న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ హీరో, కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ అయిన షారూక్ ఖాన్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కోల్కత్తా నైట్ రైడర్స్ షేర్స్ అమ్మకాల విషయంలో ఆర్థిక వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అతనికి ఈ నోటీసులు ఇచ్చింది. విదేశీ మారక నిల్వల ఉల్లంఘించినట్లు ఆధారాలు లభ్యం కావటంతో ఈడీ ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెలఖారుకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని షారూక్ను ఈడీ ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.