ప్లాట్‌ఫాంలోని జనాలపైకి కారును దొర్లించారు | gang of teenagers pushed a CAR down the stairs onto a packed metro platform on New Year's Eve | Sakshi
Sakshi News home page

ప్లాట్‌ఫాంలోని జనాలపైకి కారును దొర్లించారు

Published Sat, Jan 2 2016 5:14 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

ప్లాట్‌ఫాంలోని జనాలపైకి కారును దొర్లించారు - Sakshi

ప్లాట్‌ఫాంలోని జనాలపైకి కారును దొర్లించారు

బ్రసెల్స్: కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు ఆకతాయి కుర్రాళ్లు జనాలను బిత్తరపోయేలా చేశారు. మెట్రోరైలు కోసం ఎదురుచూస్తూ ప్లాట్‌ఫాం మీద కిక్కిరిసిపోయిన ప్రయాణికుల మీదకు మెట్లపై నుంచి కారును తోసేశారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెల్జియం వాసులు బిక్కుబిక్కుమంటూ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొన్నారు. కనీసం వేడుకల సందర్భంగా టపాకులు కాల్చేందుకు పోలీసులు అనుమతించలేదు.

ఈ నేపథ్యంలో గురువారం (డిసెంబర్ 31న) రాత్రి క్లెమెన్‌సియా మెట్రోరైలు స్టేషన్‌లో కొంతమంది ఆకతాయి కుర్రాళ్ల మూక మూగింది. స్టేషన్‌లో మెట్ల మీద ఎవరూలేని సమయం చూసి.. ఓ ఆకుపచ్చ రంగు కారును మెట్ల మీద కిందకు దొర్లించారు. కింద ప్లాట్‌ఫాంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచిచూస్తున్నారు. దడదడమని చప్పుడు చేసుకుంటూ కారు దొర్లిపడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా బిత్తరపోయారు. తన మీదకు వస్తున్న కారు నుంచి ఓ ప్రయాణికుడు అతికష్టం మీద తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి 10 సెకండ్ల వీడియో క్లిప్‌ విడుదల కావడంతో ఆకతాయిల దుండగ చర్య స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ ఘటనలో ఆకతాయిలు దుందుడుకు చర్య మాత్రమే కాదు భద్రతా దళాల నిర్లక్ష్యం కూడా కనపడుతున్నదని బ్రసెల్స్‌ ఎంపీ జమాల్ ఇకాజ్‌బన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement