నైపీడా : మయన్మార్ పశ్చిమ రాష్ట్రమైన రాకినిలో బోటు తిరుగబడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మంది గల్లంతయ్యారు.ఈ మేరకు మీడియా బుధవారం వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బోటులో 100 మంది ఉన్నారని పేర్కొంది. శరణార్థుల శిబిరం నుంచి వారిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరగుతున్నాయని మీడియా చెప్పింది.