రైలుకు తప్పిన పెను ముప్పు
Published Tue, Jan 13 2015 4:50 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించి ఏకంగా ఓ రైలునే పేల్చేయాలనుకున్న మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జార్ఖండ్లోని రైల్వే ట్రాక్పై మావోయిస్టులు అమర్చిన 5 కిలోల పేలుడు పదార్థాలను బాంబు స్క్వాడ్ గుర్తించింది. దాంతో వెంటనే వాటిని నిర్వీర్యం చేశారు.
ముందుగానే బాంబులు పెట్టిన విషయాన్ని గుర్తించి, దాన్ని తీసేయడంతో.. ఆ మార్గంలో ప్రయాణించే రైలుకు పెను ప్రమాదం తప్పింది. లేనిపక్షంలో పెద్ద మొత్తంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవించేదని అన్నారు.
Advertisement
Advertisement