
మయన్మార్లో కొలువుదీరిన కొత్త సభ
నాపిటా: మయన్మార్లో కొత్తగా ఎన్నికైన వందలాది మంది ప్రజాప్రతినిధులతో పార్లమెంటు కొలువుదీరింది. ప్రజాస్వామిక ఉద్యమ కారిణి ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ సభ్యులే అత్యధికంగా ఉన్న ఈ పార్లమెంటు.. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఏళ్ల తరబడి సైనిక పాలనలో మగ్గిన ఈ దేశంలో.. 50 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటు కావటం ఇదే తొలిసారి కానుంది.