islamic state
-
Hizb-ut-Tahrir: హిజ్బ్–ఉత్–తహ్రీర్పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: జిహాద్, ఉగ్ర కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్(హెచ్యూటీ)పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ, దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్ర భావజాలాన్ని నూరిపోస్తోందని కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. వివిధ సామాజిక మాధ్యమ వేదికలు, రహస్య యాప్లు, ప్రత్యేక సమావేశాల ద్వారా యువతను ఇది గ్రూపులో చేర్చుకుంటోందని తెలిపింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలవైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్–ఉత్– తహ్రీర్ భద్రతకు ముప్పుగా పరిణమించిందని హోం శాఖ వెల్లడించింది. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. -
కాంగోలో ఉగ్ర ఘాతుకం.. 36 మంది మృతి
గోమా: ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ఏడీఎఫ్) జరిపిన మారణకాండలో 36 మంది పౌరులు చనిపోయారు. నార్త్ కివు ప్రావిన్స్ ముకోండి గ్రామంలోకి బుధవారం రాత్రి కత్తులు, తుపాకులతో ప్రవేశించిన ఉగ్రమూకలు ఇళ్లకు నిప్పుపెట్టాయి. బయటకు వచ్చిన పౌరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాయి. ఘటనలో 36 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరిని ఎత్తుకుపోయారు. ఏడీఎఫ్ ఉగ్రమూకలు చిన్నారులపైనా దారుణాలకు పాల్పడుతున్నాయి. -
కశ్మీర్లో మరిన్ని దాడులు చేస్తాం: ఐఎస్కేపీ హెచ్చరిక
న్యూఢిల్లీ: కశ్మీర్లో ఇటీవలి కాలంలో జరిగిన లక్షిత దాడుల వంటివే మరికొన్ని చేపడతామంటూ జమ్మూకశ్మీర్ ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ) హెచ్చరికలు పంపింది. తన అధికార ఆన్లైన్ పత్రిక ‘వాయిస్ ఆఫ్ హింద్’లో సోమవారం ఒక ఫొటోను ప్రచురించింది. చిరు వ్యాపారిని వెనుక నుంచి తుపాకీతో కాలుస్తున్నట్లున్న ఆ ఫొటోకు ‘మేం వస్తున్నాం(వుయ్ ఆర్ కమింగ్)’అంటూ శీర్షిక పెట్టింది. త్రిశూలంతో ఉన్న హిందూ దేవుళ్ల ఫొటోను కూడా ప్రచురించింది. తమ తదుపరి లక్ష్యం వారేనంటూ పరోక్షంగా హెచ్చరించింది. పండుగ సీజన్లో పేలుళ్లకు పథకం వేసిన ఉగ్రవాదులను ఇటీవల భద్రతా బలగాలు పట్టుకున్న విషయం తెలిసిందే. ఐఎస్కేపీ స్లీపర్ సెల్స్ కశ్మీర్ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. -
‘ఇస్లామిక్ స్టేట్’ ప్రేరణతో ఉగ్ర ఉచ్చులోకి..
న్యూఢిల్లీ/చెన్నై: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రేరణతో భారత్లోనూ ముష్కరులు పెచ్చరిలి్లపోతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ఉగ్రవాద దాడులు, కుట్ర, నిధుల అందజేతకు సంబంధించిన 37 కేసుల్లో ఇప్పటిదాకా 168 మందిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. 31 కేసుల్లో చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేశామని తెలిపింది. నిందితుల్లో ఇప్పటిదాకా 27 మందిని న్యాయస్థానాలు దోషులుగా తేల్చాయని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ముఠా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఆమాయక యువతపై వల విసురుతోందని, భారత్లో తన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం పట్ల ఆకర్షితులైన వారిని విదేశాల నుంచే సోషల్ మీడియా వేదికల ద్వారా సంప్రదించి ఉచ్చులోకి లాగుతున్నారని తెలిపారు. తమిళనాడులో ఒకరి అరెస్టు ఇస్లామిక్ స్టేట్, హిజ్్బ–ఉత్–తహ్రీర్ ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలు, భావజాలాన్ని ఫేస్బుక్ ద్వారా వ్యాప్తి చేస్తున్నారన్న సమాచారంతో తమిళనాడులో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం రాష్ట్రంలో రెండు చోట్ల సోదాలు నిర్వహించి ఒకరిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. తిరువారూర్ జిల్లాలో బవా బహ్రుద్దీన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. -
టర్కీ దళాల చేతిలో ఐఎస్ చీఫ్ బాగ్ధాది సోదరి..
న్యూఢిల్లీ : అమెరికా సేనల ఆపరేషన్లో హతమైన ఐఎస్ చీఫ్ అల్ బాగ్ధాది సోదరి సిరియాలో టర్కీ దళాలకు చిక్కినట్టు టర్కీ అధికారి వెల్లడించారు. బాగ్ధాది సోదరి, 65 సంవత్సరాల రస్మియా అవద్కు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్నారు. అలెప్పో ప్రావిన్స్లోని అజాజ్ పట్టణంలోని ఓ కుటుంబంతో కలిసి నివసిస్తున్న కంటెయినర్పై దాడి జరిపిన క్రమంలో రస్మియా అవద్ను టర్కీ దళాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. బాగ్ధాది సోదరి రస్మియాతో ఆమె భర్త, కోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని, కుటుంబ సభ్యులను ఇంటారాగేట్ చేస్తున్నామని టర్కీ అధికారి వెల్లడించారు. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో అలెప్పో ప్రాంతాన్ని టర్కీ దళాలు తమ అదుపులోకి తీసుకుని జల్లెడ పడుతున్నాయి. రస్మియా చిక్కడంతో ఐఎస్ కార్యకలాపాలపై లోతైన సమాచారంతో ఐఎస్ ఉగ్ర మూకలను పట్టుకునే అవకాశం లభిస్తుందని టర్కీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అల్ బాగ్ధాదిని గత నెల అమెరికన్ దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. -
అమెరికా అగ్రవాదమే ఈ ఉగ్రవాదం!
‘‘అబద్ధాల మీద ఆధారపడి యుద్ధాల ద్వారా అమెరికా లక్షలాది ప్రజల్ని చంపేసిన మాట నిజమే. ఇందుకు గాను అమెరికా 8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 566 లక్షల కోట్లు) ఖర్చు చేయవలసి వచ్చింది.’’ – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోలు : అమెరికా ‘ఇన్ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్’’ (ఐసీహెచ్) సమాచారం: బిల్ వాన్ ఆకెన్; 10–10–2019 ‘సిరియాలో తిష్ట వేసిన ఇస్లామిక్ స్టేట్ అగ్రనాయకుడు అబూ బక్రాలా బాగ్దాదీ అమెరికా సైన్యం జరిపిన దాడిలో కుక్కచావు చచ్చాడు, పిరికివాడిలా చచ్చాడు. డీఎన్ఏ పరీక్ష ద్వారా అతడు బాగ్దాదీ అని చెబుతున్నారు’ (అసోసియేటెడ్ ప్రెస్). కానీ హతమైంది బాగ్దాదీ యేనని ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మూవీ చూస్తున్నట్లు ఓ ప్రకటనలో ధృవీకరించాడు. కానీ బాగ్దాదీని వేటాడటానికి సైనికులు సహాయం తీసుకుంది డాగ్ స్క్వాడ్కి చెందిన ఒక కుక్కనే అన్న సంగతి ట్రంప్ మరిచిపోయాడు. కారణం.. పాశవిక హింసాప్రియుడు ట్రంప్. ‘‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’’ అన్నట్లు 26వ తేదీన చంపామని ట్రంప్ ఉద హరించిన బాగ్దాదీ ఎవరో కాదు. మీరు పెంచి పోషించిన వ్యక్తే సుమా అని కామన్ డ్రీమ్స్ సంస్థ తరపున సీఎన్బీసీ రిపోర్టర్ జాన్ హార్యుడ్ ప్రకటించారు (27–10–2019). ఇరాన్ నాయకులు కూడా అలానే ప్రకటించారు. ఈ గాథలు, ప్రపంచ ఘటనలు, అమెరికా నాయకస్థానంలో ఉన్న వలస సామ్రాజ్య వాద పాలకుల చేష్టలు, ప్రకటనలు గమనిస్తూంటే, ప్రపంచ ఉగ్రవాద ప్రమాదం గురించిన వీరి అంచనాలు ఒకరకంగా ఉంటూ, ఉగ్రవాద నిర్మూలన పేరిట నేడు జరుగుతున్నది అమెరికా అగ్రవాదమే అనిపిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే, కొన్నేళ్ల క్రితం బిన్ లాడెన్ పేరిట ప్రపంచవ్యాప్తంగా అమెరికా–బ్రిటన్లు జరి పిన వేటకు, ఆ ముసుగులో అప్ఘానిస్తాన్, ఇరాక్, ఇరాన్ల మీద జరి పిన పాశవిక దాడులకు ఇటీవల సిరియాలో జోక్యం దారీ వేటకు ఎత్తుగడలు, వ్యూహాలన్నీ రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల నాయకుల కనుసన్నలలోనే జరుగుతున్నాయని పైన తెల్పిన ట్రంప్ ప్రకటనే (అబద్ధాలపై ఆధారపడి యుద్ధాలను అమెరికా నిర్వహిస్తోందని) చెప్పక చెబుతోంది! బాగ్దాదీని అంతం చేశామని ప్రకటించిన ట్రంప్ తీరు చూస్తే సామ్రాజ్యవాద పాలకులే కాదు.. కొన్ని దేశాల పాలకులు కూడా ఎన్నికలలో విజయావకాశాలను పెంచుకునేందుకు కూడా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి ఇరుగు పొరుగు మీదకో లేదా తమకు పడని దేశాల మీదకో యుద్ధకాహళులూది, ఉద్రిక్తతలు పెంచ డానికి వెనుదీయరని గత చరిత్రే కాదు, నడుస్తున్న చరిత్రకూడా దాఖ లాలుగా ఉన్నాయి. ట్రంప్ ఇంత సీరియస్గా బాగ్దాదీ చావు గురించి అంత హడా వుడిగా చేసిన ప్రకటన ఆధారాల్ని పాశ్చాత్య పరిశీలకులు, కొన్ని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. అవి: 1. కొన్ని నెలల్లో రానున్న అధ్యక్ష ఎన్నికల పూర్వ రంగంలో ఇటీవల ట్రంప్ రష్యా, చైనాల పైన పొంతన లేని ఆరోపణలు చేస్తుండటం, తద్వారా అమెరికా ప్రతిష్టను దిగజార్చడానికి నిరసనగా అమెరికా పార్లమెంటులో ట్రంప్కు వ్యతి రేకంగా అభిశంసన తీర్మానం రాబోవడం. 2. సిరియాలో అమెరికా, కుర్దిష్ అనుయాయులపై టర్కీ జరిపే దాడులకు దూరంగా ఉండటం కోసం సిరియా నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవాలని ట్రంప్ అకస్మాత్తుగా ప్రకటించడాన్ని రిపబ్లికన్, డెమోక్రాటిక్ పక్షాలు రెండూ విమర్శించడం. ఇందుకు అనుగుణంగా టర్కీ, కుర్దూల మధ్య యుద్ధవిరమణను ప్రకటిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించ డమూ! ఇది ఇలా ఉండగా, బాగ్దాదీని ఖతం చేసినట్లు స్వయానా ట్రంప్ అకస్మా త్తుగా చేసిన ప్రకటనను స్వయానా అమెరికన్ సైనిక యుద్ధ తంత్ర కార్యాలయం (పెంటగన్) సైతం ధృవీకరించడానికి నిరాకరించింది. చివరకు ‘ఆసులో గొట్టాం’ మాదిరిగా చీమ చిటుక్కుమంటే చాలు విసుగూ విడుపూ లేకుండా ప్రచారం కోసం ప్రకటనలు విడుదల చేస్తూండే ట్రంప్ అధ్యక్ష ప్రాసాద సాధికార ప్రతినిధి హాగన్ గిడ్లీ సహితం నోరు మెదపకుండా అదంతా ట్రంపే చూసుకుంటాడు లెమ్మని ముక్తసరిగా చెప్పాడు. పైగా బాగ్దాదీని అంతమొందించడా నికి జరిగిన దాడి ప్రయత్నం ‘జయ ప్రదమయిందా’ అన్న ప్రశ్నకు దాడిని నిర్వహించానని చెప్పిన అధికారి కూడా వివరాలు తెల్పడానికి నిరాకరించాడు. ఇక సుప్రసిద్ధ ప్రపంచ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ సంప్రదించిన అమెరికన్ అధికారులు కూడా నిజానిజాల గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇన్ని వైరుధ్యాల మధ్య బాగ్దాదీ ‘హతం, ఖతం’ వార్తలు విడుదలయ్యాయి. అందుకే, గతంలో ‘9/11’ (2001–2002) నాటి అమెరికా జంట వాణిజ్య కేంద్ర భవన సముదాయంపై జరిగిన ఆకస్మిక దుర్మార్గపు దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ దాడికి వ్యూహకర్త, ఇస్లామిక్ ఉగ్ర వాద నాయకుడు బిన్లాడెన్ స్వయంగా దాడికి కారకుడని ప్రచార ప్రకటన జార్జిబుష్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో జరిగింది. కానీ, ఆ తర్వాత 1,500 మంది అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రసిద్ధ భవన నిర్మాణ ఇంజనీర్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, పలువురు శాస్త్రవేత్తలు, భౌగోళికంగా భవన పునాదుల నిర్మాణ సంబంధమైన వాస్తు శిల్పులు, సామాజిక శాస్త్ర వేత్తలతో ఏర్పడిన కమిటీ భేటీ జరిపి సమర్పించిన నివేదికలో న్యూయార్క్, వాషింగ్టన్ వ్యూహ కేంద్రాలపై దాడి చేసిన సివిలియన్ విమానాలు ఎక్కడివో కావు, అమెరికావేననీ, ఫ్లారిడా (అమెరికా)లోని సైనిక కేంద్రం నుంచి బయలు దేరినవేనని ప్రకటించారు.. అంతవరకూ అమెరికా ప్రజలు, ప్రపంచ ప్రజలూ అది ఉగ్రవాద మూకల దాడేనని నమ్మాల్సి వచ్చింది, విశ్వసించాల్సి వచ్చింది. ఆ విశిష్ట నిపుణుల సంఘం ఇప్పటికీ దాడి అనంతర వాస్తవాలను తవ్వి తీయడం మానలేదు సుమా! పైగా, ట్విన్ టవర్లపై దాడి, బిన్ లాడెన్పై దాడి, అతగాడి మృతి గురించి కూడా పరస్పర విరుద్ధ కథనాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. 2001 సెప్టెంబర్ 11న జంట వాణిజ్య సముదాయాలపై ఉగ్రవాద దురాగతం జరిగిందనీ, ఈ దాడిని నిర్వహించినవాడు బిన్లాడెన్ అనీ మనం నమ్ముతూ వస్తున్నాం. కానీ, ఆ లాడెన్ 2001 అక్టోబర్ 10న రావ ల్పిండి ఆసుపత్రిలో ఉన్నాడని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అమెరికాలోని జంట వాణిజ్య సముదాయ భవనాలు కూలిపోయింది 2001 సెప్టెంబర్ 11న అనీ, 2001 సంవత్సరం మధ్యలో లాడెన్ దుబాయ్లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ సీబీఎస్ న్యూస్ యాంకర్ డాన్ రాదర్ రాశాడు. ఇక ‘న్యూయార్క్ టైమ్స్’ అయితే, లాడెన్ మృతిని 2001 డిసెంబర్గా పేర్కొన్నది. అతణ్ణి ఖననం చేసింది అప్ఘానిస్తాన్ అని చెప్పింది. ఇక అమెరికా అయితే లాడెన్ను పట్టుకుని ఖతం చేసింది అబ్బాటోబాద్లో అని రాసింది. ఇన్ని వైరుధ్యాల మధ్య లాడెన్ వాస్తవాలు దోబూచులా డుతూ వచ్చాయి. అసలింతగా లాడెన్ వెనుక దాగివున్న అసలు రహస్యమేమిటి? అది అమెరికాకే తెలుసు. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్లో ఏలుబడిలో ఉన్న సోషలిస్టు అనుకూల ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వాన్ని ఈ లాడెన్, అతని అనుయాయుల సహకారంతోనే ఆయుధాలిచ్చి అమెరికా కూలదోసింది. ఆ తర్వాత లాడెన్ తనకు ‘ఏకు మేకై’ పోయాడు కాబట్టి, అతణ్ణి హత మార్చాలి. లాడెన్ను ఖతం చేసిన అమెరికా అతని అస్థిపంజరం ఆధారంగా వరస వారీగా ఇరాక్, ఇరాన్, సిరియాలపై యథేచ్చగా దాడులు చేసి, ఆ దేశాల వాస్తు శిల్ప సంపదను దోచేసి అమెరికాకు తరలించుకుపోవడం మరపురాని సామ్రాజ్యవాద యుద్ధ సత్యాలు. కనుకనే, సామాజిక చేతనాజీవులైన అసాంజే (వికీలీక్స్), అమె రికా యుద్ధతంత్ర వ్యవస్థలో జాతీయ భద్రతా దళ శాఖలో పనిచేసి కళ్లారా చూసిన ఘోరాలకు చలించిపోయి కాందిశీకుడై ప్రపంచ ప్రజ లకు అమెరికా యుద్ధోన్మాద వ్యవస్థ స్వరూప స్వభావాలను ప్రాణా లకు తెగించి ఈరోజుదాకా ఎండగడుతూ వచ్చిన ఎడ్వర్డ్ స్నోడెన్ మరపురాని త్యాగశీలురుగా సజీవులై బాధలను భరిస్తూ మనకళ్ల ముందే అమెరికాకు చిక్కకుండా నిత్య సింహస్వప్నాలై వెలుగొందు తున్నారని మరవరాదు. 9/11 జంట వాణిజ్య సముదాయాల ఘోర కలికి అమెరికా పాలకులు ఎలా కారకులో నిరూపిస్తూ ప్రపంచ ప్రజలు ఎన్నటికీ మరవకూడని ‘శాశ్వత రికార్డు’ (పర్మనెంట్ రికార్డ్) పేరిట ఇటీవలనే (2019) ఒక ప్రసిద్ధ గ్రంథాన్ని రాశాడు స్నోడెన్. ‘‘9/11 ఘోరకలి ఘటనలు ప్రతిచోట అగాథాలు సృష్టించాయి. కుటుంబాలలో ఛిద్రాలు, వివిధ వర్గాల ప్రజలు, సామాజికుల మధ్య విచ్ఛిన్నాలు, కమ్యూనికేషన్స్ విచ్ఛిత్తీ, ఉపరితలంపైనే కాదు, భూగ ర్భంలోనూ విచ్ఛిన్న శకలాలే’’నని రాశాడు. ఈ స్వవినాశన చర్యకు ఫలితంగా అమెరికా చెప్పిన సమాధానం– పదిలక్షలమంది ప్రజల హత్యాకాండ అని రాశాడు (పేజి 77–78). అలాగే, 9/11 దుర్మార్గ ఘటన గురించి అమెరికా ప్రభుత్వం ‘సాధికారిక నివేదిక’ పేరిట (మిస్టీరియస్ కొలాప్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్–7, ది ఫైనల్ రిపోర్ట్, ఎబౌట్ 9/11) వెలువరించిన కవిలకట్ట కాస్తా ‘శుద్ధ అబద్ధపు అశా స్త్రీయ దస్తరం’ అని డేవిడ్ రే అనే పరిశోధకుడు వెల్లడించారు. ఈ ‘నివేదిక’ మనకాలపు పచ్చి అబద్ధాల పుట్టే కాదు, ప్రపంచంలో ఎవరి మీద కాలు దువ్వని అనేక శాంతి కాముక దేశాలపై ఏదో ఒక మిష పైన అమెరికన్ దురాక్రమణ యుద్ధాలు నిర్వహించడానికి ఈ తప్పుడు నివేదిక ద్వారాలు తెరిచిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బాగ్దాదీ ‘ఆపరేషన్’!
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అధినాయకుడు, ఉగ్రవాది అబూ బకర్ అల్ బాగ్దాదీ కోసం అమెరికా అయిదారేళ్లుగా సాగిస్తున్న వేట ముగిసింది. అతగాడిని సిరియాలో తమ దళాలు వెంటాడి ఓ సొరంగంలో చిక్కుకున్నాక మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ముందు ట్విటర్ ద్వారా ఏకవాక్య ప్రకటన చేసి, ఆ తర్వాత మీడియా సమావేశం ద్వారా బాగ్దాదీ మృతి వివరాలను ఆయన వెల్లడించారు. వీక్షకుల్లో ఉత్కంఠ రేపేందుకు చానెళ్లు సస్పెన్స్ దట్టించి మధ్యమధ్యలో విడుదల చేసే టీజర్ల మాదిరి ఆ ట్వీట్ ఉంది. తమ బలగాల చర్య పర్యవసానంగా ఐఎస్ నడ్డి విరచగలిగామని ట్రంప్ సంతోషపడుతున్నారు. ఆ మాటెలా ఉన్నా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని మళ్లీ గెలుచుకోవాల్సిన సమయం దగ్గర పడుతున్న వేళ బాగ్దాదీ మరణం ఖచ్చితంగా ఆయనకు కలిసిరావొచ్చు. ఇరాక్ తదితర దేశాల్లో అనేకానేక దురాగతాలకూ, దుర్మార్గాలకూ కారణమైన సంస్థ అధినాయకుడు మరణించాడంటే సహజంగానే ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఒక జర్మన్ పాత్రికేయుడు యూర్గన్ టోడెన్ హ్యోపర్కి అయిదేళ్లక్రితం ఎదురైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాక్లోని మోసుల్లోఐఎస్ ముఠాలో కొందరిని కలిసి బాగ్దాదీని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరిన ఆయనతో ‘అతను కేవలం వ్యక్తిమాత్రుడు. విద్యావంతులు, నాయకులు సభ్యులుగా ఉండే ఒక మండలి ఆయన్ను నాయకుడిగా ఉంచింది. ఆయన మరణిస్తే ఆ మండలి మరొకరిని ఆ స్థానంలో ప్రతిష్టిస్తుంది. మీరు కలవదల్చుకుంటే మండలి సభ్యుల్ని కలవండి’ అని సలహా ఇచ్చారట! కనుక బాగ్దాదీ మరణంతో ఐఎస్, దాని దుర్మార్గాలు కనుమరుగవుతాయని భావించడం దురాశే. ఒకపక్క దురాగతాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు కొనసాగిస్తూనే.... ఆ సంస్థ పుట్టుకకూ, అది పుంజుకోవడానికి ఏ కారణాలు దోహదపడ్డాయో గుర్తించడం, అందుకు కారకులెవరో తేల్చడం, వారిపట్ల ఎలా వ్యవహరించాలో నిర్ణయించడం ఇప్పుడు ప్రపంచ ప్రజల కర్తవ్యం. లేనట్టయితే బాగ్దాదీలాంటివారు మున్ముందు కూడా పుట్టు కొస్తూనే ఉంటారు. ఊహకందని మారణహోమాలు సృష్టిస్తూనే ఉంటారు. సరిగ్గా ఎనిమిదేళ్లక్రితం అల్ కాయిదా నాయకుడు బిన్ లాడెన్ను అమెరికా మెరైన్లు మట్టు బెట్టినప్పుడు కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా మీడియా సమావేశం ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అయితే అందులో ట్రంప్ ప్రదర్శించినంత నాటకీయత లేదు. ఆయన ఒక ప్రకటన చదవబోతున్నట్టు తెలుసుకున్న వెంటనే అప్పటికప్పుడు చానెళ్లు అన్నిటినీ నిలిపి దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఒబామా ప్రకటనలో అవసరమైన వివరాలేమీ లేవు. కానీ ట్రంప్ తీరు వేరు. ఆపరేషన్ మొత్తం ఎలా జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పారు. ఆయన మాటలు జాగ్రత్తగా విన్న ప్రతి ఒక్కరూ అది కళ్లముందే జరిగిందన్న భ్రాంతికి లోనుకావడం ఖాయం. అమెరికన్ బలగాలు గుర్తించి కాల్పులు మొదలెట్టిన వెంటనే బాగ్దాదీ ముగ్గురు పిల్లల్ని తీసుకుని లబోదిబోమంటూ ఒక సొరంగంలో దూరిన వైనం, ఆ సొరంగానికి బయటకుపోయే మార్గం లేకపోవడం గురించి ట్రంప్ వివరించారు. అనంతరం పాత్రికేయులడిగిన సందేహాలన్నిటికీ జవాబి చ్చారు. మొత్తం నలభై నిమిషాలపాటు ట్రంప్ ప్రసంగించారు. బాగ్దాదీ తొలిసారి ప్రపంచానికి పరిచయమైననాటికీ, ఇప్పుడు మరణించేనాటికీ పరిస్థితుల్లో వచ్చిన వ్యత్యాసాన్ని గమనిస్తే ఐఎస్ ఉత్థానపతనాల గురించి స్థూలంగా అర్ధమవుతుంది. 2010లో ఐఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించి నప్పుడు అది ప్రపంచ ముస్లింలందరికీ మార్గదర్శకత్వంవహిస్తుందని బాగ్దాదీ చెప్పుకున్నాడు. కానీ ఇరాక్, ఇరాన్, సిరియా, అఫ్ఘానిస్తాన్ వగైరాల్లో అమెరికా అనుసరిస్తున్న ధోరణుల్ని గట్టిగా వ్యతిరేకించే ప్రపంచ ముస్లిం ప్రజానీకంలో సైతం అతనికి పెద్దగా మద్దతు లభించింది లేదు. సరిగదా కార్యకలాపాలు సాగించిన ప్రాంతాల్లోనే అది క్షీణించింది. తన చుట్టూ ఉండేవారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితికి అతను చేరుకున్నాడు. అల్ కాయిదా, ఐఎస్ మొదట్లో కలిసి పనిచేసినా 2013లో తెగదెంపులు చేసుకున్నాక ఆ రెండు సంస్థలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికాకు సాగిలబడిన ద్రోహులు మీరంటే మీరని నిందించుకు న్నాయి. పిరికిపందలని తిట్టుకున్నాయి. కానీ అల్ కాయిదా అనుబంధ సంస్థ హయత్ తహ్రిర్ అల్ షామ్(హెచ్టీఎస్)కు పలుకుబడి ఉన్న సిరియాలోని అద్లిబ్ ప్రాంతంలో ఇప్పుడు బాగ్దాదీ పట్టు బడటాన్ని గమనిస్తే చిట్టచివరిలో అతని స్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఖలీఫాగా తనను తాను ప్రకటించుకున్నాక అతను నేరుగా దానికి నాయకత్వంవహించింది తక్కువ. పైగా దాని కంటూ ప్రత్యేకించి ఒక స్థావరం లేదు. 2003లో అమెరికా దురాక్రమించే సమయానికి ఇరాక్ ఎంతో ప్రశాంతంగా ఉండే సోషలిస్టు, సెక్యులర్ రాజ్యం. రాజ్యాంగంలో ఇస్లామ్ను అధికార మతంగా ప్రకటించడానికి ఆ దేశాధ్యక్షుడు సద్దాంహుస్సేన్ నిరాకరించారు. అలాంటి దేశాన్ని వల్లకాడుగా మార్చి అప్పటికి పాఠశాల చదువు కూడా పూర్తిచేయని బాగ్దాదీ లాంటివారిని ఉగ్రవాదులుగా రూపాంతరం చెందే స్థితికి చేర్చింది అమెరికాయే. ఐఎస్ బాధితుల్లో అత్యధికులు ముస్లింలే. ఈ వాస్తవాన్ని దాచి అది మత సంస్థగా చిత్రించడం పాశ్చాత్య మీడియా అవగాహన లేమి పర్యవసానం. సిరియా అధ్యక్షుడు అసద్ను పదవీచ్యుతుణ్ణి చేయడం కోసం య«థేచ్ఛగా డాలర్లు, ఆయుధాలు కుమ్మరించి, ఎందరు మొత్తుకుం టున్నా వినక ఐఎస్ను పెంచి పోషించిన అమెరికాయే ఇప్పుడు బాగ్దాదీ మరణంలో తన విజ యాన్ని వెదుక్కుంటున్న తీరు విడ్డూరం. కనీసం ఇప్పటికైనా తన చేష్టలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తున్నాయో గ్రహించి తీరు మార్చుకోవడం అమెరికా బాధ్యత. ఆ బాధ్యతను అది గుర్తించేలా చేయడం ప్రపంచ ప్రజానీకం కర్తవ్యం. -
‘హిందూ విలయంగా నామకరణం చేశాం’
కశ్మీర్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) సంచలన ప్రకటన చేసింది. భారత్లో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. దానికి ‘హిందూ విలయం’గా పేరు పెట్టినట్లు ఐసిస్ పేర్కొంది. ఈ విషయాన్ని ఉగ్రవాద సంస్థకు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కశ్మీర్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత ఐసిస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాక షోపియాన్ జిల్లాలోని అమ్షిపొరాలో తాము జరిపిన దాడిలో భారత ఆర్మీకి బాగానే ప్రాణ నష్టం జరిగిందని ఐసిస్ పేర్కొంది. ఐసిస్ చేసిన ప్రావిన్స్ ఏర్పాటు ప్రకటనను ఎస్ఐటీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కట్జ్ కొట్టిపారేశారు. ఈ సంస్థ ఇస్లామిక్ ఉగ్రవాదులను ట్రాక్ చేసే పనిలో ఉంటుంది. అసలు దాని ఉనికే లేని వేళ.. ఐసిస్ ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేసినట్టు చెప్పడం పూర్తిగా అసంబద్ధమని ఎస్ఐటీఈ పేర్కొంది. ఇక శుక్రవారం నాటి ఎన్కౌంటర్లో మృతి చెందిన సోఫి కశ్మీర్లోని పలు ఉగ్రవాద గ్రూపుల్లో దశాబ్దకాలంగా యాక్టివ్గా ఉన్నాడు. శ్రీనగర్ కేంద్రంగా నడిచే ఓ మేగజైన్కు సోఫి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐసిస్ సానుభూతిపరుడినని పేర్కొన్నట్టు మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. సోఫి ఈ ప్రాంతంలో భద్రతా దళాలపై జరిగిన పలు గ్రనేడ్ దాడుల్లో పాల్గొన్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం నాటి ఎన్కౌంటర్లో తమవైపు నుంచి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదని అధికారి స్పష్టం చేశారు. కశ్మీర్లో మిగిలి ఉన్న ఐసిస్ సానుభూతి పరుడు అతడొక్కడేనని, తాజా ఎన్కౌంటర్లో అతడు కూడా హతమయ్యాడని అధికారులు తెలిపారు. -
ఐదేళ్లకు కన్పించిన ఐఎస్ చీఫ్ బాగ్దాది
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అధినేత అబు బకర్ అల్ బాగ్దాది ఐదేళ్లలో తొలిసారిగా ఒక వీడియోలో కన్పించాడు. ఐఎస్ సంస్థ సోమవారం ఒక ప్రచార వీడియో విడుదల చేసింది. ఈ వీడియోను ఎప్పుడు తీశారో తెలియలేదు. కానీ తూర్పు సిరియాలోని ఐఎస్ స్థావరం బాగౌజ్ కోసం నెలల తరబడి కొనసాగించిన పోరాటం గురించి బాగ్దాది ప్రస్తావించారు. ‘బాగౌజ్ కోసం పోరాటం ముగిసింది’ అని బాగ్దాది తన ఎదురుగా ఉన్న వారితో అన్నాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల గురించి మాట్లాడారు. పేలుళ్లకు పాల్పడిన వారిని ప్రశంసించారు. -
‘శ్రీలంక పేలుళ్లు మా పనే’
కొలంబో : శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. పేలుళ్ల ఘటన ఐఎస్ మిలిటెంట్ గ్రూపు చర్యేనని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ మసీదులో ఇటీవల జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లకు పాల్పడ్డారని శ్రీలంక అధికారులు పేర్కొన్నారు. పేలుళ్ల ఘటనకు లంకకు చెందిన రెండు ఇస్లామిస్ట్ గ్రూపులే బాధ్యులని భావిస్తున్నారు. న్యూజిలాండ్లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించారు. కాగా పేలుళ్ల ఘటనకు సంబంధించి అనుమానితుడిగా భావించి ఓ సిరియన్ను అదుపులోకి తీసుకున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. -
సిరియా టు దక్షిణాసియా!
సాక్షి, హైదరాబాద్: లష్కరేతోయిబా, తాలిబన్, అల్ కాయిదా.. కరుడుగట్టిన ఈ ఉగ్రవాద సంస్థల్ని తలదన్నేలా ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న సంస్థే ఐసిస్. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్), ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనే పేర్లతో ప్రారంభమైన దీని ప్రస్థానం ప్రస్తుతం ఖండాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక విభాగాలతో విస్తరించింది. ఇరాక్, సిరియాల్లో షియాల ఆధిపత్యానికి గండికొడుతూ సున్నీల ప్రాబల్యం పెంచుతూ ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా ఐసిస్ ఏర్పడింది. ఇరాక్, సిరియాల్లో ఉన్న సున్నీ ప్రాంతాలను కలిపి ఓ రాజ్యంగా ఏర్పాటు చేయాలన్నది దీని తొలినాటి లక్ష్యం. తాజాగా భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేసి ప్రత్యేక దేశంగా చేయాలంటూ ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ అండ్ కశ్మీర్ (ఐఎస్జేకే) పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది హైదరాబాద్లో అరెస్టు అయిన ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్కు ఈ విభాగంతో సంబంధాలున్నాయి. సౌదీ అరేబియా ఆ చుట్టుపక్కల దేశాల్లో కార్యకలాపాలకు ఇస్లామిక్ స్టేట్ అరబ్ పెనిన్సులా (ఐఎస్ఏపీ), దక్షిణాసియా లో ఆపరేషన్స్ కోసం పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖురాసాన్ కేంద్రంగా మరో విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐసిస్ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్ బాగ్దాదీ, భారత్ వ్యవహారాల చీఫ్ షఫీ ఆర్మర్ మృతి తర్వాత విభాగాల వారీగా నేతలు తయారయ్యారు. దక్షిణాసియా లక్ష్యంగా.. ఐసిస్ ఖురాసాన్ మాడ్యూల్స్ కొన్నేళ్లుగా దక్షిణాసియా దేశాలను లక్ష్యం చేస్తూ వచ్చాయి. కేవలం పాక్, బంగ్లాదేశ్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకే అడ్డాగా మారిన నేపథ్యంలో తన ఉనికి చాటుకోవడానికి ఐసిస్ ప్రయత్నించింది. ఇలాంటిదే తొలి సారిగా ఢాకాలో 2016 జూలైలో జరిగిన బేకరీ ఘటన. భారత్లోనూ విధ్వంస కార్యక్రమాలు చేయట్టాలని ఐఎస్ చేసిన యత్నాలు నిఘా వర్గాల అప్రమత్తతతో సఫలీకృతం కాలేదు. మాల్దీవులలో కూడా 90 మంది ఐసిస్ ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో పెనుముప్పుతప్పింది. కానీ, తాజాగా శ్రీలంకలో వారి ప్రయత్నం సఫలమైంది. -
అఫ్గాన్లో ‘ఐఎస్’కు ఎదురుదెబ్బ
కాబూల్: అఫ్గానిస్తాన్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు నంగరార్లో 27 మంది ఉగ్రవాదులను అఫ్గాన్ ప్రత్యేక భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దీనికి ప్రతిగా తాలిబన్లు ఉత్తర అఫ్గాన్లో భద్రత బలగాలపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 15 మంది పోలీసులు మృతిచెందారు. ఐఎస్ ఉగ్రవాదులకు కంచుకోటగా ఉన్న అఫ్గాన్లోని అచిన్ జిల్లా నంగరార్లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం ప్రత్యేక బలగాలు హెలికాప్టర్ల ద్వారా దాడులు చేశాయి. ఈ దాడుల్లో 27 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు నంగరార్ ప్రాంతీయ కౌన్సిల్ సభ్యుడు అజ్మల్ ఒమర్ మీడియాకు తెలిపారు. అయితే ఈఘటనను ఉగ్రవాద సంస్థకు చెందిన మీడియా అమఖ్ వార్తా సంస్థ మాత్రం అఫ్గాన్–అమెరికా సంయక్త దళాల చర్యను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొంది. అయితే అజ్మల్ ఒమర్ మాత్రం ఈ ఆపరేషన్లో అమెరికా దళాలు పాల్గొన్నాయా లేదా అన్నది తెలియదని స్పష్టం చేశారు. -
‘మా కుమారుడ్ని విడిచిపెట్టండి’
శ్రీనగర్: కశ్మీర్కు చెందిన మరో యువకుడు ఉగ్రవాదుల్లో చేరాడు. గ్రేటర్ నోయిడాలోని శారద విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్న అహ్తెసామ్ బిలాల్ సోఫీ(17) ఇస్లామిక్స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్(ఐఎస్జేకే) ఉగ్రసంస్థలో చేరాడు. ఐఎస్ జెండా ముందు బిలాల్ దిగిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. శ్రీనగర్కు చెందిన సోఫీ నోయిడాలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేందుకు వర్సిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని అక్టోబర్ 28న వర్సిటీ నుంచి బయలుదేరిన సోఫీ అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు నోయిడాతో పాటు శ్రీనగర్లోని ఖన్యార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని దయచేసి ఇంటికి పంపాలని ఉగ్రవాదులను వేడుకుంటూ సోఫీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోఫీ తండ్రి బిలాల్ ఓ వీడియోలో ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మా మీద దయ చూపండి. దయచేసి నా కుమారుడిని ఇంటికి పంపండి. మా మొత్తం కుటుంబంలో ఏకైక మగ సంతానం అతడే. సోఫీ.. మన కుటుంబంలోని 12 మందికి నువ్వే దిక్కు. గత రెండేళ్లలో మన కుటుంబంలో నలుగురిని పోగొట్టుకున్న సంగతి మర్చిపోయావా?’ అని అన్నారు. ఇంటికి రావాల్సిందిగా తల్లి సైతం కొడుకును వీడియోలో కోరింది. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు భారీ ఎన్కౌంటర్ చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున అనంత్నాగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిపిన ఎన్కౌంటర్లో జమ్మూ కశ్మీర్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్జేకే) చీఫ్ దావూద్ అహ్మద్ సోఫీ సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీసు, మరో పౌరుడు మృతిచెందారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పలు హత్య కేసు లు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఘటనల్లో సోఫీ కీలక నిందితుడని తెలిపారు. వచ్చే వారం (జూన్ 28 నుంచి) అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ భద్రతాబలగాలకు నైతిక బలాన్నిచ్చింది. మరోవైపు, పుల్వామా జిల్లాలోని త్రాల్ మార్కెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. తెల్లారేసరికి ఆపరేషన్ పూర్తి శుక్రవారం తెల్లవారుజామునే ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన భద్రతా బలగాలు.. తెల్లారేసరికి పనిపూర్తి చేశాయి. ఉగ్రవాదులు దాక్కున్నారన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అర్థరాత్రే బలగాలు చేరుకున్నాయి. అయితే.. తెల్లవారాకే మృతుల్లో దావూద్ సోఫీ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని ఐఎస్జేకే సభ్యులైన ఆదిల్ రెహమాన్ భట్, మహ్మద్ అష్రఫ్ ఇటూ, మాజిద్ మంజూర్ దార్లుగా గుర్తించినట్లు కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి వెల్లడించారు. ‘ఈ ఆపరేషన్ విజయవంతమైంది. రాష్ట్ర పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సమన్వయంతో పని పూర్తిచేశారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో ఖిరం గ్రామానికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఓ ఇంట్లో దాక్కున్నారు. ఇంటిని చుట్టుముట్టిన బలగాలు ఆపరేషన్ పూర్తి చేశాయి’ అని ఆయన వెల్లడించారు. భారత్కు ఐఎస్ ముప్పు! ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఐఎస్ ప్రభావం భారత్లో పెద్దగా లేదని.. మన ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతోంది. కశ్మీర్లోనూ మిగిలిన ఉగ్రవాద సంస్థలతో పోలిస్తే.. ఐఎస్ ప్రభావం అసలేమాత్రం లేదని చెప్పుకొస్తోంది. కానీ కొంతకాలంగా కశ్మీర్లో ఐఎస్ జెండాలు కనబడుతున్నాయి. రాళ్లు రువ్విన ఘటనల చిత్రాల్లో యువకుల చేతిలో ఐఎస్ జెండాలు కనిపిస్తూనే ఉన్నాయి. అనంత్నాగ్లో శుక్రవారం నాటి ఎన్కౌంటర్తో ఐఎస్ లోయలో ఐఎస్ ప్రభావం ఉన్నట్లు సుస్పష్టమైంది. జమ్మూకశ్మీర్ కోసం ఐఎస్ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు తేలింది. ఏ++ కేటగిరీ (ఉగ్రవాదుల స్థాయిని బట్టి భద్రతా బలగాలు ఇచ్చే రేటింగ్) ఉన్న జేకేఐఎస్ చీఫ్ దావూద్ సోఫీని హతమార్చటం ద్వారా.. లోయలో విస్తరించేందుకు ఐఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తుందనేది సుస్పష్టమైంది. హిట్ లిస్ట్తో ఆర్మీ ఆపరేషన్ కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భద్రతా బలగాలు ‘ఆపరేషన్ ఆలౌట్’ను ప్రారంభించాయి. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని.. ఒక్కో ఉగ్రవాద సంస్థను, అందులోని ముఖ్యనేతలను పక్కాగా టార్గెట్ చేస్తూ 22మందితో జాబితాను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ (11 మంది), లష్కరే తోయిబా (7), జైషే మహ్మద్ (2), అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్, జేకేఐఎస్ల నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో ఉన్నారు. జేకేఐఎస్ చీఫ్ హతంతో ఈ జాబితా 21కి చేరింది. భద్రతను సమీక్షించిన విజయ్ జమ్మూకశ్మీర్ గవర్నర్ సలహాదారుగా నియమితుడైన రిటైర్డు ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ కశ్మీర్ లోయలోని భద్రతా పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం ఉదయమే ఆయన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. అటు, గవర్నర్ రూల్ అమల్లోకి రావడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజ్భవన్లో జరిగిన ఈ భేటీలో నేషనల్ కాన్ఫరెన్స్ తరపున ఒమర్ అబ్దుల్లా, పీడీపీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిలావర్ మిర్ సహా.. వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ గవర్నర్ను కలిసి.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జూన్ 28 నుంచి 60 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్రలో యాత్రికుల వాహనాలకు ట్రాకింగ్ చిప్స్ను అమర్చనున్నట్లు జమ్మూ రేంజ్ ఐజీ ఎస్డీ సింగ్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో యాత్రికులు, వారి వాహనాల భద్రతను నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా?: జైట్లీ న్యూఢిల్లీ: సామాన్య పౌరుల మానవహక్కుల్ని పరిరక్షించేందుకు ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరిని అవలంబించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. చంపడానికి, చావడానికి సిద్ధమై వస్తున్న ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా? అని ప్రశ్నించారు. కశ్మీర్లో సైనిక ఆపరేషన్లలో ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ వ్యాఖ్యానించడంపై జైట్లీ మండిపడ్డారు. ‘ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు చావడానికి సిద్ధంగా ఉంటాడు. అతను ఇతరుల్ని చంపడానికీ వెనుకాడడు. అలాంటివాళ్లు ఎదురుపడినప్పడు వారిని సత్యాగ్రహంతో ఎదుర్కోమంటారా? ఉగ్రవాది చంపడానికి ముందుకొస్తుంటే భద్రతాబలగాలు అతడిని చర్చలు జరిపేందుకు ఆహ్వానించాలా?’ అని ప్రశ్నించారు. మావోయిస్టుల మద్దతున్న మానవహక్కుల సంఘాలు వేర్పాటువాదం, హింసను ప్రోత్సహిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి గ్రూపుల్ని కాంగ్రెస్ గతంలో వ్యతిరేకించినా జేఎన్యూ, హెచ్సీయూలో దేశవ్యతిరేక నినాదాలు ఇచ్చినవారితో చేతులు కలిపేందుకు రాహుల్ గాంధీకి ఎలాంటి ఇబ్బంది లేదని విమర్శించారు. కశ్మీరీల తొలి ప్రాధాన్యం స్వాతంత్య్రమే కాంగ్రెస్ నేత సోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలకు ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అవకాశమిస్తే వారు స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గుచూపుతారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమనీ, పార్టీకి దానితో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో సోజ్ మాట్లాడుతూ.. ‘కశ్మీరీలు పాకిస్తాన్లో విలీనం కావాలనుకోవడం లేదని ముషార్రఫ్ చెప్పారు. ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అధికారం కశ్మీరీలకు ఇస్తే వారు స్వతంత్ర కశ్మీర్కే తొలి ప్రాధాన్యం ఇస్తారన్నారు. ఆయన చెప్పింది అప్పటికీ, ఇప్పటికీ నిజమే. నేను కూడా అదే చెప్పాను. కానీ కశ్మీర్కు స్వాతంత్య్రం రావడం అన్నది అసాధ్యమని నాకూ తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి తీవ్రనిరసన వ్యక్తమైంది. దీంతో సోజ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ఖండించారు. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగంగా ఉందనీ, భవిష్యత్లోనూ ఉంటుందనీ స్పష్టం చేశారు. త్వరలో మార్కెట్లోకి రానున్న తన పుస్తకం అమ్మకాలను పెంచుకునేందుకే సోజ్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారని సూర్జేవాలా విమర్శించారు. కాగా సోజ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కాంగ్రెస్ను డిమాండ్ చేసింది. -
63మంది ఉగ్రవాదులు హతం
కాబూల్: అఫ్గానిస్తాన్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతపై దృష్టిసారించాయి. దీంతో కేవలం 24 గంటల వ్యవధిలో 63 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు అఫ్గాన్ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఐసిస్కు చెందిన 14 మంది ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా విభాగం భావిస్తోంది. ఫరా, కాందహర్, పాక్తియా, ఉరుజ్గన్, నంగర్హర్ ప్రావిన్సులలో తమ భద్రతా సిబ్బంది ఆపరేషన్ చేపట్టారని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదులను మట్టుపెట్టిన తమ సిబ్బంది వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధులలో ఒకరైన మహ్మద్ రద్మానిష్ వెల్లడించారు. భద్రతా బలగాల ఆపరేషన్పై ఏ ఉగ్రసంస్థ కూడా స్పందించలేదని ఆయన వివరించారు. -
తౌఫీఖ్ సొంతూరు భద్రాది జిల్లా చండ్రుగొండ
-
తౌఫీఖ్ వివరాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఇస్లామిక్ స్టేట్, స్థానిక టెర్రరిస్ట్ సంస్థల్లో మాత్రమే ఇప్పటివరకు హైదరాబాద్ యువత పేరు వినిపించేది. తాజాగా కశ్మీర్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. అనంతనాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురు అన్సార్ గజ్వతుల్ హింద్ (ఏజీహెచ్) ఉగ్రవాదుల్లో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన మహ్మద్ తౌఫీఖ్ ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ తౌఫీఖ్ ఎవరో గుర్తించేందుకు రాష్ట్ర నిఘా వర్గాలు రికార్డులు తిరగేస్తున్నాయి. 2017లో కశ్మీర్కు వచ్చిన తౌఫీఖ్ ఏజీహెచ్లో కీలక స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కొన్నాళ్లుగా అల్ కాయిదా కశ్మీర్లోనూ ప్రాబల్యం చాటేందుకు ప్రత్యేకంగా ఏజీహెచ్ను ఏర్పాటు చేసింది. గతంలో ఇస్లామిక్ స్టేట్లో పని చేసిన వారు ఏజీహెచ్లో చేరినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. కాగా తౌఫిక్ సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడంతోపాటు, ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. -
'ట్రంప్ ఓ కుక్క.. ఇక మీపై బాంబుల వర్షమే..'
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించడంపై ఓ పక్క ముస్లిం దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుండగా ఏకంగా అమెరికాపై బాంబులు వేస్తామంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించింది. అమెరికాపై వరుస దాడులకు పాల్పడతామంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతకంటే ఎక్కువ వివరాలు మాత్రం తెలియజేయలేదు. జెరూసలేంను ట్రంప్ ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ నిర్ణయంపై అటు పాలస్తీనీయన్లతోపాటు ఇతర ముస్లిం దేశాల వాళ్లు యురోపియన్ దేశాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఓ టెలిగ్రాం విడుదల చేసింది. 'మాకోసం ఎదురు చూడండి. ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడు మన్హట్టన్లో ఉంది' అంటూ అందులో పేర్కొంది. 'ఇరాక్, యెమెన్, లిబియా, సిరియా, అస్ఘనిస్థాన్లో మీరు ఎలాంటి విధ్వంసం సృష్టించారో అదే మేం చేయనున్నాం. కాస్త ఎదురుచూడండి. మీ కుక్క(డోనాల్డ్ ట్రంప్) జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించాడు. అందుకే మీ రాజధానిపై బాంబులు కురిపించి మేం గుర్తింపునిస్తాం' అంటూ హెచ్చరించింది. -
'వారిని వెతికి వేటాడి చంపండి'
లండన్ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరే బ్రిటన్కు చెందిన పౌరులను వెతికి వేటాడి చంపాల్సిందేనని ఆ దేశ రక్షణశాఖ మంత్రి గావిన్ విలియమ్సన్ అన్నారు. పలువురు బ్రిటన్ నుంచి ఇరాక్, సిరియా వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారని, ఈ విషయాలను తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అలాంటి వారిని కచ్చితంగా వేటాడి చంపాల్సిందేనని సూచించారు. ప్రస్తుతం ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్లో దాదాపు 270మంది బ్రిటన్ పౌరులు ఉన్నట్లు తాము గుర్తించామని, వారిని మట్టుబెట్టేందుకు అవసరం అయితే బలగాలు వైమానిక దాడులు కూడా చేయాలని సూచించారు. 'వీలయిన ప్రతీది మనం తప్పకుండా చేయాలి. బెదిరింపులను తప్పించేందుకు మనం కూడా విధ్వంసం చేయాలి' అని ఆయన ఆవేశంగా అన్నారు. అంతేకాకుండా బ్రిటన్ నుంచి వెళ్లి ఐసిస్లో చేరినవారిని తిరిగి బ్రిటన్ రానివ్వకుండా చేయాలని, వారిని అంతమొందించాలని చెప్పారు. -
‘ఇస్లామిక్ స్టేట్ను ఊడ్చేశాం’
బిరుట్ : ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్.. ఇక పూర్తిగా ముగిసిన చరిత్ర అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూనీ మంగళవారం ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్ను దేశం నుంచి పూర్తిగా తుడిచేశామని, ఈ విషయాన్ని ప్రకటించేందుకు గర్వంగా ఉందని రెవెల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖసీమ్ సొలేమాని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఇరాన్లో ఇస్లామిక్ స్టేట్ విస్తృతంగా విస్తరించింది. ఈ క్రమంలో పలు ఉగ్రవాద దాడులను ఇరాన్ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. కొన్ని నెలలుగా ఐఎస్ను ఇరాన్ సైన్యం ఊచకోత కోస్తూ వస్తోంది. అందులో బాగంగానే శనివారం నాటికి దేశసరిహద్దుల నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను తరిమికొట్టినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. -
ఇస్లామిక్ స్టేట్ కథ ముగిసింది?
మాస్కో : సిరియాలో ఇస్లామిక్ స్టేట్ కథ దాదాపు ముగిసినట్టేనని రష్యా మిలటరీ అధికారులు వెల్లడించారు. సిరియాలో కేవలం 8 శాతం భూభాగం మాత్రమే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతిలో ఉందని.. దీనిని కూడా కొద్ది రోజుల్లోనే స్వాధీనం చేసుకుంటామని రష్యన్ మిలటరీ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదులపై సైన్యం విజయం సాధిస్తోందని.. సిరియాలో సైన్యానికి నాయకత్వం వహిస్తున్న సెర్గీ రుడోస్కీ తెలిపారు. రష్యా వైమానిక దళం క్రమం తప్పకుండా ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయని అన్నారు. -
ఆ 39 మంది ఏమయ్యారో?!
బాగ్దాద్ : మూడేళ్ల కిందట మోసుల్లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల ఆచూకీ ఇంత వరకూ తెలియలేదని ఇరాక్ ప్రధాని హైదర్ ఆల్ అబాదీ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇరాక్ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆదివారం చెప్పారు. మూడేళ్ల కిందట అపహరణకు గురైన 39 మంది జీవించి ఉన్నారా? లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. అయితే వాళ్లు ప్రాణాలతో ఉండాలని మాత్రం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గత వారంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. 39 మంది కార్మికులను క్షేమంగా విడిపించాలని తనను కోరినట్లు ఆయన చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ నుంచి మోసుల్ను స్వాధీనం చేసుకున్న క్షణం నుంచి 39 భారతీయుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
లండన్లో బాంబు దాడి: ఒకరి అరెస్టు!
బీరట్: లండన్ భూగర్భ మెట్రోరైలులో జరిగిన బాంబు దాడికి తమదే బాధ్యత అని ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ అనుబంధ సంస్థ మెట్రో రైలులో బాంబు దాడి నిర్వహించిందని పేర్కొంది. ఈ మేరకు తన 'అమాక్' ప్రొపగండ ఏజెన్సీ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ బాంబు దాడి కేసులో అనుమానితుడిగా భావిస్తున్న 18 ఏళ్ల యువకుడిని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. తాజా ఉగ్రవాద దాడి నేపథ్యంలో లండన్ నగరానికి తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం పశ్చిమ లండన్లోని పార్సన్స్ గ్రీన్ అండర్గ్రౌండ్ రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ లైన్ ట్రైన్లో భారీ పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. మొదట్లో దీన్ని ప్రమాదంగా భావించినప్పటికీ.. అనంతరం లండన్, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దీన్ని ఉగ్రవాదుల బకెట్ బాంబు విస్ఫోటనంగా తేల్చా రు. బకెట్లో ఐఈడీ (ఇంప్రువైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)ను ఉపయోగించి ఈ పేలుళ్లకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ రూటు గుండా వెళ్లే రైలు సర్వీసులను రద్దుచేశారు. లండన్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఏడాదిగా ఐసిస్ చెరలో.. నేడు భారత్కు..
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు ఏడాదిపాటు ఉగ్రవాదుల చేతిలో బందీగా ఉన్న కేరళకు చెందిన క్రైస్తవ మత ప్రబోధకుడు ఫాదర్ టామ్ ఉజున్నాలిల్ ఎట్టకేలకు బయటపడ్డారు. ఆయన మంగళవారం రాత్రిలోగా కేరళకు చేరుకుంటారని కేంద్ర విదేశాంగ వర్గాల సమాచారం తెలిపింది. ఫాదర్ టామ్ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 2016 మార్చి నెలలో యెమెన్లోని అడెన్లో మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంపై దాడి చేసి ఎత్తుకెళ్లారు. ఆ దాడిలో దాదాపు 15మంది ప్రాణాలు కోల్పోయారు. ఫాదర్ టామ్ను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లడం కేరళలో పెద్ద కలకలమే రేపింది. యెమెన్లో భారత్కు రాయబార కార్యాలయం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని వివిధ దేశాలను సంప్రదించడం ద్వారా యెమెన్కు దగ్గరవడంతో అక్కడి అధికారులు, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పరస్పర సమన్వయంతో తిరిగి ఆయనను భద్రంగా ఉగ్రవాదుల చెర నుంచి విడిపించగలిగారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ 'ఫాదర్ టామ్ సురక్షితంగా బయటపడ్డారనే విషయాన్ని వెల్లడిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది' అంటూ ఆమె ట్వీట్ చేశారు. -
‘బాగ్దాదీ బతికే ఉండొచ్చు’
వాషింగ్టన్: అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇంకా బతికే ఉండొచ్చని అమెరికా టాప్ మిలిటరీ కమాండర్ అనుమానం వ్యక్తం చేశారు. తాము జరిపిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ హతమైనట్లు రష్యా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాగ్దాదీ ఇంకా బతికే ఉన్నాడని అనిపిస్తోంది’ అని యూఎస్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ స్టీఫెన్ టౌన్సెండ్ తెలిపారు. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడులు చేస్తున్న సంకీర్ణ దళాలకు స్టీఫెన్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. అమెరికా పెంటగాన్లోని విలేకరులతో స్టీఫెన్.. బాగ్దాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘బాగ్దాదీ చనిపోయినట్లు ముందు నేను కూడా భావించాను. అయితే కొన్ని నిఘా వర్గాల సమాచారం చూస్తుంటే బాగ్దాదీ బతికే ఉన్నాడని అనిపిస్తోంది. అతడి కోసం మా దళాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఒకవేళ వారు అతడిని గుర్తిస్తే కచ్చితంగా చంపేస్తారే గానీ.. బందీగా పట్టుకోరు’ అని స్టీఫెన్ తెలిపారు. యుఫరేట్స్ నదిని ఆనుకొన్న ప్రాంతాల్లో బాగ్దాది దాగి ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నామని స్టీఫెన్ అన్నారు. -
జమ్మూకశ్మీర్లో ఐసిస్ అడుగు..
ఇరాక్లో పట్టుకోల్పోతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్(ఐఎస్ఐఎస్) భారత్లో అడుగుమోపి తన ఉనికి కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం కశ్మీర్ రాష్ట్రంలోని వేర్పాటువాద ప్రభావిత జిల్లాలను ఎంపిక చేసుకుంది. 'అన్సరుల్ ఖలీఫా జమ్మూకశ్మీర్' అనే పేరుతో టెలిగ్రామ్ గ్రూప్ను నిర్వహిస్తున్న ఐసిస్.. ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేస్తోంది. కొద్ది వారాల క్రితం జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫోన్ చేసిన ఐసిస్ సానుభూతిపరులు ముస్లిం, ఇస్లాం వ్యతిరేకులకు తుపాకులతోనే సమాధానం చెబుతాం అంటూ బెదిరించారు. ఈ నెల 5వ తేదీన కశ్మీర్లోని సానుభూతిపరులకు ఉగ్రదాడులు ఎలా చేయాలో ఐసిస్ మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. సోమవారం టెలిగ్రామ్ గ్రూప్లో.. భారీ ట్రక్కులతో ఉగ్రదాడులకు ఎలా పాల్పడాలి అనే దానిపై హిందీలో సూచనలు సలహాలు ఐసిస్ అందించింది. బుర్హన్ వానీ కాల్చివేత అనంతరం ఐసిస్ వైపు మళ్లే వేర్పాటువాద యువత సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఐసిస్ ఇరాక్లోని మోసుల్ నగరాన్ని సైన్యానికి కోల్పోయి కకావికలమైంది. తన పేరు తలుచుకుంటే వణికిపోయేలా.. ఎలాగైనా తిరిగి మునుపటి స్ధాయిని అందుకోవాలని అందుకు భారతే మంచి ప్రదేశమని ఐసిస్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, భారత రక్షణ శాఖ అధికారులు మాత్రం కశ్మీర్లో ఐసిస్ ఆనవాళ్లను కొట్టిపారేస్తున్నారు. అందుకు ఓ ఈక్వేషన్ను చూపుతున్నారు. ఐసిస్ భారత్లో లేదు కాబట్టే ఇప్పటివరకూ జరిగిన ఉగ్రదాడుల్లో ఒక దాడిని కూడా తాను చేసినట్లు ప్రకటించలేదని అంటున్నారు. కాగా, అన్సరుల్ ఖలీఫా పేరుతో ఐసిస్కు చెందిన ఉగ్రవాదులు టెలిగ్రామ్ గ్రూప్ను నిర్వహిస్తున్నారని ఎన్ఐఏ ఎప్పటినుంచో అనుమానిస్తోంది. 'అన్సరుల్ ఖలీఫా కేరళ' పేరుతో గ్రూపు ప్రారంభించిన ఆరుగురుని కేరళలోని కన్నూరులో ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. వీరందరూ ఆన్లైన్లో రాడికలైజ్ అయ్యారని సమాచారం. ఆదివారం 'అన్సరుల్ ఖలీఫా జమ్మూకశ్మీర్' టెలిగ్రామ్ గ్రూప్లో మరణించిన ఉగ్రవాది సజద్ గిల్కర్ను కీర్తిస్తూ మెసేజ్లు సర్కూలేట్ అయ్యాయి. -
ఐసిస్ కార్లు ఇవిగో.. చూస్తే ద్యావుడా అనాల్సిందే..
మోసుల్: మోసుల్ ఉగ్రవాదుల కబంద హస్తాల్లో నలిగినలిగి తిరిగి ఇరాక్ వశమైన ప్రాంతం. అటు ప్రభుత్వ బలగాల దాడులకు, ఉగ్రవాదులు విసురుతున్న బాంబులకు మధ్య చిత్తయి దాదాపు ఏడారిగా మిగిలిపోయిన ప్రాంతం. ఎంతో కష్టపడి ప్రభుత్వ బలగాలు ఎట్టకేలకు ఐసిస్ను తరిమేశారు. ఇది గొప్ప విజయమే అయినప్పటికీ అక్కడ మిగిలిందని చెప్పుకోవడానికి ఏమీ లేదు.. ఒక్క ఉగ్రవాదుల వదిలేసి పోయిన వాహనాలు తప్ప. అయితే, కేవలం వాహనాలే అని వాటిని తీసి పారేసి వీలు లేదు. ఎందుకంటే వాటిని చూస్తే ప్రతి ఒక్కరూ అవాక్కవ్వాల్సిందే. బహుషా అలాంటి వాహనాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉపయోగించారు కనుకే మోసుల్ను ఇరాక్ స్వాధీనం చేసుకునేందుకు అంతగా కష్టపడాల్సి వచ్చిందేమో అని కచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఆ వాహనాల్నీ కూడా ఎంతో నాణ్యమైన ఎస్యూవీలు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా బుల్లెట్ప్రూఫ్ వాహనాలుగా తీర్చిదిద్దినవి. దాదాపు ఒక మిసైలో, రాకెట్ లాంచరో ఢీకొడితే తప్ప ధ్వంసం కాలేనంత బలంగా ఉగ్రవాదులు వాటిని తయారు చేసుకున్నారు. స్వయంగా వారు వాటిని తీర్చి దిద్దుకున్నారు. ఇప్పుడు అలాంటి వాహనాలు మోసుల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు ఏడారిగా మారిన ఆ ప్రాంతంలో ఇరాక్ సైన్యం ఆ కార్లన్నింటిని స్వాధీనం చేసుకొని ప్రదర్శనకు పెట్టింది. ప్రతి కారు కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులతోపాటు చుట్టూ ఐరెన్ షీట్లతో కప్పి ఉండి కనిపించాయి. ఇవి యుద్ధ క్షేత్రంలో పరుగెడుతుంటే కచ్చితంగా రోబోల యుద్ధం జరుగుతుందా అనే భావన రావడం కూడా తథ్యం. ఏదీ ఏమైనప్పటికీ ఉగ్రవాదులపై పై చేయిసాధించిన ఇరాక్ బలగాలు పోలీసులు ఇప్పుడు ఆ వాహనాలన్నింటిని కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు. మరో ముఖ్యవిషయం ఏమిటంటే కార్లకు పైభాగంలో రక్షణగా అమర్చిన ఇనుప తెరలను తొలగించి చూస్తున్న ప్రతి కారులో కూడా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు బయటపడుతున్నాయి. -
బాగ్దాదీ చనిపోతే తర్వాత ఎవరు?
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అతడి తర్వాత ఆ సంస్థ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. గతంలో ఇరాక్ ఆర్మీ అధికారులుగా పనిచేసిన ఇయాద్ అల్ ఒబైదీ, అయాద్ అల్ జుమెయిలీ అనే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఈ బాధ్యతలు తీసుకుంటారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆ ఇద్దరు కూడా గతంలో సద్దాం హుస్సేన్ పరిపాలన హయాంలో ముఖ్యమైన ఆర్మీ అధికారులుగా చేశారంట. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై అవగాహన ఉన్న నిపుణులు మాత్రం ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కరిని కూడా స్పష్టం చేయలేదు. తాము జరిపిన వైమానిక దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ చీఫ్ బాగ్దాదీ చనిపోయాడని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. -
మీ టైమ్ వస్తుంది: ఐఎస్ హెచ్చరిక
టెహ్రాన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సౌదీ అరేబియాకు హెచ్చరికలు జారీ చేశారు. సౌదీపై దాడులకు పాల్పడుతామంటూ వీడియో సందేశంలో తెలిపారు. ఇరాన్ పార్లమెంట్పై బుధవారం జరిగిన దాడి తమపనే అని వెల్లడించిన ఇస్లామిక్ స్టేట్.. 'మీపై దాడికి సమయం వస్తుంది' అంటూ సౌదీని హెచ్చిరించింది. టెహ్రాన్లోని ఇరాన్ పార్లమెంట్పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇరాన్ తరువాత టార్గెట్ సౌదీనే అని, అల్లా ఆదేశం మేరకు ఇస్లాం కోసం తాము పోరాడుతున్నామని మాస్క్లు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఉన్న వీడియోలో పేర్కొన్నట్లు సైట్ ఇంటలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ హెచ్చరికల నేపథ్యంలో విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సౌదీలోని యూఎస్ ఎంబసీ తమ పౌరులకు సూచించింది. ఉగ్రవాదానికి సహకరిస్తోందనే కారణంతో ఖతార్పై పలు దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. -
జిహాదీ జాక్ దొరికిపోయాడు
సిరియా: జిహాదీ జాక్ పట్టుబడ్డాడు. కుర్దీష్ ఫైటర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో జాక్ చేరినట్లుగా అతడిపై నేరారోపణలు ఉన్న విషయం తెలిసిందే. బ్రిటన్ సంతతికి చెందిన జాక్ ఆక్స్ఫర్డ్లో ఉండేవాడు. అక్కడ నుంచే చెర్వెల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. జాన్ లెట్స్(55), శాలీలేన్(54) కుమారుడైన జాక్.. తర్వాత ఇస్లాం మతంలోకి మారిపోయాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే నేరుగా సిరియా వెళ్లి అక్కడ ఐసిస్లో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం అతడిని కుర్దీష్ల ఆదీనంలో ఉన్న జైలులో ఉంచినట్లు లండన్కు చెందిన అల్ అరబీ అనే ఓ వార్తా చానెల్ తెలిపింది. ‘నేను మా అమ్మను చూడాలని అనుకుంటున్నాను. ఆమెకు కొన్ని విషయాలు వివరించాలి’ అని కుర్దీష్లకు పట్టుబడిన తర్వాత చెప్పాడంట. బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న జిహాదీ జాక్ 2014లో సిరియా వెళ్లడమే కాకుండా ఓ ఇరాకీ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి మహ్మద్ అనే కుమారుడు కూడా ఉన్నట్లు అధికారులు గతంలోనే తెలుసుకున్నారు. ఐసిస్లో చేరడానికి ముందు జాక్గా ఉన్న తన పేరును అబూ మహ్మద్ అని మార్చుకున్నాడు. సిరియాలో ఉన్న సమయంలో పలు రకాల ఆయుధాలు ధరించి వీడియోల్లో చూపిస్తూ జిహాదీ జాన్ మాదిరిగా తానిప్పుడు పనిచేస్తున్నానంటూ వీడియోలో పోస్ట్ కూడా చేశాడు. ఐసిస్లో అత్యంత క్రూరంగా బందీల పీకలు కోసే ఓ ముసుగు వ్యక్తి జిహాదీ జాన్. అతడి స్థానంలోనే తాను పనిచేస్తున్నానంటూ జాక్ పోస్టింగ్లు చేసినా ఐసిస్ నుంచి మాత్రం ఎలాంటి నిర్ధారణ రాలేదు. అయితే, ఐసిస్లో ఉండే పనిచేస్తున్నాడని మాత్రం ధ్రువీకరించారు. -
కాబూల్ రక్తసిక్తం..
-
కాబూల్ రక్తసిక్తం..
ట్రక్కు బాంబుతో ఆత్మాహుతి దాడి ∙ 90 మంది మృతి.. - 400 మందికి గాయాలు ∙భారత ఎంబసీకి వంద మీటర్ల దూరంలోనే పేలుడు - స్వల్పంగా దెబ్బతిన్న ఎంబసీ భవనం.. సిబ్బంది సేఫ్ ∙ దాడిని ఖండించిన ప్రధాని మోదీ కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని కాబూల్లో ఓ ఉగ్ర వాది భారీ పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ హింసాకాండలో చిన్నారులు, మహిళలు సహా 90 మంది మృత్యువాతపడగా.. మరో 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వివిధ దేశాల ఎంబసీలు ఉండే చోట బుధ వారం ఉదయం 8.30 సమయంలో ఈ ఘట న చోటు చేసుకుంది. పేలుడు ధాటికి కిలో మీటర్ పరిధిలో ఉన్న భవనాల అద్దాలు, కిటి కీలు ధ్వంసమయ్యాయి. భారత రాయబార కార్యాలయానికి వంద మీటర్ల దూరం లోనే ఈ దాడి జరిగింది. దాడిలో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. భయానక వాతావరణం.. పేలుడు తర్వాత ఎటుచూసినా మృతదేహా లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ప్రాణాలు దక్కించుకునేందుకు గాయపడిన వారు, మహిళలు, స్కూల్ విద్యార్థినులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. పేలు డు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్మేయడంతో ఏం జరుగుతుందో తెలి యని పరిస్థితి ఏర్పడింది. తమ వారి గురించి ఆరా తీస్తూ చాలా మంది కన్నీరుమున్నీర య్యారు. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ‘దాడి మృతుల, బాధితుల్లో చాలా మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు’ అని అఫ్గాన్ ఆరోగ్య , హోం శాఖలు వెల్లడించాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. ఉదయం 8.30 సమయంలో జాన్బాగ్ స్క్వేర్ ప్రాంతం లో భారీగా పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కు తో ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ దురా గతానికి పాల్పడ్డాడని, ఈ దాడిలో 50 వాహ నాలు ధ్వంసమయ్యాయని వివరించాయి. బాధితులను ఆదుకునేందుకు కాబూల్ వాసులు ముందుకు రావాలని, రక్తానికి తీవ్ర కొరత ఉన్న దృష్ట్యా రక్త దానం చేయాలని కోరాయి. దాడిలో బీబీసీ చానల్కు చెందిన డ్రైవర్ మృతిచెందగా.. నలుగురు జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. మా పని కాదు: తాలిబాన్ ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే తాలిబాన్ ఈ దాడి తాము చేయలేదని స్పష్టం చేసింది. రంజాన్ మాసం కావడంతో ప్రస్తుతం దాడులకు విరామం ప్రకటించామని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. భారతీయులంతా క్షేమం పేలుడులో భారత ఎంబసీ కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఎంబసీకి సమీపంలోనే పేలుడు సంభవిం చిందని, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఆఫ్గాన్లోని భారత రాయబారి మన్ప్రీత్ వోహ్రా తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలతో పాటు ఎంబసీ తలుపులు, కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయన్నారు. జపాన్ ఎంబసీ కూడా స్వల్పంగా దెబ్బతినగా, అక్కడి ఇద్దరు ఉద్యోగులు స్వల్పంగా గాయప డ్డారు. దాడిని భారత ప్రధాని మోదీ ఖండించారు. ప్రస్తుతం స్పెయిన్లో ఉన్న మోదీ.. మృతుల కుటుంబ సభ్యులకు ట్విట్టర్లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ భారత ఎంబసీ అధికారులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. -
‘ఆయన భార్యను.. మీ కొడుకు చనిపోయాడు’
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరిన కేరళకు చెందిన మరో యువకుడు చనిపోయాడు. డ్రోన్ జరిపిన దాడిలో అతడు మృత్యువాతపడినట్లు అతడి భార్యే స్వయంగా అతడి తండ్రికి సమాచారం ఇచ్చింది. ‘డ్రోన్ జరిపిన దాడుల్లో మీ కుమారుడు చనిపోయాడు మావయ్య. నేను అతడి భార్యను’ అని ఆమె వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముర్షిద్ మహ్మద్ అనే యువకుడు మొత్తం 17మంది యువకులతో కలిసి గత ఏడాది(2016) జూన్ 1న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా టెహ్రాన్ అక్కడి నుంచి అప్ఘనిస్థాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాద సంస్థలో చేరాడు. నంగర్హార్ ప్రావిన్స్లో పనిచేయడం ప్రారంభించాడు. అక్కడికి వెళ్లాక ముఘిరా అనే యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల (ఏప్రిల్) 11న ఓ డ్రోన్ విమానం ఉగ్రవాదుల స్థావరంపై దాడి చేసిందని, ఈ దాడిలో ముర్షిద్ చనిపోయాడని వాట్సాప్ ద్వారా కేరళలోని కాసర్ఘడ్కు చెందిన అతడి తండ్రికి 12, 13 తేదీల్లో సమాచారం అందజేసింది. ప్రస్తుతం అమెరికా జారవిడిచిన అతిపెద్ద బాంబు జరిపిన దాడి ప్రాంతంలోనే ముర్షిద్ ఉండేవాడు. అయితే, ఈ దాడికంటే ముందే అతడి భార్య తెలిపిన వివరాల ప్రకారం చనిపోయాడు. మిగతా కేరళ యువకులు కూడా ప్రస్తుతం యూఎస్ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నారట. అయితే, వారి పరిస్థితి ఏమిటన్నది మాత్రం ఇంకా తెలియరావడం లేదు. -
అమెరికా బాంబుతో మాకేం కాలేదు: ఐసిస్
కైరో: అమెరికా తాజా బాంబుదాడితో తమకు ఎలాంటి నష్టం సంభవించలేదని ఇస్లామిక్ స్టేట్ స్పష్టం చేసింది. తాము ప్రయోగించిన అతిపెద్ద బాంబు ఏజీబీయూ-43బీ(ఎంవోఏబీ)తో పెద్ద మొత్తంలో ఐసిస్ ఉగ్రవాదులు చనిపోయారని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యంత శక్తిమంతమైన ఈ బాంబు దాడిలో అప్ఘనిస్థాన్లోని నంగర్హార్ ప్రావిన్నస్లోగల అచ్చిన్ జిల్లాలో తలదాచుకున్న ఉగ్రవాదులకు పెద్ద మొత్తంలో ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొంది. అయితే, దీనికి సంబంధించి శుక్రవారం అధికార ప్రకటన విడుదల చేసిన ఐసిస్ తమకు ఎలాంటి నష్టం జరగలేదని, ఒక్క ప్రాణం పోలేదని తెలిపింది. ఐసిస్ అధికారిక మీడియా తమాక్ ద్వారా ఈ విషయం చెబుతూ‘నిన్న అమెరికా దాడిలో ఒక్క మరణం సంభవించలేదు.. ఒక్కరు గాయపడలేదు’ అంటూ ప్రకటించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాల్లో కూడా చెప్పింది. -
సిరియాలో ఏం జరుగుతోంది?
ఓ పక్క అంతర్యుద్ధం, మరో పక్క ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదుల ఆగడాలు, అన్నిటికీ మించి దాదాపు 17 ఏళ్లుగా బాత్పార్టీ నేత బషారల్ అసద్ నియంతృత్వ పాలనలో మగ్గుతున్న సిరియాలో సంక్షోభం గురువారం అమెరికా విమాన దాడులతో మరింత తీవ్రమయింది. ఇద్లీబ్ పట్టణంపై మంగళవారం జరిగిన సారిన్ విషవాయువు దాడికి తీవ్రంగా స్పందిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలపై అమెరికా సేనలు తొలిసారి సిరియాపై ప్రత్యక్ష దాడిచేశాయి. అసద్ దళాలు రసాయన దాడి చేయడానికి ఉపయోగించాయని భావిస్తున్న వైమానిక స్థావరంపై 59 అమెరికా క్షిపణుల వర్షం కురిపించాయి. విషవాయువు దాడి ఎవరు చేశారో దర్యాప్తు జరిపించాలని రష్యా ఐరాసలో ప్రయత్నం చేస్తుండగానే, అమెరికా ఎప్పటిలా అసద్నే దోషిగా చేసి దాడులు జరిపించింది. తిరుగుబాటుదారులే సారిన్ వాయువును జనంపై ప్రయోగించి, అసద్ సర్కారుకు ఆ పాపం అంటేలా చేశారని రష్యా భావిస్తోంది. ఎందుకీ అంతర్గత పోరు? 2010 చివర్లో ఈజిప్ట్ సహా అరబ్ దేశాల్లో నియంతల పాలనపై ఆరబ్ స్ప్రింగ్ పేరిట ఆరంభమైన తిరుగుబాట్లు సిరియాలోనూ ప్రజలను అసద్ సర్కారుపై పోరాటానికి పురికొల్పాయి. 2011 మార్చిలో దేరా పట్టణంలో మొదలైన ఘర్షణలు 2012 నాటికి ప్రాచీన నగరం అలెప్పో, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి, అప్పటి నుంచి ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధం ఎవరు ప్రారంభించారు? అప్పటికి(2011) 40 ఏళ్లుగా సోషలిస్ట్ బాత్ పార్టీ పేరిట సాగుతున్న అసద్ కుటుంబపాలనలో అవినీతి, అణచివేత అదుపు తప్పాయి. ఫలితంగా దేరాలో జరిగిన ప్రజాప్రదర్శనను సర్కారు ఉక్కుపాదంతో అణచివేసింది. దీంతో తిరుగుబాటుదారులకు ప్రవాసంలో ఉన్న అసద్ వ్యతిరేకులందరూ మద్దతు అందించారు. ఎవరెవరిపై పోరాడుతున్నారు? అధ్యక్షుడు అసద్ సేనలు తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులు, ఇస్లాం పేరిట దారుణాలకు పాల్పడుతున్న ఐసిస్ దళాలతో పోరుసాగిస్తున్నాయి. తిరుగుబాటుదారులపై యుద్ధంలో అసద్ సైన్యం ఎందుకు విజయం సాధించలేకపోతోంది? దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలు, గ్రూపుల జోక్యమే. అసద్ షియా కావడంతో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి షియా మెజారిటీ ఇరాన్తోపాటు, ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి సంబంధాల కారణంగా రష్యా సాయం చేస్తున్నాయి. అమెరికా, సౌదీఅరేబియాలు సున్నీ తిరుగుబాటుదారులకు అన్ని విధాలా తోడ్పడుతున్నాయి. అంతర్యుద్ధంలో జరిగిన నష్టమెంత? ఒక్క అలెప్పో నగరంలోనే మూడు నుంచి దాదాపు ఐదు లక్షల మంది ఈ అంతర్గత పోరులో ప్రాణాలు కోల్పోయారు. హింస ఎంతగా పెరిగిందంటే 2015 ఆగస్టులో ఇక్కడ మృతులను ఐక్యరాజ్య సమితి లెక్కించడం మానేసింది. దేశం నుంచి దాదాపు అర కోటి మంది పొరుగున ఉన్న టర్కీ, జోర్డాన్, లెబనాన్తో పాటు పశ్చిమ ఐరోపా దేశాలకు పారిపోయారు. దాదాపు 65 లక్షల మంది ప్రజలు ఈ అంతర్యుద్ధం కారణంగా తమ ఊళ్లను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు చెల్లాచెదురయ్యారు. ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి అసద్ తన దళాలతో రసాయన ఆయుధాలు ప్రయోగించడమేగాక, వీధుల్లో మూకుమ్మడి హత్యాంకాడలకు తెగబడ్డాడని అమెరికా ఆరోపించింది. సిరియాలో హింస ఎంత క్రూరంగా కనిపిస్తోంది? తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రధాన నగరం అలెప్పోను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి డిసెంబర్లో అసద్ ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో దాడులు జరిపాయి. ఈ మెరుపు దాడుల్లో 82 మంది పౌరులు మరణించారు. తిరుగుబాటుదారుల చివరి స్థావరంగా మిగిలిన తూర్పు అలెప్పోలో కేవలం అయిదు శాతం ప్రాంతం మాత్రమే వారి అధీనంలో ఉన్నాగాని ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రభుత్వ అనుకూల దళాలు ప్రజలపై దారుణాలకు పాల్పడ్డాయని ఐరాస ప్రధానకార్యదర్శి బాన్కీ మూన్ చెప్పారు. ప్రచ్ఛన్నయుద్ధం అవశేషాలే సిరియా మంటలకు కారణమా? ప్రచ్ఛన్నయుద్దకాలంలో అసద్ కుటుంబం అప్పటి సోవియెట్ యూనియన్కు మద్దతుదారుగా మారింది. అసద్ కుటుంబం షియా ఆలవైత్ తెగకు చెందినది కావడం, అమెరికాతో వైరం ఇరాన్ను సిరియాకు దగ్గరయ్యేలా చేసింది. సోవియెట్ యూనియన్ విచ్ఛన్నమయ్యాక కూడా అమెరికా అసద్ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు సాయమందిస్తూనే ఉంది. ఫలితంగా రష్యాకు అసద్ సర్కారు మరింది చేరువయింది. ఏకైక అగ్రరాజ్యం అమెరికా, మాజీ అగ్రరాజ్యం వారసురాలు రష్యాల మధ్య ఇంకా కొనసాగుతున్న పోటీ కూడా సిరియా మంటలకు ఆజ్యం పోస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ట్రంప్ ఇడియట్ అంటూ తిట్ల దండకం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (ఐసిఎస్) తిట్ల దండకం లంకించుకుంది. ‘ఇడియట్’ అంటూ ట్రంప్ను తీవ్ర పదజాలంతో దూషించింది. ఇస్లాం గురించి ట్రంప్కు ఏం తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఐఎస్ అధికార ప్రతినిధి అబు హసన్ అల్ ముహజిర్ పేరిట అరబిక్ భాషలో దాదాపు 36 నిమిషాల నిడివి గల వీడియోను మంగళవారం విడుదల చేసింది. ఆ వీడియోలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పాలనాపగ్గాలు చేపట్టటం అమెరికన్ల దివాళాకోరుతనంగా అభివర్ణించింది. కాగా ట్రంప్ జనవరిలో అధికారంలోకి వచ్చాక ఐసిఎస్ నుంచి వచ్చిన తొలి వీడియో ఇది. అందులో ఇస్లాంను గురించి ఏమాత్రం అవగాహన లేని ఇడియట్గా ట్రంప్ను పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ అంటే ఏమిటో కూడా తెలియని మూర్ఖుడని వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్ష గద్దె నుంచి ట్రంప్ను తొలగించటం ఖాయమని, ఆయన ఉద్వాసనకు మార్గం మరింత సుగమమైందని పేర్కొంది. అమెరికా సర్కార్ త్వరలోనే దివాళా తీయడం ఖాయమని, ఇప్పటివరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఇమేజ్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరికలు చేసింది. సిరియా, ఇరాక్లలో తాము పట్టు కోల్పోలేదని, సిరియాలో మరింత బలపడేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది. ఇరాక్ బలగాలతో తాము ఎదుర్కొంటున్న పరిస్థితి జిహాదీ చరిత్రలోనే గొప్పదిగా అభివర్ణించింది. కాగా అమెరికా ఎన్నికల ప్రచారంలోనూ, అధ్యక్షుడయ్యాక ట్రంప్ పలు సందర్భాల్లో ఐఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతోపాటు అమెరికా బలగాలను ఐఎస్ను యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే ఇరాక్తోపాటు సిరియాలోని కొంతభాగంలో ఇస్లామిక్స్టేట్ పేరుతో అధికారం నడుపుతున్న ఈ సంస్థను తుదముట్టించేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వీడియోను ఐఎస్ వ్యూహకర్తలు రూపొందించారని భావిస్తున్నారు. -
ఐసిస్ టార్గెట్లో హిందూ నాయకులు, మసీదులు
దేశంలో ప్రకంపనలు సృష్టించడానికి పలువురు హిందూ నాయకులను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టార్గెట్ చేసింది. వారితో పాటు.. కొన్ని అహ్మదీయ మసీదులు, జమాతే ఇస్లామీ హింద్ నేతలను కూడా తమ హిట్లిస్టులో పెట్టుకున్నట్లు ఇటీవల కేరళలో అరెస్టయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది మొయినుద్దీన్ పరకదావత్ ఎన్ఐఏ విచారణలో వెల్లడించాడు. అహ్మదీయ నాయకులు, జమాతే ఇస్లామీ హింద్ నేతలు ఈమధ్య కాలంలో ఇస్లామిక్ స్టేట్ అకృత్యాలను తీవ్రంగా ఖండించారు. ఇస్లాం శత్రువుల కంటే ముస్లింలకే ఎక్కువ హాని చేస్తున్నారని వాళ్లు మండిపడ్డారు. కేరళకు చెందిన మొయినుద్దీన్ను ఫిబ్రవరి 14న అబు దాబి నుంచి డిపోర్ట్ చేసి తీసుకొచ్చి ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేశాయి. భారతదేశంలోని తమ టార్గెట్ల గురించి ఇస్లామిక్ స్టేట్ సభ్యులకు చెందిన రహస్య ఆన్లైన్ గ్రూపులలో తరచు చర్చలు జరుగుతుంటాయని అతడు వెల్లడించాడు. టెలిగ్రాం యాప్లోని గ్రూపులో జరిగిన ఇలాంటి చర్చలోనే.. గత సంవత్సరం కొచ్చిలో జరిగిన జమాతే ఇస్లామీ కార్యక్రమానికి రాహుల్ ఈశ్వర్ అనే హిందువును వక్తగా పిలిచిన విషయం ఒకటి తెలిసింది. ఇలాంటి కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకోవాలని అందులో అన్నారు. ఆ వేదికకు సమీపంలోనే కొచ్చి యూదుల ఆలయం ఒకటి ఉందని తాను చెప్పానని, దాంతో గ్రూపులో ఉన్న ఓ వ్యక్తి బైకును ఉపయోగించి దాడులు చేయాలని సూచించగా, తాను మాత్రం టిప్పర్ లారీ అయితే దాడికి బాగుంటుందని సూచించానని మొయినుద్దీన్ వివరించాడు. ఇక ఇటీవల కేరళ జైలు నుంచి తప్పించుకున్న 22 మంది ఖైదీలు ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్లో ఉన్నారని, వాళ్లలో ఐదుగురిని ఇరాక్ సరిహద్దుల్లో తాను కలిశానని కూడా చెప్పాడు. తర్వాత అక్కడి నుంచి అబుదాబికి వచ్చిన మొయిన్ను అక్కడి పోలీసులు అరెస్టు చేసి, భారతదేశానికి డిపోర్ట్ చేశారు. -
‘లండన్’ దాడి మా పనే!
-
‘లండన్’ దాడి మా పనే!
♦ ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటన ♦ దుండగుడ్ని ఖాలిద్ మసూద్గా గుర్తించిన పోలీసులు ♦ దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ప్రపంచ దేశాధినేతలు లండన్: బ్రిటన్ పార్లమెంట్పై దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించుకుంది. సంకీర్ణ దళాల దాడులకు ప్రతీకారంగానే దాడి చేశామని వెల్లడించింది. మరోవైపు బుధవారం నాటి ఉగ్రదాడితో బ్రిటన్ భయపడలేదని, యథాప్రకారం పార్లమెంట్ సమావేశమైందని, ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఆ దేశ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. బ్రిటన్ పార్లమెంట్పై దాడి జరిగిన 24 గంటల్లోపే గురువారం హౌస్ ఆఫ్ కామన్స్ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దుండగుడు ఇస్లామిక్ భావజాలంతో ప్రభావితమయ్యాడని, పోలీసులకు అతని వివరాలు తెలుసని, తర్వాత వెల్లడిస్తామని మే చెప్పారు. అయితే దుండగుడ్ని ఖాలిద్ మసూద్గా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఉగ్రదాడికి సంబంధించి 8 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బ్రిటన్ పార్లమెంట్పై జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు, ఒక పోలీసు అధికారి సహా ఐసిస్ ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే. ‘ఉగ్రవాద చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసినా ఆ బెదిరింపులకు మనం భయపడలేదు. ఈ రోజు యథాప్రకారం సమావేశమయ్యాం. ఉగ్రవాదానికి మేం భయపడలేదు అన్న సందేశాన్ని మన పూర్వీకులు చెప్పారు, భవిష్యత్ తరాలు కూడా చాటి చెప్తాయి. ఎప్పటికైనా ప్రజాస్వామ్య విలువలదే పైచేయ’ని ప్రధాని మే ఉద్ఘాటించారు. పార్లమెంట్పై దాడి చేసింది బ్రిటన్లో జన్మించిన వ్యక్తేనని , హింసాత్మక కార్యక్రమాలతో సంబంధాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం పోలీసులు అతన్ని విచారించారని మే వెల్లడించారు. దుండగులు దాడికి పాల్పడతాడనే ముందస్తు నిఘా సమచారం లేదని, ఒక్కడే ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు నమ్ముతున్నారని ఆమె తెలిపారు. సంకీర్ణ సేనలకు వ్యతిరేకంగానే దాడి: ఇస్లామిక్ స్టేట్ థెరిసా మే ప్రసంగం ముగిసిన వెంటనే దాడికి తామే సూత్రధారులమంటూ ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీలో ఆ వివరాల్ని వెల్లడించింది. ఐఎస్పై సంకీర్ణ దేశాల దాడులకు వ్యతిరేకంగా దాడి చేసినట్లు ప్రకటించింది. కాగా లండన్, బర్మింగ్హామ్ నగరాల్లో గురువారం పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మంది అనుమానితుల్ని అరెస్టు చేశారు. దాడి కోసం దుండగుడు వినియోగించిన కారును బర్మింగ్హమ్లోని సొలిహల్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్నట్లు తేల్చారు. విచారణ కీలక దశలో ఉందని, ఉగ్రవాది సమాచారం ప్రస్తుతం వెల్లడించలేమని స్కాట్లాండ్ యార్డ్ తాత్కాలిక డిప్యూటీ కమిషనర్ మార్క్ రౌలే చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అనుమానితుల సమాచారం ఎప్పటికప్పుడూ పోలీసులకు చెప్పాలని ఆయన కోరారు. పోలీసుల వార్షిక సెలవులు రద్దు చేసి 24 గంటలూ పహారా పెంచామన్నారు. మరోవైపు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంఘీభావంగా ట్రఫాల్గర్ స్క్వేర్లో గురువారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మృతుల కుటుంబాలకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ సానుభూతి తెలిపారు. ప్రపంచ దేశాధినేతల సంఘీభావం: లండన్ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బ్రిటన్కు భారత్ సాయంగా ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రపంచ నేతలు బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు ఫోన్ చేసి అండగా ఉంటామని చెప్పారు. దాడి సమయంలో బ్రిటన్ భద్రతా దళాలు వేగంగా స్పందించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టేందుకు బ్రిటన్కు అవసరమైన సాయం చేస్తామన్నారు. ఉగ్రవాదం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోందని, బ్రిటన్ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఫ్రాన్స్కు తెలుసని, తాము కూడా ఉగ్ర బాధితులమేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హŸలాండే అన్నారు. బ్రిటన్ ప్రజలకు జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో వారి పక్షాన ఉంటామని హామీనిచ్చారు. మరిన్ని దాడులపై నిఘా సమాచారం లేదు: మే బ్రిటన్కు ఉగ్రవాద ముప్పు ‘తీవ్ర స్థాయి’లో ఉందని దేశ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. మరిన్ని దాడులు జరగవచ్చన్న దానిపై ఎలాంటి నిఘా సమాచారం లేనందున దాన్ని ‘అతి తీవ్రస్థాయి’కి పెంచడం లేదన్నారు. దాడి వివరాలు వెల్లడిస్తూ.. ‘దుండగుడు వేగంగా కారు నడుపుకుంటూ వెస్ట్మినిస్టర్ బ్రిడ్జ్ దాటుతున్న పాదచారులపై దూసుకెళ్లాడు. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, దాదాపు 40 మంది గాయపడ్డారు. అనంతరం పార్లమెంట్ వద్ద ఉన్న క్యారేజీ గేట్స్ వద్ద కారు వదిలి పోలీసు అధికారిపై పెద్ద కత్తితో దాడిచేశాడు. అదే సమయంలో మరో అధికారి ఆ దుండగుడ్ని కాల్చి చంపాడు’ అని చెప్పారు. పలుమార్లు జైలుకెళ్లిన దుండగుడు లండన్ ఉగ్రదాడికి పాల్పడిన దుండగుడ్ని ఖాలిద్ మసూద్(52)గా గుర్తించారు. బ్రిటన్లోని కెంట్లో జన్మించిన అతను గతంలో కొన్ని హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడడంతో జైలుశిక్ష అనుభవించినట్లు తెలిసింది. విధ్వంసానికి పాల్పడినందుకు 1983లో శిక్ష అనుభవించగా, కత్తి కలిగిఉన్నందుకు 2003లో విచారణ ఎదుర్కొన్నాడు. గతంలో అతనికి ఉగ్రవాద సంబంధాలు లేవని పోలీసులు చెప్పారు. -
ఉగ్రవాదులనుకొని బాంబులు వదిలితే..
బీరుట్: సిరియాలో మరోసారి అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భాగంగా సిరియా బలగాలతో కలసి పాల్గొంటున్న అమెరికా సైనిక విమానం జరిపిన బాంబు దాడిలో 33మంది అమాయకులైన ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు అని భ్రమపడి ఓ మూతబడిన పాఠశాలపై అమెరికా యుద్ధ విమానం దానిపై బాంబును జారవిడచడంతో దాదాపు 33మంది ప్రాణాలుకోల్పోయారు. వీరంతా కూడా బాంబు దాడుల కారణంగా తమ తమ సొంత ప్రదేశాలను విడిచిపెట్టి వచ్చినవారే. సిరియా పౌర హక్కుల సంస్థ ఈ విషయం తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెరలో అల్ మన్సూరా అనే సిరియా ప్రాంతం ఉంది. ఇక్కడ రక్బా ప్రాంతానికి 20 మైళ్ల దూరంలో ఓ పాఠశాల ఉంది. అందులోకి ఆయా ప్రాంతాల్లో బాంబు దాడులకు తట్టుకోలేక నిరాశ్రయులుగా మిగిలిన కొంతమంది శరణార్థులుగా మిగిలిపోయారు. వారంతా కూడా ఆ స్కూల్ వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. వారి కదలికలను గమనించి యూఎస్ యుద్ధ విమానం ఉగ్రవాదులుగా భావించి బాంబులు వేయడంతో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. -
ఉగ్రవాదాన్ని పెకలించేస్తా: ట్రంప్
వాషింగ్టన్: తాను ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. తొలిసారి ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదితో సమావేశమైన ఆయన ఈమేరకు హామీ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ను ఓడించి తీరుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌదం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం అబాదికీ డోనాల్డ్ ట్రంప్ ఓవల్ కార్యాలయంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐసిస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇరాక్కు ట్రంప్ గట్టి మద్దతిచ్చారని, తాము కూడా దానిని తుదముట్టించి తీరుతామని అబాదీకి హామీ ఇచ్చినట్లు శ్వేతసౌదం పేర్కొంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇరాక్కు సైనిక సహాయం కొనసాగించేందుకు ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా వెల్లడించింది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు కలిసి సాగాలని బలంగా నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌదం పేర్కొంది. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలతోపాటు పెట్టుబడులకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరగనున్నట్లు వెల్లడించింది. -
ఐసిస్.. అన్నంత పనీ చేస్తోందా?
తాజ్మహల్ను టార్గెట్గా చేసుకుని భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని హెచ్చరించిన ఇస్లామిక్ స్టేట్.. (ఐసిస్) అన్నంత పని చేసేందుకు సిద్ధమవుతోందా? ఆగ్రా రైల్వే స్టేషన్ సమీపంలో సంభవించిన జంటపేలుళ్లను చూస్తే అలాగే అనిపిస్తోంది. తాజ్మహల్కు దగ్గరలోనే ఉన్న ఈ రైల్వేస్టేషన్ సమీపంలో ఒక చెత్తకుండీ దగ్గర మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత మరో ఇంటి వద్ద ఇంకో బాంబు పేలింది. రైల్వేట్రాక్ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా ఉంది. అయితే.. అదృష్టవశాత్తు బాంబులు అంత శక్తిమంతమైనవి కాకపోవడంతో పెద్దగా ప్రమాదం ఏమీ సంభవించలేదు. అయితే.. తమ ఉనికిని చాటుకోడానికి, లేదా తాజ్మహల్ సమీపంలోనికి కూడా తాము ప్రవేశించగలమని చెప్పడానికే ఇలా చేశారా అన్న అనుమానాలు పోలీసు వర్గాలకు వస్తున్నాయి. భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుకూల మీడియా గ్రూపు ఒకటి ఇటీవలే హెచ్చరించింది. వాళ్ల హెచ్చరికలో ఉపయోగించిన చిత్రంలో తాజ్మహల్ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అహ్వాల్ ఉమ్మత్ మీడియా సెంటర్ వాళ్లు ఈ టార్గెట్ గ్రాఫిక్ను టెలిగ్రాం యాప్లో పోస్ట్ చేశారు. సైనిక యూనిఫాంలో ఉండి, తలమీద నల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి అసాల్ట్ రైఫిల్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ పట్టుకుని ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గరలో ఉన్నట్లుగా ఆ గ్రాఫిక్లో ఉంది. అలాగే దీనికి ఇన్సెట్లో వాడిన మరో బొమ్మలో తాజ్మహల్ బొమ్మ, అక్కడ 'న్యూ టార్గెట్' అని రాసి ఉన్నట్లుగా కనపడుతోంది. దానికి తగ్గట్లుగానే ఆగ్రా నగరంలో చిన్నపాటి పేలుళ్లు జరగడంతో ఇప్పుడు అంతా అప్రమత్తం అవుతున్నారు. నిఘా వర్గాలు ఐసిస్ హెచ్చరికలను మధ్యలోనే ట్రాక్ చేసి, వాటి విషయాన్ని బయటపెట్టినా కూడా నగరంలో భద్రత అంతంతమాత్రంగానే ఉండటం గమనార్హం. ఆగ్రా లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల ఏమైనా జరగరానిది జరిగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉండటంతో పాటు విదేశాల్లో కూడా భారతదేశ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. -
ఐసిస్ టార్గెట్ తాజ్మహలా?
భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుకూల మీడియా గ్రూపు ఒకటి హెచ్చరించింది. వాళ్ల హెచ్చరికలో ఉపయోగించిన చిత్రంలో తాజ్మహల్ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అహ్వాల్ ఉమ్మత్ మీడియా సెంటర్ వాళ్లు ఈ టార్గెట్ గ్రాఫిక్ను టెలిగ్రాం యాప్లో పోస్ట్ చేశారు. ఇది కేవలం కొంతమందికి మాత్రమే వెళ్లిందని, పూర్తి ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో వెళ్లిందని అంటున్నారు. అయినా, జీహాదీల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండే ఇంటెలిజెన్స్ విభాగం ఒకటి దీన్ని గుర్తించింది. సైనిక యూనిఫాంలో ఉండి, తలమీద నల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి అసాల్ట్ రైఫిల్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ పట్టుకుని ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గరలో ఉన్నట్లుగా ఆ గ్రాఫిక్లో ఉంది. అలాగే దీనికి ఇన్సెట్లో వాడిన మరో బొమ్మలో తాజ్మహల్ బొమ్మ, అక్కడ 'న్యూ టార్గెట్' అని రాసి ఉన్నట్లుగా కనపడుతోంది. ఇక్కడ ఆత్మాహుతి దాడి చేయడానికి వాళ్లు సిద్ధపడుతున్నట్లుగా కూడా అందులో రాసి ఉంది. ఇస్లామిక్ స్టేట్ అనుకూల వర్గాలు భారతదేశం మీద దాడులు చేస్తామని బెదిరించడం ఇది మొదటిసారి ఏమీ కాదు. లక్నోలో ఉగ్రవాద నిందితుడు సైఫుల్లాను భద్రతాదళాలు ఎన్కౌంటర్లో హతమార్చినప్పుడు కూడా భారత్ మీద దాడులు చేస్తామని టెలిగ్రాం యాప్లో సందేశాలు వచ్చాయి. సైఫుల్లాను భారతదేశం నుంచి వచ్చిన ఖలీఫా సైనికుడిగా అందులో అభివర్ణించారు. ఇప్పటివరకు ఇస్లామిక్ స్టేట్లో దాదాపు 75 మంది భారతీయులు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఎక్కువగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు. -
ఐఎస్ ముప్పు.. చైనాలో కలవరం!
అంతర్జాతీయ మత ఉగ్రవాదపు జాడలు దేశంలోనూ విస్తరిస్తున్నాయని చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు. చైనాకు చెందిన ముస్లిం మైనారిటీలు ఇరాక్, సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పోరాడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పుపై తాజాగా చైనా అధికారులు హెచ్చరికలు జారీచేశారు. జింగ్జియాంగ్ ప్రావిన్స్కు చెందిన అధికార కమ్యూనిస్ట్ పార్టీ టాప్ అధికారి షర్హాత్ అహాన్ తాజాగా ఉగ్రవాదజాడలపై హెచ్చరికలు చేయడం గమనార్హం. అంతర్జాతీయ ఉగ్రవాద పరిస్థితుల కారణంగా చైనా అస్థిరతకు లోనయ్యే అవకాశముందని, దీని ప్రజాయుద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే జింగ్జియాంగ్ ప్రావిన్స్ గత కొన్నాళ్లుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఇక్కడ స్థానిక వీఘర్ ముస్లిం తెగ ప్రజలు చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇటీవలికాలంలో ఇక్కడ చోటుచేసుకున్న హింసలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇక్కడి వీఘర్ ఇస్లామిక్ వేర్పాటువాదులకు అల్కాయిదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చైనా ఆరోపిస్తున్నది. వీఘర్ వేర్పాటువాదులతో చైనా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నది. వీఘర్ వేర్పాటువాదులకు తాము ఇరాక్లో శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే చైనాలో దాడులు జరుపుతామని ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ ఓ వీడియోలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో మాట్లాడిన అర్హాత్ ఆహాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాలని, ప్రజల ఆస్తులను కాపాడేందుకు, చైనా శక్తిని చాటేందుకు కృతనిశ్చయాన్ని చాటాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో ఇప్పటికే జింగ్జియాంగ్ ప్రావిన్స్లో అధికార యంత్రాంగం గస్తీని ముమ్మరం చేసింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ బహిరంగ ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. -
ఐఎస్పై బహుపరాక్!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఆఖరి దశ పోలింగ్ సమయంలో ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ ఉదంతం సంచలం సృష్టించింది. అంతకు ముందు రోజు పొరుగునున్న మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి సమీపంలో ప్యాసింజర్ రైలులో బాంబు పేలి 10మంది గాయపడిన ఘటనతో ప్రమేయమున్నదని చెబుతున్న ఉగ్రవాది సైఫుల్లా ఈ ఉదంతంలో హతమయ్యాడు. లక్నో ఎన్కౌంటర్ మంగళ వారం మధ్యాహ్నం మొదలై దాదాపు 11 గంటలు కొనసాగి బుధవారం తెల్లారు జామున ముగిసింది. ఇంత సుదీర్ఘంగా ఎన్కౌంటర్ జరగడంవల్ల మాత్రమే కాదు.. మరణించిన సైఫుల్లాకు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలుండవచ్చునన్న ఊహాగానాలు రావడం వల్ల, మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉండటం వల్ల కూడా లక్నో ఉదంతానికి ప్రాముఖ్యత ఏర్పడింది. ఎన్కౌంటర్ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. ఈ ఉదంతానికి ముందు యూపీలోనే వేర్వేరుచోట్ల మరో ముగ్గురు అరెస్టయ్యారు. సైఫుల్లా నేపథ్యం గురించి మీడియాకు వెల్లడించింది యూపీ పోలీసులే. ఇదే నిజమైతే దేశంలో ఆ సంస్థ జాడలున్నాయన్న అంచనాకు రాక తప్పదు. నిజానికి ఇరాక్లో ఐఎస్ ఇప్పుడు క్షీణ దశలో ఉన్నదన్న కథనాలు వెలువడుతున్నాయి. సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ ఓటమిని అంగీకరిస్తూ ‘స్వస్థలాలకైనా పొండి... చావనైనా చావండి’ అని శ్రేణులకు పిలుపునిచ్చాడని కూడా చెబుతున్నారు. అలాంటి దశలో ఉన్న సంస్థ గురించి యూపీ పోలీసులు అతిగా చెబుతున్నారని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్టు మీడియా కథనాలు అంటున్నాయి. ఇందుకు యూపీ పోలీసుల్ని మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. వారికన్నా ముందు మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ కూడా ఆ మాదిరే చెప్పారు. రైలు బోగీలో జరిగిన పేలుడులో ఐఎస్ ప్రమేయంపై సాక్ష్యాధారాలు లభించాయని ఆయన ప్రకటించారు. ఆ రాష్ట్ర పోలీసులు మాత్రం కోర్టుకు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పట్టుబడిన ముగ్గురూ సిమి, ఐఎస్ ఉగ్రవాద సంస్థలతో ప్రభావితమైనట్టు తెలిపారు. సైఫుల్లాకు ఐఎస్తో నేరుగా ప్రమేయం ఉండక పోవ చ్చునని, దానికి అనుబంధంగా ఉన్న ఖురసాన్లో పనిచేశాడని మరో కథనం. దీన్ని ఐఎస్ ఇరాన్లో నడుపుతోంది. మనదేశంలో దాని పేరు వినబడటం ఇదే తొలిసారి. ఐఎస్ సంస్థ గురించి ఇంతగా ఆందోళన పడటానికి ఆ సంస్థ ఇరాక్, సిరి యాల్లో సాగించిన దుర్మార్గాలే కారణమని అందరికీ తెలుసు. సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ తన శ్రేణులకు పిలుపునిస్తూ ఈమధ్య విడుదల చేసిన వీడియోలో పశ్చిమ దేశాలపైనా, అరబ్ దేశాలపైనా దాడులకు పూనుకోమని చెప్పాడంటు న్నారు. అంతక్రితం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అలవాటున్న బగ్దాదీ ఈసారి అందుకు భిన్నంగా చెప్పిన నేపథ్యంలో యూపీ పోలీసుల అంచనా తప్పు కావచ్చునని కేంద్రం ఆశిస్తున్నట్టుంది. మన దేశంలో ఇంతవరకూ ఐఎస్ కార్యకలా పాల జాడ లేదు. అయితే ఆ సంస్థ కార్యకలాపాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభావితులవుతున్న యువకులను వివిధ చోట్ల అడపా దడపా అరెస్టు చేస్తున్నారు. పోలీసుల కన్నుగప్పి దేశం దాటి వెళ్లిన వారూ ఉన్నారు. వారిలో కొందరు నిరాశానిస్పృహలకు లోనై వెనక్కి కూడా వచ్చారు. ఏ రకంగా చూసినా మన దేశాన్ని ఇంతవరకూ ఐఎస్ రిక్రూట్మెంట్ కేంద్రంగా మాత్రమే పరిగణించింది. ఇరాక్లోనూ, సిరియాలోనూ సాగించే పోరా టానికి వారిని తరలించింది. తాజా ఉదంతం నేపథ్యంలో ఇప్పుడు అందుకు భిన్న మైన వైఖరి తీసుకుందా అన్నది తేలాల్సి ఉంది. ఉజ్జయిని ఉదంతంతో ప్రమేయమున్నవారు నేరుగా ఐఎస్తో సంబంధాలు పెట్టుకున్నారా లేక దానికి ప్రభావితమైనారా అన్నది పక్కనబెడితే ఆ యువకులు ఉగ్రవాద దాడికైతే పాల్పడగలిగారు. మన నిఘా సంస్థలు, శాంతిభద్రతల యంత్రాంగం తగినంత అప్రమత్తతతో లేవని రుజువుచేశారు. సక్రమంగా తనిఖీలు జరిగి ఉంటే వారి పథకం పారేది కాదు. నిజానికి ఉజ్జయిని, ఇండోర్లు సిమి సంస్థకు గట్టి పట్టున్న ప్రాంతాలని పేరు. అలాంటిచోట కూడా ఉదాసీనంగా వ్యవ హరించడం ప్రమాదకర సంకేతాలనిస్తుంది. పైగా ఉజ్జయినిలో ఉపయోగించిన బాంబును లక్నోలో సైఫుల్లా మరణించిన ఇంట్లోనే తయారుచేశారంటున్నారు. ఇంతక్రితం ఐఎస్తో ప్రభావితులైనవారు ఒకరిద్దరుగా పట్టుబడేవారు. ఈసారి ఏడెనిమిదిమంది అరెస్టయ్యారు. ఇదంతా పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఒకపక్క ఈ ఉగ్రవాదుల నేపథ్యంపై ఇన్ని అనుమానాలుండగా సైఫుల్లాను పోలీసులు సజీవంగా పట్టుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదట ఆ స్థావరంలో ఇద్దరు యువకులున్నారని పోలీసులు చెప్పారు. కానీ అక్కడున్నది సైఫుల్లా ఒక్కడే అని తేలింది. అతన్ని లొంగదీసుకోవడానికి అతని సోదరుడితో ఫోన్ చేయిం చామని పోలీసులు చెబుతున్నారు. అది ఫలించకపోగా ఎదురుదాడికి దిగాడని అందువల్లే మట్టుబెట్టవలసి వచ్చిందని వారంటున్నారు. అయితే ప్రతి ఎన్కౌంటర్ ఉదంతంలోనూ వచ్చిన ఆరోపణలే ఈ ఎన్కౌంటర్పైనా వచ్చాయి. ఘటనాస్థలికి సమీపంగా ఉన్నవారు ఇరుపక్షాలమధ్యా అసలు కాల్పులే చోటుచేసుకోలేదని చెబుతున్నారు. నిజానికి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆ ఇంటిపై పోలీసులు దాడిచేసి మరో గంటకు లోపలకు ప్రవేశించారన్నది వారి కథనం. ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్పుల శబ్దం వినిపించిందని అంటున్నారు. ఇందుకు భిన్నంగా సాయంత్రం మొదలుకొని రాత్రంతా కాల్పులు ఎడతెగకుండా సాగా యని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా చెదురుమదురుగానే కావొచ్చుగానీ ఇటీవలికాలంలో రైళ్లను లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది తొలి 40 రోజుల్లో 18 ఘటనలు జరిగాయి. అదృష్టవశాత్తూ ఎక్కడా ప్రాణనష్టం లేదు. మంగళవారం ఉజ్జయిని ఉదంతంతోపాటు కేరళలోని కన్నూరు జిల్లాలో పట్టాలకు దగ్గర్లో 13 నాటుబాంబులు లభ్యమయ్యాయి. మన నిఘా సంస్థలు, తనిఖీ బృందాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని... రైల్వే శాఖ తన భద్రతా వ్యవస్థను తక్షణం కట్టుదిట్టం చేసుకోవాల్సిన అగత్యాన్ని ఇవన్నీ తెలియజెబుతున్నాయి. -
పెట్టినవి పైపు బాంబులు.. సిరియాకు ఆ ఫొటోలు!
భారతదేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం వేళ్లూనుకోడానికి ప్రయత్నిస్తోందన్న సూచనలు ఇప్పటికే వచ్చాయి. వాటిని బలపరిచేలా మరిన్ని అంశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. భోపాల్ - ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడు కోసం ఉగ్రవాదులు ఉపయోగించినవి పైపు బాంబులని, వాటి ఫొటోలను వాళ్లు సిరియాకు కూడా పంపారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అదృష్టవశాత్తు అది ఎవరికీ కనపడకుండా ఉండాలని వాళ్లు పై బెర్తులో పెట్టడంతో బాంబు పేలుడు వల్ల రైలు పైకప్పు మాత్రం ధ్వంసమైందని, అదే లోయర్ బెర్తు కింద పెట్టి ఉంటే చాలా పెద్ద నష్టమే సంభవించి ఉండేదని చౌహాన్ అన్నారు. కాన్పూర్, కనౌజ్ల నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఇక్కడ బాంబులు పెట్టిన వెంటనే లక్నో వెళ్లిపోదామని ప్లాన్ చేసుకున్నారని, వాళ్లు లక్నో నుంచి మధ్యప్రదేశ్కు పుష్పక్ ఎక్స్ప్రెస్లో వచ్చారని సీఎం చౌహాన్ వివరించారు. వాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల మీద 'ఐసిస్.. మేం ఇండియాలో ఉన్నాం' అని రాసి ఉందని తెలిపారు. ఉగ్రవాదులు తాము రైల్లో పెట్టిన పైపు బాంబు ఫొటోలు తీసి, వాటిని సిరియాకు పంపారని కూడా ఆయన వివరించారు. దాన్ని బట్టి చూసినా.. వాళ్లు ఐసిస్కు చెందినవారేనని స్పష్టం అవుతోందన్నారు. ఉదయం 7.30 గంటల సమయంలో వాళ్లు బాంబు పెట్టి, రెండు గంటల తర్వాత పేలేలా టైం సెట్ చేశారని, మధ్యప్రదేశ్ ఏటీఎస్ బృందాలు కేంద్ర నిఘా సంస్థలను సంప్రదించి, ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పట్టుకున్నాయని ఆయన తెలిపారు. అతీఫ్ ముజఫర్ అనే వ్యక్తి కుట్రకు సూత్రధారి అని, అతడితో పాటు మహ్మద్ డానిష్, సయ్యద్ మీర్ హుస్సేన్ అనే ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకున్నారన్నారు. పేలుడు సంభవించిన కొద్దిసేపటి తర్వాత ఈ ముగ్గురినీ పిపారియా బస్ స్టాప్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రైల్లోకి అనుమానిత వస్తువులతో వీళ్లు ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాళ్ల వద్ద రైలు టికెట్లతో పాటు పేలుడుకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇదే పేలుడుకు సంబంధించి మరో ఉగ్రవాది సైఫుల్లా లక్నోలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. -
భారత్లో ఐసిస్ తొలి పంజా?
ముగిసిన లక్నో ఎన్కౌంటర్ 12 గంటల పాటు ఉగ్రవాదితో పోరు సైఫుల్లా అనే ఉగ్రవాది హతం మైక్రోట్యూబ్ కెమెరాలతో పరిశీలన లక్నో: ఇరాక్, సిరియా దేశాల్లో చావుదెబ్బ తిన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వేరే దేశాల వైపు చూస్తోందా? ఉగ్రవాద చర్యలకు తరచు టార్గెట్ అవుతున్న భారతదేశం దానికి ఇప్పుడు స్థావరం కాబోతోందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఐఎస్ చెరలో ఉండి, ఇటీవలే దాని బారి నుంచి బయటపడిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన డాక్టర్ కొసనం రామ్మూర్తి కూడా ఇదే విషయం చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థ భారతదేశాన్ని తన తదుపరి టార్గెట్గా చేసుకోవాలనుకుంటోందని ఆయన తెలిపారు. తాను వాళ్ల చెరలో ఉన్నప్పుడు వాళ్ల మాటలను బట్టి ఆ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. ఇప్పుడు తాజాగా లక్నోలో జరిగిన ఘటన చూస్తే.. ఇస్లామిక్ స్టేట్ సంస్థ నెమ్మదిగా ఇక్కడ అడుగు మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు సంభవించింది. ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా కలాపీపల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పేలుడులో గన్పౌడర్ కనిపించిందని, దాన్నిబట్టి చూస్తే ఇది ఉగ్రవాద చర్య కావచ్చని ప్రాథమికంగా పోలీసు అధికారులు అంచనాకు వచ్చారు. ఆ తర్వాత దానికి సంబంధం లేకుండా ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఇద్దరు ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బృందం రంగంలోకి దిగింది. చాలాసేపు ఎదురు కాల్పులు జరిగిన తర్వాత.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అవతలి నుంచి కాల్పులు ఆగిపోయాయి. అప్పటికే స్మోక్ బాంబులు, టియర్ గ్యాస్.. ఇలా చాలా ప్రయోగాలు చేశారు. చివరకు లోపలకు వెళ్లి చూస్తే.. ఒక్క ఉగ్రవాది మృతదేహం కనిపించింది. అతడి దగ్గర ఒక పిస్టల్, ఒక రివాల్వర్, కత్తి.. ఇలాంటి ఆయుధాలు దొరికాయి. మరణించిన ఉగ్రవాది పేరు సైఫుల్లా అని.. అతడికి ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుడుతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా తాము మైక్రోట్యూబ్ కెమెరాలు ఉపయోగించామని, దాన్ని బట్టి చూస్తే చీకట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు అనిపించిందని ఏటీఎస్ సీనియర్ అధికారి అసీమ్ అరుణ్ చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మొదలైన ఆపరేషన్.. దాదాపు 12 గంటల పాటు కొనసాగి, తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ముగిసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రభావంతోనే సైఫుల్లా పనిచేశాడని, ఐసిస్ ఖురసాన్ మాడ్యూల్కు చెందివాడని యూపీ పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి అత్యంత కీలకమైన చిట్టచివరి దశ పోలింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు వరకు ఈ ఎన్కౌంటర్ మొత్తం కొనసాగడం విశేషం. -
ఈసారి ఐసిస్ టార్గెట్ బ్రిటీష్ నగరాలే!
లండన్: గత కొద్ది రోజులుగా చప్పుడు చేయకుండా ఉన్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ వాస్తవానికి పెద్ద మొత్తంలో కుట్రలు చేస్తున్నట్లు తెలిసింది. దాని దాడి వ్యూహాల్లో మార్పులు చేసుకొని కొత్త తరహాలో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నిందట. అయితే, ఆ కొత్త తరహా దాడికి తొలుత బ్రిటన్ను ఎంచుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేసే ఓ సంస్థకు చెందిన న్యాయవాది మ్యాక్స్ హిల్ ఓ టీవీ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఈ షాకింగ్ విషయం చెప్పారు. ‘ఏమాత్రం విభేదాలు చూపకుండా విచక్షణారహితంగా అమాయక ప్రజలను ఇస్లామిక్ స్టేట్ లక్ష్యంగా చేసుకుంది. 40 ఏళ్ల కిందట బ్రిటన్ ఎదుర్కొన్న దాడి అంత పరిమాణంలో ఈసారి ఎటాక్ చేయాలని సిద్ధమవుతోంది. ఈ దాడి ఎలా ఉండబోతుందన్నది సహజంగా ఊహించడం కష్టం. బ్రిటన్లోని కొన్ని నగరాల్లో జాతి పరంగా, రంగు పరంగా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. నిర్లక్ష్యం చేయడం అంతమంచిది కాదు. అదే సమయంలో బ్రిటన్ సైనిక బలం, ఇంటెలిజెన్స్ ఈ దాడులను సమర్థంగా తిప్పిగొట్టగలుగుతుంది’ అని ఆయన అన్నారు. -
భారతదేశ ఆక్రమణకు ఐఎస్ కుట్ర!
-
భారతదేశ ఆక్రమణకు ఐఎస్ కుట్ర!
ఇస్లామిక్ స్టేట్... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ. ఇప్పటివరకు కొన్ని దేశాల మీద మాత్రమే దృష్టిపెట్టి అక్కడ రక్తపుటేర్లు ప్రవహింపజేస్తున్న ఐఎస్.. తాజాగా భారతదేశం మీద కూడా దృష్టి పెట్టిందట. భారతదేశాన్ని ఆక్రమించాలని చాలా ఆసక్తిగా ఉందట. ఈ విషయాన్ని నిన్న మొన్నటి వరకు ఆ సంస్థ వద్ద బందీగా ఉండి, క్షేమంగా బయటపడిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసి డాక్టర్ కొసనం రామ్మూర్తి చెప్పారు. శనివారం ఉదయం భారతదేశానికి చేరుకున్న డాక్టర్ రామ్మూర్తి జాతీయ మీడియాతో మాట్లాడారు. భారతదేశ విద్యావ్యవస్థ, ఇక్కడి ఆర్థికవృద్ధి చూసి ఇస్లామిక్ స్టేట్ బాగా ఇంప్రెస్ అయ్యిందని, అందుకే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్లు వాళ్ల సంభాషణల ద్వారా తనకు తెలిసిందని ఆయన అన్నారు. తనను వాళ్లు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, దారుణమైన వీడియోలు బలవంతంగా చూపించి వాళ్ల కార్యకలాపాలను తనకు అర్థం అయ్యేలా చేశారని డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. తమ ముందే కొంతమంది బందీలను కొట్టేవారని కూడా అన్నారు. వాళ్లది చాలా దారుణమైన ఉగ్రవాద సంస్థ అని, తమ ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయాలని చూస్తున్నారని చెప్పారు. తమ నియమ నిబంధనలను ప్రతి ఒక్కళ్లూ పాటించాలన్నదే వాళ్ల ఆశయమన్నారు. ఐఎస్ వద్ద బందీగా ఉన్న తనను.. వాళ్లకోసం పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేశారని, తనకు అంత అనుభవం లేదని చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. సుమారు ఏడాదిన్నర పాటు అక్కడే ఉండి వాళ్ల దుశ్చర్యలను ప్రత్యక్షంగా చూసిన రామ్మూర్తి.. తనను విడిపించి సురక్షితంగా ఇక్కడకు తెప్పించడంలో భారత ప్రభుత్వం చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదుల చేతికి చిక్కేముందు ఆయన లిబియాలోని సిర్టె నగరంలో గల ఎల్బిఎన్-ఎ సినా ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేశారు. ఉగ్రవాదులు సుమారు ఏడాదిన్నర క్రితం ఆస్పత్రిలోకి చొరబడి ఆయనను, ఒడిషాకు చెందిన ఇంజనీర్ సామల్ ప్రవాష్ రంజన్ను, ఏడుగురు ఫిలిప్పీన్స్ నర్సులను ఎత్తుకెళ్లారు. -
లిబియాలో కిడ్నాపైన డాక్టర్ విడుదల
-
లిబియాలో కిడ్నాపైన డాక్టర్ విడుదల
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు లిబియా ఉగ్రవాదుల చెర నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన డాక్టర్ రామ్మూర్తి విడుదలయ్యారు. ఈ మేరకు ఆయన కుటుంబీకులకు సమాచారం అందింది.ఆయన లిబియాలోని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నారని, 25న ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కొసనం రామ్మూర్తి వైద్యుడు. కుటుంబంతో ఏలూరు శివారు దొండపాడులో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో 16 ఏళ్ల కిందట రామ్మూర్తి లిబియా వెళ్లారు. ఆయనను 2015 సెప్టెంబర్లో లిబి యాలోని సిర్త్ పట్టణంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన వారిలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తితో పాటు రామ్మూర్తి కూడా ఉన్నారని తెలియడంతో ఆయన భార్య, పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి వారి నిరీక్షణకు తెరపడింది. ఆయన బుధవారం లిబియాలోని ఇండియన్ ఎంబసీకి క్షేమంగా చేరుకో వడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఐసిస్పై ప్రేమతో ఆ బాలిక పోలీసును పొడిచి..
జర్మనీ: సాధారణంగా ప్రతిసారి ఉగ్రవాదులు దాడి చేస్తుంటారు. వారు సృష్టించే మారణకాండను సామాన్యులు అసహ్యించుకుంటారు. వారిపట్ల సానుభూతి అనేది ఏ ఒక్కరికీ ఉండదు. కానీ తొలిసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావానికి గురై, వారిపై సానుభూతితో ఓ పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన బాలికను జర్మనీ పోలీసులు కటకటాల్లోకి పంపించారు. దాదాపు ఆరేండ్ల కాలంపాటు ఆ బాలిక జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. జర్మనీలోని హనోవర్ ప్రాంతంలో సఫియా ఎస్ అనే బాలిక 16, (దాడి చేసే సమయంలో 15 ఏళ్లు) ఇస్లామిక్ స్టేట్ భావాజాలానికి ప్రేరేపితురాలై వారిపై సానుభూతితో ఓ పోలీసు అధికారిని కత్తితో దారుణంగా పొడిచి గాయాల పాలు చేసింది. ఆ బాలిక అలా దాడి చేయడానికి గల కారణాలను ప్రశ్నించగా తాను ఉగ్రవాద సంస్థను కాపాడేందుకు ఈ పనిచేసినట్లు తెలిపింది. దీంతో ఆ బాలికను అరెస్టు చేసి విచారణ అనంతరం కోర్టుకు తీసుకెళ్లగా ఆరేళ్ల శిక్ష పడింది. -
బెంఘాజీలో ఉగ్రవాదులను ఊడ్చేశారు
లిబియా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లిబియాలోని కీలకమైన బెంఘాజీ ప్రాంతంపై పూర్తిగా పట్టునుకోల్పోయారు. ఉగ్రవాదులపై తీవ్ర పోరాటం చేస్తున్న అధికారిక సైన్యానికి సానుభూతిగా పనిచేస్తున్న ఫీల్డ్ మార్షల్ ఖలిఫా హఫ్తార్ సేన బెంఘాజిలోని గన్ఫౌడా నుంచి ఆ ఉగ్రవాదులను తరిమికొట్టింది. ఈ విషయాన్ని ఆ సైన్యం మార్షల్ హప్తార్ గురువారం ప్రకటించారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంపై ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దీంతో వారిని సమూలంగా నాశనం చేసేందుకు జరుగుతున్న యుద్ధాల్లో ఆ ప్రాంతం అస్తవ్యస్థంగా మారింది. అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగానీ, అల్ కాయిదా ఉగ్రవాదులుగానీ అయ్యుండొచ్చని మిలిటరీ అధికారులు చెబుతున్నారు. దాదాపు చాలామంది అధికారిక సైన్యమే మట్టుపెట్టగా మిగిలిన వారిని హప్తార్ సైన్యం తరిమికొట్టింది. అయితే, కొందరు ఉగ్రవాదులు సమీపంలోని 12 బ్లాక్స్ అనే ప్రాంతంలోకి వెళ్లి తలదాచుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. హప్తార్ సేనకు ఇప్పటి వరకు ఐక్య రాజ్యసమితి నుంచి గానీ లిబియా నుంచి గానీ గుర్తింపు లేదు. ఈ సైన్యాన్ని లిబియన్ నేషనల్ ఆర్మీగా చెబుతుంటారు. -
వేసవిలోగా ఐసిస్ పని ఖతం!
పారిస్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి మొసుల్ను వేసవిలోగా విడిపించే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షడు ఫ్రాంకోయిస్ హొలండే అన్నారు. ఇరాకీ సైన్యం, అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు ఇస్లామిక్ స్టేట్కు పట్టున్న మోసుల్ను స్వాధీనం చేసుకోవడానికి చేపడుతున్న ఆపరేషన్ గురించి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాకీ సేనల సహకారంతో సంకీర్ణ బలగాలు చేపడుతున్న ఆపరేషన్లో చాలా ప్రాంతాలు ఇస్లామిక్ స్టేట్ నుంచి విముక్తి పొందాయని హొలండె స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ వెనుకడుగు వేసిందని.. అయితే తమ లక్ష్యం మోసుల్ నుంచి వారిని తరిమికొట్టడం అన్నారు. ఇది వేసవిలోపు సాధ్యమౌతుందని భావిస్తున్నట్లు హొలండె తెలిపారు. ఇరాక్పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు చేపడుతున్న దాడుల్లో ఫ్రాన్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
ఉగ్రవాదులపై పోరాటానికి మహిళా ఫైటర్లు
కాబుల్: తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులతో అఫ్ఘానిస్థాన్ అట్టుడికిపోతోంది. తాలిబన్ల వల్ల గతంలో చాలా నష్టపోయింది. అఫ్ఘాన్లో ప్రజాసామ్య ప్రభుత్వం ఏర్పడినా ఉగ్రవాద ముప్పు తప్పలేదు. ఉగ్రవాద దాడులతో విసిగిపోయిన ప్రజలు వారిపై తిరగబడుతున్నారు. విశేషమేంటంటే ఆ దేశంలోని ఉత్తరాదిన ఉన్న జవ్జ్జాన్ ప్రావిన్స్లో తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదులపై పోరాటానికి మహిళలు ముందుకు వస్తున్నారు. ఉగ్రవాదులపై పోరాటంలో భాగంగా మహిళలు ఆయుధాలను చేతపట్టారు. అత్యాధునిక రైఫిల్స్ను కాల్చడంలో శిక్షణ పొందారు. ఆయుధాలు చేతపట్టిన మహిళల ఫొటోలు సోషల్ మీడియా వెబ్సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాటానికి మహిళలను కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు కూడా ప్రోత్సహిస్తున్నారు. తాలిబన్ల స్వాధీనం కాకుండా తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు జర్మీనా (53) అనే మహిళ కమాండెర్ సారథ్యంలో మహిళలు పోరాడుతున్నారు. ఆమె నేతృత్వంలో 45 మంది మహిళా ఫైటర్లు పనిచేస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన మహిళలు వారిపై పోరాటానికి ఆయుధాలు చేతపడుతున్నారు. 2014లో ఓ అఫ్థాన్ మహిళ తన కొడుకు హత్యకు ప్రతీకారంగా 25 మంది తాలిబన్ ఉగ్రవాదులను చంపేసింది. -
బాగ్దాద్ లో మరో మారణ హోమం
బాగ్దాద్: కారు బాంబు దాడితో ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి దద్దరిల్లింది. కారు బాంబులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చి వేసుకోవడంతో 17 మంది మృతి దుర్మరణం చెందారు. పదులమంది తీవ్ర గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులంతా కూడా దినసరి కూలీలు, శ్రామికులు అని వారు వెల్లడించారు. బాగ్దాద్కు ఈశాన్యంలోని సదర్ నగరంలోని ఓ చోట ప్రతి రోజు కూలి పనులకు వెళ్లేందుకు పెద్దమొత్తంలో గుమికూడి ఉంటుంటారు. వీరిని లక్ష్యంగా చేసుకొని ఓ ఉగ్రవాది కారు నిండా బాంబులతో వెళ్లి ఆత్మాహుతి దాడికి దిగాడు. ఒక్కసారిగా వారి మీదకు తీసుకెళ్లి కారుతో సహా పేల్చేసుకున్నాడు. దీంతో 17మంది శ్రామికులు అక్కడికక్కడే మృత్యువాతపడగా 39మంది గాయాలపాలయ్యారు. గత మూడు రోజుల్లో ఇది రెండో అతిపెద్ద దాడి. శనివారం సెంట్రల్ బాగ్దాద్లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో 27మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం జరిగిన బాంబు దాడిని తామే చేశామని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే, గతంలో జరిగిన బాంబు దాడులన్నీ కూడా ఇస్లామిక్ స్టేట్ జరిపిన విషయం తెలిసిందే. -
ఇది భారత్కు ప్రమాదకరం: నిఘావర్గాలు
న్యూఢిల్లీ: ఇరాక్, సిరియాలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఇటీవలి కాలంలో సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి సిరియా, ఇరాక్లకు వెళ్లి అక్కడ ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారు.. తిరిగి స్వదేశాలకు పయనమయ్యే అవకాశాలు పెరిగాయని తెలుస్తోంది. భారత్ నుంచి వెళ్లి ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారి సంఖ్య 40 నుంచి 50 మంది వరకు ఉంటుందని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయి. సంకీర్ణ సేనల దాడులతో ఇస్లామిక్ స్టేట్ తమ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలను క్రమంగా కోల్పోతున్న నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లిన యువత తిరిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి వెల్లడించారు. యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించి.. ఇస్లామిక్ స్టేట్తో పూర్తిగా ప్రభావితమై ఉన్న వీరు.. దేశంలో ఉగ్రచర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆన్లైన్ రాడికలైజేషన్ ట్రెండ్ కన్నా ఇది ప్రమాదకరమైనది అని ఆయన వ్యాఖ్యానించారు. -
ముంబై నుంచి వెళ్లి సిరియాలో..
ముంబై: ముంబై లోని కళ్యాణి ప్రాంతం నుంచి సిరియాకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన అమన్ టాండెల్ మృతి చెందినట్లు ఐఎస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఇస్లామిక్ స్టేట్ అఫిషియల్ మీడియా చానల్ ఖిలాఫా న్యూస్లో.. అమన్ అమరుడయ్యాడంటూ ఓ కథనాన్ని ఫోటోతో సహా ప్రచురించింది. అమన్తో పాటు విదేశాల నుంచి వచ్చి తమ తరఫున పోరాడుతూ మృతి చెందిన మరికొంత మంది వివరాలను సైతం ఐఎస్ ప్రకటించింది. అమన్ రక్కా ప్రాంతంలో మృతి చెందినట్లు ఖిలాఫా న్యూస్ తెలిపింది. అమన్ మృతి గురించి గత నెలలోనే అతడి కుటుంబసభ్యులు సమాచారం అందుకున్నప్పటికీ.. భారత భద్రతా సంస్థలు దీనిని ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ప్రకటనతో అమన్ మృతిపై క్లారిటీ వచ్చినట్లైంది. 2014 లో ఇరాక్లోని పవిత్ర ప్రాంతాలను సదర్శించేందుకని కళ్యాణి ప్రాంతం నుంచి అమన్తో పాటు మరో ముగ్గురు సిరియాకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపారు. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన ఓ వీడియోలో అమన్తో పాటు అతడి మిత్రుడు.. ఇండియాలో ముస్లింలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. అమన్తో పాటు వెళ్లిన ముగ్గురిలో సహీమ్ టంకీ ఇంతకుముందే మృతి చెందగా.. అరీబ్ మజీద్ గత ఏడాది ఇండియాకు తిరిగివచ్చి విచారణనను ఎదుర్కొంటున్నాడు. మరో వ్యక్తి షేక్ ప్రస్తుతం సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్నట్లు సమాచారం. -
థెరిసా నివాసం పేల్చేందుకు ఐసిస్ కుట్ర
కోల్కతా: భారత రత్న సెయింట్ థెరిస్సా(మదర్ థెరిస్సా) నివాసంపై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారు. కోల్కతాలోని ఏజేసీ రోడ్డులో గల ఆమె నివసించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలని సంకల్పించారు. ఇక్కడే సెయింట్ థెరిస్సాను ఖననం చేసిన విషయం కూడా తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులు చేసిన ఈ కుట్రను బయటపెట్టారు. గత జూలైలో బుర్ద్వాన్ రైల్వే స్టేషన్లో ఎన్ఐఏ అధికారులు మహ్మద్ మసీరుద్దీన్ అలియాస్ ముసాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢాకాలోని ఆర్టిసన్ బేకరీపై ఉగ్రదాడి అనంతరం అప్రమత్తమైన ఎన్ఐఏ ముసాను అదుపులోకి తీసుకొని విచారించింది. అనంతరం ఆ విచారణకు సంబంధించిన చార్జిషీట్ను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించారు. ఇందులో థెరిసా నివాసం ఇంటిపై ఉగ్రదాడికి కుట్రలు చేసినట్లు ముసా ఒప్పుకున్నాడనే విషయం వెల్లడించారు. ముసాను ఒక్క ఎన్ఐఏ అధికారులు మాత్రమే కాకుండా ఎఫ్బీఐ అధికారులు, స్థానిక అధికారులు కూడా విచారించారు. ఈ విచారణలో తనతోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని వారు తర్వాత వచ్చి దాడిలో పాల్గొంటామని చెప్పినట్లు తెలిపాడు. పాశ్చాత్యులను, ఇతర దేశాలనుంచి పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలనుకున్నామన్నారు. పాశ్చాత్యులంటే తనకు అసహ్యం అని చెప్పారు. అతడి సమాచారం ఇవ్వగానే ఎలాంటి ఆందోళన పరిస్థితులు ఏర్పడకుండా మఫ్టీ డ్రెస్సులో కొంతమంది పోలీసులను థెరిసా నివాసం వద్ద ఉంచామని, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారించి పంపిస్తున్నారని తెలిపాడు. -
చర్చిలపై దాడులకు ఐసిస్ సిద్ధం?
ఒకవైపు క్రిస్మస్, మరోవైపు కొత్త సంవత్సరం వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలోని చర్చిలపై ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఎఫ్బీఐ హెచ్చరించింది. అమెరికాలో ఉన్న చర్చిలపై దాడులు మొదలుపెట్టాలంటూ ఇస్లామిక్ స్టేట్ తన సానుభూతిపరులకు ఆన్లైన్లో సందేశాలు పంపుతుండగా, వాటిని ఎఫ్బీఐ మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసింది. టర్కీలో రష్యా రాయబారిని ఒక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది కాల్చి చంపి.. బెర్లిన్లో క్రిస్మస్ మార్కెట్లోకి ట్రక్కును పంపించి, డజను మందిని చంపిన తర్వాత.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యంపైనే గురిపెట్టినట్లు తెలుస్తోంది. జర్మనీ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించుకుంది. తమకు అందిన సమాచారాన్ని ఎఫ్బీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే కచ్చితంగా ఎక్కడ దాడులు జరగొచ్చన్న విషయం గురించి మాత్రం రాష్ట్రాల అధికారులు ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. కాగా, జర్మనీ మార్కెట్లోకి ట్రక్కును తీసుకెళ్లి, పలువురిని తొక్కించి చంపేసిన ట్యునీషియన్ ఉగ్రవాది అనిస్ అమ్రీ... ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు. -
ఆ ఉగ్రవాదిని హతమార్చారు!
మిలాన్: జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ట్రక్కుతో దాడి చేసి 12 మందిని పొట్టనబెట్టుకున్న ఘటనలో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శుక్రవారం ఇటలీలో ఉత్తరాదిన ఉన్న మిలాన్ నగరంలో జరిగిన కాల్పుల్లో నిందితుడు మరణించినట్టు భద్రతాదళ అధికారులు చెప్పారు. మృతుడ్ని ట్యునీసియాకు చెందిన 24 ఏళ్ల అనిస్ అమ్రిగా పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించిన ఓ వీడియోను ఇటలీ మేగజైన్ పనోరమ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఇటీవల బెర్లిన్లోని రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లో దుండగుడు ట్రక్కుతో విధ్వంసం సృష్టించడంతో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తమ సైనికుడే అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి ఓ పాకిస్తాన్ వ్యక్తిని పోలీసులు మొదట అరెస్ట్ చేసినా.. తర్వాత దాడికి పాల్పడింది అతడుకాదని భావించి వదిలేశారు. -
'ఆ దాడి చేసింది మా సైనికుడే'
బీరుట్: జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ట్రక్కుతో బీభత్సం సృష్టించిన వాడు మా సైనికుడే అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్ అనుబంధ వార్తా సంస్థ అమాక్ మంగళవారం ఓ ప్రకటనను వెల్లడించింది. సంకీర్ణ కూటమిలోని దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడి చేయమని ఇచ్చిన పిలుపు మేరకే ఇస్లామిక్ స్టేట్ సైనికుడు ఈ దాడికి పాల్పడ్డాడు అని అమాక్ ఓ ఆన్లైన్ పోస్ట్లో వెల్లడించింది. బెర్లిన్లోని రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లో ట్రక్కుతో విధ్వంసం సృష్టించిన దుండగుడు 12 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి ఓ పాకిస్తాన్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినా.. తరువాత దాడికి పాల్పడింది అతడుకాదని భావించి వదిలేశారు. నిందితుడి కోసం వేట కోనసాగుతోంది. కాగా, ఇస్లామిక్ స్టేట్ వెల్లడించిన ప్రకటనలో దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించి ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. -
యెమెన్లో ఐసిస్ నరమేధం
ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతి ∙84 మందికి గాయాలు.. అడెన్: యెమెన్లోని అడెన్ ప్రాంతంతో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతిచెందారు. 84 మందికిపైగా గాయపడ్డారు. అడెన్లో సైనికులపై వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో ఆత్మాహుతి దాడి ఇది. వేతనాలు తీసుకునేందుకు ఈశాన్య అడెన్లోని సైనిక స్థావరం వద్ద గుమికూడిన సైనికులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. సైనికుల్లో కలసిపోయి ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. 48 మంది సైనికులు మరణించారని, 84 మంది ఇతరులు గాయపడ్డారని అడెన్ హెల్త్ చీఫ్ అబ్దుల్ నాసర్ అల్–వలి తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భీతావహ పరిస్థితి నెలకొంది. తెగిపడిన శరీర భాగాలు, నెత్తుటి చారికలతో ఆ ప్రాంతం భీతి గొలుపుతోంది. కాగా, దాడి తమ పనేనని ఐఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు ఎనిమిది రోజుల క్రితం అల్–సవ్లాబన్ ప్రాంతంలో ఇదే తరహాలో ఐఎస్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. 29 మంది ఇతరులు గాయపడ్డారు. బాగ్దాదీని పట్టిస్తే 170 కోట్లు వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీపై ఉన్న బహుమానాన్ని అమెరికా భారీగా పెంచింది. బాగ్దాదీకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసిన వారికి 25 మిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు 170 కోట్లు) ఇస్తామని తెలిపింది. బాగ్దాదీని పట్టించిన లేదా సమాచారం తెలిపిన వారికి తొలుత 10 మిలియన్ యూఎస్ డాలర్ల (సుమారు 68 కోట్లు)ను బహూకరిస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్నే రెండింతలు పైగా పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 2011లో అల్కాయిదా అధినేత ఒసామా బిన్లాడెన్పై కూడా అమెరికా 25 మిలియన్ యూఎస్ డాలర్లను ప్రకటించింది. ఆ తర్వాత ఇంత మొత్తంలో బహుమతిని మరొకరిపై అమెరికా ఎన్నడూ ప్రకటించలేదు. -
ఐసిస్ను ఊడ్చిపారేశారు!
లిబియా: ఉగ్రవాదుల చెరు నుంచి లిబియా ఊపిరి పీల్చుకుంది. తమ దేశంలో పాగా వేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను దాదాపు పూర్తిగా ఊడ్చిపారేసింది. అమెరికా సేనల సహాయంతో సిర్టీలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చివరి బేస్ క్యాంపుపై విజయవంతంగా లిబియా సేనలు వైమానిక దాడులు నిర్వహించాయి. దీంతో ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల నివాసాలు, బంకర్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ఉన్న ఉగ్రవాదులంతా పరారై పోయారు. దీంతో సిర్టీ, గిజి బరియా జిల్లాలపై లిబియా సైన్యం పూర్తి స్థాయిలో పట్టు సంపాధించినట్లయింది. ఈ దాడులకు ముందు పలువురు మహిళలను, చిన్నపిల్లలను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. అయితే, దాడులు చేసిన వెంటనే వారిని విడిచిపెట్టి పారిపోయారు. ఈ విజయంతో లిబియా సేనలు అమెరికా సేనలతో కలిసి సంబురాల్లో మునిగిపోయాయి. తమ వీర జవానుల త్యాగం వృధా కాలేదంటూ సైనికులు నినాదాలు చేశారు. సిర్టీలో పట్టు కోల్పోవడం ఇస్లామిక్ స్టేట్ కు పెద్ద ఎదురుదెబ్బ అయింది. ఇతర దేశాల్లో ఆ సంస్థ హవా ఉన్నప్పటికీ లిబియాలో ఎక్కడా కూడా తనకంటూ ప్రత్యేక స్థావరం లేకుండా పోయింది. 2015లో సిర్టీలో చొరబడిన ఉగ్రవాదులు అక్కడే తిష్టవేసి ఆ ప్రాంతంపై పట్టు సాధించి ముప్పు తిప్పలు పెట్టారు. ఈ నేపథ్యంలో లిబియా అమెరికా సంయుక్త సేనలు దాడులకు దిగి విజయం సాధించాయి. ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ వెస్ లీ డ్రియాన్ ఈ సందర్భంగా సైనికులకు అభినందనలు చెప్పారు. ఇది నిజంగా ఓ శుభవార్త, ఉగ్రవాదులను దెబ్బకొట్టడం చాలా గొప్ప చర్య అని, సైనికులను అభినందించకుండా ఉండలేకపోతున్నాని చెప్పారు. -
ఉగ్రవాదుల దాడిలో 24 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. కాగా.. శుక్రవారం ఖయ్యరా ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన రెండు కారు బాంబు దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడిన విషయం తెలిసిందే. మోసుల్కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖయ్యరాను ఇరాకీ సేనలు ఆగస్టు చివర్లో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అనంతరం ఆపరేషన్ మోసుల్ను చేపట్టిన ఇరాకీ సేనలకు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుంది. ప్రస్తుతం మోసుల్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోందని ఇరాక్కు చెందిన అల్మాడా ప్రెస్ వెబ్సైట్ వెల్లడించింది. -
ఆ దారుణం చేసింది నిజానికి నైస్ గై.. కానీ!
వాషింగ్టన్: అనూహ్యంగా ఓ గుంపు మీదకు కారును తీసుకొచ్చి బలంగా ఢీకొట్టడమే కాకుండా అనంతరం అదే కారులో నుంచి దిగి కత్తితో విచక్షణా రహితంగా ఓ పన్నెండు మందిని పొడిచి అనంతరం పోలీసుల కాల్పుల్లో చనిపోయిన అబ్దుల్ రజాక్ అలీ అర్తాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి అతడు చాలా మంచివాడని, కలుగొలుపుగా ఉండే లక్షణాలున్నవాడని అతడి చుట్టుపక్కలవారు, స్థానికులు చెబుతున్నారు. అతడు ఉంటున్న అపార్టుమెంటు వద్ద ఎదురైన ప్రతి వ్యక్తిని పలకరించేవాడని, తన తల్లి, తోడబుట్టినవారితో అదే అపార్టుమెంటులోని తక్కువ అద్దె ఉన్న ఇంట్లో ఉండేవాడని చెబుతున్నారు. అతడు ప్రతి రోజు వచ్చే దారిలో ఓ దుకాణం దగ్గర ఆగి స్నాక్స్ కొనుక్కోని తినేవాడని, మసీదుకు రోజు హాజరయ్యేవాడని కూడా చెబుతున్నారు. ప్రతి రోజు తానే కాకుండా తన సోదరీసోదరుడిని స్కూల్లో దింపేవాడని అతడి తల్లి చెప్పింది. అమెరికాలోని ఒహయో స్టేట్ యూనివర్సిటీలో ఈ సోమవారం కారుతో ఢీకొట్టి, కత్తితో దాడిచేసి 12 మందిని అబ్దుల్ గాయపరిచిన విషయం తెలిసిందే. అతడి చేతిలోని కత్తి కిందపడేయాలని పోలీసులు చెప్పినా వినకపోవడంతో జరిపిన కాల్పుల్లో అతడు చనిపోయాడు. దీంతో విద్యార్థిగా వచ్చిన అబ్దుల్ అసలు ఎందుకు హంతకుడిగా మారాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటని ఆరాతీయగా కొన్ని ఆసక్తికర అంశాలు తెలిశాయి. కొలంబస్ స్టేట్ కమ్యూనిటీ కాలేజీ నుంచి ఈ ఏడాది మే నెలలో అబ్దుల్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఆ సమయంలో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో అతడు వేదికపై ఎంతో సంతోషంగా కనిపించాడట. ఆడుతూపాడుతూ గెంతులేస్తూ, పెద్ద నవ్వుతూ తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశాడట. అయితే, ఆ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ కోసం ఒహియో వర్సిటీకి వచ్చిన అతడు స్టూడెంట్ మేగజిన్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అయితే, అక్కడ బహిరంగంగా ప్రార్థన చేసుకునేందుకు ప్రయత్నించేవాడని, చుట్టుపక్కలవారు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మదన పడేవాడని ఇంకొందరు అంటున్నారు. ఏదైనా మానసిక ఒత్తిడికి గురై ఇలా చేశాడా..? లేక ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడా అనేది ఇప్పటికీ తేలని అంశమే.. మరోపక్క, సోమలియా దేశస్తుడైన రజాక్ 2007-2014 మధ్య కాలంలో పాక్లో ఉన్నాడని అమెరికా అధికారులు చెప్పారు. ‘ముస్లిం దేశాల వ్యవహారాల్లో తలదూర్చడాన్ని అమెరికా ఆపాలి’ అని రజాక్ దాడికి ముందు ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్లు మీడియా తెలిపింది. అతడు తమ వాడే అని కూడా ఐసిస్ ప్రకటించింది. -
రజాక్ మా వాడే: ఐసిస్
వాషింగ్టన్: అమెరికాలోని ఒహయో స్టేట్ యూనివర్సిటీలో సోమవారం కారుతో ఢీకొట్టి, కత్తితో దాడిచేసి 11 మందిని గాయపరిచిన విద్యార్థి ఇంతకు పూర్వం పాకిస్తాన్లో నివసించాడని తెలిసింది. అతన్ని 18 ఏళ్ల అబ్దుల్ రజాక్ అలీ అర్తాన్గా గుర్తించారు. సోమలియా దేశస్తుడైన రజాక్ 2007–2014 మధ్య కాలంలో పాక్లో ఉన్నట్లు అమెరికా అధికారులు చెప్పారు. ‘ముస్లిం దేశాల వ్యవహారాల్లో తలదూర్చడాన్ని అమెరికా ఆపాలి’ అని రజాక్ దాడికి ముందు ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్లు మీడియా తెలిపింది. కాగా, రజాక్ తమ వాడేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ తెలిపింది. అతడిని తమ ‘సైనికుడి’గా వర్ణించింది. అయితే అతడికి ఐసిస్ తో సంబంధాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. రజాక్ ను ఉద్దేశపూర్వకంగానే తమ వాడిగా ఐసిస్ ప్రకటించుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘వైమానిక దాడుల్లో మీ కొడుకు చనిపోయాడు’
ముంబై: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన మహారాష్ట్రలోని కల్యాణ్కు చెందిన యువకుడు అమన్ టాండెల్ మరణించినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వైమానిక దాడుల్లో అమన్ చనిపోయినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా అమన్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. 2014 మేలో అమన్తో పాటు కల్యాణ్కు చెందిన నలుగురు యువకులు ఐఎస్లో చేరడానికి ఇరాక్ వెళ్లారు. అప్పటి నుంచి ఐఎస్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు భావిస్తున్నారు. గత శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అమన్ ఇంటికి ఫోన్ చేసి.. వైమానికి దాడుల్లో అతను చనిపోయినట్టు చెప్పాడు. ఫోన్లో మాట్లాడుతున్నది ఎవరని అమన్ తండ్రి ప్రశ్నించగా, గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. అమన్ బంధువు ఈ విషయాన్ని వెల్లడించాడు. అమన్తో పాటు ఐఎస్లో చేరిన షహీన్ టంకీ అనే యువకుడు కూడా మరణించినట్టు గత జనవరిలో అతని కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. కాగా టంకీ చనిపోయాడా లేదా అన్న విషయం ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. అమన్ మరణవార్తపై మహారాష్ట్ర పోలీసులు మాట్లాడుతూ.. అతని కుటుంబ సభ్యులు ఈ విషయం తమకు చెప్పలేదని, అవసరమైతే విచారణ చేస్తామని చెప్పారు. -
ట్రక్కు బాంబుతో గ్యాస్ స్టేషన్పైకి..
-
గ్యాస్ స్టేషన్పై ట్రక్కు బాంబుతో దాడి.. 80 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్లోని గ్యాస్ స్టేషన్పై ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో దాడి చేయడంతో భారీ మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకుంది. 80మందికిపైగా మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ‘పశ్చిమ బాగ్దాద్ లోని గ్యాస్ స్టేషన్ పై మేం దాడి చేశాం’ అంటూ ఇస్లామిక్ స్టేట్ స్వయంగా ప్రకటించింది. -
ఐసిస్ మరో పాశవిక చర్య
కైరో: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కిరాతకానికి అంతు లేకుండా పోయింది. యువకులా వయసుమీరినవారా అనే దానితో సంబంధం లేకుండా వారు నమమేధం సృష్టిస్తున్నారు. ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పంలో ఓ వందేళ్ల వృద్ధుడిని కిడ్నాప్ చేసిన ఐఎస్ ఉగ్రవాదులు అతడి తల నరికి చంపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. షేక్ సులేమాన్ అబు హరజ్ అనే సూఫీ మతగురువును ఆరిష్ పట్టణంలోని తన ఇంటి వద్ద నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అనంతరం ముసుగులు ధరించిన జిహాదిస్ట్ ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా అతడి తలనరికి చంపారు. ఈ ఘటనను చిత్రీకరించి దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. అబు హరజ్ మంత్రగాడు అనే నెపంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. -
ఇరాకీ సేనలకు తీవ్ర ప్రతిఘటన
మోసుల్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు పట్టున్న మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఇరాకీ సేనలకు తీవ్ర ప్రతిఘటన ఎందురవుతోంది. ఇరాకీ సేనలు శనివారం ఉదయం మోసుల్ పట్టణ తూర్పు ప్రాంతం ముహరబీన్, ఉలామాలకు చేరుకోగా.. అక్కడ ఐఎస్ ఉగ్రవాదులతో భీకరపోరు జరుగుతోందని ఇరాకీ స్పెషల్ ఫోర్సెస్ అధికారి సమి అల్ అరిది వెల్లడించారు. ఐఎస్ ఉగ్రవాదులు స్నిపర్ రైఫిల్స్, గ్రెనేడ్లతో ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన వెల్లడించారు. భీకర పోరుతో ఈ రెండు ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయని అన్నారు. ఇస్లామిక్ స్టేట్కు పట్టున్న మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇరాకీ సేనలు అక్టోబర్ 17 న ఆపరేషన్ ప్రారంభించాయి. అమెరికా బలగాలు 2011లో ఇరాక్ను వదిలివెళ్లిన అనంతరం అక్కడ చేపడుతన్న భారీ మిలిటరీ ఆపరేషన్ ఇదే. మోసుల్ను కోల్పోతే ఇస్లామిక్ స్టేట్కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. -
'ఆ పోలీస్ను చంపింది మేమే'
ఆల్జియర్స్: అల్జీరియాలో ఓ పోలీసు అధికారిని కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి దారుణంగా కాల్చిచంపారు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది తామే నంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అల్ ఖాయిదా సంస్థ ఉత్తర ఆఫ్రికా విభాగం, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు చాలా కాలంగా అల్జీరియా ప్రభుత్వానికి వ్యతిరేంకంగా పనిచేస్తుండగా ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. శుక్రవారం కాన్స్టాంటిన్లో జరిగిన పోలీస్ అధికారి హత్యకు పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు అని, హత్య అనంతరం అతడి గన్ను సైతం వారు స్వాధీనం చేసుకున్నారని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ వార్తా సంస్థ అమాక్ పేర్కొంది. ఇందులో ఐఎస్ ఫైటర్లు స్వాధీనం చేసుకున్న గన్ ఇదేనంటూ ఫోటోను సైతం ప్రచురించింది. అల్జీరియా అధికారులు మాత్రం గుర్తుతెలియని ఉగ్రవాదుల దాడిలో పోలీసు అధికారి మృతి చెందినట్లు వెల్లడించినప్పటికీ.. ఇస్లామిక్ స్టేట్ ప్రకటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. -
ఒక్కడిని చంపినందుకు 30 మంది పౌరుల హత్య
అఫ్గాన్లో ఐసిస్ దారుణం కాబూల్: ఇస్లామిట్ స్టేట్ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్లో మరో దారుణానికి ఒడిగట్టారు. స్థానికుల సాయంతో తమ కమాండర్ను ప్రభుత్వ బలగాలు చంపాయనే ఆగ్రహంతో సుమారు 30 మంది అమాయక పౌరులను ఐసిస్ ఉగ్రవాదులు అపహరించి దారుణంగా హత్య చేశారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన మంగళవారం సెంట్రల్ అఫ్గాన్లోని గోర్ ప్రావిన్స్లో జరిగింది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. గోర్ గవర్నర్ నాసిర్ మాట్లాడుతూ.. మంగళవారం స్థానికుల సాయంతో భద్రతా బలగాలు ఐసిస్ కమాండర్ను హతమార్చాయని చెప్పారు. దీనికి ప్రతీకారంగా ఆ వెనువెంటనే సుమారు 30 మంది గ్రామస్తులను ఐసిస్ అపహరించిందన్నారు. వారిలో ఎక్కువ మంది గొర్రెల కాపరులున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం వారి మృతదేహాలను స్థానికులు సమీపంలో గుర్తించినట్లు చెప్పారు. -
ఆ పోలీసులను చంపింది మేమే !
-
పాక్లో ఉగ్ర దాడి
61 మంది మృతి.. 165 మందికి గాయాలు - క్వెట్టా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఐసిస్ ఘాతుకం ఉగ్రవాదులు పాకిస్తాన్లో మరోసారి పంజా విసిరారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని ఓ పోలీస్ శిక్షణా కేంద్రంపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం.. ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 61 మంది యువ క్యాడెట్లు ప్రాణాలు కోల్పోగా.. మరో వంద మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో ఉగ్రవాదులు పాల్పడిన అతి భీకర దాడుల్లో ఇది ఒకటని అధికారులు చెబుతున్నారు. నిద్రిస్తున్న వారిపై కాల్పులు, ఆత్మాహుతి దాడులు క్వెట్టా: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదులు పాకిస్తాన్లో పంజా విసిరారు. బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలోని ఓ పోలీస్ శిక్షణ కేంద్రంపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం.. ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 61 మంది యువ క్యాడెట్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 165 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల పాక్లో ఉగ్రవాదులు పాల్పడిన అతి భీకర దాడుల్లో ఇది ఒకటని అధికారులు చెపుతున్నారు. క్వెట్టాలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో సుమారు 700 మంది క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారు. వీరంతా 15 నుంచి 25 ఏళ్ల మధ్య వారే. సోమవారం రాత్రి ఆయుధాలు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు కాలేజీలోకి ప్రవేశించారు. తొలుత వాచ్టవర్ వద్ద ఉన్న పోలీస్ గార్డ్ను కాల్చిచంపి కాలేజీ క్యాడెట్ల విశ్రాంతి క్వార్టర్స్లోకి ప్రవేశించారు.నిద్రిస్తున్న క్యాడెట్లపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు క్వార్టర్స్ పైనుంచి కిందికి దూకేశారు. ఇద్దరు మిలిటెంట్లు తమను తాము పేల్చుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక ఉగ్రవాదిని పోలీసు బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం ఉదయం వరకూ కాల్పులు కొనసాగాయి. ఉగ్ర దాడి జరిగిన నాలుగు గంటలకు కాలేజీని భద్రతా బలగాలు ఖాళీ చేయించి గాలింపు జరుపుతున్నారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పక్కా ప్రణాళిక ప్రకారమే.. ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. 165 మందికిపైగా గాయపడ్డారని, వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఉగ్రవాదులు ఆత్మాహుతి జాకెట్లు ధరించారని, వీరు అఫ్గానిస్తాన్లోని తమ నేతల నుంచి ఆదేశాలు అందుకుని దాడులు జరిపారని చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ క్వెట్టా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రైనింగ్ కాలేజీలో పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన.. దాడిలో మరణించిన క్యాడెట్ల ఆత్మకు శాంతి చేకూరాలని నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా క్వెట్టా చేరుకుని తాజా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. కాగా, పోలీస్ ట్రైనింగ్ కాలేజీపై ఉగ్రదాడి జరగడం ఇదే తొలిసారి కాదు. 2006లో ఒకసారి.. 2008లో మరోసారి ఇక్కడ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. కాగా, ఈ దాడికి ఐసిస్తోపాటు తెహ్రీక్-ఏ-తాలిబాన్ , హకీముల్లా ఉగ్రవాద సంస్థలు కూడా ఈ దాడి తామే చేశామని చెప్పుకున్నాయి. అయితే తమ మిలిటెం ట్లు దాడి చేసినట్లు తమకు ఇంకా సమాచారం రాలేదని తెహ్రీక్-ఏ-తాలిబాన్ తెలిపింది. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మూడు రోజుల ను సంతాప దినాలుగా ప్రకటించారు. -
ఆ పోలీసులను చంపింది మేమే!
పాకిస్థాన్లోని క్వెట్టా నగరంలో పోలీసు శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ దాడిలో 60 మంది మరణించగా, 120 మంది గాయపడ్డారు. ఆత్మాహుతిదాడిలో ముగ్గురు పాల్గొన్నట్లు ఇస్లామిక్ స్టేట్ తరచు తన ప్రకటనల కోసం ఉపయోగించే అమాఖ్ వార్తాసంస్థ తెలిపింది. ఐసిస్లోని ఖొరసాన్ బృందం మిషన్ గన్లు, గ్రెనేడ్లు ఉపయోగించడంతో పాటు, తర్వాత తమ నడుముకు కట్టుకున్న బాంబులను పేల్చేసినట్లు వివరించింది. ఈ దాడిలో పాల్గొన్నట్లుగా ఐసిస్ చెబుతున్న ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోను కూడా అమాఖ్ వార్తా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, అమాఖ్ ఈ విషయాన్ని చెప్పడానికి ముందు బలూచిస్తాన్ పారామిలటరీ ఫ్రాంటియర్ కోర్ చీఫ్ అయిన మేజర్ జనరల్ షేర్ అఫ్ఘాన్ మాత్రం.. లష్కరే ఝంగ్వి అనే నిషేధిత సంస్థకు చెందిన అల్- అలామీ ఉగ్రవాద సంస్థ ఈ దాడులు చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదులు, వాళ్ల హ్యాండ్లర్ల మధ్య జరిగిన సంభాషణను తాము ఇంటర్సెప్ట్ చయగా, అఫ్ఘానిస్థాన్ నుంచి ముగ్గురు ఉగ్రవాదులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసిందన్నారు. కాగా, ఇంతకుముందు క్వెట్టా నగరంలోని ఒక ఆస్పత్రి మీద దాడిచేసి 73 మందిని చంపింది కూడా తామేనని అప్పట్లో ఐసిస్ సంస్థ ప్రకటించుకుంది. కానీ దాడి చేసింది తామంటూ పాకిస్థానీ తాలిబన్లకు చెందిన జమాత్ ఉల్ అహ్రార్ వర్గం కూడా చెప్పింది. క్వెట్టా నగర శివార్లలో ఉన్న ఈ శిక్షణ శిబిరంపై ముసుగులు ధరించిన ఉగ్రవాదులు దాడి చేశారు. దాదాపు ఐదు గంటల పాటు దాడి జరిగింది. లోపలకు చొరబడిన ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారని, తాము అరుస్తూ అటూ ఇటూ పరుగులు తీశామని దాడినుంచి తప్పించుకున్న కొందరు పోలీసులు చెప్పారు. -
ఆఖరి పోరాటం
-
ఐసిస్ ఉగ్రవాది అరెస్టు.. పేలుళ్ల కుట్ర భగ్నం
తమిళనాడులోని పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రవాదిని ఎన్ఐఏ వర్గాలు అరెస్టుచేశాయి. తిరునల్వేలి జిల్లా కడయనల్లూరులో ఉగ్రవాది సుబహానీ హజా మొయద్దీన్ను అరెస్టు చేశారు. బుధవారమే అరెస్టు చేసిన అతడి నుంచి పలు కీలక వివరాలను ఎన్ఐఏ రాబట్టింది. గతంలో విజిటర్ వీసాపై ఇస్తాంబుల్ వెళ్లిన మొయొద్దీన్.. అక్కడ అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశీయులను కలిశాడు. అక్కడినుంచి నేరుగా ఇరాక్ వెళ్లి ఐసిస్లో చేరాడు. ఇరాక్లోని మోసుల్ నగరంలో ఐసిస్ తరఫున పనిచేశాడు. అందుకుగాను అతడికి ఐసిస్ నెలకు 100 డాలర్లు చెల్లించేది. అయితే, భద్రతా దళాలు చేసిన షెల్ దాడిలో మొయిద్దీన్ కళ్ల ముందే అతడి సహచరులు ఇద్దరు హతమయ్యాచు. దాంతో ఐసిస్ను వదిలిపెట్టాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఐసిస్ తనను బంధించి, హింసించిందని కూడా చెప్పాడు. తర్వాత సిరియాలో్ని రఖ్కా ప్రాంతానికి తరలించి, తర్వాత విడిచిపెట్టింది. ఐదుగురు సహచరులతో కలిసి అతడు మళ్లీ టర్కీ చేరుకున్నాడు. అక్కడ భారత కాన్సులేట్ను ఆశ్రయించి, అత్యవసర పత్రాలతో 2015 సెప్టెంబర్ 22న ముంబై చేరాడు. కొంతకాలం తమిళనాడు కడయనల్లూరులోని ఒక బంగారం దుకాణంలో పనిచేశాడు. తర్వాత మళ్లీ ఐసిస్ వర్గాలు అతడితో సంప్రదింపులు జరిపాయి. దాంతో శివకాశిలో పేలుడు పదార్థాలు సేకరించడానికి అతడు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తద్వారా వాటితో తమిళనాడులో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ పన్నాడు. చెన్నై, కోయంబత్తూరు సహా పలు నగరాల్లో రెక్కీలు నిర్వహించాడు. అతడి గురించి పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ వర్గాలు అతడిని అరెస్టుచేసి ఎర్నాకులం కోర్టులో ప్రవేపశపెట్టాయి.