
క్రైమ్ కామెడీతో...
హ్యాకింగ్ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ కామెడీ చిత్రం ‘ఇంటిలిజెంట్ ఇడియట్స్’. విక్రమ్ శేఖర్, ప్రభ్జీత్ కౌర్ జంటగా బాయీజీ దర్శకత్వంలో శరద్ మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మించిన ఈ సినిమా ఈ 23న విడుదల కానుంది. శ్వేతాబసు ప్రసాద్ కీలకపాత్ర చేశారని, మంచి కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందిందని దర్శక, నిర్మాతలు తెలిపారు.