మిలిటెంట్ల దాడిలో 11మంది భద్రతా సిబ్బంది మృతి | 8 jawans die as militants attack army camp | Sakshi
Sakshi News home page

మిలిటెంట్ల దాడిలో 11మంది భద్రతా సిబ్బంది మృతి

Published Fri, Dec 5 2014 5:56 PM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

మిలిటెంట్ల దాడిలో 11మంది భద్రతా సిబ్బంది మృతి

మిలిటెంట్ల దాడిలో 11మంది భద్రతా సిబ్బంది మృతి

శ్రీనగర్ : పాక్‌ ఉగ్రవాదులు సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులకు.. భారత సైన్యానికి మధ్య హోరాహోరిగా జరిగిన కాల్పుల్లో  లెఫ్టె నెంట్ కల్నల్ తో సహా ఎనిమిది మంది జవాన్లు మృతిచెందగా, ముగ్గురు పోలీసులు అసువులు బాసారు. బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో  మొత్తం 17 మంది మరణించారు.  ఈ ఘటనలో ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు.

 

తొలుత పోలీసులపై కాల్పులు జరుపుతూ... ఉగ్రవాదులు యూరీ సెక్టార్‌లోని ఓ బంకర్‌లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగి వారిని ప్రతిఘటించారు. బంకర్‌లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూలో రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 9వ తేదీన జరుగనున్న నేపథ్యంలో మిలిటెంట్లు ఈ మారణకాండకు పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement