చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి | 8 Students Killed As Car Rams Tree In Tamil Nadu's Cuddalore | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి

Published Sat, Jan 16 2016 6:12 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి - Sakshi

చెన్నై: తమిళనాడులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కడలూరు సమీపంలోని వానమతిదేవి గ్రామ శివారులో చెట్టును కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు సేలంలోని ఎంఐటీ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.

మృతదేహాలను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థుల మరణంతో వారి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement