
టెర్రకోట మ్యూజియం సందర్శన
చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువాంగ్ సైన్యంలోని యుద్ధవీరులు, గుర్రాల టైటా ప్రతిమలున్న ప్రఖ్యాత మ్యూజియంను మోదీ సందర్శించారు. మ్యూజియంలోని ప్రతిమలను ఆసక్తిగా పరిశీలించిన మోదీ గంటకుపైగా గడిపారు. ఈ మ్యూజియం ప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ఐరాస ప్రకటించింది. ఇక్కడ దాదాపు 8వేల మంది సైనికుల, 130 రథాల, 520 గుర్రాల ప్రతిమలున్నాయి.