Maoist Activity
-
‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు’
సాక్షి, హన్మకొండ: ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నాయకుడు చాడా వెంకట్రెడ్డి. ప్రజాకవి గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదని చెప్పుకొచ్చారు.చాడా వెంకట్రెడ్డి తాజాగా హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను అణచివేయాలని చూస్తున్నారు. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరం కాదు. నక్సలిజాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలి.గద్దర్కు అవార్డు ఇవ్వడం తప్పు అనేది సరైంది కాదు. గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. దేశాన్ని రాచరికం ఏలుతున్న రోజుల్లో కమ్యూనిజం పుట్టింది. భారత సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చింది సీపీఐ పార్టీనే. ఎన్నో నిర్భంధాలను కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంది. నవాళి కళ్యాణానికి బీజం వేసింది భారత కమ్యూనిస్టు పార్టీ. దీన్ని అంతం చేస్తామని కొందరు చెబుతున్నారు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదు అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు.. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్ల విషయమై స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు. ఎన్కౌంటర్ల వల్ల ఉద్యమాలకు చెక్ పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి ఎన్కౌంటర్లు గతంలో చాలా జరిగాయి.. ఉద్యమాలు మళ్ళీ మొదలు అయ్యాయి. ఎన్కౌంటర్ల వల్ల కొంతమంది మరణం మాత్రమే జరుగుతుంది. కొంత మందిని మాత్రమే చంపగలరు. ఉద్యమాన్ని ఆపలేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
దంతెవాడలో బలగాల ఆపరేషన్ సక్సెస్.. మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 31 మంది నక్సలైట్లు మృతిచెందారు. దాదాపు 48 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. దాదాపు 1,500 మంది భద్రత సిబ్బందితో 48 గంటలపాటు ఆపరేషన్ సాగినట్లు అధికారుల వెల్లడించారు. పొలాలు, చిత్తడి దారుల గుండా 10 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడినుంచి 12 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి ఎన్కౌంటర్ ప్రాంతానికి బలగాలలు చేరుకున్నాయి.ఇక, ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ అలియాస్ ఆర్కె, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం. ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు కాగా, కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.మరోవైపు.. ఎన్కౌంటర్పై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్లో నక్సలిజం అంతమై శాంతి నెలకొంటుంది. మన బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి. 31 మంది నక్సల్స్ను హతమార్చారు. మన సైనికులు గత రికార్డును బద్దలు కొట్టారు. ఎన్కౌంటర్ విషయంలో మా సైనికులను అభినందిస్తున్నాము. వారి ధైర్యానికి వందనం. ఈ ఘటన మావోయిస్టులు అణిచివేతకు మార్గం చూపించింది అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బెంగాల్లో మరో దారుణం -
మాములోడు కాదు.. ఎస్ఐ డేంజర్ ప్లాన్ తెలిసి పోలీసు శాఖ అలర్ట్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతుండగా.. అదేశాఖలో పనిచేసే ఓ అధికారి మావోయిస్టుల తరహాలో దళాన్ని ఏర్పాటు చేసేందుకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి అడవుల్లో ట్రయల్ కూడా నిర్వహించినట్లు సమాచారం. సదరు వ్యక్తులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. వరంగల్లో ఓ హెడ్కానిస్టేబుల్ను కాల్చి చంపించి మావోయిస్టులు ఉన్నారనే భ్రమ కల్పించాలని పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ కుట్ర వెనుక ములుగు జిల్లాలో పనిచేసే ఓ ఏఆర్ ఎస్ఐ కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పకడ్బందీగా జరిగిన ఈ కుట్రకోణాన్ని పసిగట్టిన హైదరాబాద్లోని పోలీస్ నిఘా విభాగం.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారాలతో కూడిన కొన్ని వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు ములుగు పోలీస్ అధికారుల సహకారంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ బృందం.. సదరు ఏఆర్ ఎస్ఐతో పాటు మరో ఇద్దరిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఈ విచారణలో సాయుధ దళం ఏర్పాటుతోపాటు వరంగల్లో హెడ్కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన వివరాలను సేకరించి.. సదరు హెడ్కానిస్టేబుల్ను సైతం అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా ఈ కుట్రకోణం వెనుక భారీ ప్రణాళిక దాగి ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. సాయుధ దళం ఏర్పాటు చేసి.. ఆ సభ్యులతో యాక్షన్లు చేయించి.. తిరిగి వారిని ఎన్కౌంటర్ పేరిట హతమార్చి పోలీస్శాఖలోనూ పేరు తెచ్చుకోవాలన్న మరో కోణం దాగి ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. వరంగల్లో హెడ్కానిస్టేబుల్ను కాల్చి చంపే యాక్షన్టీమ్ తనను కలిసేందుకు ములుగు ప్రాంతానికి వచ్చే క్రమంలో ఎన్కౌంటర్ చేయాలన్న కుట్ర పన్నినట్లు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. ఇటు హెడ్కానిస్టేబుల్ను కాల్చి చంపి మావోయిస్టులు ఉన్నట్లు భ్రమలు కల్పించడంతోపాటు మరోవైపు ఎన్కౌంటర్ చేసి పోలీసు అధికారులు మెప్పు పొందవచ్చని భావించి ఈ కుట్రకు తెర లేపినట్లు సమాచారం. ముందే ఈ వివరాలన్నీ సేకరించి విచారిస్తున్న ప్రత్యేక నిఘా విభాగం.. వీటన్నింటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
ఆదిలాబాద్ జిల్లాలో హైటెన్షన్.. కొనసాగుతున్న పోలీసుల వేట
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. దీంతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ప్రభాత్, భాస్కర్, వర్గీస్, రాము, అనిత సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. బోథ్ మండలంలోని కైలాస్ టేకిడి ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ కూంబింగ్లో మావోలకు సంబంధించిన గ్రెనేడ్ లభ్యమైంది. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు. గోప్యంగా ఉంచుతున్నారు. కానీ మావోల కోసం భారీగా బలగాలతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: (పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం) -
నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు
నెల్లూరు(క్రైమ్): మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్న కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు శనివారం నెల్లూరు నగరంలో తనిఖీలు నిర్వహించారు. మావోలకు నిధులు సమకూరుస్తున్నారంటూ బిహార్లో ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం ఏకకాలంలో బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఏపీలో సోదాలు చేపట్టింది. అందులో భాగంగా శనివారం రాంజీనగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న కాంట్రాక్టర్ పెంచలయ్యనాయుడి ఇంటికి శనివారం ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసి మూడు గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ సోదాల విషయాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. గతేడాదీ నెల్లూరు అరవిందానగర్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. -
Maoist Encounter: ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
సాక్షి, ఖమ్మం: తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతం దంతెవాడ జిల్లా మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. గొండెరాస్ అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని గొండెరాస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్జీ జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్లో ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు హిద్మే కొహ్రామే ఏరియా కమిటీ సభ్యురాలు మల్లంజర్ ఏరియా కమిటీ, దర్భా డివిజన్. ఆమపై రూ. 5లక్షల రివార్డు ఉంది. పొజ్జె, సీఎన్ఎం ఇన్ఛార్జ్ మల్లెంజర్ ఏరియా కమిటీకి చెందిన నీల్లవాయ ఏరియా, దర్భ డివిజన్. ఈమెపై లక్ష రూపాయల రివార్డు ఉంది. సంఘటనా స్థలం నుంచ రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు, క్యాంపింగ్ మెటీరియల్స్ మొదలైనవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. తప్పించుకున్నవారిలో మావోయిస్టు అగ్రనేతలున్నారని సమాచారం. -
మావోయిస్టులపై ఐదు రాష్ట్రాల పోలీస్ శాఖల కన్ను..!
సాక్షి, హైదరాబాద్: వరుస ఎదురుదెబ్బలతో కుదేలవుతున్న మావోయిస్టు పార్టీని మరింత నియంత్రించేందుకు ఐదు రాష్ట్రాల పోలీస్ శాఖలు వ్యూహాత్మక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. బేస్ క్యాంపులు దట్టమైన అటవీ ప్రాంతంలో ఎంత లోపలికి చేరుకుంటే మావోయిస్టుల నియంత్రణ అంత సులువుగా మారుతుందని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటి చొప్పున బేస్ క్యాంపులు ఏర్పాటు చేయగా.. తాజాగా 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తూ దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి బలగాలు విస్తరించేలా పోలీస్ శాఖలు ఎత్తులు వేస్తున్నాయి. ఈ విధంగా ఒక్కో రాష్ట్రం నుంచి మొదలైన బేస్ క్యాంపుల ఏర్పాటు పొరుగు రాష్ట్రాల సరిహద్దులకు చేరుకుంది. సీఆర్పీఎఫ్, ఇతర సాయుధ బలగాలతో కూడిన బేస్ క్యాంపుల విస్తరణ దాదాపుగా పూర్తి కావస్తోందని పోలీస్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. మహారాష్ట్ర– ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఇప్పటికే 45కు పైగా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలి పాయి. శనివారం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఇంద్రావతి నది ఒడ్డున, మహారాష్ట్ర– ఛత్తీస్గఢ్ సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే జరగడం బేస్ క్యాంపుల విస్తృతానికి ఉదాహరణగా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో.. ప్రస్తుతం తెలంగాణలోని దుమ్ముగూడెం మండలంలోని గౌరారం, చర్ల మండలంలోని కలివేరు, తోగ్గుడెం, తిప్పాపురం, చలిమెలలో ప్రధాన బేస్ క్యాంపులుండగా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపునకు 8 ఔట్ పోస్టు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అదే విధంగా మహారాష్ట్ర వైపు నుంచి ఛత్తీస్గఢ్– తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఏటపల్లి, కోర్చి, బామ్రా గఢ్, వడ్పా, ధనోరా, గడ్చిరోలి, వెంటాపుర్, సిరోంచా, ఐరి, చమరోచి, ఆర్మోరిల్లో బేస్ క్యాంపులు నడుస్తుండగా వీటికి తోడు మరో 12 ఔట్ పోస్టు బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో ఎటపాక వద్ద ప్రధాన బేస్ క్యాంపు ఉన్నట్టు తెలిసింది. ఒడిశా–ఆంధ్రప్రదేశ్ మధ్య 6 ప్రధాన బేస్ క్యాంపులతో పాటు 8 ఔట్ పోస్టు క్యాంపులను ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. దీనితో తెలంగాణ వైపునకు మావోయిస్టులు రాకుండా నియంత్రించడం సులభమైనట్టు రాష్ట్ర నిఘా వర్గాలు తెలిపాయి. అదే విధంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఛత్తీస్గఢ్ రాయిపూర్ వరకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 18కి పైగా బేస్ క్యాంపులు రెండు రాష్ట్రాల సరిహద్దుల వరకు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దీని వల్ల ప్రతి వ్యక్తి కదలికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సులభమైనట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు. అటు ఛత్తీస్గఢ్– ఒడిశా– ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనూ 26కు పైగా బేస్ క్యాంపులు పూర్తి స్థాయిలో పటిష్టంగా పనిచేస్తున్నట్టు తెలిసింది. కోవర్టు ఆపరేషన్లతో దూకుడు! బేస్ క్యాంపుల ఏర్పాటుతో ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలోని మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు, ఆయా రాష్ట్రాల పోలీసులు పాగా వేసినట్టు తెలుస్తోంది. మూడేళ్ల ముందు వరకు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో సాగిన కూంబింగ్ అంతా ఒక ఎత్తు అయితే, తెలుగు రాష్ట్రాలు అవలంభించిన కోవర్టు, ఇన్ఫార్మర్ల వ్యవస్థను అందిపుచ్చుకుని చేసిన ఆపరేషన్లు మరో ఎత్తు అని ఆయా రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. మావో యిస్టు పార్టీకి నిత్యావసరాలతో పాటు ఆయుధాలు, మందులు, డబ్బులు.. ఇతరత్రా వస్తువులను తీసుకెళ్లే కొరియర్లను ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖలు కోవర్టుగా మార్చుకున్నట్టు మావోయిస్టు పార్టీయే అనేక సార్లు ఆరోపించింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో కొన్నిసార్లు భారీ స్థాయిలో దళ సభ్యులను కోల్పోవడంపై ప్లీనరీలో కూడా చర్చించింది. ఇలా కోవర్టు ఆపరేషన్లతో దూకుడు మీదున్న సీఆర్పీఎఫ్– పోలీస్ బలగాలు బేస్ క్యాంపుల నుంచి అన్ని రాష్ట్రాల సరిహద్దులను జల్లెడ పడుతూ భారీ స్థాయిలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా చేస్తున్నాయి. మరోవైపు సీనియర్ల మృతి, వ్యూహాత్మక నిర్ణయాల లోటు, కొంతమంది లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి తీరని నష్టం చేకూర్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక నేతల మృతి వెనుకా.. ఛత్తీస్గఢ్, ఏవోబీతో పాటు గెరిల్లా స్క్వాడ్లలో కీలకంగా వ్యవహరించే కొంతమంది నేతల మృతి వెనుక కూడా కోవర్టు ఆపరేషన్లు ఉన్నట్టు మావోయిస్టు పార్టీ అనుమానిస్తోంది. తినే ఆహారంలో విషం కలిపినట్టు కూడా అనుమానిస్తున్నట్టు తెలిసింది. చివరకు శనివారం నాటి ఎన్కౌంటర్లో చనిపోయిన అగ్రనేత మిలింద్ గురించిన కీలక సమాచారం కూడా కోవర్టుల ద్వారానే పోలీస్ బలగాలను సేకరించినట్టు తెలిసింది. శనివారం గడ్చిరోలిలోని గ్యారపట్టిలో జరిగిన ఎన్కౌంటర్లో మిలింద్ సహా 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
మావోయిస్టు విస్తరణకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీ విస్తరణను గడ్చిరోలి భారీ ఎన్కౌంటర్ పెద్ద దెబ్బతీసింది. దక్షిణాదిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కుదేలైన పార్టీని ఆదుకునేందుకు కేంద్ర కమిటీ నియమించిన విస్తరణ కమిటీ హెడ్, కేంద్ర కమిటీ సభ్యుడు దిలీప్ తేల్తుంబ్డే అలియాస్ మిలింద్ ఈ ఎన్కౌంటర్ మరణించి నట్లు గడ్చిరోలి పోలీసులు స్పష్టంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ ఏడాది సెప్టెంబర్ 26న ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇదే అతి పెద్ద తొలి ఎన్కౌంటర్. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ భారీ స్థాయిలో నియామకంపై దృష్టి పెట్టాయి. అయితే ఆర్కే అనారోగ్యం కారణంగా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఫలితం రాలేదు. అంతేకాదు తెలంగాణలో నియామకానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కమిటీ ప్రత్యక్ష కార్యకలాపాలు పెద్దగా లేకపోవడం ప్రతికూల ఫలితాలే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ విస్తరణ హెడ్గా ఉన్న మిలింద్ నేరుగా రంగంలోకి దిగారు. నాగ్పూర్తో పాటు కొన్ని ప్రాంతాలు తిరిగి నియామక ప్రక్రియపై అనుసరించాల్సి వ్యూహాలను రచించినట్లు తెలిసింది. అయితే డయాబెటిక్ సమస్యతో పాటు స్పాండలైటిస్ సమస్య, నడుస్తూనే సృహ తప్పిపడిపోయే వ్యాధితో మిలింద్ బాధపడుతున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. రిక్రూట్మెంట్తో పాటు కమిటీలను బలోపేతం చేసే దిశగా గడ్చిరోలి కమిటీతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కోర్చి పరిధిలోని మర్దిన్తోలా అటవుల్లో 48మందితో మిలింద్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కోవర్టుల ద్వారా ఇది తెలుసుకున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది. ఈ భేటీలో మిలింద్ కీలక సూచనలు చేసే సమయంలోనే తుపాకుల మోత ప్రారంభమైనట్లు సమాచారం. నలుగురు తెలుగువారు.. గడ్చిరోలి కమిటీ భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నేతలు నలుగురు, ఒడిశాకు చెందిన ముగ్గురు ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాల సమాచారం. మృతదేహాలను గుర్తిస్తే గానీ, ఆ నలుగురు ఎవరన్నది చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. కాగా, కేంద్ర కమిటీలోని 21 మందిలో అనారోగ్య కారణాలతో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరో ముగ్గురు గడిచిన ఏడాదిలో లొంగిపోయారు. దీనితో పార్టీలో యాక్టివ్గా ఉన్న వారి సంఖ్య సగానికిపైగా తగ్గింది. వరుస ఎదురుదెబ్బలు... దేశంలో మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం అత్యంత గడ్డు రోజులు నడుస్తున్నాయి. కరోనా మొదటివేవ్, లాక్డౌన్ కాలంలో అనూహ్యంగా తెలంగాణలో ప్రాబల్యం చాటుకునే యత్నం చేసిన మావోలు.. రెండోవేవ్లో తమను తాము వైరస్ బారినుంచి, భద్రతా బలగాల నుంచి కాపాడుకులేకపోతున్నారు. పెరిగిన టెక్నాలజీ, దండకారణ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరుసగా మావోయిస్టు అగ్రనేతలను కోల్పోవడంతో పార్టీకి ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్, డీవీసీ కార్యదర్శి సుఖ్లాల్ ఉన్నట్లు తెలిసింది. వీరిలో దీపక్పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు జార్ఖండ్లో జరిగిన ఓ ప్రమాదంలో కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందాడు. ఈ రెండు ఘటనలు మావోయిస్టు పార్టీకి ఊహించని విధంగా నష్టం కలిగించాయి. -
ఈశాన్యానికి లాంగ్మార్చ్?
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మారుస్తోందా? కేడర్ను కాపాడుకు నేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ‘మార్చ్’ చేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నాళ్ల పాటు ఛత్తీస్గఢ్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాలను వదిలేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమబెంగాల్ ద్వారా నాగాలాండ్ చేరువ వ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అను కూలంగా లేని వాతావరణం కావడంతో ఉన్న నేత లను, కేడర్ను కాపాడుకునే పనిలో మావోయిస్టు పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో ఉన్న ఆరు కమిటీలను రెండు కమిటీలుగా, ఛత్తీస్గఢ్లో ఉన్న 4 కమిటీలను రెండు కమిటీలుగా మార్చేసిన మావో యిస్టు పార్టీ.. కేడర్ను కాపాడే పనిలో నిమగ్న మైంది. ఆర్కే మరణం, హిడ్మా ఆరోగ్య పరిస్థితి, పెద్దగా కార్యకలాపాలు లేని తెలంగాణ కమిటీ.. ఇలా అన్ని కమి టీలు దీనావస్థలో ఉండటంతో కేవలం ఆత్మరక్షణ కోసమే కార్యాచరణ రూపొందిం చుకున్నట్టు తెలిసింది. బలంగా ఉన్న అబూజ్మడ్ (ఛత్తీస్గఢ్)ను సైతం వదిలి వెళ్లక తప్పదనే కేంద్ర కమిటీ సూచనతో ఆత్మరక్షణ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. ఛత్తీస్గఢ్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీలపై బలగాలు రెండేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించాయి. కేంద్ర హోంశాఖతోపాటు ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు సంయుక్తంగా ప్రతీ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టాయి. ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులను పెంచుకొని ప్రత్యేక శాటిలైట్ ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీకి చేరాల్సిన ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు, డబ్బులు, ఆయుధాలు.. ఇలా ప్రతీ వ్యవహారంసైనా కదలికలను బేస్ క్యాంపుల ద్వారా పసిగట్టి నియంత్రించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండానే ఇన్ఫార్మర్లు/కొరియర్లుగా వ్యవహరిస్తున్న వారిని నియంత్రించి సక్సెస్ అయ్యారు. మావో అగ్రనేత ఆర్కే మరణం కూడా ఇందులోభాగమే అని ఆ పార్టీ బహిరంగంగానే ఆరోపించింది. మందులు, ఇతర నిత్యావసరాలను అడ్డుకొని ఆరోగ్యం క్షీణించేలా చేశారని ఆర్కే భార్య కూడా ఆరోపించింది. వారసంతలపైనా నిఘా అబూజ్మడ్తోపాటు ఏవోబీలోని వారసంతలపైనా బలగాలు నిఘా పటిష్టం చేశాయి. ప్రతీ కుటుంబం ప్రతీ వారం కొనుగోలు చేసే వస్తువులపై నిఘా పెట్టింది. మునుపటి వారం కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే ఇంట్లో ఏదైనా శుభకార్యముందా? లేక మావోయిస్టు పార్టీకి అందించేందుకు కొనుగోలు చేశారా అన్నంత లోతుగా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నాయి. సర్జరీ ఆధారిత మందులు, పెయిన్ కిల్లర్లు, కరోనా మెడిసిన్స్.. ఇలా ఆయా ఏరియాల్లోని మందుల షాపుల్లో కొనుగోలు చేసే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ సైతం చేసింది. కొనుగోలుదారుల కదలికలను పసిగట్టి కొరియర్లను తమవైపు తిప్పుకోవడంలో కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర బలగాలు సక్సెస్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంచేశాయి. దీనివల్లే అనారోగ్యం బారిన పడిన సీనియర్ నేతల మరణాలు జరిగినట్టు చెప్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్ల నుంచి జరిగిన రాష్ట్ర, కేంద్ర కమిటీ కీలక నేతల లొంగుబాట్లు ఆ పార్టీని మరింత అఘాతంలోకి నెట్టాయని భావిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీలు అవలంబించే విధానాలు, వ్యూహాత్మక చర్యలను పసిగట్టి నిలువరించడంలో బలగాలు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొన్నాళ్లపాటు ఈ రెండు ప్రాంతాలను వదిలి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడినట్టు బలంగా వినిపిస్తోంది. ఎనిమిది నెలలుగా ఒక్క నియామకం లేదు... ఒకవైపు కీలక నేతల మరణాలు, మరోవైపు లొంగుబాట్లతో అతలాకుతలం అవుతున్న మావోయిస్టు పార్టీని కొత్త రక్తం లేక మరింత చీకట్లోకి నెట్టింది. ఛత్తీస్గఢ్, ఏవోబీ, తెలంగాణ, మహారాష్ట్రలో కొత్త నియామకాలు ఏమాత్రం జరగలేదు. ఎనిమిది నెలలుగా అంటే ఈ ఏడాదిలో దాదాపుగా రిక్రూట్మెంట్ లేకుండా చేయడంలో పోలీసులు పైచేయి సాధించారు. నియామకాలు జరగకపోవడంపై ఒక్క ఉదాహరణ మావోయిస్టు పార్టీ నుంచే వినిపిస్తోంది. ఆర్కే తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఒక ప్లాటూన్ కేవలం ఆయన రక్షణ కోసమే పనిచేసింది. మంచానికే పరిమితమైన ఆర్కేను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆయన చుట్టూ ఉన్న ప్లాటూన్ రక్షణ దళానికి కాపలాగా లోకల్ గెరిల్లా టీమ్ రక్షణ కవచంగా నిలిచింది. ఇలా మూడు నెలల పాటు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఏవోబీ జోనల్ కమిటీ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆర్కే కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. కేవలం తన కోసం రెండు వ్యవస్థలు కార్యకలాపాలు చేయకుండా ఉండిపోవడం పార్టీకి నష్టాన్ని కల్గిస్తుందని, కొంతమంది మినహా మిగతా బృందాలు కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలని సూచించారని తెలిసింది. నియామకాలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని పదేపదే చెప్పినట్టు సమాచారం. కొద్దిరోజులు దూరంగా..! ప్రస్తుత కీలక పరిణామాలతో ఈ రెండు ప్రాంతాల నుంచి కొద్దిరోజులపాటు దూరంగా ఉండటం మంచిదని, అందుకు ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లకతప్పదని కేంద్ర కమిటీ భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఛత్తీస్గఢ్, ఏవోబీలో ఉన్న కీలక నేతలు, ముఖ్య కేడర్ను పశ్చిమబెంగాల్ మీదుగా నాగాలాండ్కు చేరుకోవాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చినట్టు పార్టీలోనూ చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదం అన్న పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలకు బ్రేక్ ఇచ్చి నాగాలాండ్ రావాల్సినట్టుగా ఆదేశాలున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కార్యకలాపాల విస్తృతికి అక్కడి నుంచే పనిచేయాలన్న ఆలోచనలో కేంద్ర కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. -
మావోయిస్టుల బెదిరింపులు: కట్టుబట్టలతో నడిరోడ్డుపై..
ముంచంగిపుట్టు: ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య వారు నలిగిపోతున్నారు. పోలీసు ఇన్ఫార్మర్ అన్న అనుమానం వస్తే చాలు మావోయిస్టులు కక్ష కడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్టే హతం చేస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ప్రాణభయంతో గిరిజనులు సొంత ఊరిని వదిలి వేరే చోట తలదాచుకుంటున్నారు. ఇలా రంగబయలు, లక్ష్మీపురం, భూసిపుట్టు పంచాయతీలకు చెందిన 13 గ్రామాల నుంచి 41 కుటుంబాలు ముంచంగిపుట్టు మండల కేంద్రానికి వచ్చి బిక్కుబిక్కుమని బతుకీడుస్తున్నాయి. తాజాగా రంగబయలు పంచాయతీ గోబరపడా గ్రామంలో గత నెల 30వ తేదీన జరిగిన ఘటన మన్యవాసుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఏకంగా 10మంది సాయుధ మావోయిస్టులు, 30మంది మిలీíÙయా సభ్యులు ఇంటిని చుట్టుముట్టడంతో వంతాల రామచందర్ ఇంటి వెనక నుంచి అడవిలోకి పారిపోయాడు. దీంతో మావోయిస్టులు తనను నిర్దాక్షిణ్యంగా కొట్టారని, తన ఇంటిని, వస్తువులను ధ్వంసం చేశారని రామచందర్ భార్య సొంబరి తెలిపింది. పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్న రామచందర్ను హతమారుస్తామని, తక్షణమే ఊరు నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఆమె ముగ్గురు పిల్లలతో రాత్రి పూట అడవిలో నడుచుకొని తనకు తెలిసిన వారి దగ్గర మూడు రోజులు తలదాచుకుంది. భర్త ఆచూకీ తెలియక ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్లో శనివారం సాయంత్రం ఆమె ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు సమీప గ్రామాల్లో వెతికి రామచందర్ను గుర్తించి సొంబరికి అప్పజెప్పారు. నిరసన వెల్లువ మావోయిస్టుల చర్యకు నిరసనగా బాధిత కుటుంబంతోపాటు గిరిజనులు భారీ సంఖ్యంలో ఆదివారం ముంచంగిపుట్టులో నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ నుంచి పోలీసు స్టేషన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. “మావోయిస్టులారా.. ఇంకా ఎంతమందిని మా గ్రామాల నుంచి తరిమేస్తారు.. గిరిజన ఆడపిల్లలపై దాడులు చేస్తూ మా బాగు కోసం అంటే ఎలా నమ్మేది.. మా అడవి నుంచి వెళ్తారా, తరిమి కొట్టాలా.. అంటూ నినాదాలు చేశారు. మా గ్రామాలపై మీ పెత్తనం ఏమిటి... మీ స్వార్ధంతో మా బతుకులు పాడు చేయొద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు పలువురు మాట్లాడుతూ సొంత గ్రామాల్లో సుఖంగా బతుకుతున్న తమపై లేనిపోని నిందలు వేసి గ్రామాల నుంచి తరిమేశారని, తమ కళ్ల ముందే భర్తలను దారుణంగా చంపేశారని ఆవేదన చెందారు. తమ ఇళ్లు, భూములు వదులుకొని కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతకాలం తమను వేధిస్తారని ప్రశ్నించారు. తమ పిల్లల భవిష్యత్ను అంధకారంలో పెట్టవద్దని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. చేతిలో సామాన్ల మూటలతో దీనంగా ఉన్న రామచందర్ కుటుంబం పరిస్థితి చూపరులకు ఆవేదన కలిగించింది. -
రేపు ఏవోబీ బంద్
సీలేరు/పాడేరు: విశాఖ ఏజెన్సీలోని ఆంధ్రా– ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఉద్రిక్త పరిసితులు నెలకొన్నాయి. ఇటీవల కొయ్యూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా మావోయిస్టులు జూలై 1న ఏవోబీ బంద్కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ అంతటా బాంబ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టుల కదలికల కోసం సమాచారం సేకరిస్తున్నారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. హిట్లిస్టులో ఉన్న నేతలకు నోటీసులు అందించారు. బంద్ను భగ్నం చేసేందుకు అడవుల్లో కూంబింగ్కు బలగాలు చేరుకున్నాయి. కాగా.. ఈ బంద్ ఏవోబీకి మాత్రమే పరిమితమని ఓఎస్డీ సతీష్కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, విశాఖ ఏజెన్సీలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ శుక్లా, ఆ శాఖ ఐజీ మహేష్చంద్ర లడ్డా మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. జవాన్లంతా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. -
గడ్డం మధుకర్ను పోలీసులే హత్య చేశారు: సమత
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ శోభారాయ్ని పోలీసులు హత్య చేశారని మంగళవారం ఆ పార్టీ దక్షిణ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఆరోపించారు. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వెళ్లిన శోభారాయ్ని జూన్ 1న స్పెషల్ బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారని, ఈ విషయాన్ని పోలీసులే ప్రకటించారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పి, ఆఖరికి 6వ తేదీన మరణించారని మీడియాకు ప్రకటన ఇచ్చారని ఆరోపించారు. వాస్తవానికి మధుకర్ను జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు చికిత్స అందించకుండా తీవ్రంగా హింసించారని ఆరోపించారు. 15 రోజుల కింద పీఎల్జీఏ ప్లటూన్ కమాండర్ గంగాల్ను కూడా ఇదే తరహాలో హత్య చేశారని తెలిపారు. పోలీసు అధికారులు తమ చేతికి చిక్కినవారిని హత్య చేస్తూనే కరోనాను సాకుగా చూపుతూ సరెండర్ కావాలని, సరెండర్ అయిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తామని ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాల అబద్ధపు ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మవద్దని సూచించారు. హాని తలపెట్టం, చికిత్స అందిస్తాం ప్రస్తుతం మావోయిస్టు దళాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వారి కోసం తెలంగాణ, ఛత్తీస్గఢ్లో మందులను సేకరిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. కరోనా పాజిటివ్ ఉన్న సభ్యులెవరైనా లొంగిపోవాలని కోరుతున్నాం. వారికి ఎలాంటి హానీ తలపెట్టం. కావాల్సిన చికిత్స అందజేస్తాం. – అభిషేక్, దంతెవాడ ఎస్పీ చదవండి: కరోనా చికిత్స కోసం వచ్చి.. పోలీసులకు చిక్కాడు! -
కాల్పుల విరమణ దిశగా మావోలు?
సాక్షి, హైదరాబాద్: అడవిలో కరోనా కలకలం పుట్టిస్తోంది. ఇంతకాలం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఉండి పోరాడిన మావోయిస్టులను మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓ వైపు తమ కోసం దండకారణ్యంలో భద్రతా బలగాల వేట కొనసాగుతుండగా, మరోవైపు కంటికి కనిపించని వైరస్ దళంలో ఒక్కొక్కరిని బలి తీసుకుంటోంది. ఈ వ్యాధి తీవ్రత నేపథ్యంలో కొంతకాలం కాల్పుల విరమణ చేయాలన్న అంశం మావోయిస్టు పార్టీలో చర్చకు వచ్చిందని, కరోనా బారినపడ్డ పలువురు మావోలు ఈ దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే, దీనిపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం బేషరతుగా లొంగిపోతే మంచి వైద్యం అందిస్తామని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ అలియాస్ శోబ్రాయ్ పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మిగిలిన వారి ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. కరోనా బారినపడ్డ మధుకర్ను జూన్ 2న ఛత్తీస్గఢ్ నుంచి హన్మకొండకు వస్తుండగా వరంగల్ పోలీసులు పట్టుకుని చికిత్స అందించారు. తీవ్రమైన డయేరియా, కరోనా కారణంగా ఆయన శరీరంలో అనేక మార్పులు వచ్చాయని వాటి కారణంగానే మరణించినట్లు వైద్యులు చెప్పారని వరంగల్ సీపీ తరుణ్జోషి ‘సాక్షి’కి వెల్లడించారు. తనతోపాటు కరోనాబారిన పడ్డ మరో 12 మంది సీనియర్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని మధుకర్ పోలీసులకు చెప్పాడు. లోపల ఉండలేరు, బయటికి రాలేరు.. ఆందోళనకర పరిస్థితి ఉన్న ఆ 12 మంది మావోయిస్టులు పార్టీలో చాలా సీనియర్లు. వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సమయంలో వారిని కోవిడ్ చుట్టుముట్టడంతో శారీరక సమస్యలు రెట్టింపయ్యాయి. కొరియర్ల సాయంతో తెలంగాణ నుంచి మందులు సేకరించినా, ఛత్తీస్గఢ్లో గ్రామస్తుల రూపంలో వ్యాక్సిన్ వేయించుకున్నా.. అది కింద కేడర్కే వీలవుతుంది. సీనియర్ల తలలపై రివార్డు ఉన్న నేపథ్యంలో వారు బయటికి వచ్చే పరిస్థితి లేదు. బయటికి వచ్చి చికిత్స చేయించుకుందామనుకున్నా.. మావోయిస్టు పార్టీ అనుమతించడం లేదు. ఆందోళనకరంగా ఉన్న 12 మంది వీరే.. 1. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, 2. తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ, 3.యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, 4. బడే చొక్కారావు అలియాస్ దామోదర్, 5. కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న, 6. కట్టా రాంచందర్ రెడ్డి అలియాస్ వికల్స్, 7. ములా దేవేందర్ రెడ్డి అలియాస్ మాస దడ, 8. కున్కటి వెంకటయ్య అలియాస్ వికాస్, 9. ముచ్చకి ఉజల్ అలి యాస్ రఘు, 10. కొడి మంజుల అలియాస్ నిర్మల, 11. పూసం పద్మ 12. కాకర్ల సునీత అలియాస్ బుర్రా. మరణాలకు కారణాలివే.. దండకారణ్యంలో సంచరించే మావోల్లో వ్యాపిస్తోన్న కరోనా స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైనదని సమాచారం. అయితే అది ఏంటన్నది ఇంతవరకూ గుర్తించలేదు. దళంలో ఆస్తమా, బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారిలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణలో లాక్డౌన్ కారణంగా కొరియర్లు, సానుభూతిపరుల నుంచి మందులు సకాలంలో అందడం లేదు. దళంలో కరోనా పాజిటివ్ ఉన్నవారిలో కొందరికి మాత్రలతో వ్యాధి అదుపులోకి రావడంలేదు. అది తీవ్రరూపం దాల్చి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. వేసవి కావడంతో అడవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. డెంగీ, మలేరియా, డయేరియా లక్షణాలకు.. కరోనా లక్షణాలకు పెద్దగా తేడా లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. తాజాగా మధుకర్ కూడా డయేరియాతో బాధపడుతూ మరణించడం గమనార్హం. చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత! -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: మహిళా మావోయిస్టు మృతి
దంతెవాడ: ఛత్తీస్గఢ్లో కాల్పుల మోత మోగింది. దంతెవాడ జిల్లా గుమల్నార్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఘటనాస్థలంలో 2 కిలోల పేలుడు పదార్ధాలు, 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు గీదాం పోలీసు స్టేషన్ పరిధిలో జిల్లా రిజర్వ్ గార్డు( డీఆర్జీ) పోలీసుల బృందం నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ను చేపట్టినట్లు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ తెలిపారు. దీంతో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన మావోయిస్టు వైకో పెక్కో(24) అని పోలీసులు గుర్తించారు. ఈ ఎన్కౌంటర్ ఘటన రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు 400 కిలో మిటర్ల దూరంలో చోటు చేసుకుంది. చదవండి: భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు -
ఆంధ్రాలో మావోలకు ఎర్ర జెండా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు ఉద్యమ విస్తరణకు ఎర్ర జెండా పడింది. గత రెండేళ్లుగా గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉద్యమ విస్తరణపై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా బలపడుతున్న గిరిజనులు సామాజిక చైతన్యంతో మావోయిస్టుల దరికి చేరడం లేదు. ప్రధానంగా ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో రిక్రూట్మెంట్ నిలిచిపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఉద్యమ పరిధి తగ్గిపోయింది. ఏవోబీలోని మావోయిస్టు పార్టీ దళాల్లో చేరేందుకు స్థానిక ఆదివాసీ యువత ఆసక్తి చూపడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులపై స్థానిక ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో మావోయిస్టులు తిరిగే వ్యూహాత్మక ఉద్యమ ప్రాంతాలు కుచించుకుపోతున్నాయి. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రోడ్లు, సెల్ టవర్ల నిర్మాణంతో మైదాన ప్రాంతాలకు రాకపోకలు పెరగడంతో గిరిజనులు చైతన్యవంతులవుతున్నారు. ఏజెన్సీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ గ్రామ స్థాయి సంఘాలు.. ఆదివాసీ విప్లవ రైతు కూలీ సంఘాలు (ఏవీఆర్సీఎస్), ఆదివాసీ విప్లవ మహిళా సంఘాలు (ఏవీఎంఎస్), విప్లవ ప్రజా కమిటీలు (ఆర్పీసీ), మిలీషియా కమిటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆదివాసీ ప్రజల్లో పోలీసులు, ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి పెరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల ప్రాంతాలకు సైతం చేరడంతో మావోయిస్టులకు గిరిజనులు దూరమవుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కుచించుకుపోతున్న కమిటీలు.. ఏవోబీ ప్రాంతంలో ఏపీ నుంచి మావోయిస్టులు ఛత్తీస్గఢ్, ఒడిశా వైపు విస్తరించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కటాఫ్ ఏరియాను ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే), వివేక్లు పర్యవేక్షిస్తున్నారు. ఏవోబీలో రెండేళ్ల క్రితం మావోయిస్టులకు చెందిన ఎనిమిది ఏరియా కమిటీలు ఉంటే ఇప్పుడవి నాలుగుకు పరిమితమయ్యాయి. వాటిలో కలిమెల, నారాయణపట్నం, నందాపూర్, కాఫీదళం ఏరియా కమిటీలు కనుమరుగయ్యాయి. గాలికొండ, పెద్దబయలు, గుమ్మ, బోయపెరుగువాడ ఏరియా కమిటీలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఏవోబీలో రెండు డివిజన్ కమిటీలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కంపెనీలు రెండు ఉండగా ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి ఎనిమిది ఎదురు కాల్పులు జరగ్గా ఒక డివిజన్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడితోపాటు మరో ఆరుగురు హతమయ్యారు. ఒక సెంట్రల్ జోన్ కమిటీ సభ్యుడు, ఒక డివిజన్ కమిటీ సభ్యుడు, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఇద్దరు పార్టీ సభ్యులు కలిపి మొత్తం ఆరుగురు అరెస్టు అయ్యారు. మొత్తం 31 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో స్టేట్ కమిటీకి చెందిన 11 మంది, ఏవోబీ ఎస్జెడ్సీకి చెందిన 20 మంది ఉన్నారు. -
వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేశారు. గంగుళూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కామకనార్ గ్రామంలో గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్ శారద వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి హెల్త్ వర్కర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు అక్కడికి వచ్చారు. శారద, మరో ఇద్దరు హెల్త్ వర్కర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్పీ కమలోచన్ కాశ్యప్ ధ్రువీకరించారు. కాగా, వైద్య సిబ్బంది కిడ్నాప్తో బీజాపూర్లో కలకలం రేగింది. మావోయిస్టులను అరెస్టు చేయలేదు చర్ల: మావోయిస్టులను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని బస్తర్ రేంజ్ ఐజీ సౌందర్రాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎదురుకాల్పుల తర్వాత కొందరు గ్రామస్తులు పోలీసులతో కలసి బేస్ క్యాంపు వరకు వచ్చారని, ఆ తర్వాత వారందరినీ వెంటనే తిరిగి వారి ఇళ్లకు పంపించామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. చదవండి: రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు -
గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్
-
భారీ ఎన్కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు. పోలీసులు అదనపు బలగాలతో కూంబీంగ్ ఆపరేషన్ చేపట్టారని, తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నక్సల్స్ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. చదవండి: హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: ఎనిమిది మంది దుర్మరణం -
అడవిలో అన్నలకు అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా కొంతకాలంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాక్డౌన్ను ఆసరాగా చేసుకుని తిరిగి నెట్వర్క్ ను విస్తరిద్దామన్న ఆలోచనతో రాష్ట్రంలోకి అడుగుపెట్టిన నక్సల్స్కు పోలీసుల ప్రతి వ్యూహంతో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్ర అడవుల్లో పోలీసులు నిరంతరం కూంబింగ్ చేపడుతూ మావోయిస్టులను తిరిగి ఛత్తీస్గఢ్ వైపు తరుముతున్నారు. దీంతో అన్నలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా కొంతకాలంగా మావోయిస్టుల్లో చాలామంది అనారోగ్యం బారినపడ్డారని తెలిసింది. లాక్డౌన్ కాలంలో చందాల వసూళ్లు, రిక్రూట్మెంట్, మందులు, ఇతర నిత్యావసరాలు సమకూర్చుకున్నారు. కానీ, పోలీసులు రాష్ట్రంలోకి వచ్చిన మావోయిస్టులను తిరిగి ఛత్తీస్గఢ్కు తరిమికొట్టే ఆపరేషన్ ప్రారంభించడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు, నిరంతర కూంబింగ్, నదీపరీవాహక ప్రాంతాలపై నిఘా చర్యలతో మావోయిస్టు కొరియర్ వ్యవస్థ స్తంభించింది. లాక్డౌన్ అనంతరం జరిగిన 11 ఎన్కౌంటర్లలో, 11 మంది మరణించారు. 135 మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు రాష్ట్ర సెక్రటరీలు, నలుగురు జిల్లా కమిటీ, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. దీంతో మైదాన ప్రాంతాలకు వచ్చి మందులు, నిత్యావసరాలను అడవుల్లోకి తీసుకెళ్లే కొరియర్ వ్యవస్థకు విఘాతం కలిగింది. ఫలితంగా సకాలంలో మందులు అందక, చిన్న జ్వరాలు, రోగాలు అనారోగ్యానికి దారితీస్తున్నాయి. అగ్రనేతలు రంగంలోకి దిగినా.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, బడే చొక్కారావు అలియాస్ భాస్కర్, అగ్రనేత హరిభూషణ్ సెంట్రల్ కమిటీ ఆదేశాలతో రాష్ట్రంలో లాక్డౌన్ తరువాత పలు ప్రాంతా ల్లో సంచరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ కోసం తీవ్రంగా శ్రమించినా అనుకున్న మేరకు సఫలీకృతం కాలేకపోయారు. వీరిలో హరిభూషణ్ సంచారంపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, అడెల్లు భాస్కర్ రెండు సార్లు, ద్వితీయ శ్రేణి నాయకుడు కంకణాల రాజిరెడ్డి ఒకసారి పోలీసులకు తారసపడ్డారు. వీరిద్దరూ పోలీసుల కాల్పుల్లో త్రుటిలో తప్పించుకున్నారు. ఎలా తెలిసిందంటే... మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా వెల్లడైంది. ‘భిక్షపతి అలియాస్ విజేందర్ 2018లో దళంలో చేరాడు. ఏటూరునాగారం–మహదేవ్పూర్ ఏరియా కమిటీలో పనిచేశాడు. కొంతకాలం క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. పోలీసుల అష్టదిగ్బంధనం కారణంగా చికిత్స అందకపోవడంతో ఈనెల 18వ తేదీన మరణించాడు’ అని గురువారం విడుదల చేసిన లేఖలో జగన్ ఆరోపించారు. ఈ లేఖ వెలుగులోకి రావడంతో మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వెలుగుచూసింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో పారాసిటమాల్ టాబ్లెట్లు కొనుగోలు చేసేవారిపై పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టులు అప్పుడు కొనుగోలు చేసిన మందులు జనవరి నాటికి దాదాపుగా అయిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఫలితంగా టాబ్లెట్లు దొరక్క.. బయటకు వచ్చే అవకాశం లేక మావోయిస్టులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. భిక్షపతి ఇంటి వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు,(ఇన్సెట్) భిక్షపతి (ఫైల్) మా కొడుకు తిరిగొస్తాడనుకున్నాం చిట్యాల: అజ్ఞాతంలోకి వెళ్లిన తమ కుమారుడు భిక్షపతి తిరిగి వస్తాడనుకుంటే కానరాని లోకానికి వెళ్లిపోయాడని ఆయన తల్లిదండ్రులు సమ్మక్క–ముత్తయ్య కన్నీటిపర్యంతమవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన మ్యాదరి సమ్మక్క–ముత్తయ్య దంపతులకు నలుగురు సంతానం. పెద్దకుమారుడు భిక్షపతి డిగ్రీ చదివాడు. 2018లో ఉద్యమంలో చేరాడు. చదవండి: సెల్యూట్ పోలీస్.. 7 నిమిషాల్లో రక్షించారు కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతా: మంత్రి -
మావోయిస్టు పార్టీ: పట్టుకోసం ప్రయత్నాలు!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటై 20 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఏటా నిర్వహించే వారోత్సవాలకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2 నుంచి 8 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. 2000లో సీపీఐ (ఎంఎల్), పీపుల్స్వార్ తదితర విప్లవ పార్టీలన్నీ కలసి ఒకే గూటికిందకొచ్చి సీపీఐ మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇలా కలసిపోయిన అన్ని పార్టీల్లోని సాయుధ దళాలన్నిటిని కలిపి పీఎల్జీఏగా ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణలోని ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరుసగా చోటుచేసుకున్న ఐదు ఎన్కౌంటర్లలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం, కొత్తవారిని చేర్చుకోవడానికి పీఎల్జీఏ వారోత్సవాలను తెలంగాణ జిల్లాల్లో నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత జూలైలో తెలంగాణలో కొత్తగా రాష్ట్ర కమిటీతోపాటు 12 డివిజన్, ఏరియా కమిటీలు వేశాక వారోత్సవాలు జరుగుతుండటంతో రిక్రూట్మెంట్లపై మావోయిస్టు పార్టీ గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త కమిటీలన్నీ చురుగ్గా పని చేస్తున్నాయి. పార్టీ అగ్రనేతలు సైతం ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సైతం ఏవోబీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్ర బలగాలు కూంబింగ్ను ముమ్మరం చేశాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల ఎస్పీలు ఆయా జిల్లాల్లోని అన్ని పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఏజె న్సీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కొరియర్లు, సానుభూతిపరులపై కూడా మరింత నిఘా పెట్టారు. రాష్ట్రంలోనూ హత్యలు గత అక్టోబర్ 10న ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురంలో టీఆర్ఎస్ నాయకుడు మడూరి భీమేశ్వరరావును మావోలు హతమార్చారు. అలాగే అక్టోబర్ 26న ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన నాయకులపు ఈశ్వర్ అనే వ్యక్తిని మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో హతమార్చారు. అలాగే 2019, జూలై 8న చర్ల మండలం బెస్తకొత్తూరు టీఆర్ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును అపహరించిన మావోయిస్టులు అదేనెల 12వ తేదీన హత్య చేశారు. పట్టుకోసం ప్రయత్నాలు.. మూడేళ్లుగా మావోయిస్టులు సరిహద్దు ఏజెన్సీలో తిరిగి పట్టు సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పలుచోట్ల భారీగా మందుపాతరలు, ప్రెషర్బాంబులు అమర్చారు. మరోవైపు మావోల యాక్షన్ టీమ్లు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. పోలీసు బలగాలతో ఎదురుకాల్పులు నిత్యకృత్యమయ్యాయి. మరో పక్క ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పలువురిని హతమార్చింది. గత నెలలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని రెండు గ్రామాలకు చెందిన 25 మందిని అపహరించిన మావోలు ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి వారిని హతమార్చారు. -
ఏవోబీలో భారీ మావోయిస్ట్ డంప్ స్వాధీనం
భీమారం: ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దులోని స్వాభిమాన్ అంచల్లోని పేపర్మెట్ల పోలీసులు భీమారం రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టుల భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. భీమారం అటవీ సమీపంలోని గుణమాముడి గ్రామ సమీపంలో బుధవారం భద్రతా బలగాలు నక్సల్స్ కోసం ఆపరేషన్ను ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు పోలీసులు తారపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి నక్సల్స్ తప్పించుకున్నారు. గురువారం సంఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పేలుడుకి వినియోగించే ఐఈడీలు, 7.62 మిమీ ఎస్ఎల్ఆర్ లైవ్ రౌండ్లు 11, నాలుగు 7.62 మిమీ ఏకే రౌండ్లు, ఒక 5.56 మిమీ ఇన్సాస్ రౌండ్లు, ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్, 32 డిటోనేటర్లు, ఒక ఫ్లాష్ కెమెరా, రేడియో, 11 కిట్ బ్యాగులు, మూడు మావోయిస్టు యూనిఫాంలు, విప్లవ సాహిత్యంతో పాటు రోజు వారి అవసరాలకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: మావోయిస్ట్ గడ్డపై తిరుగుబాటు) పోలీసులే లక్ష్యంగా దాడులకు దిగి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు సోమవారం భద్రతా దళాలు స్వాభిమాన్ అంచల్లోని జోడాంబో పోలీస్స్టేషన్ పరిదిలోని గురాసేటు, బీజింగ్, జంప్లూర్, పర్లుబంధ గ్రామాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. -
ములుగు జిల్లాలో ఎన్కౌంటర్
ములుగు: ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మంగపేట మండలం నరసింహసాగర్ సమీపంలో ఉన్న ముసలమ్మగుట్ట, తిమ్మాపూర్ పరిధి కొప్పుగుట్ట మధ్య మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు పక్షాలమధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు. వారిని మణుగూరు ఏరియా దళ సభ్యులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో దళకమాండర్ సుధీర్ అలియాస్ రాము ఉన్నాడు. ఈ ఘటనతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా శనివారం ఏటూరునాగారం సబ్డివిజన్ పోలీసులు వెంకటాపురం(కె) మండలంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మిలీషియా సభ్యుడు మిడియం చిన్న లక్ష్మయ్యను అరెస్టు చేశారు. అతని నుంచి సేకరించిన సమాచారం మేరకు మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి దాడి చేసినట్లు తెలుస్తోంది. -
రెండవ సారి ఏజెన్సీ ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ పర్యటన
-
మావోయిస్టులకు ఎదురు దెబ్బ.. కామేష్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు గమ్మెల కామేష్ అలియాస్ హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాలికొండ ఏరియా కమిటీలో హరి కీలకంగా వ్యవహరించేవారు. దీంతో హరిపై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. అదే విధంగా అతనిపై రూ. 4లక్షల రివార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్య హత్య కేసులో హరి ప్రధాన నిందితుడు. హరి అరెస్ట్ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు మాట్లాడుతూ.. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని పేర్కొన్నారు. ముగిసిన వారోత్సవాలు ఖమ్మం(చర్ల): మావోయిస్టు వారోత్సవాలు, బంద్ పిలుపుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో సుమారు రెండు వారాల పాటు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగింది. వారోత్సవాలు ముగియడంతో కూంబింగ్ ఆపరేషన్ను ముగించుకొని బలగాలు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు పలు ధపాలుగా దండకారణ్యంలోకి వెళ్లాయి. మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేందుకు బలగాలు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించాయి. వారోత్సవాలు ముగిసినందున అడవులను విడిచి బలగాలు వస్తున్నాయనే సమాచారంతో సరిహద్దు ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక పక్క మావోయిస్టులు, మరో పక్క బలగాలతో సరిహద్దులోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు.. తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని మారుమూల గ్రామాలు అట్టుడికాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సరిహద్దులో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గుండాల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు, చర్ల మండలంలోని పూసుగుప్ప సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు, చెన్నాపురం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పోలీసులు మందు పాతరలను వెలికి తీయడం.. వాటిని నిర్వీర్యం చేయడం, మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేసి రహదార్లను పేల్చివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీస్ బలగాల్లో గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన ఓ సబ్ఇన్స్పెక్టర్ తుపాకీ మిస్ఫైర్ అయ్యి.. తూటాలు శరీరంలోకి దూసుకెళ్లి మృతి చెందాడు. -
మావోయిస్టుల జాడ కోసం డ్రోన్ నిఘా!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం పోలీసు బలగాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఆయుధాలు, బలగాల పరంగా చూస్తే ఇప్పటివరకు మావోయిస్టులపై పోలీసులదే పైచేయిగా నిలిచింది. అయితే సరిహద్దు దండకారణ్యంలో సంచరించడంలో మాత్రం మావోయిస్టులకే ఎక్కువగా పట్టు ఉంది. దీంతో ఆ సమస్యను అధిగమించేందుకు పోలీసులు అత్యాధునిక డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. తద్వారా మావోయిస్టుల కదలికలపై వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని కేంద్ర, సరిహద్దు రాష్ట్రాల బలగాలకు సైతం ఇస్తున్నారు. దీంతో సరిహద్దు రాష్ట్రాల పోలీసులు పక్కాగా సమన్వయం చేసుకుంటూ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖ, ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్ జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు ఉన్నాయి. ఈ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న తెలంగాణలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోనూ పలుచోట్ల సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ బేస్ క్యాంపుల నుంచి పోలీసులు దండకారణ్యంపై డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాల మేరకు వీటిని వాడుతున్నారు. బలగాల వద్ద 250 గ్రాముల బరువు గల నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు ఉండే మైక్రో డ్రోన్లు, 2 కిలోల నుంచి 25 కిలోల బరువు కలిగిన స్మాల్ డ్రోన్లు, 150 కిలోల లోపు ఉండే మీడియం డ్రోన్లు, 150 కిలోలకు పైగా బరువు కలిగిన లార్జ్ డ్రోన్లు ఉన్నాయి. వీటిలో నానో, మైక్రో డ్రోన్లను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇవి 250 మీటర్ల నుంచి 400 మీటర్ల ఎత్తుతోపాటు దూరం వెళ్లగలుగుతాయి. పక్షులు ఎగురుతున్నట్టుగానే శబ్ధం రాకుండా పనిచేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లను వాడుతున్నారు. ఇవి పూర్తిస్థాయి నియంత్రణతో ఉండడంతోపాటు ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు బేస్క్యాంపుల నుంచి అనుసంధానం చేసి ఉన్నాయి. -
25 మంది కిడ్నాప్!: నలుగురి హత్య
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు గ్రామాలకు చెందిన 25 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి నలుగురిని హత్య చేశారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. గంగులూరు పోలీస్స్టేషన్ పరిధిలో గల కుర్చేలి, మోటాపాల్ గ్రామాలకు చెందిన 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారిని ప్రజాకోర్టులో విచారించి అనంతరం రెండు గ్రామాలకు చెందిన నలుగురిని ప్రజాకోర్టులోనే గొంతుకోసి దారుణంగా హతమార్చినట్లు సమాచారం. అనంతరం ఐదుగురిని విడిచిపెట్టినట్లు తెలుస్తుండగా.. మిగిలిన 16 మందిని వారి అదుపులోనే ఉంచుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా.. ఈ విషయంపై పోలీసు అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?) ఇన్ఫార్మర్ నెపంతో ఒకరి హత్య ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సోమ వారం రాత్రి మావోయిస్టులు ఓ గ్రామస్తుడిని హత్య చేశారు. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని పుటాకేల్ గ్రామానికి సుమారు 20 మంది మావోయిస్టులు దసార్ రమణ ఇంటికి వచ్చారు. నిద్రిస్తున్న అతడిని లేపారు. మాట్లాడే పని ఉందని చెప్పి బయటకు రమ్మని పిలవడంతో.. అతడు నిరాకరించాడు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే మాట్లాడాలంటూ పట్టుబట్టారు. దీంతో మావోయిస్టులు అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఇంటి ఎదుటే ఇనుప రాడ్లతో కొట్టడంతోపాటు రమణను కత్తులతో దారుణంగా పొడిచి చంపారు.ఇన్ఫార్మర్ నెపంతో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. -
విశాఖ మన్యంలో హైఅలర్ట్
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే క్రమంలో దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో యాక్షన్ టీమ్లు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మన్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు. కొన్ని ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. వారం రోజులపాటు కొనసాగే ఈ వారోత్సవాల్లో కొంత అలజడి చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మన్యం ప్రజలు భయపడుతున్నారు. (పచ్చని అడవికి నెత్తుటి మరకలు) -
పచ్చని అడవికి నెత్తుటి మరకలు
సాక్షి, మంచిర్యాల: పోలీసు, మావోయిస్టుల మధ్య అనేక ఎన్కౌంటర్లకు ఉమ్మడి జిల్లా అడవులు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలోనే మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో పదేళ్ల క్రితం వరకూ ఇక్కడి అడవుల్లో తుపాకుల మోతలు వినిపించేవి. అప్పటి పీపుల్స్వార్ గ్రూప్ నుంచి నేటి మావోయిస్టు పార్టీ వరకు ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. యాక్షన్ టీం మెంబర్ల నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వంటి అగ్రనేతలపై పోలీసు తుటాలు పేలాయి. ఈ ఆధిపత్య పోరులో ఒక్కోసారి దళ సభ్యులది.. ఎక్కవసార్లు పోలీసు బలగాలది పైచేయిగా మారింది. దళ సభ్యుల క్యాంపులపై బలగాలు విరుచుకుపడిన ఘటనలు ఉండగా.. పక్కా సమాచారంతో మాటువేసి దాడులు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. కొన్నిసార్లు రోజులకొద్దీ కాల్పులు సాగాయి. దశాబ్దం తర్వాత మళ్లీ కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఉమ్మడి జిల్లాలో గతంలో పేలిన తూటాల చప్పుళ్లను గుర్తుచేసింది. చదవండి: (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?) సంచలనం రేపిన ఆజాద్ ఎన్కౌంటర్ 2010లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్ కాగజ్నగర్ మండలం జోగాపూర్ అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సీనియర్ జర్నలిస్టు హేమచంద్ర కూడా చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ ఆజాద్ భార్య పద్మ కోర్టులో కేసు వేశారు. దీంతో ఎన్కౌంటర్లో పాల్గొన్న 20 మంది పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ ఆదిలాబాద్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. చదవండి:(19 ఏళ్లకే దళంలోకి.. మూడు నెలలకే ఎన్కౌంటర్) మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలిన సంఘటనలు 2001లో జన్నారం, దండేపల్లి అడవుల్లో జిల్లా కమిటీ సెక్రటరీ సూర్యం ఎన్కౌంటర్ అయ్యాడు. కీలక సభ్యుడి మరణంతో పార్టీకి పెద్ద నష్టం వాటిల్లింది. 2003 డీసీఎస్ (జిల్లా కమిటీ సెక్రటరీ)గా ఉన్న ఎల్లంకి అరుణ అలియాస్ లలితక్కను ప్రస్తుత కుమురంభీం జిల్లా.. అప్పటి బెజ్జూరు మండలం అగర్గూడలోని కొండ ప్రాంతంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళా సభ్యులు చనిపోయారు. 2003లో ప్రస్తుత మంచిర్యాల జిల్లా దేవాపూర్లో రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్న సుదర్శన్రెడ్డి అలియాస్ రామక్రిష్ణ ఎన్కౌంటర్తో పార్టీకి పెద్ద నష్టం జరిగింది. 2006లో కాగజ్నగర్ మండలం మానిక్పటార్లో వరుసగా మూడు రోజులపాటు కాల్పులు జరగగా.. ఓ దళ కమాండర్ సహా ముగ్గరు మావోలు చనిపోయారు. అంతకుముందు 1989లో ప్రస్తుత నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసి పేట అడవుల్లో జిల్లా కమిటీ సభ్యుడు సుగుణాకర్, 1992లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం చింతలబోరి వద్ద ఎన్కౌంటర్లో బోథ్ దళ కమాండర్తోపాటు ఐదుగురు దళ సభ్యులు చనిపోయారు. 1993లో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డెడ్రా అడవుల్లో బోథ్ దళ కమాండర్తోపాటు ముగ్గురు దళ సభ్యులు మరణించారు. ఇవేకాకుండా కెరమెరి, సిర్పూర్(టి), ఖానాపూర్, చెన్నూరు ప్రాంతాల్లోనూ ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టుల ప్రతీకార దాడులు 1985లో ప్రస్తుత కుమురం భీం జిల్లా పాత బెజ్జూరు మండలం లోడ్పల్లిలో జరిగిన ఎన్కౌంటర్కు ప్రతీకారంగా దహెగాం మండలం బీబ్రా ఎస్సై లక్ష్మణరావును కాగజ్నగర్లోని ఎస్పీఎం క్వార్టర్లో ఉండగా ఉదయం ఏడు గంటలకు బయటకు పిలిచి కాల్చి చంపారు. 1989లో ప్రస్తుత పెంచికల్పేట మండలం చేడ్వాయి గుట్ట వద్ద ల్యాండ్మైన్ పేల్చి ఐదుగురు పోలీసులను హతమార్చారు. 1991లో నెల వ్యవధిలోనే రెండుసార్లు కౌటాల పోలీసు స్టేషన్పై దాడులు జరిగాయి. 1997లో ప్రస్తుత కుమురంభీం జిల్లా సిర్పూర్ (యూ) పోలీస్స్టేషన్ను బాంబులతో పేల్చివేయగా 11 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు సాధారణ వ్యక్తులున్నారు. 1998లో కాగజ్నగర్ డీఎస్పీ కార్యాలయంపై దాడి చేయగా ముగ్గురు గన్మెన్లు మృత్యువాత పడ్డారు. 1999 బెజ్జూరు ఫారెస్టు రేంజర్ కొండల్రావును పిస్తోల్తో కాల్చి చంపారు. గోలేటీ సీఐఎస్ఎఫ్ క్యాంపుపై దాడితోపాటు అనేక ప్రతీకార దాడులు జరిగాయి. కోల్బెల్టు ప్రాంతంలో ‘సికాస’ ఉమ్మడి జిల్లా పశ్చిమ ప్రాంత పరిధిలో అటవీ, గిరిజన ప్రాంతాల్లో పీపుల్స్ వార్ ఎన్కౌంటర్లు, ప్రతీకార దాడులు జరుగుతుండగా.. అదే సమయంలో తూర్పు ప్రాంతంగా ఉన్న ప్రస్తుత మంచిర్యాల జిల్లాలో పీపుల్స్వార్ గ్రూప్ అనుబంధ కార్మిక సంఘమైన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) మిలిటెంట్ దళాల నియంత్రణకు పోలీసు బలగాలు అనేక ఎన్కౌంటర్లు జరిపాయి. 1996లో జిల్లా కార్యదర్శిగా ఉన్న మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్ రమాకాంత్ ఎన్కౌంటర్ ‘సికాస’ చరిత్రలో ప్రముఖమైంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ స్లాబ్క్వార్టర్ల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో సమ్మిరెడ్డితోపాటు అప్పటి చెన్నూరు సీఐ చక్రపాణి, కానిస్టేబుల్ అశోక్ మరణించారు. ముఖ్యమైన ఎన్కౌంటర్లు చూస్తే 1991లో శ్రీరాంపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు, 1993లో రామక్రిష్ణాపూర్లో ఇద్దరు, 1996లో బెల్లంపల్లి మండలం చిన్నబుదలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు, 1998లో మాదారంలో, 1999లో నస్పూర్లో సికాస సభ్యులు ఎన్కౌంటర్లో మరణించారు. 2002లో బెల్లంపల్లిలోని గాంధీనగర్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సికాస సభ్యులు మరణించారు. అప్పటి ఆఫీసర్లే ఇప్పుడు సారథ్యం ఉమ్మడి జిల్లాలో అనేక ఎన్కౌంటర్లలో దూకుడుగా ఉన్న అప్పటి ఎస్సైలే ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అప్పటి యువ అధికారులే ప్రస్తుతం కీలక ప్రాంతాల్లో ఉన్నతాధికారులుగా వచ్చారు. వారి ఆధ్వర్యంలోనే ‘మావోయిస్టు ఆపరేషన్’ కొనసాగుతోంది. భాస్కర్ వేటలో భారీ కూంబింగ్ వేమనపల్లి: రెండు రోజులుగా తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. పొరుగున ఉన్న ఆసిఫాబాద్కొమురంభీం జిల్లా కదంబా ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే కాల్పుల నుంచి తప్పించుకున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, మరో ఇద్దరు మావోయిస్టుల కోసం ప్రాణహిత తీరం వెంట డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. కల్లెంపల్లి ఫెర్రీ పాయింట్ను పరిశీలిస్తున్న డీసీపీ, ఏసీపీ వేమనపల్లి మండలం కల్లెంపల్లి, ముక్కిడిగూడెం అడవులను పోలీసుబలగాలు జల్లెడ పడుతున్నాయి. పెద్దపల్లి డీసీపీ రవీందర్, జైపూర్ ఏసీపీ నరేందర్, రూరల్ సీఐ నాగరాజు సోమవారం కూంబింగ్ బలగాల వద్దకు వెళ్లి దిశానిర్దేశం చేశారు. కల్లెంపల్లి, ముక్కిడిగూడం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో జనం ముందుకు వస్తున్న మావోయిస్టులకు ఇప్పటికే ఎవరూ సహకరించడం లేదని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సహకరించొద్దని, కదలికలు ఉన్నట్లు గమనిస్తే 100కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని అన్నారు. రాకపోకల నిలిపివేత కదంబా ఎదురుకాల్పుల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ప్రాణహిత నదిపై రాకపోకలు నిలిపివేసినట్లు డీసీపీ, ఏసీపీ తెలిపారు. మండలంలోని ప్రాణహిత ఫెర్రీ పాయింట్లను సందర్శించారు. మావోయిస్టులు నది మీద రాకపోకలు సాగించే వీలున్నందున కోటపల్లి మండలం వెంచపల్లితోపాటు రాచర్ల, రేగుంట, వేమనపల్లి, కళ్లెంపల్లి ఫెర్రీ పాయింట్ల వద్ద తాత్కాలికంగా పడవలను నిలిపివేశామన్నారు. నది అవతలి వైపు ఉన్న సిరోంచ, బామిని, రేగుంట, వెంకటాపూర్ పోలీస్స్టేషన్ల సహకారం తీసుకుని ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఆసిఫాబాద్ కొమురంభీం, మంచిర్యాల జిల్లాలోని తీరం వెంట ఉన్న పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశామని, 10 గ్రేహౌండ్స్ బృందాలకు చెందిన 400 మంది పోలీసులతో కూంబింగ్ కొనసాగుతోందన్నారు. తప్పిపోయిన మావోయిస్టులకు లొంగిపోవడమే శరణ్యమని, లేకుంటే ఏ క్షణంలోనైనా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అర్ధరాత్రి బాదిరావు అంత్యక్రియలు నేరడిగొండ: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జుగ్నక్ బాదిరావు మృతిచెందిన విషయం విదితమే. ఆదివారం అర్ధరాత్రి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. నేరడిగొండ పోలీసులు మృతుడి తల్లితోపాటు సర్పంచ్ సీతారాం, పలువురు గ్రామస్తులను ఆదివారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అదే అర్ధరాత్రి మృతదేహాన్ని ఇచ్చోడ సీఐ కంప రవీందర్, నేరడిగొండ ఎస్సై భరత్సుమన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు అద్దాల తిమ్మాపూర్కు తీసుకొచ్చారు. అనంతరం అంత్యక్రియలు చేపట్టారు. రోధిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు దీంతో బంధువులు, ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు సోమవారం మృతుడి ఇంటికి చేరుకున్నారు. ఆయన తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. జుగ్నక్ బాదిరావు కొంతకాలం నేరడిగొండలో లారీ క్లీనర్గా పనిచేశాడు. నాలుగైదు నెలల క్రితం నిర్మల్లో క్లీనర్గా పనిచేశాడు. ఇటీవల ఇంటికి వచ్చి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు కంటతడి పెడుతూ తెలిపారు. నిర్మల్లోని లారీ యజమానిని అడగగా 20రోజులుగా పనికి రాలేదని తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. చేతికొచ్చిన కొడుకు ఇలా ఎన్కౌంటర్లో మృతిచెందడంతో ఆ కుటుంబం రోధనలు మిన్నంటాయి. -
ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఉత్తరాన ఉరికి వస్తున్న భాస్కర్ దళం.. ఈశాన్యం నుంచి చొచ్చుకొస్తున్న మావోయిస్టులు.. వెరసి పోలీసులకు కంటి మీద కునుకు కరువైంది. రాష్ట్రంలోకి చొరబడాలని మావోయిస్టులు, వెనక్కి తరిమికొట్టాలని గ్రేహౌండ్స్ బలగాలు చూస్తున్నాయి. ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీగా మావోయిస్టులు కాచుకుని ఉన్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. వీరు చొరబడితే విధ్వంసాలకు దిగుతారన్న ముందస్తు సమాచారంతో దండకారణ్యంలో జల్లెడ పడుతున్నాయి. తెలంగాణ నుంచి దాదాపు 50 కి.మీ.దూరం ఉన్న ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా ఇంజారం గ్రామం వద్దే వారిని నిలువరించేందుకు సీఆర్పీఎఫ్ కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు డ్రోన్ కెమెరాలతో మైదానాలు, వాగులు, వంకలపై నిఘా పెంచారు. సీఆర్పీఎఫ్ వద్ద ఉన్న డ్రోన్ కెమెరాలు చాలా ప్రత్యేకమైనవి. భూమి మీద చీమనైనా గుర్తించగలిగే శక్తి వీటి ప్రత్యేకత. పైగా వేల మీటర్ల ఎత్తున ఎగిరే వీటిని భూమి మీద నుంచి గుర్తించడం సాధ్యం కాదు. దండకారణ్యం జల్లెడ: ఈ నెల 13వ తేదీన ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలో దాదాపు 300 మంది మావోయిస్టులు వాగు దాటుతున్న దృశ్యాలు సీఆర్పీఎఫ్ డ్రోన్కు చిక్కాయి. వీరు సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసేందుకు భారీగా తరలిరావడం గమనార్హం. వీరంతా సుకుమా జిల్లాకు సమీపంలోని ఇంజారం గ్రామం దాకా వచ్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు ద్వారా తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి వారిని వెనక్కివెళ్లేలా చేయడంలో దాదాపు వేయిమందికిపైగా కోబ్రా–గ్రేహౌండ్స్ పోలీసులు సఫలీకృతమయ్యారు. అయినా, వదలని పోలీసు బలగాలు వీరిని దండకారణ్యం వైపు తరిమికొట్టే వ్యూహంతో కూంబింగ్ చేస్తున్నాయి. వీరిని తెలంగాణ సరిహద్దు నుంచి వీలైనంత వరకు దూరంగా పంపాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో వీరు సాయుధ బలగాలను ఏమార్చి ఇతర మార్గాల్లో రాష్ట్రంలోకి రాకుండా.. సరిహద్దు వెంబడి సైతం పటిష్ట నిఘా ఉంచారు. -
తప్పించుకున్న భాస్కర్?
-
తప్పించుకున్న భాస్కర్?
సాక్షి, మంచిర్యాల: మన్యంలో తుపాకీ మోత మోగింది. జిల్లాలోని కాగజ్నగర్ మండలం కదంబా అడవుల్లో ఎన్కౌంటర్ ఉలిక్కిపడేలా చేసింది. శనివారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రాణహిత సరిహద్దు మీదుగా ప్రత్యేక బలగాలతో కూంబింగ్ కొనసాగుతోంది. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా అనువణువు గాలిస్తున్న పోలీసులు కాగజ్నగర్ మండలంలోని కదంబా అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. కేబీఎం (కుమురం భీం, మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే.. జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని మండలాలు, ప్రాణహిత నది తీరం వెంట డీఎస్పీ స్వామి ఆధ్వర్యంలో 8 గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. నేరుగా డీఎస్పీ స్వామి మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఘా ఉంచిన పోలీసులు కదంబా అడవుల్లో మావోయిస్టులు తిరుగుతుండగా ప్రణాళికతో ముందుకు సాగినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మాత్రమే చనిపోగా మరికొందరు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో భాస్కర్తో పాటు లింగయ్య, వర్గీస్, ప్రభాత్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది. గురువారం రాత్రి ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అక్కడ దళ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతో పాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై గస్తీ కొనసాగింది. దళ సభ్యులు కదంబా అడవుల వైపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిఘా పెట్టిన పోలీసులు పక్కా ప్రణాళికతో ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. తప్పించుకున్న భాస్కర్? కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేబీఎం(కుమురం భీం, మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. భాస్కర్ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకనుగుణంగానే తిర్యాణి మండలం టోక్కిగూడ అడవుల్లో రెండుసార్లు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసు బలగాలు మావోల సంచారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు అనుమానం కలిగిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మావోయిస్టులకు భోజనం పెట్టిన తిర్యాణి మండలానికి చెందిన ఓ వ్యక్తిని సైతం అరెస్టు చేసి ఆదిలాబాద్ జైల్లో ఉంచారు. రెండుసార్లు డీజీపీ పర్యటన.. కొద్ది రోజులుగా దళ సభ్యుల సంచరిస్తున్నారనే సమాచారం ఉన్న ప్రతిచోటా గస్తీని విస్తృతం చేస్తున్నారు. ఇటీవల దళ సభ్యుల నియంత్రణలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. ఆగస్టులో ఓసారి పర్యటించగా, ఈనెల రెండో తేదీన ఆసిఫాబాద్కు వచ్చిన ఆయన నాలుగు రోజులు మకాం వేశారు. క్షేత్రస్థాయిలో పలు విషయాలు తెలుసుకుని మావోల సంచారం నేపథ్యంలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. కదంబా అడవుల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్తో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎప్పుడు ఎక్కడ తుపాకీ చప్పుళ్లు వినాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. -
మావోయిస్ట్ గడ్డపై తిరుగుబాటు
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్ట్ కంచుకోటగా వెలుగొందిన ప్రాంతాల్లో ఆ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పోలీసులు వరుస కూబింగ్లతో పాటు ఎన్కౌంటర్లు సైతం కోలుకోలేని దెబ్బకొడుతున్నాయి. అయినప్పటికీ పట్టు కోసం పారాడుతున్న మావోయిస్టులకు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలు అండగా ఉంటున్నాయి. అయితే ఏళ్ల తరబడి అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటున్న ఆదివాసీలు సైతం మావోయిస్టులపై తిరుగబడుతున్నారు. తమ వెనుకబాటుకు కారణం మీరే అంటూ మావోలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రా-ఒరిస్సా (ఏవోబీ) సరిహద్దుల్లో గిరిజన ప్రజలు భారీ ర్యాలీని నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కావాలని నినాదంతో 6 గ్రామాల గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. మావోయిస్టుల కంచుకోటలో వ్యతిరేక నినాదాలు చేశారు. రోడ్లు, ఆసుపత్రులు, సెల్ టవర్ నిర్మించాలి అంటూ గిరిజనులు నినాదాలు చేశారు. (ఆసిఫాబాద్లో మావోల కదలికలు) మరోవైపు తెలంగాణలోనూ మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. దళ సభ్యుల సంచారం అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే వారికి దళ సభ్యులు కంటపడకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీలు చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతోపాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై పోలీసుల గస్తీ కొనసాగింది. దీంతో సమీప గ్రామాల ప్రజల్లో తెలియని ఆందోళన మొదలైంది. పోలీసుల బందోబస్తుతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ నెలకొంది. పోలీసులు అన్ని వైపులా నిఘా మరింత పెంచారు. -
ఏజెన్సీలో ఏం జరుగుతోంది..?
సాక్షి, ఇల్లెందు: భ్రద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ దూది దేవాలు అలియాస్ శంకర్ను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన బంద్ ఇల్లెందు ఏరియాలో ఆదివారం కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా ఇల్లెందు, గుండాల, మణుగూరు భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, బయ్యారం, టేకులపల్లి, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బంద్ ప్రభావం కనిపించలేదు. దుకాణాలు, షాపులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేశాయి. గుండాల, కరకగూడెం లాంటి మారుమూల గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్ సర్వీసులను ముందస్తుగా నిలిపి వేశారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రీకరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. మావోయిస్టు బంద్ దృష్ట్యా ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను మోహరింపజేసి కూంబింగ్ చేపట్టారు. స్పెషల్ పార్టీ బలగాలతో పాటు ఈ దఫా గ్రేహౌండ్స్ దళాలతో సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నెల 3వ తేదీన తెల్లారుజామున భద్రాద్రి కొత్తగూడెం– ములుగు, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దు దేవాళ్లగూడెం– దుబ్బగూడెం మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దూది దేవాలు అలియాస్ శంకర్ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ స్థాయిలో ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సుమారు ఏడేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన శంకర్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ జగన్కు అంగరక్షకుడుగా కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఏరియా కమిటీ సభ్యుడుగా, దళ నేత శంకర్ బయటకు రావటం, పోలీసులకు చిక్కి ఎన్కౌంటర్లో హతమవ్వటం మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బలగాలరె పెద్ద ఎత్తున మోహరించి కూంబింగ్ను ఉధృతం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని అధికార పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను అలర్ట్ చేశారు. ఊహించినట్లే మావోయిస్టు బంద్ ప్రభావం లేకపోవటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బంద్ దృష్ట్యా ముందస్తుగా ఏజెన్సీని జల్లెడ పడుతుండటంతో ఎక్కడ ఏం జరుగుతుందోనని గిరిజన గూడెంలలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఎన్కౌంటర్లో కీలక నేతను కోల్పోయిన మావోయిస్టులు జాగ్రత్తలతో ఉంటారని, పక్కా సమాచారంతోనే పోలీసులకు దొరికే చాన్స్ ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అడవులు దట్టంగా పెరగటం, అంతటా నీరు లభిస్తుండటం మావోయిస్టులు సునాయసంగా తప్పించుకునే అవకాశం ఉంటుందని ఇతర విప్లవ గ్రూపులు పేర్కొంటున్నాయి. ఇదే క్రమంలో ఆదివారం తెల్లారుజామున గుండాల మండలం శంభునిగూడెం ఏరియాలో ఎనిమిది రౌండ్ల వరకు కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు ప్రచారం జరిగింది. కానీ అక్కడి గ్రామాల ప్రజలు, పోలీసులు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపడేశారు. దూది దేవాలు 2013లో మావోయిస్టు పార్టీలో చేరాడని మావోయిస్టు పార్టీ ప్రకటించగా వైద్యం కోసం వెళ్లి దొరికినట్లు వెల్లడించిన మావోయిస్టులు ఏ పట్టణానికి వెళ్లింది, ఎక్కడ పోలీసులకు చిక్కింది వెల్లడించలేదు. అయితే మునుపెన్నడూ లేనంతగా మావోయిస్టు కమిటీల పేరుతో ప్రకటనలు గుప్పించి బంద్కు పిలుపునిచ్చిందని, ఉనికిని చాటుకునే యత్నం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
మావోయిస్టుల మందుపాతరకు ఇద్దరు మృతి
పెదబయలు(అరకులోయ): తప్పిపోయిన పశువుల కోసం వెళ్లి ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు మండలంలో చింతలవీధికి చెందిన ఇద్దరు గిరిజనులు బలవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. 60 కుటుంబాలు నివసిస్తున్న ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. వారంరోజులకిందట తప్పినపోయిన రెండు పశువులను వెతికేందుకు జామిగుడ పంచాయతీ చింతలవీధి గ్రామానికి చెందిన మొండిపల్లి మోహన్రావు(30),మొండిపల్లి అజయ్కుమార్(20) ఆదివారంఉదయం బయలుదేరారు. మూడు కిలోమీటర్ల దూరంలో గల ఇంజరి పంచాయతీ కోండ్రు అటవీ ప్రాంతానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లారు. అక్కడ మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు పెట్టడంతో అది ఒక్కసారిగా పేలి వారిని బలితీసుకుంది. మోహన్రావుకు నడుము నుంచి కింద భాగం శరీరం పూర్తిగా తునాతునకలైంది. అజయ్కుమార్కు కుడి చెయ్యి పూర్తిగా తెలిపోగ, ఎడమ చేయి, తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ శబ్దం విన్న స్థానికులు.. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నట్టు భావించి అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు భయపడ్డారు. పశువులు వెతకడానికి వెళ్లిన అన్నదమ్ములు తిరిగిరాకపోవడంతో ధైర్యం చేసి గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో వీరి మృతదేహాలు పడి ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. మోహన్రావుకు భార్య కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయ్కుమార్కు పెళ్లి కాలేదు.తల్లిదండ్రులు ఉన్నారు. మృతదేహాలను అటవీ ప్రాంతం నుంచి చింతలవీధి గ్రామానికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ప్రాంతంలో మందుపాతరకు గిరిజనులు బలికావడం ఇదే ప్రథమం. గతంలో కూడా ఈప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలు పెట్టారు. మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు ప్రశాతంగా ముగుస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. మందుపాతర పేలి మృత్యువాత పడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఇంజరి పంచాయతీలోని కోండ్రు అటవీ ప్రాంతం గిరిజనులకు ప్రాణ సంకటం పాడేరు: అడవుల్లో సంచరించే పోలీసు పార్టీలను మట్టుబెట్టాలనే వ్యూహంతో మావోయిస్టులు భారీగా ఏర్పాటు చేస్తున్న మందు పాతరలను గిరిజనులకు ప్రాణ సంకటంగా మారాయి. రెండేళ్ల కిందట పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని కోండ్రుం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాతరలను పోలీసు బలగాలు ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేయడంతోపాటు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసు పార్టీలు త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అయితే ఇలాంటి మందు పాతరలు ఏవోబీ వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. ఈ మందుపాతరల ఉనికిని పోలీసులు పసిగడుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు మాత్రం గుర్తించక ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. గిరిజనులకు అటవీ ప్రాంతాల్లో సంచరించి పశువుల కాపల, అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో మందు పాతరలను గిరిజనులు గుర్తించలేకపోతున్నారు. ఫలించిన పోలీసుల వ్యూహం పాడేరు/ముంగింపుట్టు: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తుగానే వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టింది. గత నెల 28 నుంచి ఈ నెల 3 వరకు వారోత్సవాల నిర్వహణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అయితే అంతకు ముందే ఒడిశా పోలీసు బలగాలతో పాటు విశాఖ ఏజెన్సీ పోలీసు పారీ్టలు కూడా ఏవోబీ వ్యాప్తంగా కూంబింగ్ చర్యలను విస్తృతం చేయడంతో వారిని కట్టడి చేయగలిగారు. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు, సంస్మరణల వా రోత్సవాల చివరి రోజున మందుపాతర పేలి ఇద్దురు గిరిజనులు మృతి చెందారు. ఒడిశాలోని ముకుడుపల్లి, ఏజెన్సీలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకోగా గాయాలతో మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. జి.మాడుగుల మండలం కిల్లంకోట, మల్కన్గిరి జిల్లా పరిధిలోని గుజ్జెడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మిగిలిన మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు. తర్వాత వారోత్సవాలను మావోయిస్టులు ప్రారంభించినప్పటికీ ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపలేదు. ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో గతనెల 28న కొద్దిపాటి గిరిజనులతో అమరవీరుల వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహించారు. ఆ తర్వాత ఎక్క డా భారీ స్థాయిలో వారోత్సవాలను నిర్వహించిన దాఖలా లు లేవు. మావోయిస్టులంతా ఏవోబీలో సురక్షిత ప్రాంతా లకే పరిమితమయ్యారనే ప్రచారం జరిగింది. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ఏవోబీ వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మోహరించి జల్లెడ పట్టాయి. మరోవైపు వర్షాలు కూడా విస్తారంగా కురవడంతో మా వోయిస్టుల వారోత్సవాలకు ఆటంకం కలిగినట్టు తెలుస్తుంది. భారీ వ్యూహాంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం అమరవీరుల వారోత్సవాలను కట్టడి చేసి మావోయిస్టులపై పైచేయి సాధించింది. -
ఏఓబీలో కలకలం..
మక్కువ: ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో (ఏఓబీ) మళ్లీ కలకలం మొదలైంది. ప్రత్యేక బలగాల బూట్ల శబ్ధంతో ఏజెన్సీ అదురుతోంది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో రెండు రోజులుగా యుద్ధ వాతవరణం నెలకొంది. ఈ నెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఏఓబీకి సరిహద్దు గ్రామాలైన ఎర్రసామతవలస, దుగ్గేరు, మూలవలస, బాగుజోల, చిలకమెండంగి, మెండంగి, గుంటబద్ర, తదితర గ్రామాల్లో బుధవారం ముమ్మర కూంబింగ్ చేపట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో పోలీసుల బూట్ల చప్పళ్లు వినిపించాయి. వారంరోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందట ఒడిశా రాష్ట్రం మల్కనగిరి, విశాఖ ఏజెన్సీ పెదబయలు మండల అటవీ ప్రాంతాలలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకొని ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోకి ప్రవేశించి ఉంటారన్న అనుమానంతో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. అలాగే మంగళవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు మంగళవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాల వద్ద నాకాబందీ నిర్వహించారు. సంస్మరణ వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా గతంలో మక్కువ మండలంలో పలుమార్లు తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు బ్యానర్లు, వాల్పోస్టర్లు అతికించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మక్కువ మండలం ఏఓబీ సరిహద్దులో ఉన్నందున మావోయిస్టులు ఎదో ఒక రూపంలో వారి ఉనికిని చాటుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సంఘటనల్లో కొన్ని.. 2011 మే 15న మక్కువ మండలం ఎర్రసామంతవలస, దుగ్గేరు గ్రామాలలో ఏఓబీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. గ్రీన్హంట్ను తిప్పికొట్టాలని అప్పట్లో బ్యానర్లు కట్టి కలకలం రేపారు. అదే ఏడాది జూలై 28న ఎర్రసామంతవలసలో మరో బ్యానర్ కట్టి వారి ఉనికిని మరోమారు చాటుకునే ప్రయత్నం చేశారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అప్పట్లో మావోయిస్టులు (సీపీఐ)పేరిట బ్యానర్ను కట్టి మన్యంలో కలకలం సృష్టించారు. 2011 ఏప్రిల్ 24న చెక్కవలస రిజర్వ్ ఫారెస్ట్లో భారీ డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2012 ఫిబ్రవరి 17న దుగ్గేరులోని రామమందిరం వద్ద శ్రీకాకుళం–కొరాపుట్ డివిజనల్ కమిటీ పేరుతో గోడపత్రికను అతికించారు. అలాగే ఎర్రసామంతవలసలో బీఎస్ఎన్ఎల్ టవర్ను కాల్చి వేశారు. అలాగే పనసబద్ర గ్రామంలో కరువుదాడి జరిగిన సంఘటనలున్నాయి. ఏవోబీకి మక్కువ మండలం అతిసమీపంలో ఉన్నందున మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేయడం.. పోలీసులు పట్టు సాధించేందుకు ప్రయత్నించడం పరిపాటిగా మారుతోంది. -
ఇవాళ్టి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు
-
ఏవోబీలో మళ్లీ పేలిన తుపాకులు
పెదబయలు/పాడేరు: మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒక వైపు మావో యిస్టులు అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపు నివ్వగా.. మరోవైపు అడ్డుకునేందుకు సాయుధ దళాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో మన్యంలో అప్రకటిత రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏవోబీలో శనివారం సాయంత్రం మళ్లీ తుపాకుల మోత మోగింది. దీంతో ఏవోబీలో వాతారణం ఒక్క సారిగా వేడిడెక్కింది. మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తొమ్మిది రోజుల వ్యవధిలో మూడు సార్లు ఎదురు కాల్పులు జరగడంతో గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ, వారిని వెంటాడుతూ పోలీసులు పైచేయి సాధిస్తున్నారు. ఈ నెల 16న మల్కన్గిరి జిల్లా జోడం పంచాయతీ ముక్కుడుపల్లి అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసు బలగాలు–మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఒడిశా కటాఫ్ ఏరియా నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి మావోయిస్టులు ప్రవేశించారని సమాచారం తెలియడంతో ఆంధ్ర పోలీసు బలగాలు కూంబింగ్ను ముమ్మరం చేశారు. ఈ నెల 19న పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ లండూలు, మెట్టగుడ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మరోమారు ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో మావోయిస్టు అగ్రనేతలు గాయాలతో బయటపడినట్టు, వారి నుంచి కిట్ బ్యాగులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు, లభ్యమైన సామగ్రి ఆధారంగా మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీస్ బలగాలు కూబింగ్ను ఉధృతం చేశాయి. తాజాగా ఒడిశా రాళ్లగెడ్డ పంచాయతీ గజ్జెడిపుట్టు,దిగుడుపల్లి అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. దయా అనే మావోయిస్టు మృతి చెందాడు. ఏవోబీలో వరుస ఎదురు కాల్పులతో యుద్ధవాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు సమాచారం. వారోత్సవాలు భగ్నమే లక్ష్యంగా .. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహిస్తారు. ఒడిశా కటాఫ్ ఏరియాలో ఏడు పోలీసుల అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆంధ్ర ప్రాంతంలోఉన్న ముంచంగిపుట్టు మండలం భూషిపుట్టు, బుంగాపుట్టు పంచాయతీలు, పెదబయలు మండలం ఇంజరి,గిన్నెలకోట ,జామిగుడ పంచాయతీల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారంతో ఆంధ్ర గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ను ముమ్మరం చేశాయి. మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాలు భగ్నం చేయాలని పోలీసులు,ఎలాగైన వారోత్సవాలు జరపాలని మావోయిస్టుల పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఏవోబీలో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. విశాఖ గ్రేహౌండ్స్, ఒడిశా ఎస్వోజీ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో చిత్రకొండ పోలీస్స్టేషను పరిధి రాళ్లగెడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలంలో 303 తుపాకీ, మూడు కిట్ బ్యాగులు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టు జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన దయాగా గుర్తించారు. 2016లో జరిగిన రామ్గుడ ఎన్కౌంటర్లో మృతి చెందిన పాంగి దొసో తమ్ముడు దయా. అప్పట్లో దొసో చనిపోవడంతో ఉద్యమంలో చేరాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మావోల తలలకు వెల..!
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టుల తలలకు పోలీస్ శాఖ వెల కట్టింది. సమాచారం అందించిన వారికి బహుమతి ఇస్తామని వాల్పోస్టర్ల ద్వారా పోలీస్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి తతంగం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్వసాధారణంగా ఉండేది. పదేళ్ల అనంతరం మావోయిస్టుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ మావోల అలజడి మొదలైంది. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలో రెండుసార్లు ఎదురుకాల్పులు కూడా జరిగాయి. దీంతో డీజీపీ మహేందర్రెడ్డి రంగంలోకి దిగి అటవీ ప్రాంతాల్లో పర్యవేక్షించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మావోల ఏరివేతనా..? తరిమికొట్టడమా..? అంశంపై చర్చించారు. అదే సమయంలో మావోయిస్టులు పార్టీ పునర్మిర్మాణం చేసినట్లు రాష్ట్ర, జిల్లా, మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి జాబితాను ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మావోల అణచివేతకు పోలీస్ యంత్రాంగం స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులు వందలాది మందితో 24 గంటలపాటు అడవులను జల్లెడ పడుతున్నారు. పైగా ఉమ్మడి జిల్లా ఓఎస్డీగా మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ ప్రస్థానం నక్సల్ ఉద్యమం ఉమ్మడి జిల్లాల్లో నాలుగు దశాబ్దాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉద్య మం పుట్టింది శ్రీకాకుళంలోనే అయినా ఉద్యమానికి ఊపిరిపోసింది మాత్రం ఇక్కడే. బడిపంతులైన కొండపల్లి సీతరామయ్య ఆధ్వర్యంలో జన్నారం మండలం తపాలపూర్కు చెందిన పితంబర్రావు దొరగడిపై జరిగిన దాడులు.. వారి సోదరుల హత్యతో భీతిల్లి గుండెపోటుతో మరణించినప్పటి నుంచి ఉద్యమం ఇక్కడి అడవుల్లో వేళ్లూనుకుపోయింది. తరచూ పోలీస్, పీపుల్స్ మధ్య వార్ కొనసాగేది. అదే తరహాలో మవోయిజం తెరమీదికి వచ్చింది. సమాచారం మాకు.. బహుమతి మీకు.. మావోయిస్టుల సమాచారం ఇచ్చి సహకరించాలని, సమాచారం ఇచ్చినవారికి తగిన పారితోషికం అందిస్తామని ఓఎస్డీ ఆరుగురు మావోయిస్టుల ఫొటొలతో కూడిన వా ల్ పోస్టర్ను విడుదల చేశారు. వీరి తలలకు గతంలోనే వెల కట్టినా.. తాజాగా విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ ఎస్పీ 944079500, నిర్మల్ ఎస్పీ 8332811100, ఆసిఫాబాద్ ఎస్పీ 8332801100, మంచిర్యాల డీసీపీ 9440795003, ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ 8333986921కు సమాచారం ఇవ్వాలన్నారు. -
పట్టుదలతో మావోలు.. పంతంతో పోలీసులు
సాక్షి, బెల్లంపల్లి : వ్యూహ ప్రతి వ్యూహాలతో మావోయిస్టులు, పోలీసులు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి పట్టుకోసం మావోలు ప్రయత్నాలు చేస్తుండగా ఆ వ్యూహాన్ని ఆదిలోనే తిప్పికొట్టేందుకు బహుముఖ వ్యూహాలతో పోలీసులు పథక రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు పోలీసు యంత్రాంగం అన్నిరకాలా సంసిద్ధమవుతోంది. ఆసిఫాబాద్ జిల్లా పరిధి తిర్యాణి అటవీప్రాంతం తొక్కిగూడ వద్ద ఇటీవల జరిగిన పరస్పర ఎదురు కాల్పుల ఘటనతో అటవీప్రాంతం అట్టుడుకుతోంది. మావోయిస్టులు తారసపడినట్లే పడి తృటిలో తప్పించుకోవడాన్ని పోలీసులు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సభ్యులతో కూడిన దళం క్షణాల్లో తప్పించుకోవడం సంచలనమైంది. ఈ చర్యతో ఇరువర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రవెల్లిలో మావోల కుటుంబీకులను పరామర్శిస్తున్న ఏసీపీ (ఫైల్) గిరిజన యువతను ఆకట్టుకుని పట్టుసాధించాలనే తలంపులో మావోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఎలాగైనా అడ్డుకుని మావోలపై పైచేయి సాధించాలనే కృత నిశ్చయంతో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఎదురు కాల్పుల ఘటన తర్వాత మావో లు కొత్తగా ఏర్పాటు చేసిన ఏరియా కమిటీలు ఒక్కసారిగా తెరమీదకు రావడం, పత్రికల్లో ప్రకటనలు రావడం మారిన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇదే క్రమంలో విప్లవ కవి వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను జైలులో నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న మావోయిస్టుపార్టీ రాష్ట్రబంద్కు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈక్రమంలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బంద్ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది చర్చనీయాంశమైంది. -
తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్
-
మన్యంలో అలజడి..
సాక్షి, ఆసిఫాబాద్: ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం గుండాల అటవీ ప్రాంతంలో దళ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో విస్తృతంగా పోలీసు ప్రత్యేక బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో మావోయిస్టుల జాడ కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన దళ సభ్యులు పోలీసు బలగాల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయం కుమురం భీం జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణువారియర్ ధ్రువీకరించారు. (జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు) తప్పించుకున్న వారిలో సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు మైలవరపు అడెల్లు అలియాస్ భాస్కర్, కేబీఎం (కుమురం భీం మంచిర్యాల ఏరియా) సభ్యుడు వర్గేష్ కోయ అలియాస్ మంగులుతో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్లో విప్లవ సాహిత్యం, మావోయిస్టు యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికాలు, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్లు, పాలిథిన్ కార్పెట్స్ లభ్యమయ్యాయి. రూ.20లక్షల రివార్డు ఉన్న మైలారపు అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం కాగా, వర్గేష్ ది చత్తీస్ఘడ్ ప్రాంతం. ఈయనపై రూ.5లక్షల రివార్డు ఉంది. పక్కా సమాచారంతో దాడులు.. గత రెండు నెలలుగా కుమురం భీం జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్, తిర్యాణి అటవీ ప్రాంతంలో కేబీఎం దళ సభ్యులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసు శాఖకు అందింది. దీంతో స్పెషల్ పార్టీతో పాటు స్థానిక పోలీసులతో రాత్రింబవళ్లు అడవుల్లో జల్లెడ పడుతున్నా రు. గత నెల 28న దళ సభ్యులకు అన్నం పెట్టివస్తున్న ఓ వ్యక్తిని ఆసిఫాబాద్ మండలం మోవాడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానిక ఆదివాసీల గూడాలపై, సానుభూతి పరులపై మరింత దృష్టి సారించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాల రాకను పసిగట్టి అక్కడి నుంచి మావోలు తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మంగీ, గుండాల, ఉట్ల పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వారు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అడవుల్లోనే మకాం.. కరోనా సంక్షోభంలో పోలీసు యంత్రాంగం బిజీగా ఉన్న సమయంలో మహారాష్ట్ర సరిహద్దుల నుంచి జిల్లాలోకి మా వోలు అడుగుపెట్టినట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇన్నాళ్లు చత్తీస్గడ్లోని దండాకారణ్యంలో ఉన్న దళం మళ్లీ స్థానికంగా పట్టుపెంచుకునేందుకే వచ్చినట్లు పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక యువతను ఉద్యమబాట పట్టించేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. పట్టుపెంచుకునేందుకేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మిలిటెంట్ దాడులకు ప్రసిద్ధిగాంచిన మంగీ దళం పూర్తిగా కనుమరుగైంది. 2016లో దళ సభ్యుడు ఆత్రం శోభన్ అలియాస్ చార్లెస్ పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత ఇక్కడ మావోల అలజడి కనిపించలేదు. జిల్లా పునర్విభన తర్వాత మంచిర్యాల కుమురం భీం ఏరియా (కేబీఎం)కి సారథ్యం వహిస్తూ.. స్థానికంగా పట్టున్న మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్తో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి బండి ప్రకాశ్, అలియాస్ ప్రభాత్తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తమ ఉనికిని చాటేందుకు మావోలు ఓ దాడికి కూడా యత్నించినట్లు సమాచారం. ఇటీవలే గిరిజన ప్రాంతంలో యువతీ యువకులు అదృశ్యమైన సంఘటనలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వీరంతా ఉద్యమబాట పట్టారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. -
ఏవోబీలో అలర్ట్
పాడేరు: ఏవోబీలో మావోయిస్టు నేతలు, యాక్షన్ టీమ్ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా ప్రాంతానికి దగ్గరగా ఉన్న సీలేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అరకులోయ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అరకు సంతబయలు ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులు వచ్చి రెక్కీ నిర్వహించినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో వారి కదలికలపై నిఘా పెంచారు. ఇదీ పరిస్థితి... లాక్డౌన్తో మావోయిస్టులు కూడా తమ కార్యకలపాలకు విరామం ప్రకటిస్తున్నట్టు గత నెలలోనే ప్రకటన చేశారు. పోలీసులు కూడా అడవుల్లో కూంబింగ్ నిలిపివేశారు. అయితే మావోయిస్టులు జనావాసాల్లో సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఏవోబీలో నిఘాను పెంచింది. ఇటీవల చింతపల్లి ఏఎస్పీ సతీష్కుమార్ మావోయిస్టు యాక్షన్ టీమ్ల సంచారంపై ప్రకటన చేశారు. మావోయిస్టు పార్టీలోని కీలక నేతలు, యాక్షన్ టీమ్ సభ్యుల ఫొటోలతో కూడిన పోస్టర్లను పోలీసుశాఖ విడుదల చేసింది. వారి సమాచారం తెలిపిన వారికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని పేర్కొంది. -
మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు
-
మావోయిస్టు కొత్త కమిటీ.. తెలంగాణకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఉద్యమ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మావోయిస్టు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే మంగళవారం నూతన కేంద్ర కమిటీని ఎన్నుకుంది. 21 మందితో మావోయిస్టు కేంద్ర కమిటీ జాబితా సిద్ధం చేసింది. నూతన కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి 10 మందికి స్థానం లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరి చొప్పున చోటు దక్కింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా పార్టీ సీనియర్ నేత నంబాల కేశవరావును (69) అలియాస్ బస్వరాజ్ను ప్రధాన కార్యదర్శిగా పార్టీ నియమించింది. -
మళ్లీ మావోయిస్టుల కదలికలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? అంటే పోలీసు వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. జూలై, ఆగస్టు మాసాల్లో గోదావరి పరీవాహక ప్రాం తంలో పలు ఘటనలకు పాల్పడిన మావోలు 4 నెలలుగా స్తబ్దతగా ఉన్నారు. వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర జరగనున్న నేపథ్యంలో మళ్లీ ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులోకి చేరినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. 2013 మే 25న సుకుమా జిల్లాలో సల్వాజుడుం అధినేత మహేంద్రకర్మతో పాటు పలువురిని చంపిన కేసులో ‘మోస్ట్ వాంటెడ్’గా మావోల జాబితాను విడుదల చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లకు చెందిన మావోల ఫొటోలు, పేర్లు, రివార్డులతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 3 రాష్ట్రాల సరిహద్దు ల్లో వాల్పోస్టర్లు వేసింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో 3 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 3 రోజుల కిందట సమావేశమైనట్లు సమాచారం. మనోళ్ల డైరెక్షన్.. ఛత్తీస్గఢ్ కేడర్ యాక్షన్ ఛత్తీస్గఢ్, లాల్గఢ్ ప్రాంతాలలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన మావో యిస్టు పార్టీ నాయకులు, కేడర్తో పాటు.. ఛత్తీస్గఢ్కు చెందిన 100 మంది వరకు సాయుధ నక్సల్స్ 3 గ్రూపులుగా తెలంగాణ సరిహద్దుల్లో ప్రవేశించి నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయమై వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేసినట్లు తెలిసింది. మూడు రోజుల కిందట మావోల అణచివేత కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఈ ప్రాంతంలో పర్యటించి పలువురు పోలీసులతో మాట్లాడినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన మావోల్లో అత్యధికంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. అందులో 22 మంది వరకు తెలంగాణ ప్రాంతం కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు చెబుతున్నారు. 2016లో జిల్లాల పునర్ విభజన తర్వాత కేకేడబ్ల్యూ(ఖమ్మం – కరీంనగర్ – వరంగల్) కమిటీని ఎత్తివేసి దాని స్థానంలో మూడు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ లక్మా అలియాస్ హరిభూషణ్ వ్యవహరిస్తుండగా, బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి, బడే దామోదర్, మైలారపు భాస్కర్ సభ్యులుగా ఉన్నారు. మొత్తం సాయుధ బలగాలకు వీరే సారథ్యం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా నాయకుల సూచనల మేరకు దాడులు, కార్యక్రమాలకు పాల్పడుతారని గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు... పోలీసులను అప్రమత్తం చేయడం చర్చనీయాంశమైంది. -
అయ్య బాంబోయ్..! టిఫిన్ బాక్స్ బాంబులు
జయపురం: నవరంగపూర్ జిల్లా రాయిఘర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం సరగుడి డీఎన్కె గ్రామం రహదారిలో రెండు టిఫిన్ బాక్సులలో బాంబులు కనిపించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. టిఫిన్ బాక్స్ బాంబులై ఉండవచ్చని ఆ ప్రాంత ప్రజలు అనుమానించి పోలీసులకు తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఒక బాలుడు రోడ్డుపై ఆడుకుంటున్న సమయంలో కోళ్ల ఫారం సమీపంలో రెండు టిఫిన్ బాక్సులు కనిపించగా ఆ విషయం గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వాటిని టిఫిన్బాక్స్ బాంబులని అనుమానించి పోలీసులకు తెలియజేశారు. సమాచారం మేరకు వెంటనే రాయిఘర్ పోలీసులు వచ్చి పరిశీలించి బాంబు డిస్పోజల్ టీమ్ను రప్పించారు. వారు వచ్చి ఒక బాంబును నిర్వీర్యం చేశారు. రెండో దానిని పేలకుండా చేసేందుకు ప్రయత్నిçస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి ఇంకా ఆ బాంబును నిర్వీర్యం చేయనట్లు సమాచారం. అయితే ఆ టిఫిన్ బాక్స్ బాంబులు ఆదివారం సాయంత్రం నుంచి ఆ ప్రాంతంలో పడి ఉన్నాయని సోమవారం వాటిని చూసిన తరువాత గ్రామస్తులు పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. ఆ టిఫిన్ బాక్స్లో బాంబులు ఎవరు పెట్టారు? ఎవరిని టార్గెట్ చేసి పెట్టారన్నది తెలియడం లేదు. రాయిఘర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పాటు వారి కార్యకలాపాలు జోరుగా సాగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది. గత కార్యకలాపాలతో తీవ్ర భయాందోళన గతంలో రాయిఘర్ సమితిలోని అనేక ప్రాంతాలలో మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. అంతే కాకుండా పలువురు వక్తులను ఇన్ఫార్మర్ల పేరిట హత్య చేసిన సంఘటనలు ఉన్నాయి. గతంలో ఉమ్మరకోట్ ఎంఎల్ఏ జగబంధు మఝిని కూడా మావోయిస్టులు హత్య చేశారు. అయితే రాయిఘర్ ప్రాంతంలో కొంత కాలంగా మావోయిస్టుల సంఘటనలు అంతగా జరిగినట్లు సమాచారం లేదు. తాజాగా రెండు టిఫిన్ బాక్స్ బాంబులు కనిపించడంతో ప్రజలు, పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మావోయిస్టులు ఎవరిని టార్గెట్ చేశారోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సహజంగా మావోయిస్టులే టిఫిన్ బాక్స్లలో బాంబులు పెట్టి జవాన్లను గానీ మరెవరినైనా టార్గెట్ చేస్తారని అందరి అనుమానం. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తేలవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో మరేమైనా టిఫిన్ బాక్సు బాంబులు ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు అణువణువు పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
జార్ఖండ్: హేమంత్ సొరేన్ ముందున్న సవాళ్లు
రాంచీ: జార్ఖండ్లోని అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో.. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వానికి పెనుసవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, పెట్రేగుతున్న మావోయిస్టు కార్యకలాపాలు, వేధిస్తున్న ఆహార కొరత, రాష్ట్రం పేరిట ఇప్పటికే ఉన్న రుణభారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపే బాధ్యత కాబోయే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్పై ఉంది. దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించడంతో ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పెను సవాళ్లతో సతమతం అవుతున్న జార్ఖండ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, ప్రజల అంచనాలను అందుకుంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. రూ. 85 వేల కోట్ల రుణభారం: జార్ఖండ్ ప్రభుత్వంపై ఇప్పటికే రూ. 85 వేల కోట్ల రుణభారం ఉంది. గతంలో రఘుబర్దాస్ ప్రభుత్వం కొలువుదీరక(2014) ముందు రూ. 37,593 కొట్ల అప్పు ఉండేది. అయితే రఘుబర్దాస్ ప్రభుత్వం హయాంలో అదికాస్త గణనీయంగా పెరిగింది. దీంతో రుణభారం తగ్గించే పని హేమంత్ సొరేన్ భుజ స్కంధాలపై పడింది. కాగా రాష్ట్రంలోని రైతులు సుమారు రూ. 6వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం రైతుల పేరిట ఉన్న రుణాన్ని మాఫీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ పేరు తప్పిస్తారా? దేశంలో పేద రాష్ట్రంగా ముద్ర పడిపోయిన 'బిహార్'.. ఆ ట్యాగ్ను 2000 సంవత్సరం నుంచి తొలగించుకొంది. తరువాత నుంచి ఛత్తీస్గఢ్ 'పేద రాష్ట్రం'గా కొనసాగుతుంది. పేదరికం నుంచి కాస్త మెరుగుపడుతున్నా.. బీద రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోని జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో 36.96 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. జార్ఖండ్కు ఉన్న 'బీద' రాష్ట్రమనే పేరును తప్పించడం కూడా హేమంత్ సొరేన్ ముందున్న సవాలు. ఆహార కొరత: ఆకలి చావుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 2017లో ఇదే రాష్ట్రంలోని సిమ్దేగా జిల్లాలో సంతోషి అనే 11 ఏళ్ల అమ్మాయి ఆకలితో మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్కు ప్రతియేటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు అవసరమవుతాయి. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఖాళీని పూరించడం హేమంత్ సొరేన్ ముందున్న మరో సవాలు. మావోయిస్టుల కట్టడి, శాంతి భద్రతలు: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్లో ఇప్పటికే మావోయిస్టులను అదుపు చేస్తున్నా.. ఇంకా 13 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. అందులో ఖుంతి, లాతేహర్, రాంచీ, గుమ్లా, గిరిదిహ్, పలాము, గర్హ్వా, సిమ్దేగా, డుమ్కా, లోహర్దగా, బోకారో, ఛత్రా జిల్లాలు ఉన్నాయి. వీటిని మావోయిస్టు రహితంగా మలచడం హేమంత్ సోరెన్కు కత్తి మీద సామే. మూకదాడులతో రాష్ట్రానికి మచ్చ: పెరుగుతున్న మూకదాడుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం అపకీర్తిని మూట కట్టుకుంది. ఇక ఆ మచ్చను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుద్యోగ సమస్యను అధిగమిస్తారా? దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలలో జార్ఖండ్ ఒకటి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రతి అయిదుగురిలో ఒకరు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 46 శాతానికి పైగా పోస్టుగ్రాడ్యుయేట్లు, 49 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఎటువంటి ఉపాధి లేకుండా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. 2018-19లో నిర్వహించిన ఎకనమిక్ సర్వే ప్రకారం, సుమారు లక్షమందికి పైగా యువతకు ప్రభుత్వం ఉపాధి పథకాల కింద శిక్షణ ఇచ్చినా.. ప్రతి పదిమంది యువతలో ఎనిమిది మంది ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగం అనే కష్టతరమైన సవాలును ఎదుర్కొని రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వాగ్దానాలను నిలబెట్టుకుంటారా? 'రాష్ట్రంలో నిరుద్యోగమనేది దీర్ఘకాలిక వ్యాధి, మహమ్మారిలా వ్యాపించి మితిమీరుతుంది' అని హేమంత్ తన ఫేసుబుక్లో చెప్పుకొచ్చారు. 'దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం రేటు 7.2 శాతం ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం 9.4 శాతంగా ఉంది. రఘుబర్దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని, సుమారు నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులు అధికారికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఒకవేళ తమ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. వంద శాతం నిరుద్యోగ యువతకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. -
కలవరపెడుతున్న కరపత్రాలు
సాక్షి, ములుగు : జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వరుసగా జరుగుతున్న మావోయిస్టు కరపత్రాల విడుదల జిల్లా యంత్రాంగానికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఈ నెల 17న, 24న వేర్వేరుగా రెండు కరపత్రాలు విడుదల కావడంతో కలకలాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ, బీజేపి నాయకులు, ఆదివాసీ సంఘాలు, అధికారులను టార్గెట్ చేస్తూ విడుదల కావడంతో ఆందోళనకు గురి చేస్తుంది. జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం(కె), మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లోని అధికార పార్టీ నాయకులు, అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తిప్పి కొట్టిన ప్రజాప్రతినిధులు.. గడచిన వారం రోజుల్లో జిల్లాలో నాలుగు సార్లు కరపత్రాలు విడుదల కావడంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, అధికారుల్లో గుబులు మొదలయ్యింది. తాము చేయని తప్పుకు తలదించాల్సిన అవసరం లేదని కొంతమంది ధైర్యంగా మావోయిస్టుల హెచ్చరికలను తప్పికొట్టారు. మరికొంత మంది ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాలపై ఈ నెల 18న జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఘాటుగా స్పందించారు. భూ ఆక్రమణలకు, అవినీతి అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేటతెల్లం చేశారు. అలాగే ఈ విషయంపై స్పందించిన ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య ములుగులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు కరపత్రాల విషయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు కరపత్రాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా గత మూడు రోజుల క్రితం ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు, అధికారులను ఏటూరునాగారం స్టేషన్కి పిలిపించి తగిన వివరాలను సేకరించారు. స్థానికంగా ఉండకుండా పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. దీంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధుల కదలికలపై ఆరా తీస్తున్నారు. మొదటి కరపత్రంలో ఇలా.. లంచగొండి అధికారులు, రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ నెల 17న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో విడుదలైంది. ఇందులో ఏటూరునాగారంలోని కొంత మంది నాయకులు ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్, ఉమ్మడి భూపాలపల్లి, ములుగు జిల్లాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ దందాలు, భూ ఆక్రమాలు, గుండాయిజం, అవినీతి అక్రమాలు, పైరవీల పెత్తనాలు చేస్తూ 34 ఎకరాల భూమిని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అందులో ఆరోపించారు. అలాగే ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వైద్యుల కారణంగానే సామాన్య గిరిజనులు వైద్యసేవలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటును ఆశ్రయించి వేలాది రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాది రూపాయలను వెచ్చించినా వాటిని గిరిజనుల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చుచేయలేదని ఐటీడీఏ పీఓ, ఏపీఓల వైఖరిని తప్పుబట్టారు. రెండో కరపత్రంలో.. జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని టీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ దందాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడి ప్రశ్నించిన వారిని పోలీసుల ప్రోత్భలంతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భారత కమ్యునిస్టు పార్టీ (మావోయిస్టు) వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ ఈ నెల 24న ఓ కరపత్రంలో పేర్కొన్నారు. మండలంలోని సుడిబాక గ్రామానికి చెందిన 56 మంది రైతుల 150 ఎకరాల భూములను కొంత మంది నాయకులు కబ్జా చేశారని కరపత్రంలో తెలిపారు. జీఎస్పీ, ఏవీఎస్పీ సంఘాలకు చెందిన వారు కూడా వత్తాసు పలుకుతూ లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు. లక్ష్మీనగరం, దానవాయిపేట గ్రామాల ఆదివాసీలకు చెందిన 27 ఎకరాల భూమిని ఆక్రమించి పట్టాలు చేసుకున్నారని, అమాయక ఆదివాసీలు నిత్యం అధికారులు, కోర్టుల చుట్టూ న్యాయం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారన్నారు. రైతుల నుంచి ఆక్రమించిన భూమిని వెంటనే వారికి అప్పగించాలని, లేనిపక్షంలో ప్రజల చేతుల్లో శిక్షతప్పదని కరపత్రంలో హెచ్చరించారు. -
మావోల హింస వల్లే అత్యధిక ప్రాణనష్టం
సాక్షి, అమరావతి: దేశంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించేందుకు మావోయిస్టు పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని, ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో జరిగిన మొత్తం హింసాత్మక ఘటనల్లో 88 శాతం కంటే ఎక్కువ మరణాలకు మావోయిస్టులే పేర్కొంది. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితిపై (2018–2019 మార్చి వరకు) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలో వివిద వామపక్ష తీవ్రవాద సంస్థల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) అత్యంత శకిమంతంగా ఉందని నివేదికలో స్పష్టం చేసింది. తీవ్రవాద ప్రభావిత 10 రాష్ట్రాల్లో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో గడిచిన తొమ్మిదేళ్లలో 3,749 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 2010 నుంచి 2018 వరకు మొత్తం 10,660 ఘటనలు చోటుచేసుకోగా, వాటిలో 3,749 మంది మరణించారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేలా ప్రజలతో పోలీసులు మమేకం కావాలని హోం శాఖ నివేదికలో సూచించింది. మావోయిస్టుల ప్రభావం ఉన్నచోట ప్రజల భద్రతతోపాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్) అమలు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పలు పథకాల ద్వారా నిధులు విడుదల చేసి, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు మావోయిస్టులను కట్టడి చేయడానికి పోలీసు బలగాల సంఖ్యను పెంచడంతోపాటు భద్రతా సిబ్బందికి అధునాతన ఆయుధాలు, హెలికాఫ్టర్లు తదితర అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నట్టు పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తక్కువే.. మావోయిస్టుల హింసాత్మక ఘటనలు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే తక్కువ. మావోయిస్టుల హింసాత్మక ఘటనల విషయంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి తగ్గిపోతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2013లో 10 రాష్ట్రాల్లో 76 జిల్లాల్లోని 330 పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టుల ప్రభావం ఉండేది. 2018 నాటికి 8 రాష్ట్రాల్లోని 60 జిల్లాల పరిధిలో 251 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే వీరి ప్రభావం కనిపించింది. ఏపీలో మావోల హింసాత్మక ఘటనలు.. మృతులు ఏడాది ఘటనలు మృతులు 2010 100 24 2011 54 9 2012 67 13 2013 28 7 2014 18 4 2015 35 8 2016 17 6 2017 26 7 2018 12 3 -
ఘణపురంలో మావోయిస్టుల కరపత్రాలు
సాక్షి, ములుగు: జిల్లాలోని వాజేడు మండలం ఘణపురం గ్రామ శివారులో గురువారం మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. ఈ నెల 21 నుంచి నవంబర్ 8 వరకు మావోయిస్టుల 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మావోలు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కరపత్రాలు సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో వెలిశాయి. -
అబూజ్మాడ్లో అగ్రనేతలు
పెద్దపల్లి: కాకులు దూరని కారడవులు.. ఎత్తయిన కొండలు.. దట్టమైన దండకారణ్యం. గౌతమి, ఇంద్రావతి, శబరి, లాహిరీ నదుల పరిసరాలను విస్తరించిన అబుజ్మాడ్పై క్రమంగా పోలీసులు పట్టు సాధిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో దండకారణ్యంలో జరిగిన నాలుగు ఎన్కౌంటర్ సంఘటనలో రెండు అబూజ్మాడ్ కొండల్లోనే సాగడం ఇందుకు నిదర్శనం. మోస్ట్ వాంటెడ్ నేతలంతా మాడ్ ప్రాంతంలోనే ఉన్నట్లు భావిస్తున్న కేంద్ర బలగాలు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా అబూజ్మాడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. వందలాది ఎన్కౌంటర్లతో నష్టపోతున్న మావోయిస్టు పార్టీకి ఇప్పటికీ అబూజ్మాడ్ ప్రాంతంలో పటిష్టమైన నాయకత్వంతో జనతన సర్కార్ను నడుపుత్నునారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాలను ఆనుకుని ఉన్న నారాయణపూర్ ఖాంకేర్, రాజ్నంద్గామ్, జిల్లాల్లో విస్తరించిన అబూజ్మాడ్ ప్రాంతంలోని కొండలను స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్న మావోయిస్టు పార్టీ 38 ఏళ్లుగా ఛత్తీస్గఢ్లో పోటీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. వేల మైళ్ల అడవులతోపాటు నైబేరడీ గౌతమినదీ, పర్లకోటనదీ, ఇంద్రావతి, శబరి, లాహిరీ లాంటి నదులు పార్టీ దళాలకు దారి చూపే మార్గాలుగా ఉన్నాయి. తెలంగాణ, జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్ట పోయినా ఇంకా 14 రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉంది. అయితే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ పార్టీకి అబూజ్మాడ్ ప్రాంతం గుండెకాయలాంటింది. ఆయుధాల తయారీ సహా పార్టీకి చెందిన దళాలకు రాజకీయ శిక్షణ, సైనిక శిక్షణ అంతా అబూజ్మాడ్లోనే జరుగుతున్నాయి. అబూజ్మాడ్ను గుర్తించడానికి వందలసార్లు హెలీకాప్టర్లతో సర్వేలు నిర్వహించిన పోలీసు బలగాలు క్రమంగా చొచ్చుకెళ్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కమెండోలు, కోబ్రా దళాలు, ఆక్వా ఫోర్స్, ఆదివాసీలకు చెందిన స్పెషల్ ఆఫీసర్ (ఎస్పీఓ)లు మావో దళాల కోసం నిత్యం అబూజ్మాడ్ ప్రాంతాన్ని గాలిస్తూ, తమ ఆ«దీనంలో తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే దశబ్దా కాలంగా పోలీసులు అబూజ్మాడ్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించి వడ్స, బాంమ్రాఘడ్, చింతల్నాల్ లాంటి ప్రాంతాల్లో సైన్యం దెబ్బతిన్నది. చింతల్నాల్, మస్పూర్, ఖాంకేర్లలో మూడు సంఘటనలోనే వంద మందికిపైగా పోలీసులు మరణించారు. రాష్ట్రాల్లోని మావోయిస్టు కమిటీలలో మాడ్ డివిజన్ కమిటీ కీలకమైంది. ఆ కమిటీ అదీనంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక నేతలు ఉంటారని ప్రచారం. మోస్ట్ వాంటెడ్ మావోల స్థావరంగా అబూజ్మాడ్ను గుర్తించారు. -
ఏజెన్సీలో బూట్ల చప్పుళ్లు!
విశాఖపట్నం,అరకులోయ/పెదబయలు: మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలు ఏవోబీలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మావోయిస్టులు అధికంగా సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జోరువానలో తడుస్తూనే గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కూంబింగ్తో అడవిని జల్లెడ పడుతున్నారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల బూట్ల చప్పుళ్లతో అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లకే గిరిజనులు పరిమితం మావోయిస్టులు తలపెట్టిన అమరవీరుల వారోత్సవాలు ముగిసేంత వరకు గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల పరిధిలోని గిరిజన ప్రజలతో పాటు ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె.వీధి మండలాల పరిధిలోని మావోయిస్టుపభావిత గ్రామాల గిరిజనులంతా తమ ఊర్లకే పరిమితమయ్యారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. బలిమెల రిజర్వాయర్ కటాప్ ఏరియాలోని గిరిజనులు రిజర్వాయర్లో లాంచీల ప్రయాణాన్ని మానుకున్నారు. ఏవోబీలోని గిరిజనులకు ప్రధాన మార్కెట్ ప్రాంతమైన ఒనకఢిల్లీకి గిరిజనుల రాకపోకలు తగ్గాయి. నిలిచిపోయిన బస్సులు : ఏజెన్సీలోని మారుమూల గ్రామాలు, సరిహద్దు ఒడిశాలోని గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. పాడేరు డిపో నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతుండగా, మారుమూల గ్రామాల సర్వీసులను రద్దు చేశారు. ప్రైవేటు వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ముంచంగిపుట్టు మండలం కుమడ నుంచి ఒడిశాలోని కటాప్ ఏరియాతో రవాణా సంబంధాలు నిలిచాయి. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మావోయిస్టుల అమరవీరుల స్థూపాలు అధికంగా ఉండడంతో గిరిజనులు మరింత భయపడుతున్నారు. మన్యంలో ఉద్రిక్తత : అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు ప్రచారం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాలను భగ్నం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. పైచేయి కోసం పోలీసులు, మావోయిస్టులు ఎవరికివారే ప్రయత్నం చేస్తుండడంతో విశాఖ మన్యంతో పాటు ఏవోబీలో ఉద్రిక్తత నెలకొంది. ఏవోబీలో ప్రత్యేక పోలీసు బలగాలు కూడా కూంబింగ్ చర్యలను చేపడుతున్నాయి. కటాప్ ఏరియాలో మల్కన్గిరి, కోరాపుట్ పోలీసు పార్టీలు, ఏజెన్సీ మారుమూల అటవీ ప్రాంతాలలో విశాఖ జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మందుపాతరలపై పోలీసుల నిఘా మావోయిస్టులు ఏజెన్సీతో పాటు సరిహద్దులోని ఒడిశా రోడ్లలో మందుపాతరలు అమర్చి ఉంటారనే అనుమానాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కూంబింగ్ పార్టీలతోపాటు బాంబు తనిఖీ బృందాలు కూడా సంచరిస్తున్నాయి. మందుపాతరలు, ఇతర పేలుడు సామగ్రిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, ఒడిశాకు పోయే ప్రధాన రోడ్లలో బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. అన్ని వాహనాలను తనిఖీ చేసి,అనుమానిత వ్యక్తుల లగేజీ బ్యాగ్లను క్షుణంగా సోదా చేస్తున్నారు.ఒడిశా నుంచి అరకు ప్రధాన రోడ్డులో కూడా పోలీసుల తనిఖీలు మమ్మురమయ్యాయి. పాడేరు, ముంచంగిపుట్టు మండలాల నుంచి వచ్చే వాహనాలను స్థానిక ఎస్సై రాజారావు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు..
సాక్షి, ఏటూరునాగారం: మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలోని టీఆర్ఎస్ నాయకుల్లో గుబులు పుట్టింది. మావోయిస్టు నక్సల్స్ టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కే) మండలాలకు చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులను సురిక్షత ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు సమాచారం. చిట్యాల, రేగొండ, టేకుమట్ల, పలిమల వంటి ప్రాంతాల్లోని టీఆర్ఎస్ నాయకులతోపాటు టార్గెట్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా గ్రామాల్లో ఉండొద్దని రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో పోలీసులు వారికి సెల్ఫోన్, మేసేజ్తోపాటు, లిఖిత పూర్వకంగా కూడా ముందస్తు హెచ్చరికలను అందజేశారు. పూర్వపు ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు నాయకులను, టార్గెట్లను అప్రమత్తం చేస్తూ వారికి రక్షణ కల్పిస్తున్నారు. జూలై 12న కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని బేస్తకొత్తూరుకు చెందిన పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును ఈనెల 8న మావోయిస్టులు అపహరించుకు తీసుకెళ్లారన్నారు. ఈనెల 12న ఛత్తీస్గఢ్లోని పుట్టపాడుకు వెళ్లే మార్గంలో శ్రీనివాసరావు మృతదేహాన్ని ఆయన బైక్ను వదిలిపెట్టి వెళ్లారు. అక్కడే అతడిని హతమార్చారు. అయన టీఆర్ఎస్ పార్టీ కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వాటిని ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సవాల్గా తీసుకొని ప్రత్యేక చర్యలను ముమ్మరం చేశారు. అడవుల్లో కూంబింగ్తోపాటు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, గొత్తికోయగూడెంల్లో ఆకస్మిక తనికీలు, కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర ప్రధాన రోడ్డు అయిన ఛత్తీస్గఢ్– హైదరాబాద్ ప్రాంతాల మధ్యలోని ఏటూరునాగారం వై జంక్షన్, ముల్లకట్ట బ్రిడ్జి వద్ద పోలీసులు గట్టి నిఘా వేసి తనిఖీలను తీవ్ర స్థాయిలో చేపడుతున్నారు. ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు, మావోయిస్టుల కదలికలతో ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారు. -
ఉలిక్కిపడిన మన్యం
సాక్షి, భామిని–సీతంపేట: ఏజెన్సీ ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మావోయిస్టు డంప్ లభించడం అలజడి రేపింది. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఓబీలోని దోనుబాయి పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ లభ్యమైంది. కూంబింగ్కు వెళ్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకునే ఈ డంప్ ఇక్కడ పెట్టారని పోలీసు అధికారులు ప్రకటించడం గమనార్హం. సీతంపేటలో వాలీబాల్ టోర్నమెంట్కు హాజరయ్యేందుకు ఎస్పీ అమ్మిరెడ్డి వచ్చిన తరుణంలో కూంబింగ్కు వెళ్లిన సాయుధ బలగాలకు డంప్ దొరకడంతో మావోల ఉనికిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. గతంలోనూ ఇదే ఏజెన్సీలోని తివ్వాకొండ పరిసరాల్లో మావోల డంప్లు దొరికాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే మాటిమాటికీ డంప్లు దొరుకుతున్నా యి. తివ్వాకొండలను మావోయిస్టులు తమ సేఫ్టీ జోన్గా భావిస్తారు. పోలీసులకూ ఈ సమాచారం ఉంది. ఈ విషయాన్ని బలపరుస్తూ ఈ కొండ చుట్టూనే డంప్లు పలుమార్లు లభ్యమయ్యాయి. డంప్ లభ్యం సీతంపేట మండలం దోనుబాయి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉంచిన డంప్ను పోలీసులు గుర్తించినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. దోనుబాయి పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా డంప్ లభించినట్లు వివరించారు. వాటిలో ఆరు ల్యాండ్మైన్లు ఉన్నట్లు గుర్తించామని, సాంకేతిక నిపుణుల సాయంతో నిర్వీర్యం చేసి బయటకు తీశామని తెలిపారు. ల్యాండ్మైన్స్తో పాటు ఆరు డిటోనేటర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఓ నాటు తుపాకీ, టార్చిలైట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన నాటు తుపాకీ పనిచేసే స్థితిలో ఉండడాన్ని చూస్తే ఏడెనిమిదేళ్ల కిందట ఈ డంప్ను భూమిలో పాతిపెట్టి ఉండవచ్చని ఎస్పీ అభిప్రాయపడ్డారు. వీటిని గుర్తించిన సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు కృష్ణవర్మ, శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రివార్డుల ప్రకటనతో.. కొన్నేళ్లుగా ఏఓబీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. హింసాత్మక ఘటనలు జరగలేదు. అయితే ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దులోనే పోలీసు ఇన్ఫార్మర్లనే నెపంతో గిరిజనులను హతమార్చిన ఘటనలు వెలుగు చూశాయి. అంతలోనే పోలీసులు కూంబింగ్ నిర్వహించడం, వారికి డంప్ దొరకడంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలపై అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల భామినిలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని నేరుగా నిషేధిత మావోయిస్టుల వివరాలను ప్రకటించారు. వారిని పట్టిస్తే రివార్డులు కూడా అందిస్తామని చెప్పారు. మావోల కదలికలపై అంతర్గతంగా ఇంటెలిజెన్స్ ఇచ్చిన హెచ్చరికలతోనే పోలీసులు వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేశారనే వాదన వినిపిస్తోంది. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ప్రతీకార చర్యలకు దిగడం కూడా మావోలకు ఆనవాయితీ. ఈ తరుణంలోనే పోలీసులకు డంప్ దొరికింది. దీంతో అక్కడక్కడా ఉన్న మావో సానుభూతిపరులపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. -
ఛత్తీస్గఢ్లో ఓయూ విద్యార్థి అరెస్ట్ !
భీమదేవరపల్లి: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్న వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్కు చెందిన ఉగ్గె భరత్ను ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్లో పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో వారు పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా శాతావాహన యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు స్టడీ టూర్ పేరిట ఛత్తీస్ఘడ్కు వెళ్లి మావోయిస్టులను కలిసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టడీ టూర్లో భరత్ సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానించి అతడిపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. భరత్ ఇటీవలే జీవిత ఖైదు అనుభవించి జైలు నుంచి విడుదలైన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి ఉరఫ్ మదన్లాల్ సోదరుడు ఉగ్గె శేఖర్ కుమారుడు కావడం చర్చనీయాంశంగా మారింది. భరత్ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీసులు తీసుకెళ్లారా.. లేక ఛత్తీస్ఘడ్లోనే అరెస్ట్ చేశారా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా పోలీసులు తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని భరత్ తండ్రి శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
మన్యంలో యాక్షన్ టీం?
సాక్షి, మహబూబాబాద్: కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో చాలా రోజుల తరువాత మావోలు వచ్చారనే చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం విస్తరించి ఉండటం, చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతం నుంచి నేరుగా జిల్లాలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో మావోయిస్టు యాక్షన్ టీం వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే యాక్షన్ టీం సభ్యులు మండలాల్లో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలంతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఇక్కడి ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకున్నారని సమాచారం. యాక్షన్ టీంలు వస్తే ఎందుకు వచ్చారు? ఇన్ఫార్మర్లుగా పనిచేసే వారిని గాని, అధికార పార్టీ నాయకులను గానీ టార్గెట్ చేసేందుకు వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. టార్గెట్గా ఉన్న రాజకీయ నాయకులను, ఇన్ఫార్మర్లను కొద్ది రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ఘడ్ నుంచి మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, భద్రన్న, ధర్నన్న తదితరులతో కూడిన యాక్షన్ టీం కొత్తగూడ, గంగారం మండలాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దశలో రెండు రోజులుగా పోలీసులు మావోయిస్టు సానుభూతి పరులు, మద్దతు దారులను, అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు విచారించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోల కదలికలతో కలకలం కొనసాగుతోంది. హరిభూషణ్ వచ్చాడా.. గంగారం మండలంలోని మడగూడ గ్రామానికి చెందిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్ హరిభూషణ్, భద్ర న్న, ధర్మన్నలు వారి యాక్షన్ టీంతో జిల్లాలోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గంగారం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్ర నాయకుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 40మంది మావోలతో కలసి కోమట్లగూడెం, జంగాలపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతానికి వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఈ ప్రాంతంలో స్వగ్రామమైన మడగూడెం వస్తున్నాడని, వచ్చి వెళ్లారని రక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.10సంవత్సరాల క్రితం గ ట్టి నిర్భందం సమయంలో పెద్దఎల్లాపూర్ గ్రామంలో ఒక భూ వివాదాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర కార్యదర్శి హోదాలో 200మంది మావోలతో గ్రా మాన్ని చుట్టుముట్టి హరిభూషణ్ సమస్యపై ప్రజా దర్భార్ నిర్వహించి సంచలనం సృష్టించారు. కేంద్ర కమిటీ నాయకుడిగా ఎదిగిన హరిభూషణ్ కొత్తగూడకు వచ్చే అవకాశాలు తక్కువనే మరో చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ ఎంత వరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ హరిభూషణ్ వస్తే ఎందుకు, ఏ విషయంపై వచ్చాడని, సాధారణంగా అతడు ఈ ప్రాంతానికి రాడు అని సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. కొత్త రిక్రూమెంట్ కోసమేనా..? తెలుగు రాష్ట్రాలలో గతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి నష్టం చేకూర్చాయి. ప్రపంచీకరణంతో పాటు, పోలీసుల నిఘా పెరగటం, తదితర కారణాలతో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు రిక్రూమెంట్ ఆగిపోయింది. దీంతో పార్టీ బలహీనంగా మారి, మావోయిస్టు ప్రభావం తగ్గిపోయింది. ఈ దశలో తిరిగి నూతన రిక్రూట్మెంట్ కోసం మావోయిస్టు యాక్షన్ టీం తిరిగి జిల్లాలోకి ప్రవేశించిందా..? లేకపోతే గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోడు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఖరీఫ్ సాగు ప్రారంభం కావటం, పోడు సాగు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నా రు. ఈ దశలో ఏజెన్సీ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా మావోలు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫారెస్ట్ దాడుల్లో భూములు కోల్పోయిన వారిని దళంలో చేర్చుకుని బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో మావోలు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. ఇదే రిక్రూట్మెంట్కు మంచి సమయం అని మావోయిస్టు యాక్షన్ టీం ఏజెన్సీ గ్రామాల్లోకి ప్రవేశించిందని పోలీసులు భావిస్తున్నారు. డేగ కన్నులతో.. యాక్షన్ టీం జిల్లాలో ప్రవేశించిందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. గతంలో పార్టీలో పనిచేసిన వారు, సానూభూతి పరులను విచారిస్తున్నారు. వారి పై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ దశలో ఏ క్షణంలో ఏమి జరుగునోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణ తనిఖీలు చేస్తున్నాం ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టు యాక్షన్ టీం ప్రవేశించినట్లు ఎటువంటి సమాచారం లేదు. అలాంటివి అన్ని ఊహాగానాలే. నెల రోజులుగా ఏజెన్సీలో సాధారణ తనిఖీలు చేపడుతున్నాం. అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉంటే మీ దగ్గరిలోని పోలీసులకు సమాచారం అందించండి. –నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ -
తెలంగాణకు ఛత్తీస్గఢ్ ‘మావో’లు!
పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఛత్తీస్గఢ్ మావోయిస్టులు వస్తున్నారా..? పోలీసులు మాత్రం వచ్చారనే అంటున్నారు. ఈ మేరకు పలుచోట్ల ఛత్తీస్గఢ్ మావోయిస్టులను పట్టుకుంటే రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఇస్తామని పోస్టర్లు వేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన యాక్షన్ టీంలో ఉన్న భద్రు, లింగు, గంగాబీ, పాండు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారే. వారి కదలికలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఆదివాసీ ప్రాంతానికి చెందిన యువకులకు ధైర్యసాహసాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివారే మావోయిస్టులో చేరుతుంటారు. ప్రస్తుతం ఆదివాసీ తెగకు చెందినవారే మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ఉత్తర తెలంగాణ కార్యకలాపాల విస్తరణ కోసం వచ్చినట్లు భావిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు పోస్టర్ల ప్రచారం ప్రారంభించారు. గతంలో ఇటు నుంచి అటు గతంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అనేక మంది నక్సలైట్లు, మావోయిస్టులపై వివిధ రాష్ట్రాల్లో నగదు రివార్డులు ఉన్నాయి. మన వాళ్లను ఆయ రాష్ట్రాల్లో పట్టుకుంటే రూ.లక్ష నుంచి పాతిక లక్షల మేరకు ఖరీదులు ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టుపార్టీ యాక్షన్ టీం దళం ఒకటి ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి మీదుగా రాష్ట్రంలో ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. దీని కోసం ఆరుగురు సభ్యులతో కూడిన యాక్షన్ టీంను పట్టుకున్న సమాచారం అందించిన ఒక్కొక్కరిపై రూ.5 లక్షల మేర రివార్డును అందిస్తామని పోలీస్ యంత్రాంగం రైల్వేస్టేషన్లు, బస్టాండ్ ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లను అంటించారు. పోలీసులు ప్రకటించిన ఆరుగురు యాక్షన్ టీం సభ్యుల్లో ఐదుగురు మాడవీకాయ అలియాస్ రవి మినహాయిస్తే ఐదుగురు సభ్యులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారే. కోయ, గొత్తికోయల జాతి వారు.. అటవీ ప్రాంతాల్లో ఉండే కోయ, గొత్తికోయ, కొండజాతికి చెందినవారు పెద్దఎత్తున మావోయిస్టుపార్టీలో చేరారు. ఒకనాడు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లినవారే అక్కడంతా నక్సలైట్ల దళాలలో సభ్యుల నుంచి కీలక నాయకుల వరకు పనిచేశారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా దళాలకు ఆదివాసీలే నాయకులుగా కొనసాగుతున్నారు. ఆదివాసీ జాతుల్లో సాహసమైన జాతీయులు గొత్తికోయలు. దాడుల్లో ధైర్యాన్ని ప్రదర్శించే గొత్తి కోయలు ప్రస్తుతం ఈ ప్రాంతానికి వచ్చినట్లు అనుమానిస్తున్న ఐదుగురు యాక్షన్ టీం సభ్యుల్లో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. వారిలో కురుసం మంగు అలియాస్ భద్రు బీజాపూర్ జిల్లా, లింగ్ అలియాస్ రాజేశ్, మడకంగూడ కుంట తాలూకా. కోవాసి గంగాధి సుకుమ జిల్లా మంగతూది ఛత్తీస్గఢ్, పాండు మంగులుది బీజాపూర్ జిల్లా.. ప్రస్తుతం సుకుమ బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ రిక్రూట్మెంట్ అయిన వారిని తెలంగాణ ప్రాంతానికి పంపించేందుకు ముందుగా కురుసం మంగు నాయకత్వంలో వ్యూహాత్మకంగా ఓ దళాన్ని మావోయిస్టు పార్టీ ఈ ప్రాంతానికి నియమించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూనే నాయకులకు అదనపు భద్రత కల్పిస్తున్నారు. -
మావోయిస్టులకు సహకరిస్తున్న హోంగార్డులు
సాక్షి, తూర్పు గోదావరి: సీలేరు జెన్కోలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. కిలో బాబురావు, మరిగల నాగేశ్వరరావు అనే ఇద్దరు హోంగార్డులు గత కొంతకాలంగా మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు మండలంలోని లంకపాకల వద్ద మావోయిస్టులకు కలిసి వస్తుంటే వారిద్దరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరూ మావోయిస్టు నేతలు చలపతిరావు, అరుణకు సహరిస్తున్నట్లు తేలిందని చింతపల్లి ఓఎస్డీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇది పోలింగ్ బూతే
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టతరమైన పని. అందులోనూ అత్యంత వెనుకబడిన, కనీస రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అతి కష్టం. అలాంటి కోవలోదే జార్ఖండ్లోని హజారీబాగ్. హజారీబాగ్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో ఓట్లు వేయించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ముçప్పుతిప్పలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు వారు. అభివృద్ధి వారి గూడేల్లోకి అడుగిడే పరిస్థితులే లేవు సరికదా జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రాబల్యం ప్రబలంగా ఉంది. ఎలాగైనా పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎన్నికల నిర్వాహకులు. కొండకోనల్లో ఉండే గిరిజనులను రప్పించేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు. గతంలో స్థానిక ఆదివాసీ ప్రజల్లో అత్యధిక మంది రైలు ఎక్కడం కాదు కనీసం చూడను కూడా చూసి ఉండర ని తెలిసుకున్నారు. అంతే రైలు బోగీ ఆకారంలో పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసి, దానికి 140 నంబర్ ఇచ్చారు. దానికి తోడు రైలు బూత్ గురించి గిరిజన గూడేల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఊహించినట్టుగానే నిజమైన రైలుని చూడని ఆదివాసీలు రైలు బూత్ని చూడ్డం కోసం వచ్చి, ఎంచక్కా రైలెక్కి తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిపోయారు. టికెట్టు లేకుండా రైలెక్కినట్టూ అయ్యింది. అధికారులకు ఆశించిన ఓటుని వినియోగించుకోవడమూ జరిగింది. బూత్నంబర్ 140 జార్ఖండ్లోని హజారీబాగ్ నియోజకవర్గం పరిధిలోని రామ్గఢ్ బ్లాక్లోనిది. -
గడ్చిరోలి–హెలికాప్టర్ పైలెట్లకు ప్రత్యేక శిక్షణ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజు తీవ్ర రూపం దాలుస్తున్న మావోయిస్టుల కార్యకలాపాలకు చమరగీతం పాడేందుకు ఫ్రెంచ్ తయారి ‘హెచ్–145’ అత్య«ధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా ఈ అత్య«ధునిక హెలికాప్టర్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ విమానయాన డైరెక్టర్కు చెందిన ముగ్గురు సీనియర్ పైలెట్లను శిక్షణ నిమిత్తం జర్మనీకి పంపించనుంది. జర్మనీలోని డోనవర్థ్–మాన్చింగ్లో ఈ ముగ్గురు పైలెట్లకు 75 రోజుల పాటు కఠోర శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా నక్సలైట్ల ప్రాబల్యమున్న అలాగే అటవి ప్రాంతాల్లో హెలికాప్టర్ను ఎలా నడపాలనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కేవలం శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.7.30 లక్షలు ఖర్చు చేయనుంది. శిక్షణ కోసం విదేశాలకు వెళ్లే ముగ్గురిలో చీఫ్ పైలెట్ క్యాప్టన్ సంజయ్ కర్వే, సీనియర్ పైలెట్ క్యాప్టన్ మహేంద్ర దల్వీ, అసిస్టెంటెంట్ పైలెట్ క్యాప్టన్ మోహిత్ శర్మ ఉన్నారు. వీరంత జూన్ ఐదో తేదీన జర్మనికి బయలుదేరుతారు. అక్కడ 75 రోజులపాటు కఠోర శిక్షణ తీసుకున్న తరువాత ఆగస్టు 14వ తేదీ తరువాత తిరిగి స్వరాష్ట్రానికి చేరుకుంటారు. కేవలం అత్యధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయగానే సరిపోదు. దాన్ని నడిపే సత్తా ఉండాలనే ఉద్ధేశ్యంతో ముగ్గురు పైలెట్లను ఎంపిక చేసి శిక్షణ కోసం జర్మనీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నక్సలైట్ల కార్యకలాపాలను అంతమొందించేందుకు చేపట్టే గాలింపు చర్యల పనుల కోసం గత ఎనిమిదేళ్లుగా పవన్ హంస్ కంపెనీకి చెందిన హెలికాప్టర్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.25 కోట్లు చెల్లిస్తుంది. దీంతో సొంతంగా ఒక అత్యధునిక హెచ్–145 మోడల్ హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎయిర్ బస్ హెలికాప్టర్ కంపెనీ నుంచి రూ.72.43 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఇందులో ఇద్దరు పైలెట్లు, పది మంది ప్రయాణించే సామర్ధ్యం ఉంటుంది. మావోలను ఏరివేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు సాయం అందించేందుకు కూడా దీన్ని వినియోగించవచ్చు. అందుకు ప్రధాన కారణం ఇందులో స్ట్రేచర్తోపాటు బాధితులకు అందజేసే రకరకాల మందులు, ఇతర వైద్య సామాగ్రి నిల్వచేసే సౌకర్యం ఉంది. గగనతలం నుంచి దృష్టి సారించేందుకు రాష్ట్రంలో నక్సలైట్ల కార్యకలాపాలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన దాడిని బట్టి మావోలు క్రియశీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దాడులకు, పోలీసును అంతమొందించేందుకు కొత్త కొత్త విధానాలను ఎంచుకుంటున్నారు. కారడవిలో దట్టమైన చెట్ల మధ్య మావోలను గుర్తించాలంటే పోలీసులకు దారి లభించదు. ఇలాంటి సందర్భంలో గగనతలంలోంచి దృష్టి సారించడానికి ఈ హెలికాప్టర్ ఎంతో దోహదపడనుంది. -
మావోయిస్టు దళ సభ్యురాలి అరెస్టు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పోలీసులు సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన, మావోయిస్టు అనుబంధ సంఘాలలో పని చేస్తున్న ఆత్మకూరు అనూషను పెదబయలు పోలీస్ స్టేషన్ కేసులలో అరెస్టు చేశారు. ఈ మేరకు పాడేరు డీఎస్పీ పి.బి.రాజ్కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు. పాత కేసులలో అరెస్టు కాబడి ఈరోజు బెయిల్పై విశాఖపట్నం సెంట్రల్ జైలు నుండి విడుదలకాగా, పాడేరు పోలీసులు ఇతర కేసుల నిమిత్తం అరెస్టు చేసి స్పెషల్ ఏజేఎఫ్సీఎం కోర్టుకు తరలించగా ఈనెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఆత్మకూరు అనూష(24) తండ్రి రమణయ్య చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తూ , సీపీఐ మావోయిస్టు పార్టీలో దళ మెంబర్గా కొనసాగుతోంది. ఈమెకు పెదబయలుపోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులతో సంబంధం ఉన్నట్టు విచారణలో తేలినందున అరెస్టు చేసినట్టు సమాచారం. గత ఏడాది ఏప్రి ల్ నెలలో ఈమె సీపీఐ మావోయిస్టులు అక్కిరాజు హరగోపాల్,ఉదయ్, చలపతి మరికొంత మంది మావోయిస్టు సభ్యులు గ్రామంలో స్థానిక గిరిజనులుతో బెదిరించి బలవంతంగా ప్రజాకోర్టు నిర్వహించారు. అలాగే జుండాం అటవీ ప్రాంతంలో పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో మందుపాత్రలు అమర్చిన సంఘటనలో మావోయిస్టులతో కలిసిప్రత్యక్షంగా పాల్గొంది. -
ఈ మల్లన్న.. ఎవరన్నా?
సాక్షి, హైదరాబాద్: అది రాజీవ్ రహదారి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన మార్గం. సిద్దిపేట జిల్లాకు అత్యంత దగ్గరగా ఉన్న ఓ మండల అధికారి కారులో తన ఆఫీస్ నుంచి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లగానే నలుగురు వ్యక్తులు కారు ఆపారు. లిఫ్ట్ కావాలని కారెక్కారు. వారిలో ఓ వ్యక్తి.. మల్లన్న మిమ్మల్ని తీసుకురమ్మన్నాడని చెప్పాడు. దీంతో మల్లన్న ఎవరు.. ఎక్కడుంటాడు.. అసలు ఆయనెవరో చెప్పాలని ఆ అధికారి పేర్కొన్నారు. అవన్నీ తర్వాత చెప్తామని, ముందు తాము చెప్పినట్లు వెళ్లాలని గట్టిగా చెప్పారు. ఓ 20 కిలోమీటర్లు వెళ్లగానే ఓ వ్యక్తికి ఫోన్ వచ్చింది. మల్లన్న బిజీగా ఉన్నాడు.. ఆ కారు దిగి వచ్చేయండి అని ఫోన్లో వ్యక్తి చెప్పడంతో కారు దిగి వెళ్లిపోయారు. ఇదంతా మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. ఇప్పటికీ ఆ అధికారి షాక్లోనే ఉన్నాడు. అక్కడి నుంచి ఆఫీస్కు వెళ్లిపోయాడు. సాయంత్రం సినిమా చూపించారు.. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. విధులు ముగించుకొని సంబంధిత అధికారి కారులో ఇంటికి చేరుకున్నాడు. అక్కడే అధికారికి షాక్ తగిలింది. తనతో మధ్యాహ్నం మల్లన్న విషయం చెప్పిన నలుగురు ఆ అధికారి ఇంటి వద్ద ఉన్నారు. వారిలో ఒకరు గేటు వద్ద కాపలా ఉండగా, మిగిలిన వారు అధికారి ఇంట్లో కూర్చున్నారు. అధికారి ఇంట్లోకి వెళ్లగానే ‘మల్లన్న రూ.10 లక్షలు ఇవ్వమన్నాడు. త్వరగా డబ్బులిస్తే వెళ్లిపోతాం’అని సంబంధిత వ్యక్తులన్నారు. ‘అసలు మల్లన్న ఎవరు? నేనెందుకు డబ్బులివ్వాలి? ఎవరు మీరు అని’ అధికారి ఎదురు ప్రశ్నించాడు. దీంతో వారు అధికారి తలపై గన్ పెట్టి డబ్బులు ఇవ్వకపోతే అధికారితో పాటు ఆయన భార్యను కూడా చంపేస్తామని బెదిరించారు. తమది మల్లన్న మిలిటెంట్ దళం అని, డబ్బులివ్వకపోతే ప్రాణాలు పోతాయని బెదిరించడంతో అంత డబ్బు లేదని, రూ.50 వేలు ఉన్నాయని అధికారి చెప్పారు. ఆ డబ్బు తీసుకుని మిగిలిన మొత్తంపై అన్నతో మాట్లాడి చెప్తామని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అధికారి ఎక్కడా చెప్పలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.. చేస్తే ఎక్కడ తన కుటుంబాన్ని టార్గెట్ చేసి చంపుతారేమోనని భయపడ్డారు. తెల్లారే కాంట్రాక్టర్ను.. ఆ మరుసటి రోజే మెదక్ జిల్లాలో రోడ్ల నిర్మాణం చేస్తున్న ఓ బడా కాంట్రాక్టర్కు మల్లన్న మిలిటెంట్ దళం అంటూ ఫోన్ చేసి బెదిరించారు. రేపు వస్తామని, రూ.10 లక్షలు రెడీ చేసుకోవాలని, లేకపోతే చంపేస్తామంటూ హెచ్చరించారు. సదరు వ్యక్తుల నంబర్లను తెలిసిన పోలీస్ అధి కారి ద్వారా కాంట్రా క్టర్ ఆరా తీయించాడు. దీంతో ఈ వ్యక్తులతో పాటు ఓ మండల ఎంపీపీ, అతడి అనుచరుడిగా ఉన్న ఓ ఎంపీటీసీ భర్త నంబర్లు ఉండటం సంచలనం రేపుతోంది. టీఆర్ఎస్లో ఉన్న ఈ ఎంపీపీకి, ఎంపీటీసీ భర్తకు, మల్లన్న మిలిటెంట్ గ్యాంగ్కు సంబంధం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. అతడి నేతృత్వంలోనే దళం.. ప్రస్తుతం సిద్దిపేట, మెదక్ ఈ రెండు జిల్లాల్లో మావోయిస్టు ప్రాబల్యమే లేదు. పాత జనశక్తి దళాల్లో ఉన్న ఎవరూ కూడా యాక్టివ్ లో లేరు. అలాంటప్పుడు ఈ దళం ఎక్కడినుంచి వచ్చిందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎంపీపీకి గతంలో నకిలీ నోట్ల చెలామణి చేసిన వ్యక్తి, పోలీసులపై కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చిన నిందితుడికి సంబంధం ఉండటం అనుమానాలకు తావిస్తోంది. శామీర్పేట పరిసరాల్లో నకిలీ నోట్లు చెలామణి చేస్తూ దొరికినప్పుడు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తే ఈ దళానికి నాయకత్వం వహిస్తున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా వైఫల్యం.. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో తుపాకులతో సంచరిస్తూ దళాల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నా అక్కడి పోలీసులకు ఈ విషయం తెలియకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో నయీం లాంటి వ్యక్తి దళాల పేరుతో సంచరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బెదిరింపులకు గురైన కాంట్రాక్టర్ నేరుగా డీజీపీ లేదా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులను కలసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల పోలీసులపై నమ్మకం లేదన్న ఉద్దేశంతోనే ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. పైగా ఆ దళం ఇన్చార్జి ఓ జాతీయ పార్టీ నేతతో తిరుగుతుండటం సంచలనం రేపుతోంది. గతంలో ఇద్దరు పోలీసులను తుపాకీతో హతమార్చిన వ్యవహారంలోనూ ఇదే నేత సహాయం చేసి బయటపడేలా చేసినట్లు ఆరోపణలున్నాయి. -
మావో వేడుకలపై చైనా ఉక్కుపాదం
బీజింగ్: స్వతంత్ర చైనా తొలి చైర్మన్ మావో జెండాంగ్ 125వ జయంతి వేడుకలపై షీ జిన్పింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మావో జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైన పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థి, వర్సిటీ మార్క్సిస్ట్ సొసైటీ చీఫ్ క్వీ హంక్సువాన్ను అరెస్ట్ చేసింది. పెకింగ్ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్దకు సాధారణ దుస్తుల్లో వచ్చిన 8మంది పోలీసులు నల్లటికారులో క్వీని బలవంతంగా ఎక్కించారు. ఈ సందర్భంగా అతను ‘నేను క్వీ హాంక్సువాన్ను. నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు’ అని అధికారులతో పెనుగులాడాడు. చైనాలో 1989లో తియానన్మెన్ కూడలిలో ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ఉద్యమంలో పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. అయితే కొన్నేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్పింగ్, చైనా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు, వాటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. తాజాగా క్వీ అరెస్టుపై చైనా ప్రభుత్వం, పెకింగ్ విశ్వవిద్యాలయం ఇంకా స్పందించలేదు. -
అర్బన్ అలజడి
సాక్షి,సిటీబ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో చాలా ఏళ్ల తర్వాత ‘మావోయిస్టు’ జాడలు కలకలం రేపుతున్నాయి. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న మావోయిస్టు సంబంధాల నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. కొన్నేళ్లుగా తెలంగాణలో నిషేధిత మావోయిస్టుల కార్యకలాపాలేవీ లేనప్పటికీ.. నగర శివార్లను షెల్టర్ జోన్గా ఉపయోగిస్తూ దేశంలో వివిధ ప్రాంతాల్లో హింసకు కుట్ర పన్నుతున్నారన్న కారణాలతో ఎన్జీఆర్ఐలో పనిచేస్తున్న నక్కా వెంకట్రావుతో పాటు మౌలాలీ హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న ఆత్మకూరి భవాని, అన్నపూర్ణ, అనూషలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మౌలాలీ హౌసింగ్ బోర్డులో ఉంటూ తెలంగాణ ప్రజాఫ్రంట్, కుల నిర్మూలన సమితిలో పనిచేస్తున్న ఆత్మకూరి రమణయ్య దంపతుల కూతుళ్లు భవాని (అమవీరుల బంధుమిత్రుల కమిటీ), అన్నపూర్ణ (చైతన్య మహిళా సంఘం), అనూష(చైతన్య మహిళా సంఘం) ఆయా సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో అనూష 2017 డిసెంబర్ నుంచి విశాఖ ‘మావో’ దళసభ్యురాలిగా నియమితమై పలుమార్లు ప్రాంతాల్లో కాల్పులతో పాటు, మందుపాతరలను పేల్చిన ఘటనల్లో పాల్గొన్నట్లు విశాఖ పోలీసులు అభియోగం మోపారు. చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్న అన్నపూర్ణ గాలికొండ దళంతో టచ్లో ఉన్నారని, భవాని తెలంగాణ, ఏపీ అమరవీరుల బంధుమిత్రుల కమిటీ జాయింట్ సెక్రటరీగా పలు విధ్వంస కార్యక్రమాలకు రెక్కీ నిర్వహించారన్నది అభియోగం. ఇదిలా ఉంటే భవాని, అన్నపూర్ణలు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రజాచైతన్య యాత్రలు నిర్వహించారు. ఏపీ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరోకు చిక్కిన మావోయిస్టు కామేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు అనూష ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోలీసులకు చిక్కారు. ఆమెతో పాటు ఆమె ఇద్దరు అక్కలను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే నగర శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటూ వివిధ సంఘాల పేరుతో పనిచేస్తున్న విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలపై మరింత నిఘా పెంచే యోచనలో నగర పోలీసులు ఉన్నారు. నగరంలో విధ్వంసకర కార్యకలాపాలేవీ చేయకున్నా నిషేధిత సంస్థల ప్రతినిధులు నగరాన్ని షెల్డర్ జోన్గా వాడుకోవడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. హక్కుల సంఘాల ఖండన పౌర హక్కులను, ప్రజా సంఘాలను అణిచివేసే క్రమంలోనే విప్లవ రచయిత వరవరావు మొదలుకుని, నక్కా వెంకట్రావు, తాజాగా మౌలాలిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారని పౌరహక్కుల సంఘం పేర్కొంది. ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దారుణమని అరెస్ట్ అయినవారి తండ్రి ఆత్మకూరి రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
ఛత్తీస్గఢ్లో హైదరాబాద్ వాసి అరెస్టు
-
ఛత్తీస్గఢ్లో హైదరాబాద్ వాసి అరెస్టు
రాయ్పూర్ : మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా నక్కా వెంకట్రావు అనే వ్యక్తిని ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వాసి అయిన వెంకట్రావు అర్బన్ నక్సలిజం వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడని... అతడిని అరెస్టు చేయడం ద్వారా అర్బన్ నక్సల్స్ నెట్వర్క్ను బ్రేక్ చేశామని ఛత్తీస్గఢ్ ఐజీ ఎస్పీ సింగ్ తెలిపారు. ఎన్జీఆర్ఐలో ఉద్యోగం చేస్తున్న నక్కా వెంకట్రావు 2016, 2017లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం అయినట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు నక్కా పనిచేశాడని ఐజీ వెల్లడించారు. కాగా వెంకట్రావు సోదరుడు పౌరహక్కుల సంఘం కార్యకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం. -
ప్రశాంతంగా ఓటు వేయండి...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్నికల నోడల్ అధికారి, శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ స్పష్టంచేశారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరగనున్న పోలింగుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. మొత్తంగా 6వేల సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు తెలిపారు.సుమారు ఆరు జిల్లాల్లో ఈ తరహా ప్రాంతాలను గుర్తించామని, వీటిలో కొడంగల్ కూడా ఒకటని జితేందర్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ, ఐటీ విభాగం సంయుక్తంగా రూ.125కోట్ల నగదు, ఎక్సైజ్ శాఖతో కలసి 4 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.6 కోట్ల విలువైన ప్లాటినం, బంగారం, వెండి, రూ. 60 లక్షల విలువ గల గంజా యి, రూ.1.6 కోట్ల విలువైన బహుమతులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 90,238 మందిని బైండోవర్ చేయగా, 8,482 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ చేసుకున్నట్టు తెలిపారు. 11,862 నాన్బెయిలబుల్ వారంట్లను అమలు చేసినట్టు తెలిపారు. కోడ్ ఉల్లం ఘన కింద 1,501 కేసులు నమోదు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, ముందస్తుగా సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఛత్తీస్గడ్, మహరాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు వివరించారు. నగదు పట్టుబడ్డ చోట్ల విచారణ జరిపి సంబంధిత నేతలపై కేసులు నమోదు చేసినట్టు జితేందర్ తెలిపారు. ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్రావు, పోటీలో ఉన్న అభ్యర్థులు సర్వే సత్యనారాయణ, మల్లారెడ్డి, జగ్గారెడ్డి, ఆనంద్ప్రసాద్ తదితరులపై సెక్షన్ 171 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్లో పట్టుబడ్డ హవాలా నగదుపై ఐటీ, ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతారని జితేందర్ వెల్లడించారు. ఈ డబ్బు పొందేందుకు యత్నించిన పలువురి నేతలపై కూడా విచారణ జరిపే అవకాశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని నేతలు హైదరాబాద్లో ఉండాల్సి వస్తే సంబంధిత ప్రాంతంలోని రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. నిబంధనలు ఉల్లంఘించి వివిధ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ అధికారులపై పలు పార్టీలు, అభ్యర్థులు చేసిన ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నామని, రెండు కేసుల్లో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు జితేందర్ స్పష్టంచేశారు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల బ్యానర్లను తగులబెట్టి..
సాక్షి, కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకాలోని తాడుగుడ, పెండ్రీ గ్రామాల్లో మావోయిస్టుల ఎరుపురంగు బ్యానర్లు వెలిశాయి. ఆదివారం తెల్లవారు జామున మావోయిస్టులు ఆయా గ్రామాల్లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆ ఎరుపురంగు బ్యానర్లలో తెలిపారు. దీంతో స్థానికులు తమ గ్రామాలకు మావోయిస్టులు రావద్దని, అభివృద్ధి నిరోధకులని ఆ బ్యానర్లను స్థానికులు తీసు నాలుగు కూడళ్ల వద్ద నిప్పంటించి తగులబెట్టారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా గ్రామాల్లో పోలీసులు కూంబింగ్ తీవ్రం చేశారు. కాగా శనివారం ఏటపల్లి తాలూకా గట్టపల్లి అడవుల్లో రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో అక్కడి 10 జేసీబీలు, 5 ట్రాక్టర్లను మావోయిస్టులు కాల్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మావోయిస్టులు మెరుపుదాడులకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే యాక్షన్ టీంలు సంచిరిస్తున్నట్లు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని గోదావరి సరిహద్దుల్లో పోలీసులు నిఘాను తీవ్రం చేశారు. -
దిగ్విజయ్ సింగ్ను ప్రశ్నించనున్న పూణే పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ : అర్బన్ నక్సల్స్ కేసుకు సంబంధించి పూణే పోలీసులు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ను ప్రశ్నించనున్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో స్నేహితుడి నెంబర్గా పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్కు చెందినదిగా పోలీసుల విచారణలో వెల్లడైందని డీసీపీ సుహాస్ బావ్చే చెప్పారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, దీనిపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ను ప్రశ్నించే అవకాశం ఉందని పూణే పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త నిరసనలకు సహకరించేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖంగా ఉన్నారని కామ్రేడ్ సురేంద్రకు కామ్రేడ్ ప్రకాష్ రాసినట్టుగా చెబుతున్నఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల అరెస్ట్ అయిన కార్యకర్తలకు మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆధారాల కోసం పూణే పోలీసులు ఈ లేఖను కోర్టులో సమర్పించారు. కాగా లేఖలో పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్దేననే వార్తల నేపథ్యంలో దీంతో తనకెలాంటి సంబంధం లేదని దిగ్విజయ్ తోసిపుచ్చారు. -
మన్యంలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
తూర్పుగోదావరి, వై.రామవరం: మన్యంలో(ఏఓబీలో) మరలా మావోయిస్టు పోస్టర్ల కలకలం చెలరేగింది. గతనెల 12న వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ, పలకజీడి గ్రామంలో సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఒక హెచ్చరిక పోస్టరు వెలసిన విషయం విదితమే. అయితే తిరిగి శుక్రవారం అదే గ్రామ శివారులో సీపీఐ(మావోయిస్టు) ఎంకేవీబీ డివిజన్ కమిటీ పేరున కొన్ని డిమాండ్లతో కూడిన పోస్టర్లు చింతచెట్లకు అతికించి దర్శనమిచ్చాయి. శుక్రవారం ఆ గ్రామంలో వారపు సంత కావడంతో, వాటిని చూసిన సంత నిర్వాహకులైన వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. గతనెలలో, ఈనెలలో రెండుసార్లు కూడా వారపు సంత రోజు శుక్రవారమే పోస్టర్లు దర్శనమివ్వడంతో వారపుసంత నిర్వహించే వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. చింత చెట్టుకు అతికించిన ఆ పోస్టర్ల ద్వా్డరా బాక్సైటు తవ్వకాలు, కాఫీతోటల సమస్యలు తదితర డిమాండ్లను ప్రభుత్వానికి అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 ఎన్నికల హామీలతో ప్రజలను అనేక విధాలుగా మోసగించాయని దుయ్యబట్టారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న సీఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ అదనపు బలగాల పోలీసులకు, స్టేషన్ సిబ్బందికి అడ్డతీగల సీఐ ఎ.మురళీ కృష్ణ సూచించారు. మండల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయన్న సమాచారం అందగానే శుక్రవారం ఉదయం సీఐమురళీకృష్ణ స్థానిక పోలీసుస్టేషన్కు చేరుకుని, సిబ్బందిని అప్రమతం చేశారు. స్టేషన్ భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయన్న సమాచారం మేరకు, అనుమానాస్పద ప్రదేశాల్లో, ప్రధాన రహదారిలో వచ్చిపోయే వాహనాలను సీఆర్పీఎఫ్ పోలీసుల సహాయంతో విస్తృతంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం మండల లోతట్టు గ్రామాలను సందర్శించి, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ క్లారెన్స్, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీస్ శాఖలో కలవరం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పోలీస్ ఉన్నతాధికారుల్లో ఒత్తిడి పెరుగుతోంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న టెన్షన్ మొదలైంది. ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ముగిశాక ఇక్కడ పోలింగ్ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. పలుచోట్ల మావోయిస్టుల పోస్టర్లు, హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మంలో ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు మావోలు కుట్రపన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటికితోడు సోమవారం ఛత్తీస్గఢ్లో జరిగిన తొలిదఫా ఎన్నికల అనంతరం మావోయిస్టు యాక్షన్ దళాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి చేరుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లోని భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం తదితర ప్రాంతాల్లో పోలీస్ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. బయటకు విషయం పొక్కనీయకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. ప్రవేశించడం సులభమా? ఛత్తీస్గఢ్లో చెదురుమదురు ఘటనలకు పాల్పడ్డ మావోయిస్టు పార్టీ తెలంగాణవైపు వచ్చేందుకు యత్నించినా నియంత్రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీనియర్ ఐపీఎస్ ఒకరు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో సంచరించే డివిజన్ కమిటీకి చెందిన యాక్షన్ దళాలే తిరుగుతున్నట్లు సమాచారం ఉందని ఎస్ఐబీ చెప్తోంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో అన్ని డివిజన్ కమిటీల యాక్షన్ బృందాల కార్యకలాపాలు విస్తృతం చేయాలని నిర్ణయించారని, అందులో భాగంగానే గుర్తింపు కోసం శబరి కమిటీ, మంచిర్యాల కమిటీ ప్రయత్నాలు చేస్తున్నాయని ఎస్ఐబీ తెలిపింది. సమాచారం ఇవ్వకుండా వెళ్లొద్దు... మావో ప్రాభల్య నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లవద్దని నేతలకు ఆయా జిల్లాల ఎస్పీలు సూచించినట్లు తెలిసింది. ఒకవేళ వెళ్లాల్సివస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. -
ముగిసిన పోలింగ్; ఇద్దరు మావోయిస్టుల మృతి
రాయ్పూర్ : కట్టుదిట్టమైన భద్రత నడుమ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా ఈసారి 70 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. సురక్షిత ఓటింగ్ కోసం భద్రతా దళాలను భారీగా రంగంలోకి దించటంతో పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇక తొంభై నియోజక వర్గాలున్న ఛత్తీస్గడ్ రాష్ట్రంలో రాజ్నంద్గాం, కొండగాం, కాంకేర్, బస్తర్, నారాయణ్పూర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో ఈరోజు తొలిదశ పోలింగ్ జరిగింది. వీటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగియగా, మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మిగిలిన 72 నియోజక వర్గాల్లో ఈనెల 20(నవంబరు)న పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబరు 11న వెలువడనున్నాయి. కాగా పోలింగ్ సమయంలో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్ ట్రాకర్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి తోంక్ పాల్ చింతల్నార్ నుండి ఎలక్షన్ డ్యూటీ ముగించుకుని వస్తున్న భద్రతాదళాల మీద మావోయిస్టుల కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరి మృతదేహాలను భద్రత దళాలు స్వాధీన పరుచుకున్నాయి. కాగా ఈ సమయంలో భద్రతా దళాలతో పాటు, డ్యూటీ ముగించుకుని వస్తున్న ఎలక్షన్ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఛత్తీస్గఢ్లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్
-
ఛత్తీస్గఢ్లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దక్షిణ ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గాం, కొండగాం, కాంకేర్, బస్తర్, నారాయణ్పూర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతుంది. వాటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్ వేళల్లో మార్పులు చేశారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మిగత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా నేపథ్యంలో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. అధికారులు లక్ష మంది భద్రత సిబ్బందితో పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్ ట్రాకర్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రజాప్రతినిధులే టార్గెట్..!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ మావోయిస్టు హెచ్చరికలు పోలీస్ శాఖను కలవరంలో పడేసేలా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ వచ్చిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు తాజాగా ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ లేఖ విడుదల చేయడం సంచలనానికి తెరదీసింది. గురువారం ఉదయం బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేయడం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయనడానికి నిదర్శనమని అంటున్నారు. కదలికలు నిజమేనా? ఇన్నాళ్లూ మావోయిస్టు పార్టీ తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోనే కార్యకలాపాలను సాగిస్తూ వస్తోంది. అయితే కొద్దిరోజుల నుంచి వాజేడు వెంకటాపురం, భద్రాచలం పరిసరాలతో పాటు భూపాలపల్లి, మంథనిలో డివిజన్ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో మొదటి దఫాలో ఎన్నికలు జరుగుతున్నాయి. వరుసగా 15 రోజుల నుంచి కాల్పులు, ఎదురుకాల్పులతో అటవీ ప్రాంతం రక్తసిక్తమవుతోంది. తీరా ఇప్పుడు తెలంగాణలోనూ పేలుళ్లకు మావోయిస్టు పార్టీ కుట్రపన్ని ఉంటుందా అన్న కోణంలో పోలీస్ ఉన్నతాధికారులు కూంబింగ్ను వేగవంతం చేశారు. వాజేడులో వెలిసిన పోస్టర్ల కింద ల్యాండ్మైన్లు అమర్చడం చూస్తే భారీ స్థాయిలో విధ్వంసానికి పాల్పడేందుకు యత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సమయంలో మావోయిస్టు పార్టీ చర్యలు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని 10 నుంచి 12 నియోజకవర్గాల్లో తీవ్రమైన భయాందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యకలాపాలు మొత్తం రాష్ట్ర కమిటీ కీలక నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ పెద్దగా కార్యకలాపాలు సాగించని డివిజన్ కమిటీలు ఎన్నికల సమయంలో యాక్టివ్ అవడం పోలీసులను ఒత్తిడిలోకి నెడుతోంది. రాష్ట్ర కమిటీ కింద పనిచేస్తున్న శబరి కమిటీ మాత్రమే కొంత యాక్టివ్గా ఉందని భావించిన నిఘా వర్గాలు ఇప్పుడు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇస్తూ ఇచ్చిన లేఖ పోలీస్ అధికారులనే షాక్కు గురిచేసినట్టు తెలిసింది. అయితే ఏడాదిన్నర క్రితం ఆదిలాబాద్ డివిజన్ కార్యదర్శి చార్లెస్ అలియాస్ డేవిడ్ మహారాష్ట్రలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఇతడి స్థానంలో వచ్చిన కొత్త కార్యదర్శి ఇప్పుడు మంచిర్యాల డివిజన్ కమిటీని లీడ్చేయడంతోపాటు దాడులకు కూడా వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు డివిజన్ కమిటీ కార్యకలాపాలు లేవని భావించిన నిఘా వర్గాలు.. ఇప్పుడు విడుదల చేసిన లేఖతో కంగుతిన్నట్టు తెలిసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మావోయిస్టు పార్టీ క్షేత్ర స్థాయిలో రిక్రూట్మెంట్ కూడా చేసే ఆలోచన చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ లేఖపై అనుమానం... మావోయిస్టు పార్టీ మంచిర్యాల డివిజన్ కమిటీ పేరుతో మాజీ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ ఇచ్చిన లేఖపై అటు స్థానిక పోలీసులు, ఇటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) విచారణ సాగిస్తున్నారు. సాధారణంగా మావోయిస్టుల పోస్టర్లు, లేఖలు సిద్ధాంతంతో కూడిన పదాలతో ప్రారంభమవుతాయి, అయితే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ ఇచ్చిన లేఖ వీటికి భిన్నంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని నిఘా అధికారులు స్పష్టంచేశారు. పైగా ఏ4సైజ్ పేపర్పై రాసి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని నిఘా అధికారి ఒకరు స్పష్టం చేశారు. కావాలనే ఎవరైనా రాశారా లేక నిజంగా డివిజన్ కమిటీ నుంచి వచ్చిందా అన్నది రెండురోజుల్లో తెలుస్తుందని వివరించారు. -
మళ్లీ నేనే!
దేశవ్యాప్తంగా బీజేపీ కంచుకోటల్లో ఛత్తీస్గఢ్ ఒకటి. ఏకబిగిన మూడుసార్లు ఇక్కడ సీఎం రమణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీయే అధికారంలో ఉంది. ఒకప్పటి కాంగ్రెస్ అడ్డా అయిన ఛత్తీస్గఢ్పై బీజేపీ పట్టు వెనక రమణ్ పాత్ర కీలకం. ఆ ధీమాతోనే ఆయన కూడా నాలుగోసారీ అధికారాన్ని కైవసం చేసుకుంటామంటున్నారు. జోగి రాక బీజేపీకన్నా కాంగ్రెస్కే ఎక్కువ నష్టమంటున్నారు. నక్సల్స్, కుల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై రమణ్ సింగ్ లెక్కలేంటి? మావోయిస్టులను అణచేస్తాం ‘మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం అప్రజాస్వామికం. ఎన్నికలు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని వినియోగించుకునేలా ప్రభుత్వం.. చర్యలు చేపడుతుంటే మావోయిస్టులు హెచ్చరించడమేంటి. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. ఇప్పుడు బస్తర్ ప్రాంతానికే వారు పరిమితమయ్యారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి నెలకొల్పడమే మా ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి రాగానే ఈ దిశగా మా కార్యాచరణ ప్రారంభిస్తాం. వాస్తవానికి గత ఎన్నికల్లోనే (2013)మాకు తీవ్రమైన పోటీ ఉంది. అప్పుడే కాంగ్రెస్ నేతలను నక్సలైట్లు కాల్చి చంపారు. అంతటి సానుభూతిలోనూ మేం విజయం సాధించాం. ఇప్పుడు అంతటి తీవ్రమైన పోటీ పెద్దగా ఎదురవడం లేదు’ జోగి రావడం మంచిదే! ‘అజిత్ జోగి పోటీలో రావడం మంచిదే. జోగి తన సొంతపార్టీతో పోటీ చేయడం ఈ ఎన్నికలను మరింత రసతవత్తరంగా మారుస్తుంది. ఆయన బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో దిగుతుండటం.. బీజేపీ, కాంగ్రెస్లపై దీని ప్రభావం ఉంటుంది. ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇది.. కాంగ్రెస్కే ఎక్కువ నష్టం చేస్తుంది. ఆయన్ను ఇప్పటికీ కాంగ్రెస్ నేతగానే ప్రజలు భావిస్తున్నారు’ గిరిజనులెప్పుడూ మావెంటే.. ‘ఛత్తీస్గఢ్లోని మొత్తం 90 స్థానాల్లో 29 గిరిజనులకు, 10 ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. మిగిలినవి జనరల్ స్థానాలు. గతంలో ఎస్సీ స్థానాల్లో ఎక్కువ మేమే గెలిచాం. గిరిజనులెప్పుడూ బీజేపీతోనే ఉంటారు. ఛత్తీస్గఢ్లో కులసమీకరణాల ప్రభావం పెద్దగా ఉండదు. నేను తటస్థ వాదిని. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలూ నన్ను ఆదరిస్తాయి. అయినా.. అభివృద్ధి అంశంపైనే మేం ఈ సారి ఎన్నికల బరిలో నిలుచున్నాం. ఛత్తీస్గఢ్లో మేమేం చేశామో ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే పదానికి తావే లేదు’ -
మావోయిస్ట్ చీఫ్గా బసవరాజ్
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్ట్ చీఫ్ ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) స్ధానంలో శ్రీకాకుళంకు చెందిన నంబళ్ల కేశవరావు ఎంపికయ్యారు. వయోభారం కారణంగా గణపతి (72)ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైదొలగాలని మావోయిస్ట్ కేంద్ర కమిటీ కోరింది. బసవరాజ్గా పార్టీ వర్గాలు పిలుచుకునే కేశవరావు (63) కేంద్ర మిలిటరీ కమిషన్ సారథిగా వ్యవహరిస్తున్నారు.విద్యార్ధి దశలోనే మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులైన కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పట్టభద్రులు కావడం గమనార్హం. కాగా గణపతి తలపై రూ 49 లక్షల రివార్డు ప్రకటించగా, బసవరాజ్కు పట్టిఇచ్చిన వారికి రూ 36 లక్షల రివార్డును పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మరోవైపు రెండు నెలల కిందటే మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పు చోటుచేసుకుందని తెలంగాణ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అరకులో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యకు బసవరాజు వ్యూహం రూపొందించారని తాము భావిస్తున్నామని తెలిపాయి. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న గణపతి స్ధానంలో చురుకుగా ఉండే యువ నేతను ఎంపిక చేసుకునేందుకు వీలుగా పార్టీ పగ్గాలను వీడాలని గణపతికి కేంద్ర నాయకత్వం స్పష్టం చేయడంతో నాయకత్వ మార్పు జరిగిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సైన్స్, బీఈడీల్లో గ్రాడ్యుయేట్ అయిన భూస్వామ్య రైతు కుటుంబానికి చెందిన గణపతి మూడు దశాబ్ధాలుగా మావోయిస్టు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. -
కిడారి, సోమను అందుకే హతమార్చాం
విశాఖ సిటీ: బహుళ జాతి సంస్థలకు ఏజెంట్లుగా మారి కోట్లాది రూపాయల ఆదివాసీల సహజ సంపదను కొల్లగొడుతున్నందునే ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చామని మావోయిస్టులు ప్రకటించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ(ఏఓబీఎస్జెడ్సీ) లెటర్ హెడ్పై అధికార ప్రతినిధి జగబంధు పేరుతో శుక్రవారం రెండు పేజీల లేఖను విడుదల చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు కూడా లేటరైట్ పేరుతో బాౖక్సైట్ను దోచుకుంటున్నారని, ఆపకపోతే తర్వాతి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కిడారి, సోమ హత్య జరిగిన వారం రోజుల తర్వాత ఆ హత్యల గురించి ఎర్ర సిరా అక్షరాలతో వచ్చిన లేఖ అబద్ధమని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో లేఖ బయటకు వచ్చినా అందులో కిడారి, సోమ హత్యల గురించి మావోలు చెప్పలేదు. తాజాగా విడుదలైన లేఖలో మాత్రం హతమార్చడానికి దారితీసిన పరిస్థి తులు, జరుగుతున్న మోసాల గురించి వివరిస్తూ.. కమిటీ లెటర్హెడ్పై లేఖ రావడంతో విశ్వసనీయత చేకూరింది. లేఖలోని సారాంశం.. వారు ఆదివాసీ ద్రోహులు ‘‘కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు ఆదివాసీ నేతలు కానే కాదు. వారు ద్రోహులు. ప్రజాసేవ ముసుగులో మామూలు స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తారు. క్వారీ యజమానులుగా, అరకు, అనంతగిరి, పాడేరు, విశాఖలో ఆస్తుల్ని, భూముల్ని అక్రమంగా గడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తూ, బాక్సైట్ వెలికితీత కోసం జిందాల్, రస్అల్ఖైమా, అన్రాక్లకు ఏజెంట్లుగా వ్యవహరించి అక్రమంగా డబ్బు వెనకేసు కున్నారు. సివేరి సోమ ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో ఇలాంటి దళారీ పాత్రలు నిర్వహించి నందుకుగాను, చైనా క్లే తీసేందుకు ప్రయత్నించిన సందర్భంలో డుంబ్రిగూడ మండలం కండ్రుం గ్రామాల ప్రజలంతా ఏకమై వెంటపడి తరి మారు. ప్రజాగ్రహానికి గురైనా తన తీరు మార్చు కోకుండా జిందాల్కు ఏజెంటుగా వ్యవహరించ డమే కాకుండా బాౖక్సైట్ విషయంలో ప్రజా వ్యతిరేకిగా వ్యవహరించాడు. సర్వేశ్వరరావు రోజుకో పార్టీని మారుస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా అర్రులు చాచాడు. ఆయన కొన సాగిస్తున్న క్వారీని మూసెయ్యాలనే డిమాండ్తో హుకుంపేట మండలం గూడ గ్రామ ప్రజలు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా అధికార అండతో ఏమాత్రం ఖాతరు చెయ్యలేదు. సొంత పార్టీలోనే వాటికి వ్యతిరేకంగా బహిరంగంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. వీరిద్దరూ మెజార్టీ ప్రజల ఆగ్రహానికి గురైన కార ణంగా ప్రజావ్యతిరేకుల్ని, ద్రోహులను అంతం చెయ్యాలనే నిర్ణయంతోనే తమ పార్టీ పీఎల్జీఏ ఆధ్వర్యంలో తీర్పుని అమలు చేశాము’’ అని జగబంధు లేఖలో స్పష్టం చేశారు. అయ్యన్నా.. మైనింగ్ మానుకో తెలుగుదేశం ప్రభుత్వ అండదండలతో తూర్పు కనుమల్లో అటవీ సంపదను బినామీ పేర్లతోనూ, ఆదివాసీ దళారులుగా పుట్టకొకరు తయారై, క్వారీలు, గనుల్ని తెరుస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని తరలిస్తున్నారనీ, దీని వెనుక మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్లున్నారని తెలిపారు. మన్యం ప్రాంత సంపద అక్రమ తరలింపుని తక్షణమే నిలిపెయ్యా లనీ, లేకపోతే.. జరిగే తీవ్ర పరిణామాలకు తామే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని దళారీలను, ప్రజా వ్యతిరేక నాయకుల్ని జగబంధు హెచ్చరించారు. ఇకనైనా తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ వెలికితీత కోసం జారీ చేసిన జీవో నం.97ని పూర్తిగా రద్దు చెయ్యడమే కాకుండా, అటవీ సంపదని అక్రమంగా దోచుకునే కార్యక్రమాల్ని మానుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. -
ఎలక్షన్.. టెన్షన్!
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు మావోయిస్టు ప్రభావితమైనవి కావడంతో ఆందోళన నెలకొంది. తాజాగా మావోయిస్టులు సోమవారం దంతెవాడ జిల్లాలో ఎన్నికలను బహిష్కరించాలంటూ పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాల పరిధిలోని కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో మావోయిస్టులు జనతన సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో ఈ సరిహద్దు జిల్లాల్లో నిరంతరం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పైగా ఎనిమిది నెలలుగా మావోయిస్టులు, భద్రతా బలగాల మద్య నిత్యం పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న దంతెవాడ, సుక్మా, బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, బస్తర్ జిల్లాల్లో వచ్చే నెల 12న పోలింగ్ జరగనుంది. దేశంలోనే వామపక్ష తీవ్రవాదం అత్యధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ఈ జిల్లాల్లోని 18 నియోజకవర్గాలకు మొదటి విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అరకు ఘటన నేపథ్యంలో నేతల్లో దడ.. గత సెప్టెంబర్ 23న విశాఖపట్నం జిల్లాలో (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు) డుంబ్రిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చిన విషయం విదితమే. కాగా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోజుల తేడాతో ఎన్నికలు జరుగుతుండడంతో మరింత టెన్షన్ నెలకొంది. స్వేచ్ఛగా ప్రచారానికి వెళ్లేందుకు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. సాధారణ రోజుల్లోనే ఈ ప్రాంతాల్లో పరిస్థితి గంభీరంగా ఉంటుంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా, తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లోని 18 నియోజకవర్గాల్లో మాత్రమే మొదటి దశలో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రతిక్షణం ప్రమాదకర పరిస్థితే అనేలా ఉంది. ఛత్తీస్గఢ్లో పరిస్థితి అలా ఉంటే సరిహద్దుకు ఇటువైపు ఉన్న తెలంగాణలోనూ యుద్ధ వాతావరణమే ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో మొత్తం 160 పోలింగ్ బూత్లు ఉండగా, అందులో 51 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో మొత్తం 995 పోలింగ్ బూత్లు ఉండగా, వీటిలో 104 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మరో 179 పోలింగ్ బూత్లు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో, 344 పోలింగ్ బూత్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గాల్లోని బూత్లు అత్యధికం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన రాజకీయ పార్టీల నేతల్లో దడ నెలకొంది. మోహరించిన మరిన్ని బలగాలు మావోయిస్టుల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మరిన్ని బలగాలను మోహరించింది. దీంతో గత కొన్ని నెలలుగా మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎడతెరిపి లేని పోరు నడుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్లో ఉన్న మర్రిగూడెం, గొల్లపల్లి, కిష్టారం, పామేడు పోలీసుస్టేషన్ల పరిధిలో సీఆర్పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని చెలిమెల, కలివేరు, గౌరారం, ఛత్తీస్గఢ్లోని తోగ్గూడెం(బీజాపూర్), పైడిగూడెం, వెలకనగూడెం, పాలోడి, పొట్కపల్లి (సుక్మా)ల్లో క్యాంపులను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మావోయిస్టులపై పోరుకు బలగాలను కదిలిస్తోంది.