సాహితీ దిగ్గజానికి నోబెల్‌ గౌరవం | British author Kazuo Ishiguro wins Nobel Prize for Literature | Sakshi
Sakshi News home page

సాహితీ దిగ్గజానికి నోబెల్‌ గౌరవం

Published Thu, Oct 5 2017 5:23 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

British author Kazuo Ishiguro wins Nobel Prize for Literature - Sakshi

సాహితీ దిగ్గజం కజౌ ఇషిగురో(62)ను సాహిత్య నోబెల్‌- 2017 వరించింది. అమెరికా విసిరిన అణుబాంబును తన గుండెలపై భరించిన జపాన్‌లోని నాగసాకిలో ఇషిగురో 1954 నవంబర్‌ 8న జన్మించారు. ఆయనకు ఐదేళ్ల వయసున్న సమయంలో కుటుంబం యూకేకు వచ్చేయడంతో అక్కడే స్థిరపడ్డారు.

ఇషిగురో ఇప్పటివరకూ ఎనిమిది పుస్తకాలు రచించారు. చిత్రాలకు, టీవీ కార్యక్రమాలకు స్క్రిప్టులను కూడా అందించారు. ఇషిగురో రచనల్లో 'ద రిమెయిన్స్‌ ఆఫ్‌ ది డే' ప్రసిద్ధి చెందింది. దీన్ని 1989లో ఆయన రచించారు. 1993లో 'ద రిమెయిన్స్‌ ఆఫ్‌ ది డే' చిత్రంగా కూడా విడుదలై ఘన విజయం సాధించింది. ది రిమెయిన్స్‌ ఆఫ్‌ ది డే నవలే 2017 సాహిత్యంలో నోబెల్‌ పురస్కారానికి ఎంపికైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement