
చొరబాట్లు : బీఎస్ఎఫ్ చేతిలో ఇద్దరు హతం
న్యూఢిల్లీ : భారత భద్రతా బలగాలు సరిహద్దులో అత్యంత శక్తివంతంగా పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ చొరబాటు దారులును భారత సైన్యం ఎక్కడిక్కడ ఏరిపారేస్తోంది. తాజాగా బుధవారం పంజాబ్ సరిహద్దులో ఉన్న ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాట్లకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ స్మగ్గర్లను బీఎస్ఎఫ్ దళాలు మట్టికరిపించాయి.
మృతుల వద్ద నుంచి 4 ఏకే 47 తుపాకులు, ఏకే మ్యాగ్, 9 ఎంఎం పిస్టల్, పాకిస్తాన్ మొబైల్ సిమ్ కార్డ్, రూ. 20 వేల పాక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాబలగాలు ప్రకటించాయి.