టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వయసు మీద పడుతున్నా ఇప్పటికీ యంగ్ లుక్తో యువహీరోలతో పోటీ పడుతున్నారు. నాగార్జున అందం, స్టైల్ చూసి ఇష్టపడిని భామలు ఎవరు ఉండరనడంలో సందేహం లేదు. మరి అలాంటి కింగ్ మనసును గెలుచుకుంది ఓ యువ హీరోయిన్. తన తోటీ నటీమణులను పక్కకు నెట్టి నాగ్తో హాట్ అనిపించుకుంది ఎవరంటే మిల్కీ బ్యూటీ తమన్న. ఓ ఛానల్ రియార్టీ షోలో నాగార్జున ఈ మాటలు చెప్పటం విశేషం. ఈ కార్యక్రమానికి నాగ్ ...అప్పటి హీరోయిన్ సుహాసినీ మణిరత్నంతో కలిసి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా సుహాసినీ .... గ్రీకువీరుడిపై కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ తరం హీరోయిన్లు సమంత, కాజల్, శ్రుతి హాసన్, తమన్నాలలో ఎవరిని ఎంపిక చేసుకుంటారని అడగగా, 'అందరూ హాటే, అయితే తమన్నా హాటెస్ట్'అని సమాధానం ఇచ్చారు. యుక్త వయసులో ఉన్నప్పుడు తాను జయసుధను ఆరాధించేవాడినని, ఎన్టీఆర్ క్లాసిక్ చిత్రం 'అడివి రాముడు'ని 20సార్లు చూసినట్లు నాగార్జున తెలిపారు. ఆ సినిమా తొలిసారి చూసినప్పుడు జయసుధ, జయప్రదల నటన తనకు గుర్తుండిపోయిందని నాగ్ వెల్లడించాడు.
'అందరూ హాటే, అయితే ఆమె హాటెస్ట్'
Published Tue, Jul 29 2014 11:27 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement