ఏం జరిగింది? | swarna mahal movie first look released | Sakshi
Sakshi News home page

ఏం జరిగింది?

Published Tue, Mar 3 2015 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

ఏం జరిగింది?

ఏం జరిగింది?

అదొక అందమైన స్వర్ణ మహల్. అందులో ఏం జరిగింది? అనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో సౌమిత్రి (దుర్గాప్రసాద్ .వై) రూపొందించిన చిత్రం ‘స్వర్ణ మహల్’. ఉమ సమర్పణలో మనోజ్, అలీషా జంటగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ, ‘‘ఇదొక హారర్ ఎంటర్‌టైనర్. ఇందులోని సస్పెన్స్ థ్రిల్‌కు గురి చేస్తుంది. 40 నిమిషాల గ్రాఫిక్స్ చిత్రానికి ప్రధానాకర్షణ. పూర్తిగా విజయవాడలోనే చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement