![బాహుబలి-2కు లైన్క్లియర్..](/styles/webp/s3/article_images/2017/09/5/71492533990_625x300.jpg.webp?itok=b5q3gAB3)
బాహుబలి-2కు లైన్క్లియర్..
అందులో శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ అధినేత సవరణన్ బాహుబలి-2 చిత్ర తమిళనాడు విడుదల హక్కులను పొందారన్నారు. ఆయన 2016లో రూ.1.18కోట్లు రుణం అడిగారని, ఆ మొత్తాన్ని తాము ప్రభుదేవా స్టూడియోస్ పేరు మీద ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మొత్తాన్ని రూ.10 లక్షలు వడ్డీతో సహా బాహుబలి-2 విడుదలకు ముందు చెల్లిస్తానని సవరణన్ పిబ్రవరిలో అగ్రిమెంట్ రాసి ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మాట మార్చిన సరవణన్ బాహుబలి-2 చిత్ర విడుదల తరువాత డబ్బు చెల్లిస్తానంటున్నారని, తమకు సొమ్ము చెల్లించేవరకు బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది.
బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించడానికి నిరాకరించిన న్యాయమూర్తి ఈ పిటిషన్కు బదులు దాఖలు చేయాల్సిందిగా శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ అధినేత సవరణన్కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా ఇరు తరఫు న్యాయవాధులు కోర్టుకు హాజరై సమస్యను కోర్టు బయట పరిష్కరించుకున్నట్లు తెలియజేయడంతో విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.