
కిస్సింగ్ ఇప్పుడు కామన్!
Published Sat, Nov 30 2013 12:57 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

తదనతరం జరిగిన పార్టీలో అందరి సమక్షంలో దీపికాను గట్టిగా ముద్దుపెట్టేసుకున్నారట హోమీ. దీపిక కూడా దాన్ని లైట్గానే తీసుకున్నారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్లే హోమీ అలా ప్రవర్తించారని అందరూ అక్కడ చెవులు కొరుక్కున్నారు. ఆ మరుసటి రోజే... దీపికా రీసెంట్ హిట్ ‘రామ్లీలా’ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ వేడుకలో సదరు చిత్ర కథానాయకుడు రణవీర్సింగ్... వెనుకాలే వచ్చి... దీపికాను గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తేశారు. ఆ హఠాత్ పరిణామానికి ముందు భయపడిపోయిన దీపిక... తర్వాత రణవీర్ని చూసి సిగ్గుల మొగ్గ అయిపోయారట. కాగా... దీపికా ముద్దుల పరంపర ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది.
వీటిని ఆధారంగా తీసుకొని కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి. దాంతో ఖంగుతిన్న దీపిక ఘాటుగా స్పందించారు. -‘‘సమాజం వేగంగా దూసుకుపోతోంది. మడికట్టుకొని కూర్చునే రోజులు కావివి. కిస్ చేసుకోవడం ప్రస్తుతం కామన్. అభిమానించేవారు, అయిన వారు ఇష్టాన్ని ప్రదర్శిస్తున్న రీతి ఇది. దాన్ని తప్పుపడితే ఎలా. ఏదైనా మనం చూసే తీరుపై ఆధారపడి ఉంటుంది. తోబుట్టువుల్ని, స్నేహితుల్ని మనం ముద్దు పెట్టుకోవట్లేదా. అప్పుడు కనిపించని తప్పు నా విషయంలో ఎందుకు కనిపించింది’’ అని వాపోయారు.
Advertisement
Advertisement