జూలై 2013లో హార్విల్ మోటారుసైకిల్పై 297 అడుగుల పొడవైన ‘డర్ట్-టు-డర్ట్ రాంప్ జంప్’ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ABD’de 28 yaşında deneyimli motosiklet sürücüsü Alex Harvill, 106.98 metrelik akrobasi atlayışı ile dünya rekoru kırmaya çalışırken hayatını kaybetti. pic.twitter.com/r2ZuxB95Hm — Griffin (@griffincomtr) June 19, 2021 చదవండి: Sanjay Raut: మహావికాస్ ఆఘాడి కూటమి బలంగా ఉంది చదవండి: వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది? -
US: కొవాగ్జిన్ తీసుకున్నారా.. మా దేశం రావచ్చు!
వాషింగ్టన్: దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిదే. అయితే తాజాగా కోవాగ్జిన్ తీసుకున్న భారతీయ విద్యార్థులకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవాగ్జిన్ వేసుకున్న భారతీయ విద్యార్ధులపై ఆంక్షలను ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతీయ విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా డబ్ల్యూహెచ్ఓ అనుమతి లేకపోవడంతో పలు దేశాలు కొవాగ్జిన్పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్నారు. అయితే డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు లేని వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసున్నా కూడా కొన్ని దేశాలలో “అన్వాక్సినేటెడ్” గానే పరిగణిస్తున్నారు. చదవండి: Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ! చదవండి: వృద్ధులపై సొంత ఇంట్లోనే శారీరకంగా, మానసికంగా వేధింపులు -
వైరల్: బురదలో ఏనుగు సరదా!
వాషింగ్టన్: చిన్నపిల్లల ఆటలు ఎంతో ముద్దనిపిస్తాయి. అలాగే జంతువుల్లో కొన్ని చేసే చిలిపి చేష్టలు కూడా భలే సరదాగా ఉంటాయి. అవి చేసే చిలిపి పనులకు మనుషులు ఫిదా అవుతుంటారు. తాజాగా ఓ ఏనుగు బురదలో సరదా ఆటలు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏనుగు బురదను కాలితో తన్నుతూ.. దానిలో బొర్లుతూ.. తెగ అల్లరి చేస్తోంది. ఈ వీడియోను ఒరెగాన్ జూ ‘స్పా డే’ అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. 35,000 మంది నెటిజన్లు వీక్షించారు. ఏనుగు సంబరాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కాగా ఏనుగు అల్లరి చేష్టలు చూస్తుంటే.. చిన్నప్పుడు ఆడిన ఆటలు గుర్తుకు వస్తున్నాయంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. Spa day pic.twitter.com/Yx7T4Ti7h9 — Oregon Zoo (@OregonZoo) June 10, 2021 చదవండి: అనుమతి వస్తే.. దేశంలో చిన్నారులకు తొలి కరోనా టీకా ఇదే! -
‘అవును.. నేరాలు చేశా, ఘోరాలకు పాల్పడ్డా’
వాషింగ్టన్ : మెక్సికన్ డ్రగ్ బాస్(మాజీ) వాకిన్ ‘ఎల్ చాపో’ గుజ్మన్ భార్య ఎమ్మా కరోనెల్ ఎస్పూరో ఎట్టకేలకు నేరాల్ని అంగీకరించింది. జీవిత ఖైదు, పది మిలియన్ల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందన్న నేపథ్యంలో వాషింగ్టన్ కోర్టు ముందు గురువారం ఆమె తలవంచింది. ఈ తరుణంలో ఆమె శిక్షను పదేళ్ల కాలానికి తగ్గించే అవకాశం ఉండొచ్చనేది న్యాయ నిపుణుల మాట. కాగా, ఆమె భర్తైన 63 ఏళ్ల గుజ్మన్ మనీ లాండరింగ్, డ్రగ్ అక్రమ రవాణా ఆరోపణ, హత్యలు-అత్యాచారాల నేరాలపై కొలరాడో జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినాలోవా డ్రగ్ కార్టెల్.. అమెరికాలో అతిపెద్ద డ్రగ్ సప్లయర్. దాని ఆర్థిక వ్యవహారాలన్నీ కరోనెల్ చూసుకున్నట్లు, మనీలాండరింగ్కు పాల్పడినట్లు, అక్రమంగా మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటితోపాటు 2015లో మెక్సికో జైలు నుంచి పారిపోవడానికి గుజ్మన్ ప్రయత్నించినప్పుడు కరోనెల్ సహకరించిందనే ఆరోపణలన్నీ ఆమె చిరునవ్వుతో ఒప్పుకుంది. ‘ఆమె జైలుకు వెళ్లడానికి సంతోషంగా సిద్ధమైంది. ఎల్చాపో అరెస్ట్ అయ్యాక.. తనను అరెస్ట్ చేయరని ఆమె అనుకుంది. కానీ, ఆమె బ్యాడ్లక్’ అని ఆమె అటార్నీ లిట్చ్మన్ మీడియాకు వెల్లడించాడు. అయితే శిక్ష తగ్గింపు ఒప్పందం మేరకే ఆమె నేరాల్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అప్సరసలాంటి కరోనెల్ ఎమ్మా కరోనెల్ ఎస్పూరోకి యూఎస్-మెక్సికన్ పౌరసత్వం ఉంది. ఆమె చాలా అందగత్తె. అంతేకాదు మాజీ బ్యూటీ క్వీన్ కూడా. జర్నలిజం చదివిన కరోనెల్.. పదిహేడేళ్ల వయసులో ఓ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఎల్ చాపోని కలిసింది. ఆ తర్వాత అతనితో సహజీవనం చేస్తూ కవలల్ని కనింది. ఆ తర్వాతే వాళ్ల పెళ్లి జరిగింది. అయితే డ్రగ్స్ దందాలో భార్య కరోనెల్ అందాల్ని ప్రత్యర్థులకు ఎరగా వేసి హతమార్చేవాడని ఎల్ చాపోపై ఒక అపవాదు ఉంది. గుజ్మన్ న్యూయార్క్ జైల్లో ఉన్నప్పుడు మూడు నెలలపాటు రోజూ ఆమె అతన్ని కలిసింది. ఆ తర్వాత 31 ఏళ్ల వయసున్న కరొనెల్ను డలాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా ఆరోపణలపై అరెస్ట్ చేసి.. వర్జీనియా జైలుకు తరలించారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో.. సినాలోవా రాష్ట్రం(మెక్సికో)లో ఓ పేద కుటుంబంలో పుట్టిన ఎల్చాపో గుజ్మన్.. డ్రగ్స్ దందాతో ప్రపంచ కుబేరుల జాబితాకు చేరిన విషయం తెలిసిందే. డబ్బు, పరపతి మోజులో ఎమ్మా కరోనెల్ అతనితో చేతులు కలిపింది. ఈ ఇద్దరూ కలిపి చేసిన నేరాలు ఒళ్లు గగ్గురు పొడిచే విధంగా ఉంటాయని చెప్తుంటారు. అంతేకాదు ఎల్ చాపో, ఎమ్మా కరొనెల్ జంటను స్టయిల్ ఐకాన్స్గా భావిస్తారు. 'ఎల్ చాపో గుజ్మన్' బ్రాండ్తో బిజినెస్ చేస్తున్నారు కూడా. అలాగే ఎల్చాపో మరో కూతురు(వేరే భార్య కూతురు) అలెగ్జాండ్రినా గుజ్మన్ కూడా తండ్రి పేరు మీద బట్టల వ్యాపారం చేస్తోంది. అంతేకాదు ఈ కరోనా టైంలో తండ్రి పేరు మీదుగా ఆమె సహాయక కార్యక్రమాలు చేస్తుండడం విశేషం. చదవండి: ఇంటర్వ్యూతో దొరికాడా? -
శ్మశానాలను తవ్వేసి.. భారీ భవంతులు
శాన్మార్కోస్ (యూఎస్): ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు భూమి విస్తీర్ణం మాత్రం పరిమితం. అందుబాటులో ఉన్న భూమితోనే అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మృతదేహాలను ఖననం చేయడానికి సైతం స్థలం దొరకడం లేదు. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సింగపూర్లో పాత శ్మశానాలను తవ్వేసి, భారీ భవంతులు కట్టేస్తున్నారు. కొత్త శ్మశానాలను ఏర్పాటు చేయకపోవడం, స్థలం కొరత వల్ల అంత్యక్రియల విషయంలో ఆచారాలను సైతం మార్చుకోవాల్సి వస్తోంది. శ్మశానాల కోసం దొరకని స్థలం అగ్రరాజ్యం అమెరికాలోనూ శ్మశానాల కోసం స్థలం దొరకడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింగపూర్లో ప్రభుత్వం శ్మశానాల స్థానంలో కొలంబరియ్స్ నెలకొల్పుతోంది. ఒక ఎత్తయిన గోడ లాంటిది కట్టి, మధ్యలో గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మృతుల అస్థికలతో కూడిన కలశాలను ఈ గూళ్లలో ఉంచుతున్నారు. పూర్వీకుల జ్ఞాపకార్థం ఇక్కడే ప్రార్థనలు చేసుకోవాలి. సింగపూర్లో ఒక మృతదేహాన్ని 15 ఏళ్ల పాటే శ్మశానంలో ఖననం చేయాలి. తర్వాత వెలికి తీసి, దహనం చేయాలి. అస్థికలను కలశాల్లో భద్రపర్చుకోవచ్చు. అదే స్థలంలో మరో మృతదేహాన్ని ఖననం చేస్తారు. దహనాలకే ప్రాధాన్యం: హాంకాంగ్లో భూముల విలువ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ స్థలాలు ప్రపంచంలోనే అత్యధిక ధర పలుకుతుంటాయి. శ్మశానాల్లో పార్థివ దేహాల ఖననానికి అవసరమైన స్థలాలను ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. అందుకే హాంకాంగ్ ప్రభుత్వం ఖననం కంటే దహనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామాలకు తరలిపోదాం: వృద్ధుల జనాభా పెరిగి, జననాలు తక్కువగా ఉన్న జపాన్లో సైతం శ్మశానాల కొరత 1970ల నుంచే మొదలైంది. అందుకే అక్కడి అధికారులు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నారు. నగరంలో ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులు, బంధు మిత్రులు ఒక బస్సులో మృతదేహంతోపాటు యాత్రగా బయలుదేరుతారు. గ్రామానికి దూరంగా తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేస్తారు. జపాన్లో 1990ల్లో ‘గ్రేవ్–ఫ్రీ ప్రమోషన్ సొసైటీ’ అనే సంస్థ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మృతదేహాన్ని దహనం చేసి, బూడిదను భూమిపై వెదజల్లాలని ప్రచారం చేసింది. అయితే, ఈ విధానం ఆదరణ పొందలేదు. వృక్ష సమాధితో పర్యావరణ పరిరక్షణ ఉత్తర జపాన్లోని షౌన్జీ టెంపుల్ 1999 నుంచి నవీన ఆవిష్కరణకు తెరతీసింది. అదేమిటంటే.. వృక్ష సమాధి(ట్రీ బరియల్). దీన్ని జపాన్ భాషలో జుమొకుసో అంటారు. ఇందులో శవాన్ని దహనం చేస్తారు. అస్థికలు, బూడిదను ఒకచోట భూమిలో పాతిపెట్టి, దానిపై మొక్క నాటుతారు. అదే ఆ మనిషి సమాధి. అది వృక్షంగా మారుతుంది. కుటుంబ సభ్యులు ఏటా అక్కడే ప్రార్థనలు చేస్తారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన పద్ధతి అని షౌన్జీ టెంపుల్ చెబుతోంది. ప్రభుత్వం అనుమతించిన చోట ఒక వృక్ష సమాధి ఏర్పాటయ్యాక క్రమంగా ఇతరులూ అదే తరహా సమాధులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాతి కాలంలో అదొక పెద్ద వనంగా మారుతోంది. ఇలా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతోందని నిపుణులు అభినందిస్తున్నారు. షౌన్జీ టెంపుల్కు చెందిన స్థలంలో చిషోయిన్ పేరిట వృక్ష సమాధులతో ఒక చిట్టడవి ఏర్పడింది. ఈ శ్మశానంలో కేవలం పెద్దపెద్ద చెట్లే కనిపిస్తాయి. రాళ్లు, సమాధులు గుర్తులు కనిపించవు. మృతుల కుటుంబ సభ్యులు, మత గురువులు ఈ చెట్ల వద్ద ప్రార్థనలు చేస్తారు. సాధారణంగా బౌద్ధులు పర్యావరణ పరిరక్షణను ఆచారంగా పాటిస్తారు. సహజ ప్రకృతి ప్రపంచంలోనే దేవుడుంటాడని నమ్ముతారు. అందుకే ట్రీ బరియల్స్కు జపాన్లో ఆదరణ పెరుగుతోంది. చదవండి: కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం చదవండి: కోవిడ్ టీకా డోస్ల వృథాలో జార్ఖండ్ టాప్ -
ఈ పిల్ల తెలివి మామూలుగా లేదు..
వాషింగ్టన్: పిదపకాలం పిదప బుద్ధులు అన్న సామెతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు నేటి పిల్లలు. తమకు కావాల్సిన దాని కోసం ఏం చేయాలో వాళ్లకు బాగా తెలుసు. ట్రెండ్ను ఫాలో కాకుండా.. సెట్ చేయటంలో ఆరితేరారు. అమెరికాకు చెందిన లియోనా కూడా అంతే! తన బర్త్డే కేకును మొత్తంగా దక్కించుకోవటానికి అద్భుతమైన ప్లాన్ వేసింది. సోషల్ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది. వివరాలు.. అమెరికా, మిన్నిసోటాలోని సేయింట్ పాల్కు చెందిన లియోనా ఫేయ్ అనే చిన్నారి.. కొద్ది రోజుల క్రితం మూడవ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. తన బర్త్డేకు ఎలాంటి కేకు కావాలో కూడా తనే చెప్పింది. వాల్ట్ డిస్నీ సంస్థ రూపొందించిన ప్రముఖ చిత్రం ‘లయన్ కింగ్’ సినిమాలోని ముఫాసా మరణ సన్నివేశాన్ని కేక్గా తయారు చేయించింది. సినిమా చూసిన వారికి ఆ సన్నివేశం కళ్లకు కడుతుంది. చిన్నారి ఆ కేకును ఎందుకలా తయారు చేయించమని చెప్పిందో పాప మేనమామ వివరిస్తూ.. ‘‘ మా మేనకోడలు మూడవ పడిలోకి అడుగుపెట్టింది. లయన్ కింగ్ కేకు తయారు చేయించమని తను అడిగింది.. ఎందుకంటే! దాన్ని చూసిన వారు విషాదం కారణంగా తినటానికి ఇష్టపడరు. దీంతో మొత్తం లియోనా తినేయాలని ప్లాన్’’ అని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఈ కేకుపై ఆమె తల్లి ఎలిసన్ మాట్లాడుతూ.. ‘‘ లయన్ కింగ్ కేకు తయారు చేయించటానికి నిజంగా చాలా ఇబ్బంది పడ్డా. బేకరీ వాళ్లు నన్ను ఓ భయంకరమైన తల్లి అనుకుంటారేమోనని’’ అని చెప్పింది. కేకు తయారు చేసిన బేకరీ వాళ్లు కూడా పిల్ల వింత ప్రవర్తనకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : 2 మిలియన్ల వ్యూస్: ఇంటర్నెట్ని షేక్ చేస్తోన్న యువతి -
పార్టీ పేరుతో రచ్చ..150 మంది అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డ్రైయన్ లోపెజ్ తన 17వ పుట్టిన రోజుకు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. వెంటనే సోషల్ మీడియాలో “అడ్రియన్స్ కిక్బ్యాక్” పేరుతో ఆహ్వానాన్ని షేర్ చేశాడు. అయితే స్కూల్ మిత్రుల కోసం పంపిన ఆహ్వానాన్ని లోపెజ్ స్నేహితుడు యాహిర్ హెర్నాండెజ్ (16) తన స్నాప్చాట్, టిక్టాక్ ఖాతాలలో పోస్ట్ చేశాడు. దీన్ని కొందరు సోషల్ మీడియా సెలబ్రెటీలు షేర్ చేశారు. దీంతో 280 మిలియన్ల నెటిజన్లు “అడ్రియన్స్ కిక్బ్యాక్”ను వీక్షించారు. దీంతో దాదాపు 2500 మంది రావడంతో పార్టీని హంటింగ్టన్ బీచ్ నుంచి లాస్ ఏంజల్స్లో మరో చోటుకు మార్చారు. అయితే “అడ్రియన్స్ కిక్బ్యాక్”లో డబ్బులు పెట్టి టికెన్ కొన్న వారు ఈ విషయం తెలియక అక్కడకు వచ్చి పాటలు పెట్టుకుని..రోడ్డు పై వెళ్లే వాహనాలపై సీసాలు విసరడం మొదలుపెట్టారు. దాంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు లాస్ ఏంజిల్స్లో రాత్రిపూట అత్యవసర కర్ఫ్యూ విధించారు. ఆ పార్టీ ప్రారంభించక ముందే పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని మూసివేశారు. దీంతో గుంపులోని నుంచి పోలీసుల పై కాల్పులు జరిపారు. కాగా పోలీసులు పార్టీకి వచ్చిన దాదాపు 150 మందిని అరెస్ట్ చేశారు. (చదవండి: Kamal Nath: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు!) -
UN Chief: కరోనా మహమ్మారి మనతోనే ఉంది
ఐక్యరాజ్యసమితి: కోవిడ్–19 ముప్పు తొలగిపోలేదని, మహమ్మారి ఇంకా మనతోనే ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ హెచ్చరించారు. వైరస్ రూపాంతరం చెందుతూ (మ్యుటేటింగ్) తనను తాను అభివృద్ధి చేసుకుంటోందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన ఒక నివేదిక విడుదల చేశారు. ఇటీవల భారత్, దక్షిణ అమెరికాతోపాటు ఇతర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయని, వైరస్ బారినపడి ఊపిరి అందక విలవిల్లాడిన ఎంతోమందిని మన కళ్లముందే చూశామని అన్నారు. అందరికీ రక్షణ కల్పించేదాకా... ఏ ఒక్కరూ క్షేమంగా ఉండలేరని తాను మొదటి నుంచే చెబుతున్నానని గుర్తుచేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్ల పంపిణీ తదితర విషయాల్లో ప్రపంచ దేశాల మధ్య అసమానత నెలకొనడం బాధారమని చెప్పారు. పేద దేశాలను వైరస్ దయకు వదిలేశామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరత తీర్చండి భయంకరమైన వైరస్తో మనం యుద్ధం సాగిస్తున్నామని ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. ఈ దశలో మనకున్న ఆయుధాలను సక్రమంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. నిధుల కొరత, పరిమిత ఉత్పత్తి సామర్థ్యం వల్ల ఆశించిన స్థాయిలో కరోనా వ్యాక్సిన్లను తయారు చేసుకోలేకపోతున్నామని చెప్పారు. ఇప్పటిదాకా 17 కోట్ల డోసులను ‘కోవాక్స్’ కార్యక్రమం కింద పేదదేశాలకు అందించాల్సి ఉండగా... 6.5 కోట్ల డోసులు మాత్రమే పంపిణీ చేయగలిగామని అన్నారు. నిధుల కొరతను తీర్చే విషయంలో జీ20 దేశాలు చొరవ చూపాలని కోరారు. వందల కోట్లు పెట్టుబడి పెడితే లక్షల కోట్లు ఆదా అవుతాయని, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు నిలుస్తాయని వ్యాఖ్యానించారు. ప్రపంచమంతటా కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని గ్యుటెరస్ సూచించారు. కరోనా వైరస్లో కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా ఆపాలన్నా, మహమ్మారిని అంతం చేయాలన్నా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఉత్పత్తి చేసిన కరోనా టీకాల్లో 82శాతం టీకాలు ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, కేవలం 0.3 శాతం టీకాలు పేద దేశాలకు అందాయని వెల్లడించారు. చదవండి: USA: ఆర్ఎంపీలకు ఆన్లైన్ శిక్షణ) -
USA: ఆర్ఎంపీలకు ఆన్లైన్ శిక్షణ
న్యూయార్క్: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని కరోనా బాధితులకు తమ వంతు సేవలందించేందుకు అమెరికాలోని వైద్యులు, వృత్తి నిపుణులు ముందుకొస్తున్నారు. వారంతా బృందంగా ఏర్పడ్డారు. అమెరికాలో స్థిరపడిన భారత సంతతి వారితో పాటు భారత్లోని వృత్తి నిపుణులు కూడా ఈ 27 మంది బృందంలో ఉన్నారు. తమ సేవా కార్యక్రమానికి ప్రాజెక్ట్ మదద్ అని పేరు పెట్టుకున్నారు. కరోనా పరీక్షలు, చికిత్సా విధానాలపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషినర్లకు (ఆర్ఎంపీ), ఆరోగ్య కార్యకర్తలకు ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. ఆసుపత్రుల్లో పడకల లభ్యతపై సమాచారం అందజేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, వాస్తవాలకు ప్రజలకు తెలియజేస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఆర్ఎంపీలకు, హెల్త్కేర్ వర్కర్లకు సరైన శిక్షణ ఇవ్వడమే ప్రాజెక్టు మదద్ ఉద్దేశమని నిర్వాహకులు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లో ఇప్పటికే 150 మందికిపైగా ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చామని, వారితో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. కోవిడ్–19 లక్షణాలను గుర్తించడం, తక్కువ తీవ్రత కలిగిన వారికి ఇళ్లల్లోనే చికిత్స అందించడం, వ్యాక్సినేషన్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించాలన్న ఆలోచన ఉందన్నారు. గ్రామాల్లో పనిచేసే వైద్య సిబ్బందికి కరోనా చికిత్సపై సరైన పరిజ్ఞానం లేనట్లు గుర్తించామని, అందుకే ప్రాజెక్టు మదద్కు శ్రీకారం చుట్టామని ప్రాజెక్టు లీడ్, న్యూయార్క్కు చెందిన రాజా కార్తికేయ తెలిపారు. ఆర్ఎంపీలకు తగిన శిక్షణ ఇస్తే కరోనా చికిత్స చాలావరకు తేలికవుతుందని, ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని అమెరికాలోని మినియాపొలిస్కు చెందిన ప్రముఖ డయాగ్నోస్టిక్ రేడియాలజీ స్పెషలిస్టు డాక్టర్ సుబ్బారావు ఇనంపూడి తెలిపారు. తమ ప్రాజెక్టుతో చక్కటి ఫలితాలు వస్తున్నాయని, తాము శిక్షణ ఇచ్చిన ఆర్ఎంపీలు, వైద్య సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెరిగిందని యూఏఈలో చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థను నిర్వహించే బలరాంరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: తెగిపడిన కేబుల్ కారు) -
USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు
వాషింగ్టన్: టెక్సాస్కు చెందిన సునీల్ కే అకులా (32) అనే భారత సంతతి వ్యక్తికి 56 నెలల జైలు శిక్ష, మూడు సంవత్సరాల పర్యవేక్షణ విధించింది అక్కడి కోర్టు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ప్రకారం.. "సునీల్ టెక్సాస్లోని తన ఇంటి నుంచి మసాచుసెట్స్ లోని అగావామ్కు తన భార్యతో 2019, ఆగష్టు 6న ప్రయాణించాడు. ఆ సమయంలో అతడు ఆమెతో గొడవ పడ్డాడు. అతడు తన భార్యను అపార్ట్మెంట్ నుంచి తరిమివేసి, తన కారులో ఎక్కమని బలవంతం చేశాడు. ఆమెను తిరిగి టెక్సాస్కు తీసుకువెళుతున్నానని చెప్పాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేయమని బలవంతం చేశాడు. ఆమె ల్యాప్టాప్ను పగులగొట్టి హైవేపై విసిరాడు." అంటూ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. ప్రయత్నాలు విఫలం సునీల్ దౌర్జన్యంపై అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని అరెస్టు చేశారు. అయితే, కేసు నుంచి బయటపడేందుకు సునీల్ ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. అతను పోలీసుల అదుపులో ఉన్నప్పుడు, భారతదేశంలో ఉన్న తన కుటుంబ సభ్యులకు చాలాసార్లు ఫోన్ చేశాడు. భార్య తన కేసును ఉపసంహరించుకోవాలని ఆమె తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నించాడు. ఆమెను కూడా బతిమాలుకున్నాడు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతని భార్య తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు సునీల్కు జైలు శిక్ష ఖరారు చేసింది. (చదవండి: వాకింగ్ చేస్తున్నట్లు నటిస్తూ.. మహిళల ఫోటోలు తీసిన వృద్ధుడు) -
వైరల్: ఈ ఖడ్గమృగం చాలా స్పెషల్! బర్త్డేకి ఏం చేసిందో తెలుసా?
వాషింగ్టన్: మనుషులు పుట్టిన రోజు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే జంతుప్రేమికులు కొన్నిసార్లు తమ పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు చేస్తుంటారు. అయితే తాజాగా డెన్వర్ జూలో ఒక ఖడ్గమృగం తన పుట్టినరోజున తనే స్వయంగా కీబోర్డ్ను ప్లే చేసింది. జూలోని బంధు అనే ఖడ్గమృగానికి 12 సంవత్సరాలు నిండాయి. దాంతో బంధుకు పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 18 వేల మంది వీక్షించగా..వందల మంది లైక్ కొట్టారు. "మా జూలో ఉండే కొమ్ము గల మగ ఖడ్గమృగానికి ఈ రోజుతో 12 ఏళ్లు నిండాయి. ఇది తన పుట్టినరోజు. అయితే బంధు స్వయంగా తాను రాసిన ఒక ప్రత్యేక పాటతో మీ అందరికీ చికిత్స చేయాలనుకున్నాడు. తన పుట్టినరోజున మానసికంగా, శారీరకంగా ఉత్తేజపరిచేందుకు అనేక మార్గాలలో ట్యూన్ కంపోజ్ చేయడానికి అతని ప్రిహెన్సిల్ పెదవిని ఉపయోగించాడు." అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కాగా, దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "పుట్టినరోజు శుభాకాంక్షలు బంధు! అవును! ఆ పెద్ద పిల్లవాడిని ప్రేమించండి! " అంటూ కామెంట్ చేశాడు. "జంతువులకు నాకన్నా ఎక్కువ ప్రతిభ ఉంది" అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Denver Zoo (@denverzoo) (చదవండి: వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!) -
బైడెన్ దంపతుల ఆదాయమెంతో తెలుసా?
వాషింగ్టన్: 2020 ఏడాదికి సంబంధించిన ఆదాయ పన్ను చెల్లింపుల వివరాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు, దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దంపతులు సోమవారం వెల్లడించారు. 2020 ఏడాదిలో బైడెన్ దంపతుల స్థూల ఆదాయం దాదాపు రూ.4.43 కోట్లు( 6,07,336 డాలర్లు) అని అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ పేర్కొంది. 2019లో బైడెన్ దంపతుల స్థూల ఆదాయం దాదాపు 7.19 కోట్లు( 9,85,223 డాలర్లు) కావడం గమనార్హం. ఈ ఆదాయానికి 2020లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం దాదాపు రూ.1.14 కోట్ల(1,57,414 డాలర్లు)ను ఫెడరల్ ఆదాయ పన్ను( 25.9 శాతం)గా బైడెన్ దంపతులు చెల్లించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్, డౌగ్ ఎమ్హాఫ్ దంపతుల స్థూల ఆదాయం దాదాపు రూ.12.38 కోట్లు( 16,95,225 డాలర్లు) అని వైట్హౌస్ తెలిపింది. ఈ ఆదాయానికి 2020నాటి చట్టాల ప్రకారం దాదాపు రూ.4.54 కోట్లు(6,21,893 డాలర్లు) ఫెడరల్ ఆదాయ పన్ను(36.7 శాతం)గా హ్యారిస్ దంపతులు చెల్లించారు. -
భారత్లో పరిస్థితి తీవ్ర ఆందోళనగా ఉంది..సైన్యాన్ని దించండి
వాషింగ్టన్: భారత్లో కోవిడ్ తీవ్రత చాలా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సర్వశక్తులూ వినియోగించు కోవాలనీ, తక్షణమే తాత్కాలిక కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి ఆయన సూచించారు. అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించాలన్నారు. కేవలం వైద్య సామగ్రి అందించడమే కాదు, వైద్య సిబ్బందిని కూడా భారత్కు పంపించాలని ఇతర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భారత్లో కోవిడ్ కేసులు మూడు నెలల్లోనే రెట్టింపై 2 కోట్లు దాటి పోవడంతోపాటు, మహమ్మారి బారిన పడి 2.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, అధ్యక్షుడు జో బైడెన్కు చీఫ్ మెడికల్ అడ్వైజర్ అయిన డాక్టర్ ఫౌచీ(80) పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిలువరించేందుకు భారత్లో కొన్ని వారాలపాటైనా లాక్డౌన్ విధించడం మేలన్నారు. ‘కోవిడ్ వ్యాప్తి తీవ్రతతో భారత్ చాలా ఒత్తిడికి గురవుతోంది. అమెరికా మాదిరిగానే మిగతా దేశాలు కూడా భారత్కు సాయం అందించేందుకు ముందుకు రావాలి. భారత్లో కోవిడ్ చికిత్సలో ఉపయోగించే వైద్య సామగ్రి కొరత ఉన్న దృష్ట్యా ప్రపంచ దేశాలు అవసరమైన ఆ సామగ్రిని అందజేయాలి. దీంతోపాటు వైద్య సిబ్బందిని కూడా పంపించాలి’అని విజ్ఞప్తి చేశారు. ‘అదే సమయంలో, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం పౌరులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. భారత్లో అభివృద్ధి పరిచిన రెండు టీకాలతోపాటు, అమెరికా, రష్యాతోపాటు ఇందుకోసం ముందుకు వచ్చే మరే ఇతర దేశాలకు చెందిన సంస్థల నుంచయినా సరే కూడా టీకాలను సేకరించి సాధ్యమైనంత మందికి ఇవ్వడం తక్షణం ప్రారంభించాలి. టీకా ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ, కొన్ని వారాలపాటు వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు’అని ఫౌచీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు భారత్ తక్షణం తీసుకోవాల్సిన చర్యలతోపాటు దీర్ఘకాలంలో చేపట్టాల్సిన వాటిని డాక్టర్ ఫౌచీ సూచించారు. వేల సంఖ్యలో కోవిడ్ బారినపడిన వారికి చికిత్స అందించేందుకు భారత ప్రభుత్వం ఖాళీగా ఉన్న స్థలాల్లో తక్షణం తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించాలి. ఇందుకోసం సైన్యం సాయాన్ని తీసుకోవాలి. గత ఏడాది కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో చైనా ఇదే చేసింది’అని ఆయన చెప్పారు. -
కరోనా కల్లోలం: భారత్కు అమెరికా తీపికబురు..
వాషింగ్టన్: కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలు ఈ మహమ్మారి బారినపడ్డాయి. చాలా మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, ఈ విపత్తు సమయంలో అనేక దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటూ తమ స్నేహభావాన్ని చాటుతున్నాయి. అయితే, కరోనా మొదటి దశలో అమెరికాలో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత్, అమెరికాకు అండగా నిలిచింది. కోవిడ్ను ఎదుర్కోవడానికి కావాలసిన మందులను సరఫరా చేసింది. ఆపద సమయంలో మేమున్నామని అమెరికాకు స్నేహ హస్తాన్ని అందించింది. కాగా, కరోనా సెకండ్ వేవ్లో భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్లో వ్యాక్సిన్ తయారీ ముడిసరుకుల ఎగుమతిపై అమెరికా ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆపత్కాలంలో ఇండియాకు అండగా నిలవాలంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన జో బైడెన్ భారత్కు సాయం అందిస్తామని తెలిపారు. భారత్లో కరోనా కేసులు పెరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, అన్నివిధాలుగా చేయుతనివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. అదే విధంగా, భారత్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, పీపీఈ కిట్లు, ముడిసరుకు, అమిడ్ వ్యాక్సిన్లు , వెంటిలేటర్లు పంపనున్నట్లు పేర్కొన్నారు. కాగా, అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్కూడా భారత్కు తమ సహకారం ఉంటుందని ట్వీట్ చేసింది. ఇక ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పరస్పర సహకారం చేసుకోవడం, ఇరుదేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతానికి తోడ్పడుతుందంటూ, జో బైడెన్ నిర్ణయం పట్ల అమెరికా, భారత్ కు చెందిన పలువురు నాయకులు ట్వీటర్ వేదికగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా, ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారిపై కలిసి కట్టుగా పోరాడాలని పిలుపు నిచ్చారు. Just as India sent assistance to the United States as our hospitals were strained early in the pandemic, we are determined to help India in its time of need. https://t.co/SzWRj0eP3y — President Biden (@POTUS) April 25, 2021 -
విషాదం నింపిన అమెరికా పర్యటన..
పరకాల/ వరంగల్: కొడుకు కుటుంబంతో కొన్నాళ్లు గడుపుదామని అమెరికా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఆదివారం రాత్రి 9గంటల (అమెరికాలో తెల్లవారుజామున 4గంటలు)కు జరిగిన ఈ ప్రమాదంలో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పరకాలకు చెందిన ఈదునూరి రాజమౌళి (50) హన్మకొండ గోపాలపూర్లో నివాసముంటూ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్. మిచిగాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న చిన్న కుమారుడు పవన్కుమార్ వద్దకు రాజమౌళి తన భార్య తో కలసి మార్చి 5న వెళ్లాడు. న్యూయార్క్, వాషింగ్టన్లను కారులో కొడుకుతో వెళ్లి సందర్శించారు. ఈ క్రమంలో, ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమై నివాసానికి రెండు మైళ్ల దూరం లో ఉండగా వర్షానికి కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో కారులోని నలుగురూ సురక్షిత మని భావించి పవన్కుమార్, డ్రైవింగ్ చేస్తున్న ఆయన మిత్రుడు కారు దిగి పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో వెనుక కూర్చున్న తండ్రి రాజమౌళి, తల్లి నీలిమను కాపాడేందుకు పవన్ ప్రయత్నించాడు. తల్లి ప్రాణాలతో బయటపడగా, తండ్రి మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం సంగతి పరకాలలోని బంధువులకు తెలియడంతో కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: రక్తపు మడుగులో భార్యాభర్తలు.. బాల్కనీలో ఏడుస్తూ చిన్నారి -
మరోసారి ఫేస్బుక్ డేటా లీక్, 50 కోట్ల యూజర్లకు షాక్!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ యూజర్లూ జరభద్రం! మీ పర్సనల్ సమాచారాన్ని, ఫోన్ నంబర్ను ఆన్లైన్లో వేలానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫేస్బుక్ డేటా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హ్యాకర్ల కోసం ఫేస్బుక్ డేటాను ఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ప్రచారం జరగుతోంది. అయితే ఈ డేటా లీక్ విషయం చాలా పాతదే అయినా.. మరోసారి భారీ ఎత్తున డేటా లీక్ అయిందన్న సమాచారం మాత్రం ప్రస్తుతం ఫేస్బుక్ యూజర్లలో కలకలం రేపుతోంది. ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్సైట్ల నుంచి ఈ డేటా సేకరించి ఆన్లైన్లో పెట్టినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఇన్సైడర్ శనివారం తన కథనంలో పేర్కొంది. కాగా, 106 దేశాల్లో ఫేస్బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయని చెప్పుకొచ్చింది. ఫేస్బుక్ డేటా లీక్తో సుమారు 1.1 కోట్ల యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. అయితే, ఫేస్బుక్ డేటా లీక్ సమస్య ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఉన్నదే. ఫేస్బుక్ 2018 లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఆప్షన్ను తీసివేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం తర్వాత ఫేస్బుక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కేంబ్రిడ్జ్ అనలిటికా 8.7 కోట్ల ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిందన్న వార్తలు అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఫేస్బుక్ లీక్ డేటా చాలా పాతదని, 2019లోనే తమకు సమాచారం అందిందని, 2019 ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని ఫేస్బుక్ క్లారిటీ ఇచ్చింది. చదవండి: వెనుజులా అధ్యక్షుడి ఫేస్బుక్ ఖాతా నిలిపివేత..! -
రికవరీ బాటన భారత్ ఎకానమీ: ఐఎంఎఫ్
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటన నడుస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతినిధి గ్యారీ రైస్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్తో కలిసి వచ్చే నెల్లో ‘స్ప్రింగ్’ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అలాగే ఏప్రిల్ 6వ తేదీన ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ను కూడా విడుదల చేయనుంది. ‘‘భారత్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ అవుతోంది. 2020 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) క్షీణతలోంచి బయటపడింది. మూలధనం, పెట్టుబడి వ్యయాలు పెరుగుతున్నాయి అని విలేకరుల సమావేశంలో గ్యారీ పేర్కొన్నారు. దీనికితోడు 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, రవాణాసహా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పలు ఇండికేటర్స్ సానుకూలంగా ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. అయితే కరోనా కొత్త స్ట్రెయిన్స్, స్థానిక లాక్డౌన్లు రికవరీబాటలో కొంత ఇబ్బందికరమైన పరిణామాలని కూడా ఆయన అన్నారు. చదవండి: దూసుకెళ్తున్న ఇండియా వృద్ధిరేటు! -
ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించేది అందుకేనా
వాషింగ్టన్: అమెరికా రక్షణ, దౌత్యాధికారులు ఉత్తర కొరియాను సందర్శించిన కొద్ది రోజులకే ఉ.కొ అనేక క్షిపణులను పరీక్షించిందని మంగళవారం వైట్ హౌస్ తెలిపింది. ఆదివారం రెండు క్షిపణులను పరీక్షించడం ద్వారా వాషింగ్టన్ ,సియోల్ను రెచ్చగొట్టడానికి ప్యాంగ్యాంగ్ మళ్లీ తన పాత పద్ధతులను అనుసరిస్తోందని తెలుస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే ప్యాంగ్యాంగ్ వైపునుంచి బిడెన్ ప్రభుత్వానికి ఎదురుకాబోయే మొదటి సవాలు ఇదేనని తెలుస్తోంది. అయితే, దీనిపై అమెరికా పరిపాలనా అధికారులు మాట్లాడుతూ.. క్షిపణుల పరీక్ష "సాధారణ" సైనిక పరీక్షే అని అన్నారు. అలాగే అణ్వాయుధీకరణపై ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపుతున్న వాషింగ్టన్కు ఈ చర్యలు అడ్డు కావని తెలిపారు. అవి తక్కువ రెంజ్ కలిగిన, నాన్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు అని, అలాగే ఈ క్షిపణిలు ఏవీ కూడా యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు నిరోధించిన పరిధిలోకి రావని అమెరికా పరిపాలన సీనియర్ అధికారి విలేకరులతో అన్నారు. గత అమెరికా ప్రభుత్వాలను రెచ్చగొట్టడానికి అప్పట్లో ప్యాంగ్యాంగ్ ప్రయోగించిన అణ్వాయుధ పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు వంటివి ఏవీ ఇందులో లేవన్నారు. ప్రస్తుతం పరీక్షించిన ఈ క్షిపణులు ఆ కోవలోకి రావని తెలిపారు. ఉత్తర కొరియా తమ వివిధ వ్యవస్థలను పరీక్షించడంలో భాగంగా ఇలాంటివి చేయటం అక్కడ సర్వ సాధారణమని, తాము ప్రతి రకమైన పరీక్షకు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ( చదవండి : ఈ నాలుగేళ్లు ప్రశాంతంగా నిద్ర పోవాలంటే.. ) -
ట్రంప్ సోషల్ మీడియా రీ ఎంట్రీ.. ఇదెలా సాధ్యం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదేంటి, ఫేస్బుక్, ట్విటర్ సహా ఇతర సోషల్ మీడియాలో ఆయన ఖాతాలను నిషేధించారు కదా ! మరి ఎలా వస్తారని అనుకుంటున్నారా. తానే స్వయంగా ఓ కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించి దాని ద్వారా నెటిజన్ల ముందుకు రానున్నట్లు సమాచారం. అందుకే అంటారు ట్రంప్ రూటే సెపరేటని. రెండు, మూడు నెలల్లో తన నూతన వేదికను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆయన సీనియర్ సలహాదారుల్లో ఒకరు ఓ ఆంగ్ల మీడియాతో వెల్లడించారు. ‘ట్రంప్ మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టనున్నారు. ఈ సారి ఆయన తన సొంత సామాజిక మాధ్యమ వేదిక పైన ప్రజలకు అందుబాటులోకి రానున్నారు’ అని జేసన్ మిల్లర్ మీడియాకు తెలిపారు. ఇతను 2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్కు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. కాకపోతే, ఈ అంశానికి సంబంధించిన ఎటువంటి అదనపు వివరాలను మిల్లర్ వెల్లడించలేదు. మరోవైపు ట్రంప్ అధికార వర్గాల నుంచి కూడా దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అమెరికాలో జనవరి 6న క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తదనంతర పరిణామాల కారణంగా ట్విటర్, ఫేస్బుక్ సహా ఇతర వేదికలు ట్రంప్ ఖాతాను నిషేదించాయి. ( చదవండి: ట్రంప్ బుద్ద.. ఎంతైనా చైనోడి తెలివే వేరబ్బా! ) -
మార్చిలో మరో యుగాంతం!
వాషింగ్టన్: భూమి అంతం.. పెను ప్రళయం.. యుగాంతం.. అంటూ ప్రతిఏటా ఎవరో ఒకరు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చెబుతూనే ఉంటారు. 2020లో కరోనా వచ్చినప్పుడైతే ఈ ఊహాగానాలకు అంతులేకుండా పోయింది. అయితే అనూహ్యంగా కరోనాను మానవాళి జయించడంతో ఈ అంచనాలన్నీ తప్పిపోయాయి. దీంతో తాజాగా వచ్చే నెల్లో భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలో అబద్ధపు ప్రచారం మొదలైంది. మార్చిలో ఇప్పటివరకు చూడనంత పెద్ద ఆస్టరాయిడ్(గ్రహశకలం) భూమికి సమీపంలోకి రానున్న తరుణంలో కొన్ని ఫేక్ సైట్లు ఈ శకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ ప్రాపగాండా చేస్తున్నాయి. అయితే సైంటిస్టులు అలాంటిదేమీ లేదని భరోసా ఇస్తున్నారు. మార్చి 21న భారీ ఆస్టరాయిడ్(పేరు:2001 ఎఫ్ఓ32) భూమికి సమీపంలోకి రానున్నమాట వాస్తవమేనని, కానీ భూమిని ఢీకొట్టడమనేది అబద్ధమని చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్ పలు ఎన్ఈఓ(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్)ల్లో ఒకటని, ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని వివరించారు. ఇలాంటివి అనేకం.. భూ కక్ష్యకు 3 కోట్ల మైళ్ల లోపు దగ్గరకు వచ్చే శకలాలను ఎన్ఈఓలు అంటారు. ఇప్పటివరకు దాదాపు 25వేల ఎన్ఈఓలను గుర్తించారు. వీటిలో అధిక శాతం ఆస్టరాయిడ్స్ కాగా కొన్ని మాత్రం తోకచుక్కలు. ఈ 25వేల ఎన్ఈఓల్లో 2100 ఎన్ఈఓలను పొటన్షియల్లీ హజార్డియస్(ప్రమాదం కలిగించే శక్తి కలవి)గా వర్గీకరించారు. భూకక్ష్యకు 46 లక్షల మైళ్ల దూరంలోకి వచ్చేవి, వ్యాసార్ధంలో 460 అడుగుల కన్నా పెద్దవైన శకలాలను ఈ కేటగిరీలో చేరుస్తారు. అంతమాత్రాన ఇవన్నీ భూమిని తాకుతాయని కాదని, కానీ వీటిని పరిశీలిస్తూ ఉంటామని సెంటర్ ఫర్ ఎన్ఈఓ డైరెక్టర్ పాల్ చోడస్ చెప్పారు. ప్రస్తుతం వస్తున్న ఆస్టరాయిడ్ వ్యాసార్ధం దాదాపు 2,526–5,577 అడుగులుంటుందని చెప్పారు. మార్చి 21 ఉదయం 11గంటలకు ఈ శకలం భూమికి 13 లక్షల మైళ్ల దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో ఆస్టరాయిడ్ గంటకు 76,980 మైళ్ల వేగంతో పయనిస్తుంటుంది. భూమికి దగ్గరగా వచ్చిన అనంతరం తిరిగి ఈ గ్రహశకలం తన దోవలో తను పోతుందని, భూమిని ఢీకొట్టే అవకాశం లేదని పాల్ తెలిపారు. కాబట్టి.. యుగాంతం జాతకాలు చెప్పేవాళ్లు ఇంకో కొత్త సంగతి చూసుకోవాల్సిందే! -
ఫేస్బుక్ వాడితే ఫోన్ నంబర్ అమ్ముకున్నట్లే!
వాషింగ్టన్: వివిధ దేశాల్లో నానా రకాల వివాదాలతో ఇబ్బందులు పడుతున్న ఆన్లైన్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాద సుడిగుండంలో ఇరుక్కుంటోంది. ఫేస్బుక్ వాడకందారుల ఫోన్ నంబర్లు టెలిగ్రామ్లో అమ్మకానికి పెడుతున్నారని ఒక సెక్యూరిటీ అధ్యయనం వెల్లడించింది. ఫేస్బుక్ ఐడీలకు చెందిన ఫోన్ నంబర్లను టెలిగ్రామ్ ఆటోమేటెడ్ బోట్ను వినియోగించి ఒక సైబర్ క్రిమినల్ సంస్థ సేకరించి సదరు డేటాను విక్రయిస్తోందని అధ్యయనం తెలిపింది. ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మంది వినియోగదారుల నంబర్లు ఇలా బయటపడి ఉంటాయని పేర్కొంది. ఈ డేటాబేస్లో 2019 వరకు వివరాలున్నాయని తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ రిసెర్చర్ అలాన్ గాల్ ఒక ట్వీట్లో వివరాలు వెల్లడించారు. చదవండి: (బైడెన్ వలస చట్టంపై హోరాహోరీ) 2020లో ఈ సెక్యూరిటీ క్రైమ్ గురించి తొలిసారి తెలిసిందని, వివరంగా పరిశీలిస్తే వివిధ దేశాలకు చెందిన 53.3 కోట్ల మంది యూజర్ల సమాచారం తస్కరణకు గురైనట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఆయన షేర్ చేశారు. ఈ బోట్ 2021 జనవరి వరకు యాక్టివ్గానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇదే అంశాన్ని మదర్బోర్డ్ నివేదిక ధృవీకరిస్తూ, టెలిగ్రామ్ బోట్ ద్వారా ఈ వివరాలు తస్కరించారని తెలిపింది. ఒక్క యూజర్ వివరం కావాలంటే 20 డాలర్లు, పెద్ద ఎత్తున కావాలంటే 10వేల మంది వివరాలకు 5వేల డాలర్లు చెల్లించాలని తెలిపింది. ఇప్పటికైనా ఫేస్బుక్ తన యూజర్లను ఈ విషయమై హెచ్చరించాలని సూచించింది. అప్పుడే యూజర్లు హ్యాకింగ్ తదితర ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని తెలిపింది. చదవండి: (వైట్హౌస్లో పెంపుడు జంతువుల సందడి!!) -
బైడెన్ రాకతో అక్కడ పెంపుడు జంతువుల సందడి!
వాషింగ్టన్: ఒబామా అనంతరం పెంపుడు జంతువులు లేకుండా పోయిన వైట్హౌస్లోకి మరలా బైడెన్ రాకతో పెంపుడు జంతువుల సందడి మొదలైంది. బైడెన్కు చెందిన రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలు ఛాంప్, మేజర్ వైట్హౌస్లోకి కాలుమోపాయి. వైట్హౌస్లో కుదురుకున్నతర్వాత కుక్కలను తెచ్చుకోవాలని బైడెన్ కుటుంబం భావించిందని జిల్బైడెన్ ప్రతినిధి మైఖెల్ లారోసా చెప్పారు. వీటిలో మేజర్ అనే కుక్కతో ఆడుకుంటూ గతేడాది బైడెన్ కిందపడిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఈ రెండూ వైట్హౌస్లో తమకు కేటాయించిన బెడ్స్ను ఎంజాయ్ చేస్తున్నాయని మైఖెల్ చెప్పారు. మేజర్ డాగ్ను బైడెన్ 2018లో డెలావర్ హ్యూమనె అసోసియేషన్ నుంచి దత్తత తీసుకున్నారు. బజారు కుక్క నుంచి దేశ ఫస్ట్ డాగ్గా మేజర్ జర్నీని పురస్కరించుకొని ఈ అసోసియేషన్ గతవారం ఫండ్ రైజింగ్ చేసి 2 లక్షల డాలర్లు సమీకరించింది. త్వరలో బైడెన్ కుటుంబం ఒక పిల్లిని కూడా తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. గతంలో ధియోడర్ రూజ్వెల్ట్, హార్డింగ్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ట్రూమన్, జార్జ్బుష్, క్లింటన్, ఒబామాలు తమ తమ పెంపుడు జంతువులను వైట్హౌస్లో తమతో ఉంచుకున్నారు. -
అమెరికా అధ్యక్షుల పెంపుడు జంతువులు ఇవే..
వైట్హౌస్ అంటే అక్కడి ప్రెసిడెంటు గారిలాగే ఆయన పెంపుడు జంతువులు (పెట్స్) కూడా ఫేమసే.. ఎప్పుడో 1789లో అమెరికా మొదటి అధ్యక్షుడిగా పీఠాన్ని అధిరోహించిన జార్జ్ వాషింగ్టన్ నుంచి మొన్నమొన్నటి బరాక్ ఒబామా దాకా పెంపుడు జంతువులంటే పడి చచ్చేవారే.. ఒక్క మన ట్రంప్ మాత్రమే మినహాయింపు.. ఆయనకు పెంపుడు జంతువులు లేనేలేవు.. అమెరికా అధ్యక్షుల్లో అలా లేకపోవడం ఓ రికార్డు కూడా.. కనీసం కుక్కనైనా పెంచుకోమని సలహా ఇస్తే.. నాకంత టైం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. బైడెన్ రాకతో వైట్హౌస్లో మళ్లీ ఇప్పుడు పెంపుడు జంతువులు ప్రవేశించనున్నాయి. ఆయనకు రెండు కుక్కలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు పెంచుకునే వాటిల్లో కుక్కలు, పిల్లులు, గుర్రాలు, మేకలు, గొర్రెలు, రకరకాల పక్షులు.. అంతేనా.. ఎలుగుబంట్లు, మొసలి కూడా ఉన్నాయి. జార్జ్ వాషింగ్టన్ దగ్గర బోలెడన్ని గుర్రాలు ఉండేవి. వాటితోపాటు మొసలి కూడా ఉండేది. అది ఆయన బాత్రూంలోనే మకాం వేసేదట. విదేశాల నుంచి వచ్చిన అతిథులు సడెన్గా దాన్ని చూసి.. హడలి చచ్చిన రోజులున్నాయి. ఇక ఉడ్రో విల్సన్ గారి గొర్రెలు వైట్హౌస్ లాన్లోనే గడ్డిమేసిన ఉదంతాలెన్నో. ఇలా చెప్పుకుంటే బోలెడు కథలు. కొందరు అధ్యక్షులైతే.. . కొన్ని రకాల పక్షులు, గొర్రెల మందలను పెంచుకునేవారని.. అవి ఎన్ని వందలు ఉండేవో వాటి లెక్కే లేదని ప్రెసిడెన్షియల్ పెట్ మ్యూజియం గణాంకాలు చెబుతున్నాయి. వాటిని లెక్కేయకుండా.. ప్రధానమైన పెంపుడు జంతువుల లెక్కను మాత్రమే ఈ పెట్ మ్యూజియం నిర్వహిస్తోంది. దీని ప్రకారం అందరి కన్నా ఎక్కువగా.. థియేడర్ రూజ్వెల్ట్ వద్ద 48 పెంపుడు జంతువులు ఉండేవి. ఇందులో 6 కుక్కలు, 2 పిల్లులు, 40 ఇతర జంతువులు ఉన్నాయి. అందరి అధ్యక్షుల లిస్టు అంటే చదవడం కష్టం కానీ.. ఓసారి బైడెన్తో కలుసుకుని లాస్ట్ 10 మంది అధ్యక్షుల పెంపుడు జంతువుల జాబితా ఓసారి చూసేద్దామా.. -
సొంతూరు వీడుతూ బైడెన్ కంటతడి
న్యూ కేజల్ : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి వాషింగ్టన్కు బయల్దేరి వెళ్లడానికి ముందు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సొంత రాష్ట్రమైన డెలవార్ లోని న్యూ కేజల్లో నేషనల్ గార్డ్ సెంటర్లో మంగళవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న బైడెన్ తన సొంతూరు వీడి వెళ్లిపోతున్నందుకు పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. నేను చనిపోయినా కూడా నా గుండె డెలవార్ కోసం కొట్టుకుం టూనే ఉంటుందని బైడెన్ ఉద్విగ్నంగా చెప్పా రు. సెనేటర్గా దశాబ్దాల తరబడి రైల్లోనే వాషింగ్టన్కు ప్రయాణం చేసిన ఆయన ప్రమాణ స్వీకారానికీ అలాగే వెళ్లాలనుకున్నారు. కానీ భద్రతా కారణాల రీత్యా బైడెన్ విమానంలో వెళ్లాల్సి వచ్చింది. తన కోరిక తీరకపోయి నప్పటికీ ఆ రైలు ప్రయాణం అనుభూ తుల్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు. ‘‘సరిగ్గా పన్నెండేళ్ల క్రితం విల్మింగ్టన్ స్టేషన్లో ఒక నల్లజా తీయుడి కోసం వేచి ఉన్నాను. రైల్లో ఆయన వెళుతూ నన్నూ తీసుకొని వెళ్లారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షు లుగా ఒబామా, నేను ప్రమాణం చేశాము. ఇప్పుడు మళ్లీ ఒక నల్లజాతీయ మహిళను కలుసు కోవడానికి వాషింగ్టన్ వెళుతున్నాం. నేను, కమలా హ్యారిస్ అధ్యక్ష, ఉపా«ధ్యక్షులుగా ప్రమాణం చేస్తాం. అదీ అమెరికా.. అదీ డెలవార్’’ అని బైడెన్ చెప్పారు. -
యూఎస్లో రెండు బిగ్ ‘డే’లు.. అందులో ఒకటి నేడే!
యూఎస్లో రెండు బిగ్ ‘డే’లు ఉంటాయి. యేటా వచ్చే ఇండిపెండెన్స్ డే ఒకటి. నాలుగేళ్లకొకసారి వచ్చే ఇనాగురేషన్ డే ఇంకొకటి. జూలై 4 అమెరికా స్వాతంత్య్ర దినం. జనవరి 20 అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ దినం. స్వాతంత్రానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఆ దేశంలో స్వీకారానికి అంత ప్రాధాన్యం ఉంది. ఈరోజు ఆమెరికా ఇనాగురల్ డే. జో బైడెన్, కమలా హ్యారిస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరున్నా లేకున్నా, ఎవరి పార్టీ ఏదైనా.. కొత్త అధ్యక్షుడి స్వీకారంలో పాత అధ్యక్షుడు ఉండటం సంప్రదాయం. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ బైడెన్ వేడుకకు ‘స్కిప్’ కొడుతున్నారు. అంటే.. ఆయన హాజరు కావడం లేదు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. బైడెన్ గెలవక ముందు నుంచే ఎడమొహం పెడమొహంగా ఉన్నారు ట్రంప్. బైడెన్ గెలిచాక ‘నీ గెలుపును గుర్తించను ఫో..’ అన్నట్లే ఉండిపోయారు. అలాగని అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి వీపు చూపించిన అధ్యక్షులలో ట్రంపే మొదటి వారు కాదు. ఇంకొకాయన కూడా ఉన్నారు. ఆ వివరాలతో పాటు.. గత ‘ప్రెసిడెన్షియల్ ఇనాగురేషన్’లలో సంభవించిన కొన్ని ఆసక్తికరమైన ఘటనలు ఏమిటో చూద్దాం. బైడెన్కి ఎంతుందో ట్రంప్కీ అంతుంది! ట్రంప్ అమెరికన్లందరి మనిషి. బైడెన్ అమెరికన్లతో పాటు, అమెరికాలోని అన్ని దేశాల వారి మనిషి. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్కు గట్టి పోటీ ఇచ్చారు ట్రంప్. చివరి ఫలితాల్లో ఓడిపోయారు. అది ఉండిపోయింది ట్రంప్ మనసులో. ట్రంప్ మనసులోనే కాదు.. ట్రంప్ని అభిమానించే వారందరి మనసుల్లో, జాతీయ భావన ఉన్న అమెరికన్లు అందరిలో ఆ బాధ, కోపం అలా ఉండిపోయాయి. ఎవరి మనసులో ఎలా ఉన్నా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి పాత అధ్యకుడు హాజరవ్వాలి. పార్టీ వేరైనప్పటికీ హాజరు నుంచి మినహాయింపు ఉండదు. పద్ధతి అది. ట్రంప్ గురించి చెప్పేదేముంది. ‘ముందు అమెరికా. ఆ తర్వాతే పద్ధతి’ అనే మనిషి. అందుకే పద్ధతిని పక్కన పెట్టి, నికార్సయిన అమెరికన్గా వేడుకకు స్కిప్ కొడుతున్నారు. స్కిప్ కొట్టినందుకు రాజ్యాంగమేమీ తప్పు పట్టదు. ఒకవేళ రాజ్యంగంలో ఉన్నా ట్రంప్కు పట్టదు. ‘నాదే శాసనం. నేనే రాజ్యాంగం’ అన్నట్లు ఉన్నారు కదా ఈ నాలుగేళ్లూ! ఇప్పుడు ట్రంప్ స్కిప్ కొట్టినట్లు, శత్రుత్వ భావనతో కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఒకప్పుడు స్కిప్ కొట్టిన అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. అమెరికా రెండవ అధ్యక్షుడు ఆయన. 1797 నుంచి 1801 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ ‘ప్రో అడ్మినిస్ట్రేషన్’. యు.ఎస్.లో తొలి రాజకీయపార్టీ అది. దానికే ఇంకో పేరు ‘ఫెడరలిస్ట్’ పార్టీ. ఆయన తర్వాత అధ్యక్షులు అయినవారు థామస్ జెఫర్సన్. జెఫర్సన్ వరుసగా రెండు టర్మ్లు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనది డెమొక్రాటిక్ రిపబ్లికన్ పార్టీ. జాన్ ఆడమ్స్ నుంచి థామస్ జెఫర్సన్కు అధికారం చేతులు మారేటప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి జాన్ ఆడమ్స్ వెళ్లలేదు. ఆడమ్స్ వ్యక్తిగా జంటిల్మన్. రాజకీయవేత్తగా పగా ప్రతీకారాల మనిషి. జెఫర్సన్ కూడా అంతే. ఆడమ్స్ పవర్లో ఉన్నప్పుడు ఇద్దరికీ పడేది కాదు. ఒకర్నొకరు విమర్శించుకునేవారు. అసలు ఒకర్ని చూస్తే ఒకరికి మండిపోయేదని హ్యూస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాన్సీ బెక్ యంగ్ చెబుతుంటారు. ఆడమ్స్ నుంచి ట్రంప్ వరకు ఈ మధ్యలో పాత అధ్యక్షులు కొందరు కొత్త అధ్యక్షుల ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోయినా అందుకు కారణం శత్రుత్వమైతే కాదు. ఈ పగలు, పట్టింపులను అలా ఉంచితే, అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార మహోత్సవంలోని ప్రతి నిముషం చరిత్రలో రికార్డు అవుతూ ఉంటుంది. ఆ కొద్ది గంటల్లో విశేషాలు ఏమైనా జరిగితే చరిత్రలో వాటికి ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఇప్పుడంటే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వాషింగ్టన్ డీసీలోని ‘క్యాపిటల్’ బిల్డింగ్లో జరుగుతోంది. అమెరికా తొలి అధ్యక్షుడు (1789–1797) జార్జి వాషింగ్టన్ ప్రమాణం చేసే నాటికి వాషింగ్టన్లోని కాపిటల్ బిల్డింగ్ పూర్తవలేదు ఆ కార్యక్రమం కనుక న్యూయార్క్ సిటీలోని ఆనాటి (ఇప్పుడున్నది కాదు) ఫెడరల్ హాల్లో జరిగింది. ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన కాపిటల్ బిల్డింగ్.. కాలక్రమంలో అధ్యక్షుల ప్రమాణ స్వీకార భవనం అయింది. మొన్న జనవరి 6 న విధ్వంసం జరిగింది ఈ పాలనా భవనంలోనే. వాషింగ్టన్ డీసీలో నేడు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ జరుగనున్న ‘క్యాపిటల్’ భవంతి ఇప్పుడు బైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాపిటల్ భవనానికి, ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు భద్రతగా ఆర్మీ రంగంలోకి దిగుతున్నట్లే.. అమెరికా అంతర్యుద్ధం ప్రారంభం అవుతున్న దశలో 1861లో అధ్యక్షుడిగా గెలిచిన అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారానికి అంతే భారీగా సైన్యాన్ని దింపి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. అధ్యక్షుడిగా రెండోసారి 1865 మార్చి 4న ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఏప్రిల్ 15న లింకన్ హత్యకు గురయ్యారు. ఆయన మరణంతో అదే రోజు ఉపాధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ ఒక హోటల్ రూమ్లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయవలసి వచ్చింది. అప్పట్లో మార్చి నెలలో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగేది. ప్రెసిడెంట్ విలియమ్ మెకిన్లే (1897–1901) 1901 సెప్టెంబర్ 14న హత్యకు గురైనప్పుడు కూడా ఆయన ఉపాధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ అదే రోజు తన న్యూయార్క్, బఫెలో ప్రాంతంలోని తన ఇంట్లో నుంచి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. థియోడర్ రూర్వెల్ట్కు ఫ్రాంక్లిన్ డెలనో రూజ్వెల్ట్ అనే కజిన్ ఉన్నారు. ఆయన నాలుగుసార్లు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. 1945లో చనిపోడానికి కొద్ది రోజుల ముందు ఆయన నాలుగో ప్రమాణ స్వీకారం జరిగింది. రెండు టెర్మ్లకు మించి ఎక్కువ కాలం అధికారంలో ఉన్న ఏకైక అమెరికా అధ్యక్షుడు డెలనోనే. ఎలా సాధ్యం? ఎవరైనా రెండు టెర్మ్లే కదా అక్కడి రాజ్యాంగం ప్రకారం ఉండాలి! అప్పటికింకా.. ‘రెండుసార్లు మాత్రమే’ నిలబడాలి అనే 22వ రాజ్యాంగ సవరణ జరగలేదు. డెలనో నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచారు. కనుక నాలుగుసార్లు ప్రమాణ స్వీకారం చేయగలిగారు. చరిత్రలో ప్రసిద్ధి చెందిన ప్రమాణ స్వీకారం మాత్రం లిండన్ బైన్స్ జాన్సన్దే. ఆయన 1963–69 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడీకి బైన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1963లో కెనడీ హత్య జరగడంతో బైన్స్ అధ్యక్షుడయ్యారు. కెనడీ హత్యతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంలో బైన్స్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ప్రమాణ స్వీకారాలతో పాటు, వాటికి సంబంధించిన కార్యక్రమాలకు కూడా చరిత్రలో నిలచినవి ఉన్నాయి. ఇటీవలి కాలానికి వస్తే, 2009లో బరాక్ ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అమెరికన్ సింగర్ అరెథా ఫ్రాంక్లిన్ ఇచ్చిన ప్రదర్శన వాషింగ్టన్ చరిత్రలోనే నిలిచిపోయేంతగా వెలిగిపోయింది. అసలు ఆమె రాక వల్లనే ఒబామా స్వీకారానికి నిండుదనం వచ్చిందని యూఎస్ పత్రికలు అరెథాను ఆకాశానికి ఎత్తేశాయి. ‘‘అదొక మానవాళి మూకుమ్మడి ఉత్సవం’’ అని నాన్సీ బెక్ రాశారు. ఈరోజు జో బైడెన్ ప్రమాణ స్వీకారం కూడా చరిత్రలో నిలిచిపోబోయే ఘట్టమే. తీవ్ర ఉద్రిక్తతల మధ్య, సైన్యం నీడలో ‘ఐ డు సాలెమ్న్లీ స్వీయర్ దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ.. అని ప్రమాణం చేయబోతున్నారు. -
రేపు ఉదయం ట్రంప్ టాటా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 ఉదయం వైట్హౌజ్ను, వాషింగ్టన్ను వీడనున్నారు. అదే రోజు దేశ నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా చివరి రోజైన మంగళవారం ట్రంప్ బిజీబిజీగా గడపనున్నారు. దాదాపు వంద మందికి క్షమాభిక్ష ప్రకటించే, లేదా శిక్షా కాలాన్ని తగ్గించే ఫైల్స్పై సంతకాలు చేయనున్నారు. వారిలో హెల్త్ కేర్ కుంభకోణానికి పాల్పడిన నేత్ర వైద్యుడు డాక్టర్ సోలమన్ మెల్గన్, పలువురు వైట్కాలర్ క్రిమినల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మేరీలాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్లో బుధవారం ట్రంప్కు వీడ్కోలు పలికే కార్యక్రమం జరపనున్నారు. ఆ తరువాత, ట్రంప్ తన అధికారిక విమానం ‘ఎయిర్ఫోర్స్ వన్’లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్కు వెళ్తారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కన్నా ముందే వీడ్కోలు కార్యక్రమం ఉంటుందని, ఉదయం 6 గంటల నుంచి 7.15 గంటల మధ్య అది ఉండొచ్చని వైట్హౌజ్ వర్గాలు తెలిపాయి. కలర్ గార్డ్, 21 గన్ సెల్యూట్తో అధ్యక్షుడికి వీడ్కోలు పలికే అవకాశముందన్నాయి. సీఎన్ఎన్ వార్తాసంస్థ కథనం ప్రకారం.. అధ్యక్షుడిగా చివరి రోజు ట్రంప్ స్వీయ క్షమాభిక్ష ప్రకటించుకోవాలనుకోవడం లేదు. తనకు, తన పిల్లలకు క్షమాభిక్ష ప్రకటించే దిశగా ట్రంప్ ఆలోచించడం లేదు. జనవరి 6 నాటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. స్వీయ క్షమాభిక్ష నిర్ణయం తీసుకుంటే.. నేరం చేశానని అంగీకరించినట్లుగా తేలుతుందని ట్రంప్కు సన్నిహితులు సలహా ఇచ్చారు. అయితే, చివరి నిమిషంలో ట్రంప్ మనసు మార్చుకుని, స్వీయ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీఎన్ఎన్ పేర్కొంది. క్షమాభిక్ష ప్రకటించాల్సిన, శిక్షాకాలం తగ్గించాల్సిన వారి జాబితాను ఇప్పటికే రూపొందించారని వైట్హౌజ్ వర్గాలు వెల్లడించాయి. -
వాషింగ్టన్లో హై అలర్ట్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్, డీసీ మిలటరీ కేంద్రాన్ని తలపిస్తోంది. దేశ నూతన అధ్యక్షుడిగా జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వాషింగ్టన్లో, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అల్లర్లు చెలరేగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రత వర్గాలు అప్రమత్తమయ్యాయి. అత్యంత పటిష్ట భద్రతాచర్యలతో వాషింగ్టన్ను అష్టదిగ్బంధనం చేశాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే కేంద్రానికి దారితీసే రహదారులను మూసేశారు. వేలాది స్థానిక పోలీసులతో పాటు, సుమారు 25 వేల మంది నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపారు. క్యాపిటల్ భవనం, వైట్హౌజ్లతో పాటు నగరంలోని ప్రధాన భవనాల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. క్యాపిటల్ భవనం, వైట్హౌజ్ల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు. ఆయా భవనాల బయట 8 అడుగుల ఎత్తైన ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానులతో కిక్కిరిసే నేషనల్ మాల్ను మూసేశారు. వాషింగ్టన్తో పాటు 50 రాష్ట్రాల రాజధానుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాణ స్వీకారం రోజు హింసాత్మక ఘటనలకు పాల్పడతామంటూ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అనుకూల బృందాలతో పాటు వివిధ గ్రూపుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయని, దాంతో, ఆయా బృందాలపై, ట్రంప్ అనుకూల వర్గాలపై, జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారిపై సునిశిత దృష్టి పెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ‘కోవిడ్ నిబంధనల కారణంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అసాధారణంగా జరగబోతోంది. ఎంపిక చేసిన కొద్దిమంది అతి«థులు పాల్గొంటారు. అయితే, జనవరి 6 నాటి ఘటన నేపథ్యంలో భద్రతను మరింత పెంచాల్సిన పరిస్థితి నెలకొంది’ అని వాషింగ్టన్ డీసీ మేయర్ మురియెల్ బౌసర్ పేర్కొన్నారు. ‘దేశ పౌరులే క్యాపిటల్ భవనంపై దాడి చేసి, పోలీసు అధికారులను చంపేస్తారని ఊహించలేదు. కానీ, అది జరిగింది. అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందే’ అన్నారు. వాషింగ్టన్లోనే కాకుండా, ప్రధాన నగరాల్లో హింస చెలరేగే అవకాశముందని ఎఫ్బీఐ నివేదికల్లో హెచ్చరించింది. ‘ప్రమాణ స్వీకారం పూర్తయ్యేవరకు భద్రత బలగాలు దూకుడుగానే వ్యవహరిస్తాయి’ అని ఎఫ్బీఐ చీఫ్ క్రిస్టఫర్ స్పష్టం చేశారు. సొంత బలగాల నుంచే ముప్పు? బైడెన్కు భద్రత కల్పించే దళాల్లోని వ్యక్తుల నుంచే ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు అమెరికా రక్షణ అధికారులను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దాంతో, ప్రమాణ స్వీకార కార్యక్రమ భద్రతలో, నగర రక్షణలో పాలు పంచుకుంటున్న మొత్తం 25 వేల మంది నేషనల్ గార్డ్స్ను నిశితంగా పరీక్షిస్తున్నారు. ఈ అంతర్గత దాడి ముప్పు గురించే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని ఆర్మీ సెక్రటరీ రయాన్ మెక్ కెర్తి పేర్కొన్నారు. బైడెన్పై, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులపై దాడికి పాల్పడే అవకాశమున్న వారిని గుర్తించేందుకు పలు విధాలుగా గార్డ్స్ను పరీక్షిస్తున్నామన్నారు. దాడి చేసేందుకు వారికి లభించే అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుని.. దాడులను అడ్డుకునే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విప్లవ కాలం నాటి దుస్తులు ధరించి, రైఫిల్తో కొలంబస్లోని ఒహాయో స్టేట్హౌస్ ముందు కనిపించిన ఓ వ్యక్తి -
ట్రంప్ వాషింగ్టన్ వీడేది ఎప్పుడంటే..
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి వెళ్లనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం ట్రంప్ వాషింగ్టన్ నుంచి బయటకు వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ట్రంప్, బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోవడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వాషింగ్టన్ వెలుపల ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ ప్రధాన కార్యాలయం జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ట్రంప్ వీడ్కోలు కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన అనంతరం.. ఫ్లోరిడా పామ్ బీచ్లోని తన మార్ ఏ లాగో క్లబ్లో ట్రంప్ నూతన అధ్యాయన్ని ప్రారంభించనున్నారని సమాచారం. ఇక కొంత మంది వైట్హౌస్ సహాయకులు ట్రంప్ కోసం అక్కడ పని చేయనున్నారని తెలిసింది. (చదవండి: అభిశంసన: ట్రంప్ కన్నా ముందు ఎవరంటే) ప్రామణస్వీకారోత్సవానికి ముందే వైట్ హౌస్ సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడు జో బైడెన్కు ఆతిథ్యం ఇవ్వాలని కొందరు వైట్హౌస్ సలహాదారులు రిపబ్లికన్ అధ్యక్షుడిని కోరుతున్నారు. అయితే ట్రంప్ అలా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు లేవని పరిపాలన అధికారి ఒకరు తెలిపారు. ఇక అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. తన పదవీ కాలం ముగియడానికి ముందే ట్రంప్ మరి కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని యోచిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాక స్వీయక్షమాభిక్ష అనే అపూర్వమైన పద్దతిని ఎంచుకోనున్నారని వెల్లడించారు -
అమెరికాలో భారీ అల్లర్లకు కుట్ర ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు 50 రాష్ట్రాల్లోనూ చట్టసభల దగ్గర పెద్ద ఎత్తున అల్లర్లు, సాయుధ నిరసనలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తమకు సమాచారం అందిందని ఎఫ్బీఐ హెచ్చరించింది. కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సమయం దగ్గరకొస్తున్న నేపథ్యంలో ట్రంప్ అనుచరులు మరోసారి హింసాకాండకు పాల్పడే అవకాశాలున్నాయన్న భయాందోళనలు రేగుతున్నాయి. ట్రంప్ని గడువుకు ముందే పదవీచ్యుతుడ్ని చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అనుచరులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జనవరి 16 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్ వద్ద నిరసనలకు దిగడానికి వ్యూహరచన చేశారు. ఇక జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకార మహోత్సవం నాడు వాషింగ్టన్లో భారీ ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఎఫ్బీఐ కార్యాలయ అంతర్గత సందేశాల్లో పేర్కొన్నట్టుగా అమెరికా మీడియా వెల్లడించింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ çఘటనలు చోటు చేసుకోకుండా అదనపు జాతీయ భద్రతా బలగాలను మోహరించారు. వాషింగ్టన్లో ఎమర్జెన్సీ జో బైడెన్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజధాని వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితి విధించారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎమర్జెన్సీ జనవరి 24వరకు కొనసాగుతుందని వైట్హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎమర్జెన్సీ సమయంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్), ఫెడరల్ ఎమెర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఫెమా) సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటాయి. ప్రజల ప్రాణాలకు, ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి ముప్పు రాకుండా జాతీయ భద్రతా బలగాలు రంగంలోకి దింపుతారు. విదేశాంగ వెబ్సైట్ కలకలం అమెరికా విదేశాంగ వెబ్సైట్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం జనవరి 11 రాత్రి 7:49తో ముగిసిందని పేర్కొనడం కలకలాన్ని సృష్టించింది. అధ్యక్షుడుతో పాటు ఉపాధ్యక్షుడు మైక్పెన్స్ పదవీ కాలం కూడా ముగిసిపోయినట్టుగా వారిద్దరి బయోగ్రఫీలలో పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక విదేశాంగ శాఖ అధికారులు తలలు పట్టుకున్నారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపో అంతర్గత విచారణకు ఆదేశించారు. చేతులు కలిపిన ట్రంప్, పెన్స్ అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్పెన్స్ల మధ్య మళ్లీ మాటలు కలిశాయి. సోమవారం సాయంత్రం వారిద్దరూ వైట్హౌస్ అధ్యక్ష కార్యాల యంలో కలిసి కూర్చొని మాట్లాడారు. వారిద్దరి సంభాషణ ఆహ్లాదకర వాతావ రణం సాగినట్టుగా వైట్హౌస్ అధికారులు వెల్లడించారు. పదవీకాలం ముగిసేవరకు కలసి పని చేయాలని వారిద్దరూ అవగాహనకి వచ్చి నట్టు తెలిపారు. దీంతో ఇక ఆర్టికల్ 25 సవరణ ద్వారా ట్రంప్ని గద్దె దింపే అవకాశం లేదన్న విశ్లేషణలు వినపడు తున్నాయి. -
మూల్యం చెల్లించక తప్పదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్పై జరిగిన దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. హింసకు పాల్పడే వారు అసలు ఈ దేశ ప్రజలే కాదు అంటూ మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించిన వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాగా ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని చుట్టిముట్టిన క్రమంలో వాషింగ్టన్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని ఈ ఘటన అగ్రరాజ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోయింది. దీంతో తన మద్దతుదారులను రెచ్చగొట్టిన ట్రంప్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సొంతపార్టీ నేతలు సైతం, ముఖ్యంగా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ట్రంప్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గడువుకు ముందే ఆయనను గద్దె దింపే మార్గాల అన్వేషణ ఆరంభించారు. జనవరి 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన ట్రంప్ గురువారం రాత్రి ట్విటర్లో శాంతి మంత్రం వల్లిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికా కాంగ్రెస్ జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించిందని, క్రమపద్ధతిలో సామరస్య పూర్వకంగా అధికార మార్పిడి చేయడం మీదే తాను దృష్టి సారించినట్లు వెల్లడించారు. జనవరి 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందంటూ తన ఓటమిని అంగీకరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాను అన్ని విధాలుగా ప్రయత్నించానని, అమెరికా ఎన్నికల ఫలితానికి సంబంధించి ప్రజల్లో పూర్తి విశ్వాసం నెలకొనేలా ఎన్నికల చట్టాల్లో పలు మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తన ఓటమి గురించి ఎవరూ బాధపడవద్దని, మన ప్రయాణం ఇప్పుడే మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు.(చదవండి: వాషింగ్టన్లో ఉద్రిక్తత: ట్రంప్కు షాక్..!) అందరికీ ధన్యవాదాలు అదే విధంగా... 2020 ఎంతో మందికి చేదు అనుభవాలు మిగిల్చిందని, కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా అనేక చర్యలు తీసుకున్నామన్నారు. కష్టకాలంలో దేశం మొత్తం ఒక కుటుంబంలా కలిసి ఉండి సవాళ్లను ఎదుర్కొందని హర్షం వ్యక్తం చేశారు. ఇకపై కూడా ఇదే ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రజలకు సేవ చేయడం జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప గౌరవమని, తమ మద్దతుదారులు, అమెరికా పౌరులకు ట్రంప్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: అమెరికాలో అరాచకం) -
భారత్తో చెలిమికే బైడెన్ మొగ్గు!
బిల్ క్లింటన్ హయాంలో తప్ప ఎన్నికైన ప్రతి అమెరికా అధ్యక్షుడూ భారత్తో సామరస్య పూర్వకమైన సంబంధాలను నెలకొల్పుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. జార్జి బుష్ జూనియర్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా భారత్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఆయన జట్టులోని కీలక సభ్యులు భారత్ను ఏ దృక్పథంతో చూస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా భారత్ సందర్శించిన బైడెన్కు భారత్ పట్ల సానుకూల అభిప్రాయమే ఉంది. భారత్పై అణు ఆంక్షలకు ముగింపు పలకాలంటూ మద్దతు పలికారు. బైడెన్ టీమ్లో ఉండబోతున్న కీలక అధికారులు సైతం తాలిబన్ల కట్టడి, పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాద చర్యల నిరోధం వంటి అంశాలపై భారత్ అనుకూల వైఖరినే ప్రదర్శించగలరని సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్తగా ఎన్నికయ్యే ప్రతి అమెరికా అధ్యక్షుడూ విదేశీ విధాన నిర్వహణపై తన వ్యక్తిగత ముద్ర వేయాలని చూడటం కద్దు. బిల్ క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్నకాలంలో భారత్–అమెరికా సంబంధాలు దిగజారి పోయాయి. భారత్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపి వేయడానికి క్లింటన్ శతథా ప్రయత్నించారు. కశ్మీర్ సమస్యకు సంబంధించి భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ప్రయత్నించిన క్లింటన్, చైనాతో సత్సంబంధాలు కుదుర్చుకోవడానికి నడుం కట్టారు. క్లింటన్ అనంతరం గద్దెనెక్కిన జార్జి బుష్ (జూనియర్) భారత్తో అత్యంత మిత్రపూరితంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడిగా చరి త్రలో మిగిలిపోయారు. భారతదేశంపై అంతర్జాతీయ అణు సంపన్న దేశాలు ఆంక్షలను ఎత్తివేయడంలో సహకారమందించారు. బుష్ నిర్దే శించిన పంథానే ఒబామా అనుసరించారు. భారత్తో సంబంధాలను ఇండో–పసిఫిక్ భద్రతా దృక్పథం నుంచి ఒబామా అంచనా వేశారు. వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించినప్పటికీ, భద్రతాపరమైన అంశాలపై భారత్కు ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతుగా నిలిచారు. ఇకపై బైడెన్ హయాంలో జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరసత్వ చట్టాలు వంటి అంశాలపై అమెరికాకు భారత్ తగు హామీని ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు స్వాగతించాయి. బైడెన్, అయన జట్టులోని కీలక సభ్యులు భారత్ను ఏ దృక్పథంతో చూస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో బైడెన్ భారత్ సందర్శించారు. భారత్తో బైడెన్ నెరిపిన కీలకమైన సంబంధాలు ఏవంటే... సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్ హోదాలో నాటి అధ్యక్షుడు బుష్కి ఉత్తరం రాస్తూ, భారత దేశంపై అణు ఆంక్షలకు ముగింపు పలకాలని బైడెన్ మద్దతు పలికారు. ఉపాధ్యక్షుడి హోదాలో బైడెన్ 2013 జూలైలో భారత్ను సందర్శించారు. వాతావరణ మార్పుపై ఒప్పందం కోసం అంత ర్జాతీయ మద్దతును కూడగట్టడంలో అమెరికాకు సహకరించాల్సిందని భారత్ను ఒప్పించే ప్రచారం మొదలెట్టిన బైడెన్ తన పనిలో విజయం సాధించారు కూడా. పారిస్లో నిర్వహించిన 2015 వాతావరణ మార్పు సదస్సు సందర్భంగా అమెరికాకు భారత్ మద్దతిచ్చింది. ఈ సదస్సులోనే పర్యావరణ సమస్యలపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శించిన చిత్తశుద్ధిని అమెరికా నిజంగానే మెచ్చుకుంది కూడా. విదేశీ విధానం, భద్రతా విధానాలకు సంబంధించిన సమస్యలపై బైడెన్ పాలనా యంత్రాంగంలో ముగ్గురు వ్యక్తులు కీలక స్థానాల్లో ఉండబోతున్నారు. సెనేట్ విదేశీ సంబంధాల కమిటీలో బైడెన్కు దీర్ఘకాలం పాటు సహకరించిన ఆంథోనీ బ్లింకెన్ (ప్రస్తుతం అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి కానున్నారు)తో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ వ్యవహరించవలసి ఉంటుంది. ఒబామా ప్రభుత్వంలో బ్లింకెన్ డిప్యూటీ విదేశీ మంత్రిగా వ్యవహరించారని గుర్తుంచుకోవాలి. భారత్తో సంబంధాల తీరుతెన్నుల గురించి ఈ ఏడాది జూలైలో వాషింగ్టన్లో ప్రసంగించిన బ్లింకెన్, భారత్తో దృఢమైన సంబం ధాలను నెలకొల్పుకోవడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ‘ఇండో–పసిఫిక్ భవిష్యత్తుకు ఇది ఎంతో ముఖ్యమైనది, మేం కోరు కుంటున్న వ్యవస్థ తీరుకు భారత్తో సంబంధాలు చాలా ముఖ్యమై నవి. నూతన వ్యవస్థ అనేది మరింత న్యాయబద్ధంగా, సుస్థిరంగా, మరింత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని బ్లింకెన్ పేర్కొన్నారు. భారత్తో రక్షణరంగ పారిశ్రామిక సహకారం అభివృద్ధిని కూడా బ్లింకెన్ ఆకాంక్షించారు. దీనివల్ల భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తి గణనీయంగా మారిపోతుంది. జాతీయ భద్రతా విధానాలతో వ్యవహరించనున్న బైడెన్ టీమ్లో అత్యంత వృత్తిపర నైపుణ్యం, అనుభవం కలిగిన అధికారులు ఉన్నారు. 43 ఏళ్ల వయసున్న జాక్ సుల్లివాన్ ఇప్పుడు బైడెన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా, హిల్లరీ క్లింటన్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు సుల్లివాన్ అత్యంత కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. మరొక ఆసక్తికరమైన నియామకం జనరల్ లాయిడ్ ఆస్టిన్. అమెరికా చరిత్రలో రక్షణ రంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ కావడం విశేషం. ఆస్టిన్ గతంలో యుఎన్ జనరల్ కమాండ్ అధిపతిగా వ్యవహరించేవారు. ఇది అఫ్గానిస్తాన్లో అమెరికా సైనిక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేది. కాబట్టి అఫ్గానిస్తాన్లో తాలిబన్లకు మద్దతునివ్వడంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర గురించి, అబోత్తాబాద్లో అల్ కాయిదా అధినేత బిన్ లాడెన్కు పాకిస్తాన్ ఆశ్రయమివ్వడం గురించి అస్టిన్ కాబోయే అధ్యక్షుడికి చక్కని సమాచారం ఇవ్వగలరు. పాకిస్తాన్ అణ్వాయుధ నిర్మాణంలో చైనా సహకారం గురించి భారత్కు చక్కటి సూచనలు అందించగలరు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితి, పౌరసత్వ సవరణ చట్టం గురించి బ్లింకెన్ మాట్లాడుతూ, కశ్మీరులో స్వేచ్ఛగా సంచరిం చడం, వాక్ స్వేచ్ఛలను దెబ్బతీస్తూ భారత్ ఇటీవలి కాలంలో తీసు కున్న కొన్ని చర్యల గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశంలో పౌరసత్వ చట్టాలపై కూడా ఆయన మాట్లాడారు. కొన్ని రంగాల్లో విభేదాలు ఉన్నప్పటికీ మరింత గొప్ప సహకారాన్ని నిర్మించు కోవడంపై మరింత మెరుగైన రీతిలో వ్యవహరించగలమని బ్లింకెన్ నొక్కి చెప్పారు. అదే సమయంలో జమ్మూ కశ్మీరుపై భారత్ పారదర్శక విధానాన్ని కలిగి ఉన్నదని మనం బైడెన్ పాలనా యంత్రాంగానికి స్పష్టం చేయ వలసిన అవసరం ఉంది. జమ్మూకశ్మీరులో ప్రజలు ఎన్నుకునే ప్రజా స్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ధృఢ నిర్ణయంతో ఉందని కూడా చెప్పవలసి ఉంది. జమ్మూకశ్మీర్లో ఉనికిలో ఉన్న ప్రజాతంత్ర సంస్థలను అణచిపెట్టడానికి, ఎన్నికలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమేరకు ప్రోత్సహిస్తుందన్న దానికి అనుగుణంగానే ఆ ప్రాంతంపై భారత్ విధానం ఉంటుందని అమెరికాకు అర్థం చేయించాల్సి ఉంది. అదే సమయంలో భారతదేశంలోనూ, అఫ్గానిస్తాన్లోనూ ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నివ్వకుండా చేయడంలో అమెరికా తన పలుకు బడిని ఉపయోగించాలని భారత్ ఆశిస్తున్నదనే విషయాన్ని కూడా మనం అమెరికాకు స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. ఇకపోతే చైనా, రష్యాతో అమెరికా సంబంధాల్లో కూడా గణనీయమైన స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. చైనాపై డొనాల్డ్ ట్రంప్ హయాంలో మాదిరి తీవ్రమైన కఠిన పదజాలాన్ని ప్రయోగించడం తగ్గిపోవచ్చు. ఎందుకంటే పసిíఫిక్, హిందూ మహా సముద్రంలో తన సైనికపరమైన ఉనికిని అమెరికా కొనసాగించ నుంది. అయితే ట్రంప్ పాలనాయంత్రాంగం నుంచి రష్యా అందు కున్న ప్రాధాన్యత బైడెన్ హయాంలో లభించక పోవచ్చనిపిస్తుంది. అలాగే ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై విధించిన ఆంక్షలకు బైడెన్ యంత్రాంగం ముగింపు పలకవచ్చు. ఇది ఎంతైనా స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే అఫ్గానిస్తాన్లో తాలిబన్ ప్రాయోజిత ఉగ్రవా దాన్ని ఎదుర్కోవడంలో ఇరాన్ సానుకూల పాత్ర పోషించగలదు. అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకుంటే అది అఫ్గానిస్తాన్లోనే కాకుండా గల్ఫ్ ప్రాంతంలో కూడా శాంతి సుస్థిరతలను పెంపొందించగలదు. అన్నిటికంటే మించి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని కొనసాగించడంలో పాకిస్తాన్ను ప్రోత్సహించే విధంగా బైడెన్ యంత్రాంగం ఏరకంగానూ వ్యవహరించదని మనం భావించవచ్చు. అలాగే, చైనా ప్రాదేశిక స్వార్థ ప్రేరేపిత ఆకాంక్షలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై అమెరికా తనదైన స్పష్టమైన వైఖరిని వ్యక్తపర్చగలదని కూడా మనం భావించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రాంతం పొడవునా ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడంలో క్వాడ్ ఇప్పుడు ఒక కీలక సంస్థగా ఉంటోంది. పైగా 2021లో జి–7 పారిశ్రామిక దేశాల (బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా) సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. క్వాడ్ సభ్య దేశాలను ఆహ్వానించనున్నట్లు వార్తలు వస్తున్నాయి కూడా. ఇది భారత్కు ఎంతో అనుకూలమైన అంశమని చెప్పక తప్పదు. జి.పార్థసారథి వ్యాసకర్త చాన్స్లర్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ; మాజీ హైకమిషనర్, పాకిస్తాన్ -
నేడు ఆకాశంలో క్రిస్మస్ స్టార్
వాషింగ్టన్: నేటి రాత్రి ఆకాశంలో గొప్ప ఘటన సంభవించబోతోంది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత మన సౌరకుటుంబంలోని శని, బృహస్పతి గ్రహాలు పక్కపక్కనే కనిపించబోతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నైరుతి వైపు ఈ గ్రహాలు కనిపిస్తాయి. ఇలా రెండు గ్రహాలు చలికాలంలో ఓ చోట చేరితే దాన్ని ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ప్రస్తుతం దీనికి నాసా శాస్త్రవేత్తలు ‘క్రిస్మస్ స్టార్ ఆఫ్ 2020’ అని పేరు పెట్టారు. ఇలాంటి ఘటనను మళ్లీ చూడాలంటే మరో 60 సంవత్సరాలు ఆగాలని, 2080లో మళ్లీ కనిపిస్తుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గెలీలియో టెలిస్కోప్ కనుగొన్న 13 సంవత్సరాల తర్వాత, 1623లో జూపిటర్ చుట్టూ నాలుగు నక్షత్రాలను గుర్తించారు. వాటిని అప్పట్లో జూపిటర్ చందమామలుగానూ, శాటర్న్ వృత్తంగానూ గుర్తించారు. నాసా పేర్కొంది. ఇలాంటి ఓ ఘటన జరగడం గత 400 ఏళ్లలో ఇదే మొదటి సారి అని తెలిపారు. డిసెంబర్ 21కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజున ఉత్తరార్థగోళంలో పగలు అత్యంత తక్కువగానూ, దక్షిణార్థగోళంలో పగలు అత్యంత ఎక్కువ సమయం పాటు ఉండనుంది. -
ఆనాడు ట్రంప్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు!
వాషింగ్టన్: వాషింగ్టన్కు చెందిన ఆర్చ్ బిషప్ విల్టన్ గ్రెగోరీని పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాధిపతి (కార్డినల్)గా నియమించారు. విల్టన్ గ్రెగోరీ ఈ పదవి అధిరోహించిన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్. గతంలో ఇతర నల్లజాతీయులు కార్డినల్స్గా పనిచేసినప్పటికీ, గ్రెగోరీ మాత్రమే మొట్టమొదటి అమెరికన్ జాతీయుడు. ఈ చర్య అమెరికాలోని క్యాథలిక్ నల్లజాతీయుల పురోగతికి గొప్ప ముందడుగని గ్రెగోరీ వ్యాఖ్యానించారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ని పోలీసులు చంపివేసిన తరువాత నిరసనలు వెల్లువెత్తాయి.(చదవండి: ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!!) ఈ నేపథ్యంలో గ్రెగోరీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. జాతి వివక్ష వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న సందర్భంలో వాషింగ్టన్ డీసీలోని క్యాథలిక్ చర్చికి డొనాల్డ్ ట్రంప్ సందర్శన ప్రయత్నాన్ని గ్రెగోరీ అడ్డుకోవడంతో ఆయన తొలిసారి వార్తల్లోకెక్కారు. కాగా, వాటికన్ వేడుకలకు హాజరైన 12 మందికి కార్డినల్ హోదాను పోప్ ప్రదానం చేసి, ఆ హోదాను ప్రతిబింబించే ఉంగరం, ఎర్రటోపీ బహూకరించారు. (చదవండి: ఎఫ్బీఐపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం) -
అతన్ని పట్టిస్తే రూ.37 కోట్లు ఇస్తాం : అమెరికా
వాషింగ్టన్ : ముంబై 26/11 మారణహోమానికి ఈ నవంబర్ 26తో పుష్కరకాలం పూర్తయింది.సరిగ్గా పన్నేండేళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం 2008 ముంబై దాడులకు పాల్పడడంలో కీలకంగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్పై భారీ నజరానా ప్రకటించింది. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన సాజిద్ మిర్ సమాచారం ఇచ్చినా లేక పట్టిచ్చిన వారికి 5 లక్షల అమెరికన్ మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 37కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది. అమెరికాలో జరిగిన రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సందర్భంగా సాజిద్ మిర్ సమాచారం ఇస్తే రూ. 37 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముంబై దాడులకు లష్కరే ఆపరేషన్స్ మేనేజర్గా సాజిద్ మిర్ సూత్రధారిగా వ్యవహరించాడు. దాడుల ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ సాజిద్ దగ్గరుండి పర్యవేక్షించాడు. కాగా సాజిద్ మిర్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 2011 ఏప్రిల్ 11 న దోషిగా ప్రకటించింది. ఉగ్రవాదులకు అన్ని విధాలా సాయపడ్డాడని, ఓ దేశంలో భారీ ప్రాణ, ఆస్థి నష్టానికి కారకుడయ్యాడని పేర్కొంది. కాగా 2008 నవంబరు 26 న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ముంబైలోని పలు హోటళ్లు, ప్రదేశాలను టార్గెట్లుగా చేసుకుని ధ్వంస రచనకు పూనుకొంది. ఈ నగరంలోని తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియో పోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, చత్రపతి శివాజీ టర్మినస్ వంటి పలు చోట్ల జరిగిన పేలుళ్లలో 166 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఆ ఘటనలో 9 మంది టెర్రరిస్టులు కూడా మృతి చెందగా సజీవంగా పట్టుబడిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను 2012 నవంబరు 11 న పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. -
పట్టు వీడిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తాను పట్టిన పట్టు వీడారు. అధ్యక్ష ఎన్నికల్లో తనపై నెగ్గిన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్కు అధికారాన్ని బదలాయించడానికి అంగీకరించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికార మార్పిడి ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయన వైట్ హౌస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అధికార బదలాయింపులో అత్యంత కీలకంగా వ్యవహరించే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) చీఫ్ ఎమిలీ ముర్ఫీకి బైడెన్ బృందంతో కలిసి పని చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు ట్రంప్ ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ముర్ఫీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశం పట్ల ఆమెకున్న అంకిత భావం, విశ్వాసానికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అధికార మార్పిడికి అంగీకరించినప్పటికీ ఎన్నికల ఫలితాల అంశంలో తన పోరాటం కొనసాగుతుందన్నారు. ట్రంప్ అధికార మార్పిడికి అంగీకరించడాన్ని బైడెన్ బృందం స్వాగతించింది. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికైనట్టు జీఎస్ఏ గుర్తించి, ప్రభుత్వ వనరుల్ని వినియోగించుకోవడానికి అనుమతినివ్వడం అధికార మార్పిడికి ముందడుగు అని బైడెన్ బృందం పేర్కొంది. విమర్శలు ఆపేద్దాం : బైడెన్ దేశంలో ఎన్నికలు ముగిశాయని.. విభేదాలను, ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకోవడాన్ని ఆపేయాల్సిన సమయం వచ్చిందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ అన్నారు. అధికార బదిలీ ప్రక్రియను ట్రంప్ ప్రారంభించిన నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ ఏకం కావాల్సిన సమయం ఇదేనని అన్నారు. విభజించేందుకుగాక, ఏకం చేసేందుకు ప్రతిజ్ఞ చేసిన అధ్యక్షుడిగా తనను తాను వర్ణించుకున్నారు. తాను రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ అని చూడనని చెప్పారు. అందరి విశ్వాసాన్ని పొందుతూ పని చేస్తానని చెప్పారు. -
బాబోయ్ కరోనా... సెకండ్వేవ్ సునామీ
వాషింగ్టన్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం అంటూ ప్రపంచ దేశాలు నివారణ చర్యలు చేపట్టినా కోవిడ్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. రికవరీ రేటు ఎలా ఉన్నా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల మాత్రం ఆగడం లేదు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5.9 కోట్లు దాటగా,13 లక్షల మంది మరణించినట్లు వాషింగ్టన్లోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) వారి తాజా నివేదిక ప్రకారం మంగళవారం నాటికి 59,128,645 కేసులు.. 1,395,658 మరణాలు సంభవించాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పరంగా యూఎస్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 1,24,14,292 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,57,651 మరణాలు సంభవించాయి. రెండవ స్థానంలో ఉన్న భారత్లో 91,39,865 కరోనా కేసులు నమోదు కాగా, మరణించిన వారి సంఖ్య 1,33,738కు చేరుకుంది. మరణాల సంఖ్య ప్రకారం 169,485 బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. పది లక్షకు పైగా కేసులు నమోదైన ఇతర దేశాల జాబితాలో బ్రెజిల్ (60,87,608), ఫ్రాన్స్ (21,95,940), రష్యా (20,96,749), స్పెయిన్ (15,82,616), యుకె (15,31,267), ఇటలీ (14,31,795), అర్జెంటీనా (13,74,631), కొలంబియా (12,54,979), మెక్సికో (10,49,358) ఉన్నాయి. (చదవండి: ‘కరోనా’ అంటే ఎందుకు భయం పోయింది?) -
మాస్క్లు ధరించి ఉంటే లక్ష మరణాలు తగ్గేవి
వాషింగ్టన్ : కరోనా ఆరోగ్య నియమాలను పాటించకుండా, మాస్కులు ధరించవద్దని ప్రదర్శనలు నిర్వహిస్తోన్న నిరసనకారులను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ తప్పు పట్టారు. మాస్క్ ధరించని వారిని నగ్నంగా తిరిగేవారితో పోల్చి జోక్ చేశారు. అమెరికాలో మాస్క్లు ధరించడాన్ని రాజకీయ చేయడంపై ఇంటర్నెట్ ద్వారా ప్రసారం అయిన ఓ కార్యక్రమంలో కమేడియన్, సినీతార రషీదా జోన్స్తో కలిసి బిల్గేట్స్ మాట్లాడారు. ప్యాంట్లు ధరించమని చెబితే కొద్ది మంది అమెరికన్లు అదేదో ఘోర తప్పిదంగా చూస్తున్నారని ఆయన అన్నారు. మొదట్లో కోవిడ్ని ఆరోగ్య నిపుణులు సాధారణ ఫ్లూ, జ్వరంతో పోల్చారని, అయితే తర్వాత ఇదొక తీవ్ర వైరస్గా మారిందని ఆయన వీక్షకులకు వివరించారు. సాధారణ జలుబుతో బాధపడే వ్యక్తులు మాస్కు లేకుండా ఇంట్లో ఇతరులతో కలిసి ఉండవచ్చని, అయితే కోవిడ్ సోకిన వారు అలా చేయడానికి వీల్లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఉంటే కనుక లక్ష మరణాలను నివరించగలిగేవారమని, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధనలో తేలిందని బిల్ గేట్స్ గుర్తుచేశారు. వ్యాక్సిన్ అభివృద్ధికి బిల్ గేట్స్ కోట్లాది రూపాయలను విరాళంగా ఇచ్చారు. -
భారత్ విజయగాథ అపూర్వం
వాషింగ్టన్ : ప్రభుత్వాలు తరచూ మారిపోయినా.. రాజకీయ పార్టీల్లో కుట్రలు ఎన్ని ఉన్నా.. సాయుధ వేర్పాటు ఉద్యమాలు ఎన్ని నడిచినా, అన్ని రకాల స్కామ్లు, అవినీతి ఉన్నప్పటికీ ఆధునిక భారత దేశం సాధించిన ఘనతలు పలు విధాలుగా ఓ విజయగాథ అని అగ్రరాజ్యం అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో రాసుకున్నారు. 1990 తొలినాళ్లలో ఆర్థిక సరళీకరణలు చేపట్టడంతో భారత్లోని అసాధారణ భారతీయ వ్యాపార నైపుణ్యాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయని, ఫలితంగా దేశ అర్థ వ్యవస్థ పరుగులు పెట్టిందని, టెక్నాలజీ రంగం వృద్ధి చెందిందని ఒబామా ఆ పుస్తకంలో వివరించారు. 2008లో ఒబామా చేపట్టిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలుకొని అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అల్ కాయిదా అధ్యక్షుడు బిన్ లాడెన్ను హతమార్చడంతో పాటు తొలి దఫా అధ్యక్ష పదవీ కాలం ముగిసేంత వరకూ జరిగిన పలు ఘట్టాలను ఆయన ఎ ప్రామిస్డ్ ల్యాండ్లో విపులీకరించారు. ఈ నెల 15న విడుదలైన ఈ పుస్తకంలో 2010లో ఒబామా భారత్ పర్యటన వివరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు.. మన్మోహన్పై ప్రశంసలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. సిక్కు మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్ దేశ అత్యున్నత పదవిని అందుకోవడం దేశ పురోగతికి ఓ తార్కాణమని, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందడం వంటివి మన్మోహన్ సాధించిన విజయాలని ఒబామా వర్ణించారు. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ను తాను కలిసినప్పుడు ఆయనలోని అసాధారణ విజ్ఞానాన్ని, హుందా వ్యవహారశైలిని గుర్తించానని చెప్పారు. వినడం సోనియాకు ఇష్టం.. 2010లో తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్గాంధీలతో విందు సమావేశంలో పాల్గొన్నట్లు ఒబామా వివరించారు. సోనియా మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తి చెప్పింది వినేందుకే ఎక్కువ ఇష్టపడేవారని తెలిపారు. రాహుల్ గాంధీ తెలివైనవాడిగా, పట్టుదల ఉన్నవాడిగానే కనిపించాడు. అయితే రాహుల్లో ధైర్యం లేని అపరిపక్వతను తాను గమనించానని, పాఠాలన్నీ చదివి టీచర్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూసే విద్యార్థిలా అనిపించాడని ఒబామా వ్యాఖ్యానించారు.