ఒక్కడిని చంపినందుకు 30 మంది పౌరుల హత్య | Islamic State kills nearly 30 civilians abducted from remote province | Sakshi
Sakshi News home page

ఒక్కడిని చంపినందుకు 30 మంది పౌరుల హత్య

Published Thu, Oct 27 2016 2:42 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

ఒక్కడిని చంపినందుకు  30 మంది పౌరుల హత్య

ఒక్కడిని చంపినందుకు 30 మంది పౌరుల హత్య

అఫ్గాన్‌లో ఐసిస్ దారుణం

 కాబూల్: ఇస్లామిట్ స్టేట్ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌లో మరో దారుణానికి ఒడిగట్టారు. స్థానికుల సాయంతో తమ కమాండర్‌ను ప్రభుత్వ బలగాలు చంపాయనే ఆగ్రహంతో సుమారు 30 మంది అమాయక పౌరులను ఐసిస్ ఉగ్రవాదులు అపహరించి దారుణంగా హత్య చేశారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన మంగళవారం సెంట్రల్ అఫ్గాన్‌లోని గోర్ ప్రావిన్స్‌లో జరిగింది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఐసిస్ ఉగ్రవాద సంస్థ  ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

గోర్ గవర్నర్ నాసిర్ మాట్లాడుతూ.. మంగళవారం స్థానికుల సాయంతో భద్రతా బలగాలు ఐసిస్ కమాండర్‌ను హతమార్చాయని చెప్పారు. దీనికి ప్రతీకారంగా ఆ వెనువెంటనే సుమారు 30 మంది గ్రామస్తులను ఐసిస్ అపహరించిందన్నారు. వారిలో ఎక్కువ మంది గొర్రెల కాపరులున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం వారి మృతదేహాలను స్థానికులు సమీపంలో గుర్తించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement