tamil nadu
-
TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్
-
10 సీట్లు, మూడు పార్టీలు : విజయ్ మ్యాజిక్ ఫిగర్, ట్విస్టులే ట్విస్టులు!
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. క్షణం క్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 (మెజారిటీ మార్క్) స్థానాలకు 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకే అధినేత విజయ్ సీఎం పీఠం అధిరోహించాలంటే నెంబర్ గేమ్ తప్పనిసరిగా మారింది. 118 మంది శాసనసభ్యుల మద్దతు లేఖలను సమర్పించాల్సిందేనని గవర్నర్ అర్లేకర్ పట్టుబడుతున్న నేపథ్యంలో, ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ పూర్తికాని నేపథ్యంలో ఆ మూడు పార్టీల మద్దతు కీలకంగా మారనుంది.నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎందుకు దానికవసనమైన 'మ్యాజిక్ ఫిగర్' చేరుకోవడానికి మద్దతు కీలకం అనడంలో సందేహం లేదు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆపార్టీలకు విజయ్ లేఖ రాశారు కూడా. విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ చిన్న పార్టీల మద్దతు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే, విజయ్ సునాయాసంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు.విజయ్కు మద్దతిచ్చే అవకాశమున్న 3 కీలక పార్టీలు:విడుతలై చిరుతైగల్ కట్చి (VCK): డిఎంకె (DMK) కూటమిలో ఉన్న VCK కి 2 స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీ అధినేత తొల్ తిరుమావళవన్ ఇప్పటికే గవర్నర్ను కలిసి, విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయ్ పంపిన మద్దతు లేఖపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.సీపీఐ (CPI): ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్నప్పటికీ, టీవీకే (TVK) కి మద్దతు ఇచ్చే విషయంపై వచ్చే 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ పేర్కొన్నారు.సీపీఐ(ఎం): ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని విజయ్ ఇప్పటికే ఈ పార్టీకి అధికారికంగా లేఖ రాశారు. శుక్రవారం జరగబోయే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మరోవైపు గతంలో డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ (5 సీట్లు), ఇప్పుడు విజయ్కు బేషరతుగా మద్దతు ప్రకటించడం టీవీకేకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా చాలా హుందాగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలైన విజయ్ను తాము అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ VCK, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, తాము వారిని అడ్డుకోబోమని డీఎంకే వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్ట్మొత్తం 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ప్రస్తుత బలాబలాలు టీవీకే : 108డీఎంకే : 59, ఏఐడీఎంకే : 47కాంగ్రెస్: 5సీపీఐ(ఎం), సీపీఐ, బీసీకే : తలా 2 స్థానాలుబీజేపీ-1, DMDK: 1 అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం: 1 ట్విస్ట్ ఏంటంటే..ప్రస్తుత ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితుల నడుమ, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడానికి, తమ పార్టీ అధినేత తోల్ తిరుమావలవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని VCK ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్, ప్రధాన ద్రవిడ పార్టీలైన DM, AIADMKలకు విజ్ఞప్తి చేయడం మరో ట్విస్ట్. దీంతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఏ క్షణం, ఏం జరుగుతుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే.ఇదీ చదవండి: సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..! -
విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
-
VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం
-
అలా ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో అవాంతరం ఎదురవుతోంది. మెజారిటీ బలంతో వస్తేనే అందుకు అనుమతిస్తానంటూ గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇవాళైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న టీవీకే ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. బుధవారం లోక్భవన్లో టీవీకే అధినేత విజయ్కు చుక్కెదురైంది. ఆ పార్టీ సమర్పించిన మద్దతుదారుల లిస్ట్పై గవర్నర్ పెదవి విరిచారు. పూర్తి స్థాయి బలం లేదు కదా? అని ప్రశ్నించారు. దీంతో గురువారం ఉదయం మరోసారి లోక్భవన్కు వెళ్లి గవర్నర్తో చర్చలు జరిపారు. 113 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన సంతకాలతో పాటు 20 మంత్రుల జాబితాను సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే.. 113 మందితోనే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారని ఆ సందర్భంలో గవర్నర్ ఆర్లేకర్, టీవీకే అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం చెబుతానని విజయ్ను పంపించేశారు. ఆ వెంటనే సానుకూల ప్రకటన రావొచ్చంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ,లోక్భవన్ నుంచి టీవీకే పార్టీకి ఫోన్కాల్ వెళ్లింది. విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఎలా ఏర్పాటు చేస్తారని.. 118 ఎమ్మెల్యేల మద్దతు సమర్పించాకే సీఎంగా ప్రమాణం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ, సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. విజయ్ పార్టీకి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని.. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, .. ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ట్వీట్ చేశారు. రాజ్యంగబద్ధ హోదాలో ఉన్నవాళ్లు ప్రజా తీర్పును గౌరవించాలని..తమ విధుల్ని సరిగా నిర్వర్తించాలని హితవు పలికారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనని.. లోక్భవన్లో కాదని అన్నారాయన. ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికైనా విజయ్ని ఆహ్వానించాలని ఆయన అన్నారు. మరో నటుడు ప్రకాశ్రాజ్ సైతం విజయ్ మద్దతుగా పోస్ట్ చేశారు. విజయ్కు ప్రజలు పట్టం కట్టారు. బలనిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాల్సిందేనని ట్వీట్ చేశారు.తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ బలం 113కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటునకు మరో ఐదు స్థానాలు అవసరం. ఈ క్రమంలో డీఎంకే కూటమి పార్టీల మద్దతును విజయ్ కోరారు. అయితే అవి విజయ్కు మద్దతు ఇచ్చే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మరోవైపు అన్నాడీఎంకే లేదంటే దాని కూటమిలోని చిన్నపార్టీల తరఫు నుంచైనా విజయ్కు మద్దతు లభిస్తుందేమోనన్న చర్చ తమిళనాట జోరందుకుంది. -
విజయ్కు గవర్నర్ గ్రీన్సిగ్నల్
చెన్నై: తమిళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చారు. విజయ్తో భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అయితే, లోక్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత తన నిర్ణయం చెబుతానని గవర్నర్ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఒకవేళ గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈరోజే విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. గవర్నర్ గ్రీన్సిగ్నల్తో టీవీకే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే లోక్భవన్ వేదికగా గవర్నర్, విజయ్ మధ్య కీలక సమావేశం జరిగింది. 24 గంటల్లో రెండోసారి గవర్నర్ను విజయ్ కలిశారు.40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. వీరి భేటీ సందర్భంగా గవర్నర్కు విజయ్.. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను అందించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని విజయ్ చెప్పారు. 113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించారు. #WATCH | Chennai | TVK Chief Vijay leaves from Lok Bhavan after meeting Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar pic.twitter.com/ygxHkVNi4q— ANI (@ANI) May 7, 2026విజయ్కు అనుమతి ఇవ్వాలి..ఇదిలా ఉండగా.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్ను కోరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా, ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తంచేసింది. -
తమిళ రాజకీయాల్లో పళని బాంబు!
తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విజయ్ టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పచ్చ జెండా ఊపడం లేదు. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు విజయ్ లోక్భవన్లో ఉండగానే అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి అత్యవసరంగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. విజయ్ తర్వాత పళనిస్వామి తమిళనాడు గవర్నర్తో భేటీ కానున్నట్లు సమాచారం. దీంతో విజయ్ టీవీకేకు ఆయన మద్దతు ఇస్తారా? ప్రభుత్వ ఏర్పాటునకు సహకరిస్తారా? లేదంటే మరేదైనా ట్విస్ట్ ఇస్తారా? అనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతుందని ఆ పార్టీ నూతన ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్ స్వయంగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారన్నది ఆ తర్వాత తెర మీదకు వచ్చిన ప్రచారం. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి గెలిచిన ఎమ్మెల్యేలను అత్యవసరంగా చెన్నైకి పిలిపించుకున్నారు. ఆపై టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే నుంచి ఓ ప్రకటన వెలువడింది. కానీ, తెర వెనక మరో వ్యవహారం జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీతో కటీఫ్ చెప్పి.. టీవీకేకు మద్దతు ఇద్దామని అన్నాడీఎంకేలో ఓ వర్గం పళనిస్వామిపై ఒత్తిడి చేస్తోంది. ఈ డిమాండ్తో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో టీవీకేకు మద్దతు ఇచ్చేలా ఓ వర్గం(15 నుంచి 25 దాకా ఉన్నారనే టాక్) ఏర్పాటు అయ్యిందని.. అప్రమత్తమైన పళనిస్వామి వాళ్లను మందలించారని.. మొండిపట్టుతో ఉన్న షణ్ముగం టీం పాండిచ్చేరిలోని ఓ రిసార్ట్కు తరలిపోయిందని.. పళనిస్వామి వర్గం మాత్రం చెన్నైలోనే ఉండిపోయిందని.. ప్రచారం జోరందుకుంది. ఇది అన్నాడీఎంకేలో తిరుగుబాటుకు కారణం అయ్యే అవకాశమూ లేకపోలేదు. ఈ పరిణామాల దృష్ట్యా పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఒకవేళ విజయ్కు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చినా.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ను కోరినా.. డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సంచలన ప్రకటన చేసినా.. ఇలా ఏది జరిగినా అది తమిళ రాజకీయాల్లో పళని పేల్చిన బాంబే కానుంది. -
విజయ్పై కుట్ర: పోసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తమిళనాడు తాజాగా రాజకీయ పరిణామాలపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఈ సందర్బంగా పోసాని మాట్లాడుతూ..‘దళపతి విజయ్ నాకు 1996 నుంచి నాకు తెలుసు. వాళ్ల నాన్నతో కూడా నాకు పరిచయం ఉంది. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదు. అతని చుట్టూ ఎన్ని గొడవలు వున్నా కూడా ఎంతో సంయమనంతో ఉన్నాడు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ని విజయ్ అసలు విమర్శించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని టీవీకే చీఫ్ విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన తమిళనాడు గవర్నర్తో భేటీ కానున్నారు. ఆ సమావేశం అనంతరం కోర్టుకు వెళ్లే యోచనపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తగ్గాయి. దీంతో మిగతా పార్టీల నుంచి మద్దతు కూడగట్టాలని విజయ్ నిర్ణయించారు. ఈలోపు.. బలనిరూపణకు రెండు వారాల గడువు కోరుతూ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావొద్దన్న ఉద్దేశంతో సీఎంగా ప్రమాణం చేయాలని ఆయన భావించారు. ఇదే విషయాన్ని లోక్భవన్కు కబురు పంపగా.. మద్దతుదారుల లిస్ట్తో రావాలని టీవీకేకు గవర్నర్ అర్లేకర్ కబురు పంపారు. దీంతో కాంగ్రెస్ మద్దతుతో కూడిన మొత్తం జాబితాను బుధవారం సాయంత్రం గవర్నర్కు విజయ్ సమర్పించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు సరిపడా బలం లేదని.. కాబట్టి సీఎంగా ప్రమాణం చేయడానికి కుదరదని చెబుతూ విజయ్కు గవర్నర్ షాకిచ్చారు. 118 ఎమ్మెల్యేల మద్దతుతోనే రావాలంటూ స్పష్టం చేశారు. దీంతో టీవీకే వర్గాలు నిరాశకు లోనయ్యాయి. ఇవాళ మరోసారి గవర్నర్తో భేటీ కావాలని విజయ్ నిర్ణయించారు. గతంలో.. సాధారణంగా ఎన్నికల్లో అతిపెద్ద(లార్జెస్ట్) పార్టీలను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడమో.. లేదంటే ఆ పార్టీలు తాము ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడమో భారత రాజకీయాల్లో పరిపాటిగా వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే అవి బల నిరూపణకు వెళ్తుంటాయి. 2013లో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు, ఆప్కు 28 సీట్లు, కాంగ్రెస్కు 8 సీట్లు వచ్చాయి. అయితే మ్యాజిక్ ఫిగర్(36) లేకున్నా.. బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానం అందింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వెనక్కి తగ్గింది. దీంతో ఆప్ కాంగ్రెస్ సహాయంతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018లో కర్ణాటక ఎన్నికల తర్వాత లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. ఆ సమయంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కోర్టు తలుపు తట్టింది. దీంతో కోర్టు త్వరగా బలనిరూపణ జరపాలని గవర్నర్కు సూచింది. చివరకు మెజారిటీ నిరూపించుకోలేక యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. 2017 కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా(17) నిలిచినా అప్పటి గవర్నర్ బీజేపీ(13)ని ఆహ్వానించారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 21. బీజేపీ తన మిత్రపక్షాలతో మెజారిటీ నిరూపించుకుంది ప్రభుత్వం కొనసాగించింది. ఆ సమయంలో కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పుడు విజయ్ టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోవడం లేదు. ముందుగానే బలం చూపించాలనే కోరుతున్నారు. విజయ్ కోరినట్లు రెండు వారాల గడువు ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.కాబట్టి విజయ్ పార్టీ వీలైనంత త్వరగా బలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. లేకుంటే గవర్నర్ మరొకరికి అవకాశం ఇవ్వొచ్చు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతోనూ సంప్రదింపులు జరిపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాబట్టి గవర్నర్ గనుక ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోకపోతే న్యాయస్థానం తలుపు తట్టాలని విజయ్ భావిస్తున్నారు. నేషనల్ లెవల్లోనూ..గతంలో జాతీయ స్థాయిలోనూ ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన జనతా పార్టీకి ఆహ్వానం లభించింది. మోరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. 1989లో జనతా దళ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ టైంలో ఆయనకు బయట నుంచి మద్దతు లభించింది. ఇక 1996లో లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి బలనిరూపణలో విఫలమై 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ (INC) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. యూపీఏ కూటమి ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. -
శ్రీధర్ వేంబు ‘రాష్ట్రపతి’ అస్త్రం.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా..
తమిళనాడు రాజకీయాలు హై-వోల్టేజ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. విజయ్ స్థాపించిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ హైడ్రామా మధ్య ‘జోహో’ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ చేసిన సంచలన డిమాండ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.అంతుచిక్కని మ్యాజిక్ ఫిగర్తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 234 స్థానాలున్న అసెంబ్లీలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, 118 మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీధర్ వేంబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇతర పార్టీల మద్దతుతో అతుకుల బొంతలా ఏర్పడే ప్రభుత్వం అస్థిరంగా ఉండే ప్రమాదం ఉందని, తమిళనాడుకు ఇంతకంటే మెరుగైన, బలమైన పాలన అవసరమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రపతి పాలన.. మళ్లీ ఎన్నికలురాష్ట్రంలో నెలకొన్న ఈ అనిశ్చితికి రాష్ట్రపతి పాలనే సరైన పరిష్కారమని శ్రీధర్ వేంబు సూచించారు. కఠినమైన నిబంధనల నడుమ మళ్లీ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ మళ్లీ ఎన్నికలు జరిగితే విజయ్ సూపర్ మెజారిటీ సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దాన్ని అడ్డుకోవాలనుకుంటే డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి పోరాడాలని, బీజేపీ కూడా ఏ ఒక్క సీటు రాకపోయినా సరే, ఒంటరిగా బరిలోకి దిగి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.సస్పెన్స్లో గవర్నర్ నిర్ణయంమరోవైపు, అధికార పీఠం దక్కించుకునేందుకు టీవీకే ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించగా, వీసీకే, సీపీఐ, సీపీఎం (చెరో 2), పీఎంకే (4 సీట్లు), అన్నాడీఎంకే నేతలతోనూ మంతనాలు జరిపింది. బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసిన విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ చెబుతున్న మద్దతుపై గవర్నర్ ఇంకా పూర్తి నమ్మకంతో లేరని, తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టేందుకు టీవీకేకు మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: సీఎన్ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత -
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
రేపు తమిళనాడులో కాంగ్రెస్ ధర్నా
తమిళనాడు రాజకీయానికి సంబంధించిన అప్డేట్స్.. తమిళనాడు గవర్నర్ను కలిసిన సీఎస్, డీజీపీవిజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని డీజీపీని ప్రశ్నించిన గవర్నర్ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారన్న గవర్నర్రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలుగవర్నర్ తీరుకు నిరసనగారేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నవిజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శలుగవర్నర్ తీరుకు నిరసనగా ఆందోళనకు ధర్నాకు దిగనున్న కాంగ్రెస్ శ్రేణులు రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంటీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు వేగవంతంవామపక్షాలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి టీవీకే నేత నిర్మల్ కుమార్వామ పక్షాలతో చర్చలు జరిపే బాధ్యతల్ని కుమార్కు అప్పగించిన విజయ్ రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంసమావేశం తర్వాతే విజయ్కు మద్దతు అంశంపై క్లారిటీ అప్పటి వరకు కొనసాగనున్న ఉత్కంఠలోక్భవన్ అధికారిక ప్రకటనతమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్భవన్ అధికారిక ప్రకటనగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈ రోజు చెన్నైలో విజయ్ని కలిశారుప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మద్దతు తమిళనాడు శాసనసభలో ఇంకా లభించలేదని స్పష్టంలోక్భవన్ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళనప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శననాది భరోసాటీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ భరోసా ప్రభుత్వ ఏర్పాటు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని హామీ తగిన మెజారిటీతో రావాలని సూచన 118 మంది జాబితాతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని సలహా విజయ్కి మద్దతు ఇస్తారా?డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠవామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన విజయ్మద్దతు కోరుతూ లేఖ రాసిన టీవీకే అధినేతడీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అయిన మిత్రపక్షాల నేతలువిడిగా పార్టీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తమ నిర్ణయం ఏంటన్నది రేపు భేటీల తర్వాత ప్రకటించే చాన్స్విజయ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ(2)ఏదీ తేల్చని సీపీఎం (2)మద్దతు ఇవ్వమని ఇదివరకు ప్రకటించిన వీసీకే(2)విజయ్ లేఖ నేపథ్యంలో పునరాలోచనలో వీసీకేమద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(2)తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్..విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల సంతృప్తి చెందని గవర్నర్.గవర్నర్ ఆఫీసు నుంచి టీవీకేకి ఫోన్.118 మంది మెజార్టీ ఫిగర్తో లేఖ సమర్పించాలని టీవీకేకు స్పష్టం చేసిన గవర్నర్ ఆఫీస్.కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలుసంబంధిత వార్త: 113తో ప్రభుత్వమా? అలా ఎలా?కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలుఎంపీ కమల్హాసన్ ట్వీట్.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు.లోక్భవన్ కాదు.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలి.ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలి. తమిళనాడు చర్రితలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது. என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామంటీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందనముగిసిన భేటీ.. లోక్భవన్లో గవర్నర్తో ముగిసిన విజయ్ భేటీ.24 గంటల్లో రెండోసారి గవర్నర్ను కలిసిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్.113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించిన విజయ్.కాసేపట్లో గవర్నర్ను కలవనున్న అన్నాడీఎంకే పళనిస్వామి. పళనిస్వామికి టెన్షన్!విజయ్కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఒత్తిడి.ఈపీఎస్ ఒప్పుకోకుంటే టీవీకేకి మద్దతు పలికే ఆలోచనలో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి, షణ్ముగం సంప్రదింపులు.పుదుచ్చేరి రిసార్టులో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు. లోక్భవన్లో గవర్నర్తో విజయ్ సమావేశం..ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని కోరిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉంది: విజయ్ తమిళనాడులో ట్విస్ట్ల మీద ట్విస్టులుగవర్నర్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే పళనిస్వామివిజయ్ భేటీ అనంతరం గవర్నర్ను కలవనున్న పళనిస్వామి.మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్తో పళనిస్వామి భేటీ. గవర్నర్తో పళనిస్వామి సమావేశంపై పలు రకాల ఊహాగానాలుటీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని పుదుచ్చేరిలో 25 మంది ఎమ్మెల్యేల క్యాంపుతాజా పరిణామాల నేపథ్యంలో టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు ఇచ్చే ఛాన్స్అన్నాడీఎంకే మద్దతిస్తే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విజయ్గవర్నర్, విజయ్ భేటీపై సర్వత్ర ఉత్కంఠ👉గవర్నర్ను కలిసిన విజయ్👉లోక్భవన్లో గవర్నర్తో విజయ్ భేటీ. ప్రజల అండ విజయ్కు ఉంది: ప్రకాశ్రాజ్తమిళనాడు రాజకీయాలపై స్పందించిన ప్రకాశ్రాజ్ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ ప్రకాశ్రాజ్ పోస్ట్విజయ్కు ప్రజామోదం ఉందంటూ వ్యాఖ్యలు.ప్రజలు అండగా ఉన్నారని కితాబు. గవర్నర్ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరం, ఆమోదయోగ్యం కానిది మరియు రాజ్యాంగ విరుద్ధమైనది.మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు..కానీ విజయం ప్రజల తీర్పు ద్వారా లభించింది.సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి.This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ— Prakash Raj (@prakashraaj) May 7, 2026క్షణక్షణం.. ఉత్కంఠ.. 👉లోక్భవన్కు బయలుదేరిన విజయ్👉కాసేపట్లో గవర్నర్తో కీలక భేటీ. 👉 కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్ ఆర్లేకర్. విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కాన్వాయ్ కేటాయించినట్లు వెల్లడించిన అధికారులుసుప్రీంకోర్టుకు విజయ్కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీతమిళ రాజకీయంపై ఉత్కంఠకాసేపట్లో లోక్భవన్కు విజయ్.ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్.నిన్న గవర్నర్ను కలిసిన విజయ్118 మంది సంతకాలతో రావాలన్న గవర్నర్అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవలేదనే పాయింట్ మీద కోర్టుకు వెళ్లనున్న టీవీకే.సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నట్టు సమాచారం. అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పుదుచ్చేరి రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.అన్నాడీఎంకే బలం-47టీవీకే మద్దతు ఇవ్వాలన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలింపు.టీవీకేకే మద్దతు ఇవ్వాలంటున్న ఓ వర్గం.టీవీకేకి దూరంగా ఉండాలంటున్న మరో వర్గం.చెన్నైలోనే పళనిస్వామి వర్గం.పుదుచ్చేరిలో షణ్ముగం వర్గం.పుదుచ్చేరి రిసార్టులో దాదాపు 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి ఒక్కొక్కొరుగా పార్టీ ఆఫీసుకు వస్తున్న టీవీకే ఎమ్మెల్యేలు. నేడు విజయ్ కీలక సమావేశం.. నేడు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం.రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. మళ్లీ ఎన్నికలు జరపండి: శ్రీధర్ వేంబుతమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరపాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వ్యాఖ్యలు.టీవీకే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటు కోసం తగినంత సంఖ్యా బలం లేదు.సంఖ్యలు సరిపోతున్నట్లు కనిపించడం లేదు.ఏ ప్రభుత్వం ఏర్పడినా, అది వివిధ రకాల ఆకర్షణలు, ఒత్తిళ్లతో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది.తమిళనాడు ఇంతకంటే మెరుగైన ప్రభుత్వానికి అర్హమైనది.అందుకే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి వస్తారని నేను భావిస్తున్నాను.ఒకవేళ డీఎంకే-అన్నాడీఎంకే దానిని ఆపాలనుకుంటే, వారిద్దరూ కలిసి పోరాడాలి.సున్నా సీట్లు వచ్చినా సరే, బీజేపీ ఒంటరిగా పోరాడాలి.తమిళనాడులో బీజేపీకి ఇది ఒక కొత్త ఆరంభం.ప్రజలే మళ్లీ నిర్ణయించనివ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు. The numbers don't seem to add up. Whatever government is cobbled together is likely to be unstable with various pulls and pressures. Tamil Nadu deserves better.President's rule with fresh elections may be the best course, this time with a very strict "no cash for votes"…— Sridhar Vembu (@svembu) May 7, 2026తమిళనాడులో అల్లర్లకు చాన్స్..తమిళనాడులో ఇంటెలిజెన్స్ హెచ్చరికపలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం.దీంతో, పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన సీఎస్, డీజీపీపొత్తులపై కొత్త ట్విస్ట్.. పొత్తులపై ప్రచారాన్ని ఖండించిన డీఎంకేఅవన్నీ ఫేక్ అంటూ డీఎంకే నేతలు వ్యాఖ్యలు.విజయ్ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదన్న స్టాలిన్మరోవైపు.. విజయ్కు తమ మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే.ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుపై ఉత్కంఠ.టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న లెఫ్ట్ పార్టీలు, అన్నాడీఎంకే.కాంగ్రెస్ మద్దతులో 112కు చేరిన టీవీకే బలంమరో ఆరుగురు ఎమ్మెల్యే కోసం టీవీకే ప్రయత్నాలు. రిసార్ట్ రాజకీయాలు..గత మూడు రోజులుగా మహాబలిపురంలోని రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు.మరోవైపు.. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పుదుచ్చేరిలోని రిసార్ట్కు తరలింపు.'ది షోర్ త్రిశ్వం'లో 20కి పైగా గదులను బుక్ చేసుకున్న అన్నాడీఎంకే సీవీ షణ్ముగంPuducherry: AIADMK MLAs have gathered at a private resort in Puducherry amid uncertainty over government formation in Tamil Nadu. With TVK lacking a clear majority and seeking support, political maneuvering is underway. Heavy police security has been deployed to maintain law and… pic.twitter.com/hsUdAsgbSE— IANS (@ians_india) May 6, 2026ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను టీవీకే నేతలు కలిశారు.విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది.వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్కు అందజేత.ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిఅందుకు గవర్నర్ విముఖత.118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచన.దీంతో నిరాశతో వెనుతిరిగిన విజయ్. రసవత్తరంగా తమిళ రాజకీయం..గంట గంటకూ మారుతున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలుకొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొనసాగుతున్న ఉత్కంఠ..నేడు ఏం జరగబోతోందని అనేది సస్పెన్స్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలం ఇలా.. టీవీకే - 108డీఎంకే - 59అన్నాడీఎంకే - 47కాంగ్రెస్ - 05పీఎంకే - 04ఐయూఎమ్ఎల్- 02సీపీఐ - 02సీవీకే - 02సీపీఎం - 02బీజేపీ - 01డీఎండీకే - 01అన్నామక్కల్ మున్నేట్ర కళగం - 01రెండు పార్టీల మంతనాలుతమిళనాట కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు వార్తలుఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలుకు 106 సీట్లువామపక్షాలు మిగిలిన చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నాయట!దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం. -
విజయ్కి సెక్యూరిటీ తొలగింపు
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో బలం పెంచుకునే పనిలో విజయ్ పడ్డారు. అయితే.. ఈలోపు ఆయనకు ఝలక్ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలవడంతో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరిగింది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమై చెన్నైలోని ఆయన నివాసం ముందు భద్రతను పెంచింది. విజయ్ నివాసంతో పాటు టీవీకే కార్యాలయం, అలాగే టీవీకే ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు కనిపించారు. అయితే గవర్నర్ను కలిశాక పరిస్థితి మారిపోయింది. రాత్రి పట్టినపాకంలోని పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో విజయ్ సింగిల్ వెహికిల్లోనే ఇంటికి బయల్దేరారు. గత రెండ్రోజులుగా హడావిడి చేసిన కాన్వాయ్ కనిపించలేదు. ఆ సమయంలో ఆయన డల్గా కనిపించారు. పార్టీ శ్రేణుల వాహనాలు కూడా పెద్దగా ఆయన వెంట లేవు. கான்வாய் பாதுகாப்பு வாகனங்கள் எதுவும் இல்லாமல் சென்ற விஜய்.. பட்டினப்பாக்கம் அலுவலகத்தில் இருந்து விஜய் வீட்டிற்கு புறப்படுவதற்கு முன்பே கான்வாய் வாகனங்கள் அங்கிருந்து எடுத்துச் செல்லப்பட்டன.. pic.twitter.com/LwjOMtpgsW— Doctor Ramadoss OG (@DoctorRamadoss) May 6, 2026సీఎం హోదాలో ఇచ్చే జెడ్ఫ్లస్ సెక్యూరిటీని విజయ్కు కేటాయించింది తమిళనాడు పోలీస్ శాఖ. అయితే తాజా పరిణామాలతో ఆ భద్రతను కనీసానికి కుదించినట్లు స్పష్టమవుతోంది. అలాగే నివాసం వద్ద నుంచి కూడా సిబ్బందిని బాగా తగ్గించినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ఆర్బీ చౌదరికి నివాళులర్పించి.. ఆయన తనయుడు జీవా(కోలీవుడ్ హీరో)ను విజయ్ ఓదార్చారు. ఆ సమయంలోనూ విజయ్ వెంట పెద్దగా సెక్యూరిటీ లేదు.మరోవైపు.. గవర్నర్ విజయ్ను కలిశాక మరో పరిణామం చోటు చేసుకుంది. టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథర్వ్ అర్జున మరోసారి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని కోరారు. ముందుగా సీఎంగా విజయ్ ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత శాసనసభలో బలనిరూపణ చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. అయితే.. ముందు మ్యాజిక్ ఫిగర్ (118) చూపించాకే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తేల్చి చెప్పారు. దీంతో తమిళ రాజకీయం రసకందాయంలో పడింది. -
ఎంకే స్టాలిన్తో రజనీకాంత్ భేటీ.. ఎందుకంటే..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత.. ఎం.కే స్టాలిన్ను రజనీకాంత్ ఆయన నివాసంలో ఇవాళ(బుధవారం) కలిశారు. మర్యాద పూర్వకంగానే రజనీకాంత్.. స్టాలిన్తో భేటీ అయ్యారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్.. స్టాలిన్ కలిసి కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకోగా, డీఎంకే 59 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.స్టాలిన్ తన కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. డీఎంకే, మిత్రపక్షాలు రెండో అతిపెద్ద కూటమిగా నిలిచినందున.. కొత్త అసెంబ్లీలో అవి ప్రతిపక్ష స్థానంలో కూర్చోనున్నాయి. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.గతంలో రజనీకాంత్.. డీఎంకేకు అందించిన మద్దతు దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 1995లో రాజకీయాల్లోకి వస్తారని భావించిన సమయంలో ఆయన డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 1998 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీకి అండగా నిలిచారు. ఆ తర్వాత 2017లో రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించినప్పటికీ, 2021లో అనారోగ్య కారణాలతో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. విజయ్ విజయం తర్వాత.. ఆయనకు అభినందనలు తెలుపుతూ రజనీకాంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.కాగా, విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆయన పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఉప ఎన్నికలు జరగవచ్చు. మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకు ఇంకా 10 స్థానాల మద్దతు అవసరం. -
విజయ్ విజన్ ఉన్నోడు..వారికి పీడకలే!
టీవీకే అధినేత, కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఆయన పెట్టుబడి పెట్టే విధానం చూసి నెటిజన్లు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఆశ్చర్యపోతున్నారు. విజయ్ విజన్ ఉన్నవాడు, వారెన్ బఫెట్లాంటోడు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.27 పేజీల అఫిడవిట్లో విజయ్ ప్రకటించిన నికర ఆస్తి విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తులు రూ. 404 కోట్లు, స్థిరాస్తులు రూ. 220 కోట్లుగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు. ఇందులో ఒక సేవింగ్బ్యాంకు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉన్నట్లు, ఇతర డిపాజిట్లు, కోట్ల విలువ చేసే షేర్లను ప్రకటించారు.దీంతో విజయ్ పెట్టుబడి విధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరో అయి ఉండి కూడా, సామాన్యుడిలా బ్యాంకు డిపాజిట్లనే నమ్ముకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.జీతం తీసుకునే ఉద్యోగులు తమ పొదుపును మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో ఎస్ఐపీల రూపంలో పెట్టుబడి పెట్టాలని చెబుతున్న ఈ రోజుల్లో, విజయ్ ఆస్తులు ఫిన్ఫ్లూయెన్సర్లకు కంటగింపుగా మారాయని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. వారెన్ బఫెట్ లాగే నగదు నిల్వలు కలిగి ఉన్నందుకు, ఫన్నీగా 'దార్శనికుడు' అని కూడా కీర్తిస్తున్నారు.ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?He beats nifty returns by keeping his money in FDHe is sitting on 300cr cash Just like Warren buffet with 300 billion in cashThalapathy Vijay is visionary pic.twitter.com/eXdm0CPIQL— सौरभ (@saurabh_gunjal_) May 6, 2026ఇదీ చదవండి: సింగిల్ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్ టాపిక్గా విజయ్ ఆస్తి Vijay is a Finfluencer's nightmare! pic.twitter.com/2J2hhjbqFv— Dharmesh Ba (@dharmeshba) May 6, 2026నెటిజన్ల కామెంట్స్"మ్యూచువల్ ఫండ్స్ గురించి పాఠాలు చెప్పే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లకు విజయ్ ఒక పీడకల (Nightmare)" అని కొందరు అంటుంటే.. మరికొందరు పెట్టుబడి సలహాలు కూడా ఇచ్చారు."వంద కోట్ల రూపాయలను ఎఫ్డీలో పెట్టడం వల్ల ద్రవ్యోల్బణం (Inflation) దృష్ట్యా నష్టమే. అదే పీఎస్యూ స్టాక్స్లో పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేవి" అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. వంద కోట్లను బ్యాంకు FDలో పెట్టుబడి పెట్టారు... ఇది అతని మొత్తం ఆస్తులలో 17 శాతం. ఇంత చెత్త పెట్టుబడి సలహా ఎవరు ఇచ్చారో నాకు నిజంగా అర్థం కావడం లేదన్నారు.ఆ 100 కోట్లలో 50 శాతం అంటే 50 కోట్లను ప్రభుత్వ బాండ్లలో, డెట్ ఫండ్లలో లేదా కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకునే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. (టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు)ముఖ్యంగా "టాప్ PSUలలో అధిక డివిడెండ్ రాబడినిచ్చే స్టాక్లలో పెట్టుబడి పెడితే, మూలధనం సేఫ్. క్రమం తప్పని ఆదాయం వచ్చేది. అలాగే మూలధన విలువ కూడా పెరుగుతుంది," అని @RakJhun అనే ఒక ఎక్స్ యూజర్ వివరించారు. "తమిళులకు బంగారం, ఆస్తుల మీద ఉన్న నమ్మకం స్టాక్ మార్కెట్ మీద ఉండదు" అని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. TVK Chief Vijay appears to be risk-averse but may be lacking proper financial advice. He has ₹213 Cr in savings bank & FDs of ₹100 Cr which yields very low interest. If he invests in high dividend yield stocks of top PSUs, capital is safe + regular income + capital appreciation pic.twitter.com/pcakqtFxG6— RJ Stocks (@RakJhun) May 5, 2026 -
ఎమ్మెల్యేగా గెలిచిన పని మనిషి
-
TVK విజయ్ కు కాంగ్రెస్ మద్దతు
-
విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే టీవీకే అధినేత విజయ్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే వస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా.. మొత్తం ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ఈ తరహా నిర్ణయం ఇదే తొలి కావడం గమనార్హం!రేపో లేదంటే ఎల్లుండో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐదు వేల మంది హాజరయ్యేలా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని టీవీకే భావిస్తోంది. తమిళనాడు లోక్భవన్ (గవర్నర్ కార్యాలయం) ప్రకటన ప్రకారం.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ సాయంత్రం ప్రకటించబడతాయి. అయితే ఈ ఏర్పాట్లను ప్రభుత్వం కాకుండా టీవీకే పార్టీ స్వయంగా నిర్వహిస్తోందని లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి.సీఎం ప్రమాణ స్వీకార వేడుక అంటే.. ముఖ్యమైన ప్రజాస్వామ్య కార్యక్రమం. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజల ముందు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ వేడుక జరగుతుంది. కాబట్టి ప్రజలు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మునే ఖర్చు చేస్తారు. సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. టెంట్లు, స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, అతిథుల స్వాగతం వంటి అన్ని అంశాలకు ఖర్చు లెక్కలు ఈ శాఖే చూసుకుంటుంది. అలాగే..ఖర్చు స్థాయి కార్యక్రమం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాదాసీదా ప్రమాణ స్వీకారం రాజభవన్లో జరిగితే ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ భారీ సభలు స్టేడియం లేదంటే పెద్ద మైదానంలో నిర్వహిస్తే ఖర్చు కోట్లలోకి వెళ్తుంది. ప్రజలకు విస్తృతంగా హాజరు అవకాశం కల్పిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. వీటికి తోడు.. ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కీలకం. వేలాది పోలీసు సిబ్బంది, ఇతర దళాలు నియమించబడతాయి. వాళ్ల ప్రయాణం, భోజనం, లాజిస్టిక్స్ అన్నీ ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి. అదనంగా, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు.. పెద్ద టెంట్లు, వేదికలు, కూర్చోవడానికి సౌకర్యాలు కూడా ఖర్చులో ప్రధాన భాగం. గవర్నర్, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు.. ముఖ్య అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఆ ఖర్చు మరింత పెరిగిపోతుంది కూడా. అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో.. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ప్రైవేట్ డొనేషన్లు లేదంటే వ్యక్తిగత నిధులు ఇందులో భాగం కావు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా.. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన నిధులు ఈ వేడుకకు వినియోగించబడతాయి. అయితే విజయ్ మాత్రం ప్రభుత్వ ఖర్చు లేకుండా.. టీవీకే పార్టీ నిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. ఇందుకు గవర్నర్ కూడా అంగీకరించినట్లు లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికి ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారాన్ని తగ్గిస్తూ, పార్టీ నిధులతోనే ఈ వేడుకను నిర్వహించాలని విజయ్ భావించడం.. ప్రజాస్వామ్యానికి, ప్రజల పన్నుల వినియోగానికి గౌరవం చూపినట్టేనన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
డీఎంకేతో కటీఫ్.. విజయ్కు మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకే పార్టీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు.. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీవీకే కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో డీఎంకే కూటమికి గుడ్బై చెప్పినట్లైంది. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తొలి నుంచి భావిస్తోంది. అయితే డీఎంకే మాత్రం అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో స్టాలిన్ నేతృత్వంలో నిన్న జరిగిన కూటమి మీటింగ్కు కాంగ్రెస్ తరఫు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. బదులుగా.. టీవీకే నేత సెంగొట్టియాన్తో ఓ హోటల్లో సమావేశమై జట్టు గురించి చర్చలు జరిపారు. ఈ పరిణామం డీఎంకేకు మంట పుట్టించింది. కాంగ్రెస్ ఐదు స్థానాలు నెగ్గిందే స్టాలిన్ వల్ల అని.. టీవీకేతో వెళ్లడం వెన్నుపోటు కిందకే వస్తుందని మండిపడింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో రాహుల్ గాంధీని తప్పు పట్టిస్తున్నారని ఆరోపించింది. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మాణిక్యం ఠాగూర్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి? అని అన్నారాయన. ఈ క్రమంలో తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వమని చెప్పారు. మరోవైపు.. కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం. సెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది. విజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి అని అన్నారు.ఇంకోవైపు డీఎంకే కూటమికి కొత్తగా నెగ్గిన ఎమ్మెల్యే రాజేష్కుమార్ చురకలంటించారు. ఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం. కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్తో ఏం గెలవలేదు. తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు. ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా అని అన్నారు. ఇండియా కూటమికి బీటలుతమిళనాడు ఎన్నికల టైంలోనే సీట్ల పంపకాల విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఇండియా కూటమి పేరుతో కాకుండా సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరుతో ఎన్నికలకు వెళ్లారు. అయితే కేవలం 28 సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజా పరిణామంతో తమిళనాడులో డీఎంకేతో దోస్తీకి కాంగ్రెస్ గుడ్బై చెప్పింది. దీంతో.. డీఎంకే నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది. -
టీవీకే ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో బిగ్ ట్విస్ట్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులోకి ఉంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించడంతో టీవీకే మరో 10 మంది బలం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పది మంది కోసం టీవీకే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, అన్నాడీఎంకే లుకలుకలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి పార్టీలో చీలికలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్.. విజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక, తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి లీమా గెలుపొందారు.అయితే, ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్కు మద్దతు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై నేడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతానికి పళనిస్వామి.. ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమై ఉన్నారు. అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. నేడు జరగబోయే సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు.. సీపీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో, వారంతా ఏ నిర్ణయం తీసుకోనున్నారనే సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే మద్దతుపై విజయ్ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో జయలలిత టైంలో పలు చేదు అనుభవాలు దృష్ట్యా విజయ్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో ఉంది. -
'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?
సాక్షి, చెన్నై: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (TVK) చారిత్రాత్మక విజయం, పార్టీ అధినేత తరువాత కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (దళపతి విజయ్)కి సంబంధించిన ప్రతీ విషయం నెట్టింట వైరల్గా మారుతోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోయోలా కాలేజ్ కౌంటింగ్ సెంటర్ నుండి అందుకున్న MLAగా గెలిచిన ధృవీకరణ పత్రం వైరల్ అయ్యింది. ఇపుడు విజయ్ పదో తరగతి మార్కుల వివరాలు సోషల్ మీడియాలో సందడిగామారాయి. ఒక సగటు విద్యార్థిగా ప్రారంభమైన విజయ్ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించడమే కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదగడం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.మరోవైపు గురువారం ఉదయం 11.30 గంటలకు నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే ల మద్దతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ను కలిసేందుకు విజయ్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ ఇంకా రాలేదు.మనీ కంట్రోల్ నివేదిక, నెట్టింట హల్ చల్ చేస్తున్న 10వ తరగతి మార్కుల జాబితా (mark sheet) ప్రకారం చెన్నైలోని విరుగంబాక్కంలోని ఒక ప్రైమ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో విజయ్ చదువు కున్నారు. పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఆయన 1100 మార్కులకు గాను 711 సాధించారు. అంటే మార్కులు 65 శాతం మార్కులొచ్చాయన్నమాట. సబ్జెక్టుల వారీగా మార్కులుతమిళం: 200 మార్కులకు 155 (అత్యధిక మార్కులు)గణితం: 200 మార్కులకు 95.ఇంగ్లీష్: 200/133సైన్స్: 300 /206సోషల్ సైన్స్: 200/122పాఠశాల విద్య అనంతరం చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. సినిమాలపై మక్కువతో మధ్యలోనే కాలేజీ మానేసి నటన వైపు అడుగులు వేశారు. ఆ నిర్ణయమే ఆయన్ని కోలీవుడ్లో సూపర్ స్టార్గా నిలబెట్టింది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ప్రభంజనం దశాబ్దాల ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టి తమిళనాట ఘన విజయం సాధించారు. అత్యధిక మెజారీటీ సాధించిన ఏకైక పార్టీగా టీవీకే పార్టీని నిలబెట్టడం విశేషం. తిరుచిరాపల్లి ఈస్ట్ , పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్ విజయం సాధించారు. -
విజయ్ పవర్ స్ట్రోక్.. తెర వెనుక ఐదుగురు!
తమిళనాట ఎన్నికల పర్వం ముగిసింది. భారీ మెజార్టీతో టీవీకే విజయం సాధించారు. ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు విజయ్ చుక్కలు చూపించి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే, టీవీకే సాధించిన ఆకస్మిక విజయం వెనుక ఐదుగురు సీక్రెట్ సభ్యులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. దీంతో, వారి గురించే ఇప్పుడు ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..తమిళనాడులో విజయ్కు ఇప్పటికే బలమైన అభిమానగనం ఉంది. అభిమానుల విధేయతను ఎన్నికల బలంగా మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆన్లైన్ సైన్యం విజయ్ వద్ద అప్పటికే అందుబాటులో ఉంది. ఇక అవసరమైంది కేవలం ఒక పార్టీ నిర్మాణాన్ని రూపొందించుకోవడం మాత్రమే. అందులో భాగంగానే.. విజయ్ కోసం ఐదుగురు సభ్యుల సీక్రెట్ టీమ్.. ఎన్. ఆనంద్, అరుణ్రాజ్, CTR నిర్మల్ కుమార్, ఆధవ్ అర్జున, KA సెంగుట్టువన్ రంగంలోకి దిగారు. ఈ కీలక బృందం టీవీకే సందేశాన్ని రూపొందించడంలోనూ, క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషించింది. వీరందరూ కలిసి విజయ్ సినీ ప్రపంచంలో ఒక భాగంగా ఉంటూ టీవీకే విజయ రథాన్ని విజయం వైపు నడిపించారు.ఆనంద్ (Bussy ఆనంద్)ఆనంద్ 2006లో పుదుచ్చేరిలోని 'Bussy' నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి, ఈయన 'Bussy' ఆనంద్గా ప్రాచుర్యం పొందారు. విజయ్ తరపున క్షేత్రస్థాయిలో వ్యవహరించే ప్రధాన వ్యక్తి ఈయనే. విజయ్ను 'దళపతి' అని సంబోధించే ఆయన, విజయ్ అభిమాన సంఘమైన 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను నేటి టీవీకేగా తీర్చిదిద్దడంలో కేంద్ర బిందువుగా నిలిచారు. విజయ్ పార్టీ పేరును ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన విధేయత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత, కళ్లలో నీళ్లతో, భావోద్వేగానికి లోనైన ఆనంద్.. విజయ్ పక్కన కూర్చుని కనిపించారు. 2026 ఎన్నికల్లో టీనగర్ నియోజకవర్గం నుండి ఆనంద్ విజయం సాధించారు.అరుణ్రాజ్..ఎంబీబీఎస్ పట్టా కలిగి మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్రాజ్ తన పరిపాలనా నైపుణ్యాన్ని టీవీకే పార్టీకి అందించారు. పన్ను దాడులు, విచారణలను నిర్వహించడంలో విశేష అనుభవం ఉన్న అరుణ్రాజ్.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొద్ది కాలంలోనే ఆయన TVK అంతర్గత కోర్ కమిటీలో ఒక కీలక సభ్యుడిగా ఎదిగారు. విజయ్ అనుసరించే స్వతంత్ర రాజకీయ వైఖరి తనను ఆకర్షించిందని అరుణ్రాజ్ గతంలో పేర్కొన్నారు. డీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించే ఆయన, 2026 ఎన్నికల్లో తిరుచెంగోడ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.CTR నిర్మల్ కుమార్నిర్మల్ కుమార్.. TVK పార్టీకి డేటా, సోషల్ మీడియా నిపుణుడిగా వ్యవహరించారు. 2025లో టీవీకేలో చేరడానికి ముందు బీజేపీలో పనిచేసి రాజకీయ మెలకువలను నేర్చుకున్నారు. వాస్తవానికి, తమిళనాడులో టీవీకే డిజిటల్ ఉనికిని పెంచడంలో నిర్మల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా ఆయన కాషాయ పార్టీని వీడి, అన్నాడీఎంకేలో చేరారని వార్తలు వచ్చాయి. కానీ, అన్యూహంగా ఆయన టీవీకే చేరారు. నిర్మల్.. టీవీకేలో చేరిన తర్వాత సర్వేలు, ఓటర్ల డేటా విశ్లేషణ, పోలింగ్ బూత్ స్థాయి విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించారు. టీవీకే పార్టీకి 30% ఓట్ల వాటా లభిస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంతిమంగా పార్టీ 35% ఓట్ల వాటాను సాధించింది. ఆయన అందించిన వ్యూహాత్మక సూచనలే విజయ్ ఎన్నికల ప్రచార నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం నుండి విజయం సాధించారు.ఆధవ్ అర్జునఆధవ్ అర్జున భారతదేశ లాటరీ రాజుగా ప్రసిద్ధి. శాంటియాగో మార్టిన్ అల్లుడైన ఆధవ్ రాజకీయ ప్రస్థానం పలు రాజకీయ పార్టీల గుండా సాగింది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని 'Voice of Commons' అనే రాజకీయ సలహా సంస్థను స్థాపించడం ద్వారా ప్రారంభించారు. త్వరలోనే ఆయన పనితీరు డీఎంకే పార్టీ దృష్టిని ఆకర్షించింది. దాంతో 2021లో ఆయన డీఎంకేలో చేరారు. వాస్తవానికి డీఎంకే కోసం పనిచేసేలా ప్రశాంత్ కిషోర్ను ఒప్పించి తీసుకురావడంలో ఆధవ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. అయితే, డీఎంకేలో తనకు ఆశించిన కీలక పదవి లభించకపోవడంతో ఉదయనిధి స్టాలిన్తో ఆయనకు విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తిరుమావలవన్ నేతృత్వంలోని VCK పార్టీలో చేరారు, అక్కడ ఆయనకు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. అనంతరం, టీవీకే గూటికి చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన విల్లివాక్కం నుండి గెలుపొందారు.కేఏ సెంగోట్టయ్యన్సీనియర్ నాయకుడైన సెంగోట్టయ్యన్.. టీవీకేకి అత్యంత అపారమైన రాజకీయ అనుభవాన్ని అందించారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా (గోబిచెట్టిపాలయం నుండి) ఎన్నికైన ఆయన, ఎంజీ రామచంద్రన్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అలాగే, జయలలితకు గట్టి మద్దతుదారుగా ఉండేవారు. నిజానికి, జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి కే పళనిస్వామి మరియు సెంగోట్టయ్యన్ ఇద్దరూ పోటీదారులుగా ఉన్నారు. శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్సెల్వంలను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో ఈపీఎస్తో విభేదాల కారణంగా సెంగోట్టయ్యన్ అన్నాడీఎంకేను వీడారు. పార్టీ నుండి విడిపోయిన తర్వాత, ఆయన 2025లో టీవీకేలో చేరి విజయ్కు మార్గదర్శిగా మారారు. ఈ క్రమంలోనే గోబిచెట్టిపాలయంపై అతని విజయం ఆయన శాశ్వత ప్రభావాన్ని మరోసారి బలపరిచింది. -
విజయ్కు షాక్
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న విజయ్కు షాక్ తగిలింది. టీవీకేకు ఎట్టిపరిస్థితుల్లో తాము మద్దతు ఇవ్వబోమంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ప్రకటించింది. డీఎంకే నాయకత్వం తీసుకునే నిర్ణయానికి మేం కట్టుబడి ఉంటాం అని ఆ పార్టీ అధినేత ఖాదర్ మొహిదీన్ బుధవారం ప్రకటించారు.డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్(SPA) తరఫున.. రెండు స్థానాల్లో పోటీ చేసింది. చేసిన రెండు చోట్ల విజయంతో 100 పర్సంట్ స్ట్రయిక్ రేట్ సాధించింది. పాపనాశంలో A. M. షాజహాన్, వాణియంబాడిలో సయ్యద్ ఫారూఖ్ బాషాలు విజయం సాధించారు. మరోవైపు.. డీఎంకే కూటమిలోనే ఉన్న విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) కూడా విజయ్ పార్టీకి పొత్తు ఇవ్వమని స్పష్టం చేసింది.తమిళనాడులో విజయ్ టీవీకే 108 సీట్లు గెలుపొందింది. అధికారం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది మద్దతు అవసరం. అంటే.. సంకీర్ణ ప్రభుత్వం తప్పదన్నమాట. కాంగ్రెస్(5) మద్దతు దాదాపు ఖరారు కాగా.. లెఫ్ట్ పార్టీలు(4) కూడా జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరో స్థానం తక్కువ పడుతుండడంతో ఎవరు మద్దతుకు ముందుకు వస్తారా? అనే కుతూహలం నెలకొంది. -
ఈ వెన్నుపోటు రాజకీయమేంది?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల 2026 ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీశాయి. విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కగళం 108 స్థానాలు గెలిచింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు అవసరం పడింది. ఈ నేపథ్యంలో విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.తమిళనాడు సీనియర్ నేత, విజయ్కు కుడి భుజంగా పేరున్న సెంగొటియన్ నిన్నంతా కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి రాకూడదనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఈ తరుణంలో విజయ్ ఏర్పాటు చేయబోయే సర్కార్ మద్దతు ప్రకటించాలనే యోచనతోనే హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే ఇది మిత్రపక్షం డీఎంకేతో రాజకీయ ఘర్షణలకు కారణమయ్యేలా కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరిట డీఎంకే కూటమి పోటీ చేసింది. అయితే సీట్ల పంపకాల దగ్గరి నుంచి కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో డీఎంకేకు విబేధాలు మొదలయ్యాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఐదు చోట్ల నెగ్గింది. మరిన్ని ఎక్కువ స్థానాలు కేటాయించి ఉంటే ఎక్కువ సీట్లు గెలిచి ఉండేవాళ్లమని రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్, కాంగ్రెస్ హైకమాండ్కు నివేదించింది. ఈ నేపథ్యంలో.. నిన్న ఓటమి తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ కూటమి సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ఆ పార్టీ నేతలు విడిగా సమావేశమై టీవీకేతో జట్టు కలిసే అంశంపై చర్చించారు. ఇది డీఎంకేకు మరింత కోపం తెప్పించింది. కాంగ్రెస్ వైఖరిని వెన్నుపోటుగా అభివర్నిస్తూ డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై మండిపడ్డారు. The Backstabbers.— Saravanan Annadurai (@saravofcl) May 5, 2026No. DMK does not endorse the support of INC to TVK. It was their unilateral decision. The Backstabbers. https://t.co/DPPW3caNio— Saravanan Annadurai (@saravofcl) May 6, 2026ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకే సిద్ధమైంది. హైకమాండ్ రాష్ట్ర యూనిట్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇవాళ ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. మరోవైపు.. కాంగ్రెస్తో పాటు వామపక్షాలు కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించాయి. దీంతో ఇవాళో, రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4(సీపీఐ, సీపీఎం చెరో రెండు) కలిపితే తొమ్మిది స్థానాలు అవుతాయి. మరొక స్థానం తక్కువ అయ్యింది. డీఎంకే కూటమిలోని విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) ఎట్టి పరిస్థితుల్లో విజయ్కు మద్దతు ఇవ్వమని ప్రకటించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా పొత్తునకు ససేమీరా అనేసింది. అయితే దివంగత విజయ్కాంత్ పార్టీ డీఎండీకే మద్దతు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున 1 స్థానం గెలుచుకోగా.. విజయ్ తన బిడ్డలాంటోడంటూ విజయ్కాంత్ సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడు ఫలితాలతో డీఎంకే కుదేలు అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ప్రకటిస్తే అది మరో దెబ్బ కానుంది. -
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకే-అన్నాడీఎంకేల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47సీట్లతో మొత్తం 106సీట్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ప్రయత్నాలు ముమ్మరం 1970ల నుంచి డీఎంకే ,అన్నా డీఎంకే మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా ఒక్కటి కానున్న బద్ధ శత్రువులు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని డీఎంకే, అన్నాడీఎంకే పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలువిజయ్కు మద్దతిచ్చేందుకు వామపక్షాల నిరాకరణమద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలుకూటమిలోనే ఉంటామని ప్రకటన ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని చెప్పిన ముస్లిం లీగ్టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్రేపు విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమేప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు లభించని గవర్నర్ అనుమతిమెజార్టీపై గవర్నర్ను ఒప్పించలేకపోయిన విజయ్విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలన్న గవర్నర్ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదు : టీవీకే లోక్భవన్లో జరిగిన పరిణామాలు రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చరేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న విజయ్ తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అని అడిగిన గవర్నర్ రేపు ఉదయం 6గంటల సమయానికి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పిన టీవీకే నేతలు ప్రమాణ స్వీకారానికి అడ్డులేదని చెప్పిన టీవీకే ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?లోక్భవన్కు చేరుకున్న విజయ్ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించిన గవర్నర్ ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?గవర్నర్తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారంపై క్లారిటీ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు విజయ్కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కాంగ్రెస్తో పాటు విజయ్కు మద్దతు ఇచ్చిన సీపీఐ,సీపీఎం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్ కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో విజయ్ భేటీపార్టీ ఆఫీస్ నుంచి లోక్ భవన్కు బయల్దేరిన విజయ్ గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాలు వివరాల్ని అందిచనున్న విజయ్ అంతకంటే ముందే తమిళనాడు ఎన్నికల సంఘం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ భేటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాల్ని అందించిన అధికారులు విజయ్ మరో సంచలనం?సాయంత్రం లోక్భవన్కు విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ తర్వాతే ప్రమాణస్వీకారంపై రానున్న స్పష్టతరేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణం?విజయ్ మరో సంచలన నిర్ణయంప్రమాణ స్వీకార ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కాకుండా టీవీకే తరఫున చేయాలని నిర్ణయంఖర్చంతా భరించనున్న టీవీకే పార్టీనెహ్రూ ఇండోర్ స్టేడియంలో 5 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుసాయంత్రంకల్లా రానున్న క్లారిటీ ప్రొటెం స్పీకర్ ఎవరంటే..టీవీకే నుంచే ప్రొటెం స్పీకర్9వ సారి ఎమ్మెల్యేగా నెగ్గిన సెంగొట్టియాన్అన్నాడీఎంకేలో సుదీర్ఘ కాలం ఉన్న సెంగొట్టియాన్గతేడాది విజయ్ టీవీకేలో చేరికవిజయ్కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న సెంగొట్టియాన్ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే కూటమి పార్టీలతో చర్చలు జరిపిన సెంగొట్టియాన్ఫలించిన సెంగొట్టియాన్ దౌత్యం.. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఇతర పార్టీలుపార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న విజయ్మహాబలిపురంలోని రిసార్ట్లో బస చేసిన ఎమ్మెల్యేలుప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సమయం ఉండడంతో జాగ్రత్త పడ్డ టీవీకే అధినేతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 123?తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే నెగ్గిన స్థానాల సంఖ్య 108రెండు చోట్ల విజయ్ గెలుపు.. ఒక చోట రాజీనామా చేస్తే 107కాంగ్రెస్ 5 (మద్దతు ప్రకటన)సీపీఐ, సీపీఎం 2+2 (చర్చలు జరగాల్సి ఉంది.. దాదాపుగా మద్దతు ఖరారైనట్లే) ఏఎంఎంకే 1 (మద్దతు ప్రకటన)వీసీకే 2 (మద్దతు ఇవ్వబోమని తొలుత ప్రకటించారు. అయితే విజయ్ లేఖ రాశారు.. ఇంకా బదులు రావాల్సి ఉంది)పీఎంకే 4 (బదులు రావాల్సి ఉంది)అంతా సవ్యంగా సాగితే.. విజయ్ పార్టీ బలం 123కి చేరే చాన్స్తమిళనాడు రాజకీయాల్లో మరో సర్ప్రైజ్?బయటకు నుంచి టీవీకేకు మద్దతు ఇచ్చే యోచనలో అన్నాడీఎంకేఇప్పటికే అన్నాడీఎంకేలో విజయ్కు మద్దతు ఇచ్చే అంశంపై ముసలంసపోర్ట్ ఇవ్వాలని ఒక వర్గం.. ఇవ్వొద్దని మరో వర్గంఅన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలిసిన టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథవ్ అర్జునాఎన్డీయే నుంచి బయటకు వచ్చి విజయ్ టీవీకేకు మద్దతు తెలిపే అవకాశంఅదే జరిగితే అమాంతం పెరగనున్న టీవీకే బలంవిజయ్కు గవర్నర్ ఆహ్వానంతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ ఆహ్వానంసాయంత్రం గవర్నర్ను కలవనున్న విజయ్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందజేయనున్న విజయ్టీవీకే బలం 108 (విజయ్ రెండు చోట్లా పోటీ.. ఒక చోట రాజీనామా చేస్తే 107)మద్దతు ప్రకటించిన కాంగ్రెస్మద్దతు ఇచ్చిన ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యేవామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశంటీవీకేకు భేషరతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ముగిసిన తమిళనాడు కాంగ్రెస్ నేతల భేటీటీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసిన కాంగ్రెస్తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే కూటమి తరఫున 28 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ఐదు స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్టీవీకే మద్దతు విషయంలో డీఎంకేతో విబేధాలుపరస్పర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్-డీఎంకే నేతలుఇదీ చదవండి: డీఎంకేతో కటీఫ్.. విజయ్తో దోస్తీవిజయ్కు మద్దతు.. తప్పేంటి?: కాంగ్రెస్విజయ్కు మద్దతు విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం: మాణిక్యం ఠాగూర్ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు: మాణిక్యం ఠాగూర్ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి?: మాణిక్యం ఠాగూర్తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వం: మాణిక్యం ఠాగూర్టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది: కార్తీ చిదంబరంపార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం: కార్తీ చిదంబరంసెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది: కార్తీ చిదంబరంవిజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి: కార్తీ చిదంబరంఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం: ఎమ్మెల్యే రాజేష్కుమార్కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్తో ఏం గెలవలేదు: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు: ఎమ్మెల్యే రాజేష్కుమార్ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళనాట మరో ట్విస్ట్అన్నాడీఎంకే మద్దతు కోరే యోచనలో టీవీకే విజయ్?అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి టీవీకే కీలక నేత పళనిస్వామితో భేటీ కానున్న అథవ్ అర్జునాటీవీకేలో టాప్ 5 కీలక నేతల్లో అథవ్ అర్జునా ఒకరుఎన్నికల్లో పని చేసిన అథవ్ అర్జునా వ్యూహాలుమద్దతుపైనే చర్చిస్తారంటున్న అన్నాడీఎంకేలోని ఓ వర్గంవిజయ్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకేనంటున్న మరో వర్గంఅన్నాడీఎంకే నుంచి టీవీకేకు టచ్లో 10 మంది ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే అత్యవసర సమావేశంఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోరుతూ విజయ్ లేఖసాయంత్రం మద్దతుదారుల లిస్ట్తో గవర్నర్ను కలవనున్న విజయ్?తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ ప్రయత్నాలుతమిళనాడు కాంగ్రెస్తో పాటు చిన్న పార్టీల మద్దతు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకేలకు లేఖ రాసిన విజయ్మద్దతు తెలిపేందుకు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్(5), ఏఎంఎంకే(1)మద్దతు కోసం విజయ్ వెయింటింగ్ఈలోపే.. లోక్భవన్ నుంచి టీవీకేకు కబురుసాయంత్రంలోగా మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపనున్న టీవీకేస్వయంగా వెళ్లి సమర్పించే యోచనలో విజయ్రేపు సీఎంగా ప్రమాణం చేసే చాన్స్బలనిరూపణకు ఇప్పటికే రెండు వారాల గడువు కోరిన విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారుమధ్యాహ్నాం చెన్నైకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్సాయంత్రం టీవీకే అధినేత విజయ్కు అపాయింట్మెంట్ ఖారారు చేసిన లోక్భవన్రేపు సీఎంగా విజయ్ ప్రమాణం చేసే ఛాన్స్గవర్నర్తో భేటీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్న టీవీకేఅన్నీ కుదిరితే.. రేపు నెహ్రూ స్టేడియంలో 11.30గం.కి సీఎంగా విజయ్ ప్రమాణంవిజయ్ ఒక్కడే ప్రమాణం చేసే అవకాశంబలనిరూపణకు.. గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్విజయ్కు శ్రీలంక నేతల శుభాకాంక్షలుతమిళనాట టీవీకే ప్రభంజనంతొలి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించిన విజయ్పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ విక్టరీఅభినందిస్తున్న శ్రీలంక నేతలువిజయ్ గెలుపుతో ఉత్తర ప్రావిన్స్లో తమిళ యువత సంబురాలువిజయ్కు విషెస్ తెలియజేసిన ప్రతిపక్ష నేత, ఎంపీ నమల్ రాజపక్సగతంలో.. శ్రీలంక విషయంలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించిన విజయ్శ్రీలంక తమిళుల కోసం గొంతెత్తడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యఖర్గేకు విజయ్ లేఖప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ మద్దతు కోరుతూ టీవీకే లేఖఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విజయ్సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ యూనిట్కే వదిలేసిన హైకమాండ్విజయ్ను కలిసేందుకు సమయం కోరిన కాంగ్రెస్తన కేబినెట్లో రెండు మంత్రి పదవులు కాంగ్రెస్కు!వామపక్ష పార్టీలనూ మద్దతు కోరిన విజయ్ఎల్లుండి వామపక్ష పార్టీలతో విజయ్ సమావేశంపళనిస్వామికి చుక్కలుటీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో లుకలుకలుఅన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి చుక్కలు చూపిస్తున్న చీలికలుఒక వర్గం ఇద్దామని.. మరో వర్గం ఇవ్వొద్దని వాదనలువిజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి గెలుపొందిన లీమాపళనిస్వామి నేతృత్వంలో నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకేకూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చసమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతుపై ఏమాత్రం ఆసక్తిగా లేని విజయ్గతంలో జయలలిత టైంలో విజయ్కు పలు చేదు అనుభవాలు!అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారంఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమైన పళనిస్వామి47 సీట్లతో మూడో స్థానంలో ఉన్న అన్నాడీఎంకే గవర్నర్.. చెన్నైకి వస్తారా?లోక్భవన్ పిలుపు కోసం టీవీకే ఎదురు చూపులుకేరళ, తమిళనాడుకు గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ప్రస్తుతం త్రివేండ్రంలో ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు లోక్భవన్కు సమాచారం అందించిన టీవీకే వర్గాలుఇప్పటికే బలనిరూపణకు రెండు వారాల గడువు కోరిన విజయ్మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపాలని ఇప్పటికే గవర్నర్ సూచనపూర్తి సమాచారం ఇచ్చాకే కమ్యూనికేట్ చేస్తామంటున్న లోక్భవన్ వర్గాలుగవర్నర్ వస్తే.. వెళ్లి కలిసే యోచనలో విజయ్ఐదు కోసం..తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే ప్రయత్నాలుమేజిక్ ఫిగర్ 118టీవీకే తరఫున నెగ్గింది 108తిరుచ్చి ఈస్ట్కి రాజీనామా చేసే యోచనలో విజయ్అదే జరిగితే 108 నుంచి 107కి పడిపోనున్న టీవీకే బలంకాంగ్రెస్, ఏఎంఎంకే సపోర్ట్తో 113కి పెరగనున్న టీవీకే బలంమరో ఐదుగురి కోసం టీవీకే ప్రయత్నాలుకాంగ్రెస్ నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీకాంగ్రెస్ వైఖరిపై డీఎంకే మండిపాటుకాంగ్రెస్ ఆ ఐదు స్థానాలు నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేసీట్ల పంపకం విషయంలో డీఎంకే తప్పు చేసింది.. మరిన్ని సీట్లు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు ఇచ్చేవాళ్లం: కాంగ్రెస్కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వస్తుందా? బయటి నుంచే టీవీకేకు మద్దతు ఇస్తుందా?డీఎంకే ఇందుకు ఒప్పుకుంటుందా?డీఎంకే-కాంగ్రెస్ బంధం ముగిసినట్లేనా?అదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లోనూ బలహీనపడనున్న డీఎంకే!టీవీకే ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరంతమిళనాడులో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసిన టీవీకేమహాబలిపురంలోని ఓ రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు బసడీఎంకే కూటమిలోని పార్టీలతో టీవీకే నేత సెంగొట్టాయాన్ మంతనాలుకాంగ్రెస్ మద్దతు దాదాపు ఖరారువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు రెండు మంత్రిత్వ శాఖలకు ఇచ్చే యోచనఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్కు టీవీకే గాలంమన్నార్గుడి నుంచి నెగ్గిన కామరాజ్రేపే విజయ్ ప్రమాణం?తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి టీవీకే ముహూర్తం ఫిక్స్రేపు 11.30 ని. నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణంముహూర్తం పెట్టిన రాధన్ పండిట్నాలుగేళ్ల కిందటే విజయ్ విజయాన్ని జోస్యం చెప్పిన రాధన్తమిళనాడు గవర్నర్ కోసం ఎదురు చూపులుప్రస్తుతం కేరళం త్రివేండ్రంలో ఉన్న గవర్నర్విజయ్కు మరో షాక్ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకేకు మద్దతు నిరాకరించిన ఐయూఎంఎల్తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన పార్టీడీఎంకే నాయకత్వానికే కట్టుబడి ఉంటామని వ్యాఖ్యఇప్పటికే మద్దతు ఇవ్వబోమని వీసీకే పార్టీ స్పష్టీకరణపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉: సారీ.. సపోర్ట్ ఇవ్వలేం!కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఫైర్విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయంతీవ్రంగా తప్పుబడుతున్న డీఎంకేసెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్గా డీఎంకే కూటమిలో కాంగ్రెస్వెన్నుపోటు కిందకే వస్తుందంటున్న డీఎంకేఇవాళ తమిళనాడు కాంగ్రెస్ సమావేశంస్టాలిన్ నేతృత్వంలో జరిగిన నిన్నటి కూటమి మీటింగ్కు కాంగ్రెస్ డుమ్మా విజయ్ మద్దతు అంశంపై విడిగా సమావేశమైన కాంగ్రెస్నేడు మరోసారి సమావేశమై మద్దతు ప్రకటన చేసే చాన్స్సంబంధిత వార్త: కాంగ్రెస్-డీఎంకే బంధం ముగిసినట్లేనా?టచ్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?టీవీకేకు టచ్లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుTVKకు మద్దతు ఇస్తామంటున్న పలువురు ఎమ్మెల్యేలుఅప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానంనేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంచెన్నైలోని AIADMK కార్యాలయంలో సమావేశంఅన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలుగెలిచిన ఎమ్మెల్యేలందరూ రావాలని పళనిస్వామి ఆదేశంఅవసరమైతే రిసార్ట్కు తరలించే యత్నంఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలుతమిళనాడులలో ఏ పార్టీకి దక్కని మెజారిటీ(118)అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (108)ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకేమహాబలిపురం రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇతర పార్టీల ప్రయత్నాలుచెన్నైలోనే ఉన్న 59 మంది డీఎంకే, 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే కీలక సమావేశంనేడు గవర్నర్ను కలవనున్న విజయ్?నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలవనున్న టీవీకే అధినేత విజయ్ప్రస్తుతం కేరళం పర్యటనలో ఉన్న గవర్నర్నేడు మధ్యాహ్నాం చెన్నైకి చేరుకునే చాన్స్సాయంత్రంలోపు అపాయింట్మెంట్ కోరిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వివరించే అవకాశంఇప్పటికే రెండు వారాల గడువు కోరుతూ లేఖరేపు సీఎంగా నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణం?ఒకటి తక్కువైంది!ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన తమిళగ వెట్రి కగళంమ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్విజయ్ కోరితే మద్దతు అంశం పరిశీలిస్తామన్న వామపక్షాలురెండు కలిపినా.. 9 స్థానాలేప్రభుత్వ ఏర్పాటునకు మరో సీటు తక్కువ -
‘విజయ్’భేరికి కకావికలం
తమిళనాట 2026 అసెంబ్లీ ఎన్నికలు సంచలనం సృష్టించాయి. అంచనాలను తలకిందులు చేశాయి. ‘విజయ్’భేరి ముందు దిగ్గజ పార్టీలు చిత్తయ్యాయి. రాజకీయాల్లో ఉద్దండులైన సీఎం స్టాలిన్ సహా 14 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. విజయ్ ప్రభంజనం ముందు మంత్రులే కాదు, కొన్ని పార్టీల కీలక నేతలు, హేమాహేమీలు నిలువలేకపోయారు. విజయ్ టీవీకే పార్టీ తరఫున దళితులు, దివ్యాంగులు, మహిళలు సత్తాచాటి ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని మార్పు చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించి 108 స్థానాలతో అతిపెద్ద పార్టీ గా అవతరించింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీ ల ఆధిపత్యానికి గండికొట్టింది. అభివృద్ధికి చిరునామా అయిన చెన్నై కొళత్తూరులో లేని వసతులు అంటూ లేవు. పదిహేనేళ్లుగా స్టాలిన్ ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే, ఇక్కడి ఓటర్లు తాజాగా ఆయన్ని ఓడించి, టీవీకేకు చెందిన వీఎస్ బాబును అసెంబ్లీకి పంపించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కూలిన మంత్రుల కోటలు డీఎంకే ప్రభుత్వంలోని మొత్తం 34 మంది మంత్రులలో 14 మంది ఘోరంగా ఓడిపోయారు. ఏళ్ల తరబడి తమ బలాన్ని చాటుతూ కంచు కోటలుగా నియోజకవర్గాలను మలచుకున్న సీనియర్లు విజయ్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నాయకులు, మంత్రులు దురైమురుగన్(కాటా్పడి), సుబ్రమణియన్ (సైదాపేట), అన్బిల్ మహేశ్(తిరువెరంబూరు), పళణి వేల్ త్యాగరాజన్, మూర్తి, నాజర్, స్పీకర్ అప్పావు(రాధాపురం), డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి(కీల్ పెన్నాత్తూరు) తదితరులు టీవీకే అభ్యర్థుల చేతిలో ఓటమి చెందారు.వీరిలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఎం.సుబ్రమణియన్, విద్యా మంత్రిగా అన్బిల్ మహేశ్ నిత్యం ప్రజలలోనే ఉన్నారు. తమిళనాడులో వైద్యం, విద్య బలోపేతంలో వీరి పాత్ర కీలకంగా నిలిచినా, విజయ్ ధాటికి తలవంచకతప్పని పరిస్థితి నెలకొంది. ఇక రాజకీయ ఉద్దండులైన నామ్ తమిళర్ కట్చి కనీ్వనర్ సీమాన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్, సినీ దర్శకుడు సుందర్ సీ వంటి వారు కూడా టీవీకే అభ్యర్థుల చేతిలో పరాజయం చవి చూశారు. ఒక్క ఓటుతో చేజారిన మంత్రి గెలుపు శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన పోరులో డీఎంకే సీనియర్ నేత, మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యారు. టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో మంత్రిపై గెలిచి చరిత్ర సృష్టించారు. 212 ఓట్లతో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచి్చన మంత్రికి చివరి రౌండ్ షాక్ ఇవ్వడంతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కౌంటింగ్ సమయంలో మూడు ఈవీఎంలు మొరాయించడంతో చివరకు వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడంతో ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి గెలుపొందడం విశేషం. భారీ మెజార్టీ లూ టీవీకే కైవసం ఈసారి తమిళనాడు అసెంబ్లీలో సామాన్యుల గళం మోగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన టాప్–10 అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే, అందులో 9 మంది విజయ్ పార్టీ కి చెందిన వారే ఉండటం విశేషం. అత్యధిక మెజారిటితో గెలిచిన వారిలో తొలి స్థానంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి 98,110 ఓట్ల మెజారిటీతో నిలవగా మిగిలిన 9 మంది టీవీకేకు చెందిన వారే. ఆ తర్వాతి స్థానాల్లో షోళింగనల్లూర్ నుంచి శరవణన్ (96,780), మాధవరం నుంచి విజయ్ ప్రభు (94,985) భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు. పూందమల్లి, సేలం వెస్ట్, ఆవడి వంటి నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీ సాధించారు.టీవీకే తరఫున సామాన్యులు రాజకీయ నేపథ్యం ఉన్నవారికే కాకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకూ విజయ్ టికెట్లు కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఓ ఆటో డ్రైవర్, ఓ డ్రైవర్ కుమారుడు, దివ్యాంగులు, మహిళలు గెలవడం విశేషం. టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 35 ఏళ్లలోపు వారు 22 మందికి పైగా ఉన్నారు. గెలిచిన వారిలో 26 మంది దళిత సామాజిక వర్గానికి చెందినవారు. 13 మంది మహిళలూ ఈ సారి టీవీకే తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇక పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీవీకే అభ్యర్థులు తమ డిపాజిట్లను కాపాడుకున్నారు. టీవీకే అభ్యర్థులు 67 చోట్ల ఓడినా రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకేలు మూడో స్థానానికి పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొంగు మండలం, డెల్టా, ఉత్తర తమిళనాడుల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించినా, కేరళ– తమిళనాడు సరిహద్దుల్లోని కన్యాకుమారి జిల్లాలో ఆరు స్థానాలు ఉండగా ఒక్కచోట కూడా ఖాతా తెరవక పోవడం గమనార్హం. -
ఓట్ల తేడా 17.43 లక్షలే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మంగళవారం స్పందించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన టీవీకేకు, డీఎంకేకి పోలైన ఓట్లలో తేడా 17.43 లక్షలు మాత్రమేనన్నారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 74 సీట్లు గెలుచుకోగా, ఇందులో డీఎంకేకి 59 స్థానాలు దక్కాయి. సోమవారం వెలువడిన ఫలితాలపై మంగళవారం ఎంకే స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. టీవీకే, డీఎంకే కూటమికి ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమేనన్నారు. డీఎంకే కూటమికి 1.54 కోట్ల మంది ఓటేశారని ఆ ప్రకటనలో వివరించారు. తమకు పడిన ప్రతి ఓటూ తమపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అనేక పర్యాయాలు అధికారం చేపట్టిందని గుర్తు చేస్తూ ఆయన, ‘మేం చూడని విజయం లేదు, ఎదుర్కోని ఓటమి లేదు’అని పేర్కొన్నారు. ‘గెలుపోటములను సమానంగా చూస్తూ, ఆశయ సాధన దిశగా ప్రయాణాన్ని కొనసాగించేవారే పార్టీ నిజమైన కార్యకర్తలు. ఈ ఉద్యమానికి ఆధారం, పునాదులు’అని పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. స్టాలిన్ రాజీనామా..ఆమోదం తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇన్ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు పంపించారు. సీఎం స్టాలిన్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ అర్లేకర్ ఆమోదించారని అనంతరం లోక్భవన్ తెలిపింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని స్టాలిన్ను గవర్నర్ కోరారని వివరించింది. ఓటర్లకు కృతజ్ఞతగా ర్యాలీ స్టాలిన్ మంగళవారం ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కూటమి పార్టీలకు చెందిన వైగో, తదితరులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలెవరూ ఈ భేటీకి రాకపోవడం గమనార్హం. సాయంత్రం ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతగా రోడ్షో చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంకే వర్గాలు, మద్దతుదారులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయ నిధి? 59 మంది సీట్లను గెల్చుకున్న డీఎంకే అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఉదయనిధిని ప్రశ్నించగా, అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తెలిపారు. -
విజయ్ పొత్తు ఎవరితో?
సాక్షి, చెన్నై: ద్రవిడ రాజకీయాలను మట్టికరిపిస్తూ జనం మద్దతుతో ప్రభంజనంలా దూసుకొచ్చిన యువనేత, టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఫోన్చేసి ప్రత్యేకంగా విజయ్ను అభినందించిన నేపథ్యంలో పొత్తుకు కాంగ్రెస్ ఆసక్తి కనబరుస్తోందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. వీటిని టీవీకే పార్టీ కొట్టిపారేయలేదు. దీంతో విజయ్ ఏ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది.వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొంది. లేఖపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీవీకే పార్టీకి గవర్నర్ రెండు ఆప్షన్లు ఇచ్చే వీలుంది.అసెంబ్లీ బలనిరూపణ చేసుకోవాలని టీవీకే చీఫ్కు గవర్నర్ సమన్లు జారీచేయొచ్చు లేదా భాగస్వామ్య పార్టీల తనకుందని నిరూపించుకుంటూ అధికారిక లేఖను సమర్పించాలని కోరవచ్చు. 118 సీట్లకంటే అధిక మెజారీటి తనకుందని విజయ్ నిరూపించునే పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణం విజయ్ను గవర్నర్ ఆహ్వానించే ఆస్కారముంది. ‘‘బయటి ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరో 6 నెలల తర్వాత కూడా విజయ్ తన బలాన్ని నిరూపించుకోవాల్సిరావొచ్చు’’అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చిన్న పార్టీలు కలిసొస్తాయా? విజయ్ రెండు చోట్ల పోటీచేసిన కారణంగా ఒక స్థానంలో రాజీనామాచేయాల్సిందే. దాంతో ఇప్పుడున్న టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 108 నుంచి 107కు తగ్గుతుంది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గంసుగమం అయితే ఈ 107లోనే ఒకరు అసెంబ్లీ స్పీకర్ అవుతారు. అప్పుడు ఆయన బలనిరూపణ వేళ ఓటు వేయడం కుదరదు. దీంతో టీవీకే బలం 106కు తగ్గుతుంది. దీంతో బలనిరూపణ వేళ సాధారణ మెజారిటీ కోసం టీవీకేకు కనీసం మరో 12 మంది సభ్యుల మద్దతు అవసరం. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే), దేశీయ మూర్పొక్కు ద్రవిడ కళగం, బీజేపీ తలో స్థానంలో గెలిచాయి. సీపీఐ(ఎం), విదుథలై చిరుతైగల్ కట్చి, సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు తలో రెండు చోట్ల గెలిచాయి. పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) నాలుగు చోట్ల, కాంగ్రెస్ ఐదు చోట్ల గెలిచింది.ఈ తొమ్మిది పార్టీల్లో కొన్నింటితో కచ్చితంగా పొత్తు పెట్టుకుని అదనంగా 12 మంది సభ్యుల మద్దతును విజయ్ సాధించాల్సిందే. నేడు గవర్నర్ అర్లేకర్ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే చీఫ్ కోరనున్నారని తెలుస్తోంది. మద్దతుగా తన కొత్త ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లనున్నారని సమాచారం. గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు పనయూర్లోని విజయ్ ఇంటి వద్ద తమిళపోలీసులు భద్రతను పెంచారు. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్లలో విజయ్ పోటీచేసి రెండుచోట్ల నెగ్గారు. అయితే తిరుచిరాపల్లి ఈస్ట్స్థానంలో విజయ్ రాజీనామా సమర్పించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. చెన్నైలోని పెరంబర్ నుంచే విజయ్ ఎమ్మెల్యే కొనసాగే ఛాన్సుంది. టీవీకే శాసన సభాపక్ష నేతగా విజయ్ విజయ్ మంగళవారం కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా విజయ్ను టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. తర్వాత పార్టీ సైద్ధాంతిక నేతలకు విజయ్ నివాళులర్పించారు. పెరియార్ ఈవీ రామస్వామి, బీఆర్ అంబేడ్కర్, కె.కామరాజ్, వేళు నచియార్, అంజలాయ్ అమ్మళ్లకు విజయ్ నివాళులర్పించారు. ‘‘234 మంది సభ్యులుండే అసెంబ్లీలో 118 మంది మద్దతుతో మేం బలనిరూపణలో విజయం సాధించబోతున్నాం’’అని సమావేశం తర్వాత టీవీకే నేత నంజిల్ సంపత్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను చెన్నై ఈసీఆర్లోని ఓ రిసార్టుకు తరలించారు. జీవితాంతం రుణపడి ఉంటా: విజయ్ సాక్షి, చెన్నై: ఎన్నికల్లో విజయం సాధించిన సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ మంగళవారం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడులోని చిన్నవారు, యువకులు, పెద్దలు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆయన ఎక్స్లో మంగళవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనను హేళన చేసిన వారు, చులకనగా చూసిన వారికి ప్రజలే గట్టిగా ఎన్నికల ఫలితాల రూపంలో బుద్ధి చెప్పారన్నారు. విమర్శలు, ఒడిదొడుకులు ఎన్నో ఎదురైనా, ముసుగేసుకుని కొందరు విమర్శలు చేసినా, ప్రజలు ఇచ్చిన భరోసా జీవితాంతం గుర్తుండి పోతుందని, అందుకే వారికి జీవిత కాలం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. విజయ్ మా మద్దతు కోరారు: కాంగ్రెస్న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినప్పటికీ సాధారణ మెజార్టీ కాస్తంత దూరంలో ఆగిపోయిన టీవీకే పార్టీ భావసారూప్య పార్టీల మద్దతు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టీవీకే చీఫ్ విజయ్ తమను సంప్రదించారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మాట్లాడారు. ‘‘తమిళనాడులో ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ విజయ్ మమ్మల్ని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడులో అధికారం చేజిక్కించుకునేందుకు అవకాశం ఇవ్వబోం.విజయ్ అభ్యర్థన మేరకు, తమిళ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి మేం దిశానిర్దేశం చేశాం. తమిళ ఓటర్ల సెంటిమెంట్కు విలువ ఇస్తూ స్వీయనిర్ణయం తీసుకోవాలని టీఎన్పీసీసీకి సలహాలు, సూచనలు ఇచ్చాం’’అని మీడియాతో కేసీ వేణుగోపాల్ చెప్పారు. 234 సీట్లున్న తమిళనాడులో విజయ్ పార్టీ 108 చోట్ల గెలిచింది. టీవీకేకు కనీసం 12 మంది ఎమ్మెల్యేల అదనపు మద్దతు అవసరం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఐదు చోట్ల గెల్చింది. పట్టాలి మక్కల్ కట్చి మరో నాలుగోచోట్ల, సీపీఐ, సీపీఎం చెరో రెండు చోట్ల గెలిచాయి.ఈ నాలుగు పార్టీల మద్దతుతో అంటే ఈ పార్టీల 13 మంది ఎమ్మెల్యేల మద్దతులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని వార్తలొచ్చాయి. -
స్టాలిన్ లేటెస్ట్ రోడ్ షో..
అది ఎన్నికల ప్రచారం కాదు.. విజయోత్సవ ర్యాలీ అంతకన్నా కాదు. తాను ప్రజల మనిషినే అని చెప్పుకునే ఎంకే స్టాలిన్ ర్యాలీ అది. ఆయన ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాట ఎన్నికల్లో అటు అభ్యర్థిగానూ, ఇటు పార్టీని విజయపథంలో నడిపించడంలోనూ విఫలమయ్యారు స్టాలిన్. టీవీకే విజయ్ దెబ్బతో డీఎంకే, అన్నాడీఎంకేలు ఘోరంగా చతికిలబడ్డాయి. ఇది స్టాలిన్ కలలో కూడా ఊహించి ఉండరు. కచ్చితంగా గెలుస్తామని, అటు సర్వేలు కూడా డీఎంకేకు పట్టం కట్టిన వైనం. అయితే ‘ఛేంజ్’ చేసేశారు ప్రజలు. తమ ఓటుతో విజయ్కు జైకొట్టారు. ఇదిలా ఉంచితే,. ఎవరైనా ఓడిపోతే పూర్తిగా చతికిలబడిపోయి కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం ఆవుతారు. కానీ స్టాలిన్ అలా చేయలేదు. ఓడిపోయిన రెండో రోజే రోడ్ షో పేరుతో ప్రజల ముందుకు వచ్చారు స్టాలిన్. తనను ఓడించిన కొళత్తూరు ప్రజల ముందుకే వచ్చి.. అభివాదం చేశారు. ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ) స్టాలిన్ తాను పరాజయం పాలైన కొళత్తూరులో పర్యటించారు. తాను ఓడిపోయిన చాయలు ముఖంలో కనిపిస్తున్నప్పటికీ స్టాలిన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనను ఓడించిన ప్రజలను కలవాలని ఇలా రోడ్ షోలో పాల్గొన్నారా.. లేక తనకు ఓట్లు వేసిన జనానికి ఒకసారి రోడ్ షో రూపంలో థాంక్స్ చెబుదామనుకున్నారో కానీ ‘మీతోనే ఉంటానని, మీ వాడిగానే ఉంటాననేది’ ఆయన ముఖంలో మాత్రం కనిపించింది. கொளத்தூருக்கும் எனக்குமான உறவு தேர்தல் வெற்றி, தோல்விகளைக் கடந்த உறவு.15 ஆண்டுகாலம் எனக்கு ஆதரவு நல்கியவர்கள் கொளத்தூர் தொகுதி மக்கள். அதில், 10 ஆண்டுகள் எதிர்க்கட்சி வரிசையில் இருந்தும், 5 ஆண்டுகள் ஆளும்கட்சியாகவும் என்னால் இயன்ற அனைத்துத் திட்டங்களையும் கொளத்தூருக்குக் கொண்டு… pic.twitter.com/xtXB8p6ChR— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 5, 2026 #WATCH चेन्नई: डीएमके प्रमुख और तमिलनाडु के निवर्तमान सीएम एम.के. स्टालिन कोलाथुर विधानसभा क्षेत्र पहुंचे। राज्य के पूर्व मंत्री पीके सेकर बाबू भावुक हुए। pic.twitter.com/SB6vkKYbnh— ANI_HindiNews (@AHindinews) May 5, 2026 -
థ్యాంక్యూ మోదీజీ: విజయ్
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో విజయ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ ట్వీట్కు టీవీకే చీఫ్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మా ఏకైక లక్క్ష్యం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాం. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. Thank you, Hon'ble @PMOIndia, for your greetings. The well-being of our people remains our only goal. Transcending politics, we shall focus on the State's progress and the welfare of people of Tamil Nadu. We look forward to the Union Government’s support in this endeavor. https://t.co/EO4h8qC0hF— TVK Vijay (@TVKVijayHQ) May 5, 2026 -
సింగిల్ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్ టాపిక్గా విజయ్ ఆస్తి
సాక్షి, చెన్నై: తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, ఆ పార్టీ వ్యవస్థాపకుడు,అధినేత సి. జోసెఫ్ విజయ్ 'జన నాయగన్' (Jana Nayagan)గా సీఎం పీఠం అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శాసనపక్ష నేతగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజయ్ ఆస్తులు, ఆర్థిక వివరాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 2026 మార్చి 30న భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 27 పేజీల అఫిడవిట్లో సమర్పించిన వివరాలు విశేషంగా నిలుస్తున్నాయి.దీని ప్రకారం విజయ్ ప్రకటించిన నికర విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ. 404 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 220 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు; ఈ ఆదాయం స్వయం ఉపాధి, అద్దె ఆదాయం , వడ్డీ ఆదాయం ద్వారా సమకూరింది.ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి నాలుగు బకాయి డిమాండ్లు పెండింగ్లో ఉండగా, వాటి మొత్తం విలువ రూ. 3 కోట్లకు పైగా ఉంది. ఒకే సేవింగ్స్ ఖాతాలో రూ. 213 కోట్లు విజయ్ పేర్కొన్న అఫిడవిట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మార్చి 27, 2026 నాటికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సాలిగ్రామం శాఖలోని ఒకే ఒక పొదుపు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉండటం. ఇది ఏదో ఒక నిర్దిష్ట పెట్టుబడి పథకం గానీ, మార్కెట్తో అనుసంధానమైన ఉత్పత్తి గానీ కాదు; కేవలం ఒక సాధారణ పొదుపు ఖాతా మాత్రమే. ఆయన ప్రకటించిన మొత్తం నికర విలువలో మూడో వంతుకు పైగా వాటా ఈ ఖాతాదే కావడం విశేషం.స్థిర డిపాజిట్లు (Fixed Deposits): నాలుగు బ్యాంకుల్లో కలిపి రూ. 100 కోట్లుAxis Bank : ఇందిరా నగర్ శాఖ : రూ. 40 కోట్లుIndian Overseas Bank, కోడంబాక్కం శాఖ : రూ. 25 కోట్లుHDFC Bank, బసంత నగర్ శా ఖ: రూ. 20 కోట్లుState Bank of India, శాస్త్రి నగర్ శాఖ : రూ. 15 కోట్లుIOB పొదుపు ఖాతాలోని నిల్వను కూడా కలిపి చూస్తే, ఆయన ప్రకటించిన సంపదలో రూ. 313 కోట్లకు పైగా మొత్తం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉంది. ఇవి ఎటువంటి మార్కెట్ రిస్క్ లేని, హామీతో కూడిన రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు.ఈక్విటీలో షేర్ల విలువ రూ. 19.37 లక్షలుస్టాక్ మార్కెట్లో ఆయన పెట్టుబడులు చాలా స్వల్పంగా ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఆర్కైవ్ చేసిన అఫిడవిట్ ప్రకారం, జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్లో రూ. 19.03 లక్షల విలువైన షేర్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో రూ. 9,600 విలువైన షేర్లు, మరియు సన్ పేపర్ మిల్ లిమిటెడ్లో రూ. 25,000 విలువైన షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీటి మొత్తం ఈక్విటీ వాటా రూ. 19.37 లక్షలు, ఇది ఆయన ప్రకటించిన నికర ఆస్తి విలువలో 0.04 శాతం కంటే తక్కువ. ఎలాంటి మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా డిబెంచర్లను ప్రకటించలేదు.స్థిరాస్తులు: విజయ్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్థిరాస్తులు విలువ రూ. 220 కోట్లు. ఇవి నాలుగు వర్గాలలో విస్తరించి ఉన్నాయి. నీలన్కరై, సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మోర్ , సమీప ప్రాంతాలలో ఉన్న నివాస ఆస్తులు, వీటి విలువ పది ఆస్తులలో సుమారుగా రూ. 115 కోట్లు.పరివక్కం, త్యాగరాయ నగర్, షోలింగనల్లూర్ మరియు కొప్పూర్లలో ఉన్న వాణిజ్య ఆస్తులు, వీటి విలువ సుమారుగా రూ. 82.8 కోట్లు. అతిపెద్ద ఏకైక వాణిజ్య ఆస్తి కొప్పూర్ గ్రామంలోని 2.30 ఎకరాల భూమి ఉంది. దీన్ని 2023లో నవంబర్ 2023లో రూ. 35.81 కోట్లకు కొనుగోలు చేశారు.పోరూర్, సాలిగ్రామం మరియు నీలన్కరైలలోని వ్యవసాయేతర భూమి విలువ రూ. 22 కోట్లు. ఒక్క ఆయన పోరూర్ ప్లాట్ మాత్రమే 33,955 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.కొడైకనాల్లోని విల్పట్టి గ్రామంలో ఉన్న 0.25 ఎకరాల చొప్పున రెండు వ్యవసాయ ప్లాట్లను 1997లో ఒక్కొక్కటి రూ. 15,000కు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఒక్కొక్కటి రూ. 10 లక్షలుగా ప్రకటించారు.ఇదీ చదవండి : విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?ఈ ఆస్తుల నుండి వచ్చే అద్దె ఆదాయాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్రియాశీల ఆదాయ వనరుగా ప్రకటించారు. విజయ్ తన వ్యక్తిగత ఆస్తులకు అతీతంగా, అధికారిక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అయిన జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్ : ఫ్యాషన్ వరల్డ్ షాక్! అదిరిపోయే వాహనాలు: విజయ్ గ్యారేజ్లో కొలువు దీరిని లగ్జరీ కార్ల విలువ రూ. 13.52 కోట్లకు పైమాటే.2024 Toyota Lexus 350: రూ. 3.01 కోట్లు2015 Tata Caravan: రూ. 6 కోట్లు2024 BMW i7: రూ. 2 కోట్లు2014 Toyota Vellfire: రూ. 1.63 కోట్లు2020 BMW 530: రూ. 80.54 లక్షలు2024 Maruti Swift: రూ. 5.35 లక్షలు2025 TVS XL Super: రూ. 67,400ఆభరణాలు: విజయ్ వ్యక్తిగతంగా 883 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 1.20 కోట్లు) మరియు రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులను ప్రకటించారు. ఆయన సతీమణి సంగీత, విడిగా 3,132 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 4.07 కోట్లు), 2 కిలోల వెండిని (విలువ రూ. 4.75 లక్షలు), మరియు 134.91 క్యారెట్ల వజ్రాలను (విలువ రూ. 1 కోటి) ప్రకటించారు.ఇవి కాకుండా రుణాలు ,అడ్వాన్సుల రూపంలో : రూ. 75.5 కోట్లున్నాయని ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే!సంగీత ఆస్తులు రూ. 15.76 కోట్లువిజయ్ భార్య( విడాకుల కేసు పెండింగ్లో ఉంది) సంగీత విజయ్ తన మొత్తం ఆస్తులను రూ. 15.76 కోట్లుగా విడిగా ప్రకటించారు. ఇందులో రూ. 15.51 కోట్ల చరాస్తులు (HDFC బ్యాంక్, బసంత నగర్ శాఖలో ఉన్న రూ. 10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ మరియు రూ. 43.41 లక్షల పొదుపు నిల్వతో కలిపి) , రూ. 25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా -
TVK Vijay: ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం
-
విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళనాట నటుడు, టీవీకే అధినేత విజయ్ సంచలనం విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన స్టార్ పవర్తోపాటు, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాడు. కానీ ఇంతకుముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని విజయ్ ముందు సవాళ్లు ఏంటి? పరిపాలన ఎంత విజయవంతంగా నిర్వహించగలడు? అనేది ప్రధాన చర్చ. అధికార పగ్గాలను చేపట్టిన తరువాత హామీలను నెరవేర్చడం తక్షణ ఆర్థిక సవాల్. విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలి ఏడాదిలోనే అదనంగా రూ. 42,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి.విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలంటే మొదటి ఏడాదిలోనే సుమారు రూ. 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి రూ. 1.22 లక్షల కోట్లు (GSDPలో 3శాతం) ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారనుంది.రూ. 42,000 కోట్ల అదనపు భారంమహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను విజయ్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. విజయ్ ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా? లేదా అప్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే దీనికి కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆర్థిక భారం తక్కువగానే ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.మరీ ముఖ్యంగాప్రధానంగా మహిళలకు నెలవారీ సహాయాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంపు. దీని వల్ల ఏటా అదనంగా రూ. 21,617 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల మొత్తం వ్యయం రూ. 36,029 కోట్లకు చేరుతుంది.వృద్ధాప్య పింఛన్ను రూ. 1,200 నుండి రూ. 3,000కి పెంచడం వల్ల రూ. 6,549 కోట్ల అదనపు భారం పడుతుంది. విడో పెన్షన్ల కోసం రూ. 1,829 కోట్లు, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 504 కోట్లు అదనంగా అవసరం. ఏడాదికి 6 ఉచిత LPG సిలిండర్ల హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 7,074 కోట్ల భారం పడుతుంది. ఇక రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 15,000 సాయం కింద (కేంద్రం ఇచ్చే రూ. 6,000 కాకుండా) రాష్ట్రం అదనంగా రూ. 1,941 కోట్లు భరించాలి. అలాగు కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కోసం మరో రూ. 382 కోట్లు అవసరం.పరిమిత ప్రభావంమరోవైపు కొన్ని పథకాల వల్ల ఆర్థిక భారం పరిమితంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివాహ పథకాల కింద సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 8 గ్రాముల బంగారం సహాయం అందిస్తోంది. అంటే విజయ్ ప్రకటించిన పెళ్లిచేసుకునే యువతులకు ప్రకటించిన 8 గ్రాముల బంగారం, పట్టుచీర వల్ల అదనపు ఖర్చుల భారం పెద్దగా ఉండక పోవచ్చు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకాప్రతిపాదిత నిరుద్యోగ భృతి,గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.3,000, కఠినమైన అర్హత నిబంధనలను కొనసాగిస్తే, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా భారం పడకపోవచ్చు. కఠినమైన ఆదాయ పరిమితులతో ఉన్న ప్రస్తుత పథకానికి కేవలం రూ.2.37 కోట్ల వ్యయం మాత్రమే కాగా, దీనిని విస్తరించినా కూడా వ్యయం రూ.16 కోట్లలోపే ఉండవచ్చు.తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే దేశ సగటు సామాజిక వ్యయం 42 శాతంగా ఉంటే, తమిళనాడులో ఇది 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 34 శాతానికి పడి పోయింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం తన సొంత పన్ను రాబడి వ్యయాన్ని మెరుగు పరుచుకున్నప్పటికీ, దాని కట్టుదిట్టమైన వ్యయం (వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు) 35 శాతంతో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. కాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) 2026 తమిళనాడు ఎన్నికలలో తొలిసారిగా ఘన విజయం సాధించింది. బూటకపు పార్టీ, పొలిటికల్ డ్రామా ఆడుతున్న సినిమా స్టార్ అన్న వెక్కిరింపులకు ధీటుగా రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! -
విజయ్ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీని వెనక మరో వ్యూహం ఉండొచ్చనే చర్చా జోరందుకుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్ల విక్టరీతో సంచలన విజయం నమోదు చేసింది తెలిసిందే. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీకి టీవీకే దగ్గర్లోనే ఆగిపోయింది. అయినప్పటికీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్ తమిళనాడు గవర్నర్ను కోరారు. ఆ వెంటనే.. నెగ్గిన వాళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి రప్పించిన ఆయన.. అటు నుంచి అటే పూంజేరీలోని ఓ స్టార్ హోటల్కు తరలించాలని నిర్ణయించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే వాళ్లకు బస ఏర్పాటు చేయాలని పార్టీ కీలక నేతలను ఆయన ఆదేశించారు. అయితే..విజయ్ మాస్టర్ ప్లాన్?టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఒకట్రెండు సీట్లు నెగ్గిన పార్టీలు విజయ్ పార్టీతో అధికారంలో భాగమయ్యేందుకు ముందుకు వచ్చాయి. మద్దతు అంశం పరిశీలిస్తామని బహిరంగంగా ప్రకటనలు సైతం చేస్తున్నాయి. అయితే ఆయన ఈ విషయంలో ఆచితూచీ అడుగేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే పూర్తిగా ఆయన నిర్ణయమేనని.. అందులో తమ పాత్ర ఏదీ ఉండబోదని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. రెండు వారాల గడువు కోరడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది. ఈలోపు సమీకరణాలు ఎలాగైనా మారొచ్చని ఆయన లెక్కేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పటికైనా రిస్క్ ఉండొచ్చు. అందుకే పెద్ద చేపలకే ఆయన గాలం వేసి ఉంటారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్లో డీఎంకే లేదంటే అన్నాడీఎంకే నుంచి పలువురు బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించే అవకాశం లేకపోలేదు(అసలే అన్నాడీఎంకేలో ఆ అసంతృప్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది). ఇందుకు అవకాశం ఉండడంతోనే.. డీఎంకే, అన్నాడీఎంకేలు అప్రమత్తం అయ్యాయి. ఇవాళ చెన్నైలో ఆ పార్టీలు కీలక సమావేశాలు పెట్టుకున్నాయి. ఎమ్మెల్యేలంతా చెన్నైకు తరలి రావాలని ఆదేశించాయి. అటు నుంచి అటే వాళ్లను కూడా రిసార్ట్లకు తరలించవచ్చనే చర్చా అక్కడ జోరందుకుంది. మొత్తానికి విజయ్ మాస్టర్ స్ట్రోక్కు తమిళనాట దిగ్గజ పార్టీలు విలవిలలాడిపోతున్నాయి. -
CM పదవికి స్టాలిన్ రాజీనామా.. గవర్నర్ కు లేఖ
-
ఒక్క ఓటు.. ఎంత పని చేసింది?
టీవీకే అధినేత విజయ్ ఒక పొలిటీషియన్గా కంటే నటుడిగా సందేశాత్మక చిత్రాల ద్వారానే తమిళ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తమిళన్, తుపాకీ, సర్కార్, మెర్సల్, బిగిల్ ఇలా.. ఆయన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ కనిపిస్తుంటుంది. అయితే ఇందులో మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన సర్కార్లో ఓటు అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధమో అనేది చూపించారు. ఆ చిత్రంలో ఓటు హక్కు దుర్వినియోగం అయిన బాధితుడిగా కోర్టులో తన కేసు తానే వాదించుకుంటారు విజయ్. వాజ్పేయి సర్కార్ కూలిపోవడం దగ్గరి నుంచి.. ఒక్క ఓటు ప్రాధాన్యం కూడా ఆయన ఆ సీన్లో వివరిస్తారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపట్టూరు(185వ) నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే అభ్యర్థి.. మంత్రి పెరియాకరుప్పన్పై ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ విజయం ఈ ఎన్నికల ఫలితాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. అయితే.. ఈ ఒక్క చోటుకి కారణమైన వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. విజయ్ వీరాభిమాని అయిన మణికందన్ ఒమన్(మస్కట్)లో పని చేస్తున్నాడు. సుమారు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చి టీవీకే అభ్యర్థికి ఓటేశాడు. ఈ విషయాన్నే నిన్న ఎన్నికల ఫలితం తర్వాత తన సోషల్ మీడియాలో అతను షేర్ చేసుకుని మురిసిపోయాడు. అంతేకాదు.. ఓటేయడానికి వచ్చే విషయాన్ని కూడా అతను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. అంతే.. ఒక్క ఓటు పవర్ ఏంటో తెలిసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. Booked my flight ticket to vote for TVK. Awake and hopeful — lots of prayers that the survey turns true on May 4th— Manikandan Sivanantham (@mkxuv700) April 15, 2026 -
సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకే ఇతర పార్టీలతో కీలక మంతనాలు జరుపుతోంది. మరోవైపు దారుణ పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. ఓటమిపై స్పందించిన స్టాలిన్.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను ఇక మీదట డీఎంకే సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఘోర ఓటమి పాలైంది. కేవలం 59 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గారు. కొలతూర్లో డీఎంకే అధినేత స్టాలిన్ సహా మంత్రులంతా దాదాపుగా ఓటమి పాలయ్యారు. చెపాక్లో డిప్యూటీ సీఎం, ఆయన తనయుడు ఉదయనిధి మాత్రం నెగ్గారు. ఇవాళ స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం జరగనుంది. ఓటమిపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే ప్రతిపక్ష నేతగా స్టాలిన్ తనయుడు ఉదయనిధిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చదివిన కాలేజీలోనే ఎమ్మెల్యే విన్నింగ్ సర్టిఫికెట్ తీసుకున్న TVK విజయ్
-
టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నిక
తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ టీవీకే. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజారిటీ లేకపోవడంతో.. ఏం జరగనుంది? అనే ఉత్కంఠ నెలకొంది. తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం.. లైవ్ అప్డేట్స్టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్తమిళనాడులో కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఐదు ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరిన టీవీకేఅందుకు చర్చలు జరిపి ఓకే తెలిపిన కాంగ్రెస్మోదీ ట్వీట్కు దన్యవాదాలు తెలిపిన విజయ్ఇతర పార్టీలతో టీవీకే చర్చలురేపు గవర్నర్ను కలవనున్న టీవీకే చీఫ్ విజయ్మద్దతు కోసం ఇతర పార్టీలతో టీవీకే చర్చలుతమ పార్టీ నుంచి గెలిచిన వారిని రిసార్టుకు తరలింపు7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?టీవీకే తరఫున ఎన్నికైన నేతలతో ముగిసిన విజయ్ భేటీ ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం? టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నికఎన్నికైన నేతలతో చర్చించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు స్టాలిన్ రాజీనామాను ఆమోదించిన తమిళనాడు గవర్నర్ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్తెరపైకి రిసార్ట్ రాజకీయంతమిళనాడులో మరోసారి తెర మీదకు రిసార్ట్ రాజకీయంమల్లాపురంలోకి రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేల తరలింపుప్రభుత్వ ఏర్పాటునకు సమయం పట్టేలా ఉండడంతో ఈ నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే బసమరోవైపు.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్అప్రమత్తమైన డీఎంకే, అన్నాడీఎంకేవెంటనే చెన్నైకి రావాలంటూ ఇరు పార్టీల నెగ్గిన అభ్యర్థులకు పిలుపుసమావేశాల తర్వాత.. రిసార్టులకు వాళ్లనూ తరలించే చాన్స్విజయ్ విక్టరీపై ప్రేమలత విజయ్కాంత్ ఆసక్తికర వ్యాఖ్యలువిజయ్ మా బిడ్డలాంటోడుఅందుకే ఆయన్ని ఏనాడూ విమర్శించలేదుమొదటి నుంచి ఆయన కెప్టెన్(విజయ్కాంత్)తో ఉన్నారువిజయ్ చక్కగా పాలించాలితమిళనాడు ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచిన డీఎండీకేటీవీకే ఫ్లోర్ లీడర్గా విజయ్!టీవీకే ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న విజయ్ భేటీఫ్లోర్ లీడర్గా విజయ్ ఎన్నికఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన స్థానాలపై చర్చతమిళనాట ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేకీలకంగా మారిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇతర చిన్న పార్టీలువిజయ్ వదులుకునేది ఆ స్థానాన్నే?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయంపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్పెరంబూర్ (Perambur)లో 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విజయ్తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గంలో 27,416 ఓట్ల మెజారిటీతో విజయంరెండింటిలో ఏదో ఒకదానిని వదులుకోవాల్సిన పరిస్థితితిరుచ్చి ఈస్ట్ను వదులుకునే యోచనలో విజయ్?విజయ్ వదులుకుంటే ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠటీవీకే ఆఫీస్లో విజయ్తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే108 స్థానాల్లో విజయ్ పార్టీ విక్టరీపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్నెగ్గిన ఎమ్మెల్యేలతో టీవీకే ఆఫీస్లో విజయ్ భేటీ (106+విజయ్+విజయ్)ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభంఇవాళ అన్నాడీంకే కీలక సమావేశంతమిళనాడు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేనేడు పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ కీలక సమావేశంగెలిచిన ఎమ్మెల్యేలు చెన్నైకి రావాలని పళని పిలుపుటీవీకే కీలక ప్రకటనప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై వస్తున్న రూమర్లకు టీవీకే చెక్నిన్న.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న టీవీకేఇవాళ.. జట్టు కట్టవచ్చనే సంకేతాలుఏ పార్టీతో జత కట్టాలనేది అధినేత విజయే నిర్ణయిస్తారని టీవీకే కీలక నేతల వ్యాఖ్యఇప్పటికే సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలుప్రభుత్వ ఏర్పాటులో.. ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2లు కూడా కలిసొచ్చే అవకాశంకొనసాగుతున్న టీవీకే కీలక సమావేశంఎమ్మెల్యేలతో విజయ్ భేటీమరికాసేపట్లో స్పష్టత వచ్చే చాన్స్ఇప్పటికే.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్స్టాలిన్ రాజీనామాతమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామారాజీనామా లేఖను గవర్నర్కు పంపిన డీఎంకే అధినేతఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్కు లేఖ రాసిన టీవీకే అధినేత విజయ్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరిన విజయ్ఓటమిపై స్పందిస్తూ ప్రజా తీర్పును శిరసావహిస్తానని స్టాలిన్ ప్రకటనప్రధాన ప్రతిపక్షం బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడితమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికొలతూర్లో ఓడిన ఎంకే స్టాలిన్కాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ను ఎన్నుకునే అవకాశం టీవీకే ఆఫీస్కు విజయ్టీవీకే ప్రదాన కార్యాలయానికి చేరుకున్న అధినేత విజయ్మరికాసేపట్లో గెలిచిన 108 ఎమ్మెల్యేలతో సమావేశంశాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశంప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలుకాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకునే చాన్స్?ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడుపు కోరిన విజయ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్ ఆహ్వానిస్తే మద్దతిస్తాంతమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుతమిళనాడు ఎన్నికల్లో చెరో రెండు సీట్లు నెగ్గిన వామపక్ష పార్టీలుసీపీఐ రెండు, సీపీఎం 2ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యానికి లెఫ్ట్ పార్టీల ఆసక్తివిజయ్ ఆహ్వానిస్తే మద్దతు గురించి చర్చిస్తామంటున్న వామపక్షాలుఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్ సంప్రదింపులుడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ!తమిళనాట 108 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేఅధికారానికి మరో 10 సీట్ల దూరంలో విజయ్ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న చిన్నపార్టీల లెక్కలుకీలకంగా ఆ పార్టీలు?తమిళనాడు లో సంకీర్ణ ప్రభుత్వం, ఏ పార్టీ కు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వని తమిళ ప్రజలు108 అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీవీకే డీఎంకే 59, ఏ. ఐ.డి.ఏం కే 47 సీట్లు లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు గాను 10 సీట్లు దూరంలో టివికేరెండు వారాల్లో ప్రభుత్వం ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరిన విజయ్ గడువులోగా మెజారిటీ నిరూపించుకునేందుకు సిద్ధం అంటూ లేఖకీలకంగా మారిన తమిళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతమినాడు లో కాంగ్రెస్ 5 స్థానాలు, పి.ఏం.కే 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలుఇవిగాక.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2, డీఎండీకే 1, అమ్మ మక్కల్ పార్టీ 1 స్థానాలుఒకే ఒక్క స్థానంలో నెగ్గిన బీజేపీ 1కీలకంగా మారిన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్ష పార్టీలుఏం తేలుస్తారో?టీవీకే ప్రధాన కార్యాలయం పనయూరు వద్ద విజయ్ అభిమానులు సందడితమిళనాడు నలుమూలలా నుంచి తరలి వస్తున్న టీవీకే నాయకులు, కార్యకర్తలు, విజయ్ వీరాభిమానులుఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం కు రానున్న టివికే అధినేత విజయ్టివికే గెలుపొందిన ఎమ్మెల్యేలు తో భేటీ కానున్న విజయ్విజయ్ వెంట ఎవరెవరు?ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయంలార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేమ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంవిజయ్ వెంట కలిసొచ్చేది ఎవరనే ఉత్కంఠఅన్నాడీఎంకేనా?.. కాంగ్రెస్సా? చిన్నపార్టీల కూటమా? అనే విశ్లేషణలునేడు గవర్నర్ను కలవనున్న విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరే అవకాశం!ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి!తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్న డీఎంకేమరికాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంకొళత్తూర్లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్చెపాక్లో తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ విజయంప్రజా తీర్పును శిరసావహిస్తామని.. ప్రతిపక్షంగా పోరాడతామని ప్రకటించిన స్టాలిన్కాంగ్రెస్తో సెంగోట్టయన్ చర్చలు!తమిళనాట మారుతున్న రాజకీయ సమీకరణాలువిజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు?ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన హస్తం పార్టీకాంగ్రెస్తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోటియన్ చర్చలుఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన విజయ్లోక్భవన్కు విజయ్?తమిళనాడు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన టీవీకే అధినేత విజయ్టీవీకే ప్రధాన కార్యాలయంలో నెగ్గిన ఎమ్మెల్యేలతో మీటింగ్శాసనసభ పక్ష నేతను ఎనుకోనున్న టీవీకేసమావేశం తర్వాత నేరుగా లోక్భవన్కు దళపతి?ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసే అవకాశంతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన టీవీకేతమిళనాడులో హంగ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తక్కువ!ఇప్పటికే మద్దతు కూడకట్టుకున్న విజయ్?మరికొద్ది గంటల్లో వీడనున్న ఉత్కంఠనేడు టీవీకే కీలక సమావేశంవిజయ్ నేతృత్వంలో టీవీకే కీలక సమావేశంనెగ్గిన 108 మంది ఎమ్మెల్యేలను మీటింగ్కు ఆహ్వానించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై చర్చించే అవకాశంఈ సమావేశం తర్వాతే కీలక నిర్ణయం ప్రకటించనున్న విజయ్విజయ్ నివాసం వద్ద కోలాహలంచెన్నైలోని విజయ్ నివాసం వద్ద కోలాహలంభారీగా పోలీసు భద్రత ఏర్పాటువిజయ్ నివాసం బయట భారీగా చేరిన టీవీకే శ్రేణులు, ఆయన అభిమానులుమరోవైపు.. విజయ్ ఇంటికి క్యూ కడుతున్న ప్రముఖులువిజయ్కు రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువటీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న పలు పార్టీలుమొదలైన సంప్రదింపులుతమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలుఇప్పటికే అత్యధిక సీట్లు నెగ్గిన టీవీకే పార్టీతో మొదలైన సంప్రదింపులుఅందరినీ కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు?ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుపీఎంకే నుంచి మరో నలుగురువామపక్షాల సంఖ్య 2,ఐయూఎంఎల్ 2విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటాడా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా? అనే చర్చమరో 10 సీట్ల దూరంలో.. ఉత్కంఠగా తమిళనాడు రాజకీయంసింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే234 స్థానాల్లో 108 స్థానాల్లో టీవీకే విజయండీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో 10 మంది సభ్యులు అవసరంపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉.. విజయ్ ముందు ఆరు ఆప్షన్లు! ఇవిగో..ఓటమిపై స్పందించిన స్టాలిన్ప్రజల తీర్పును శిరసావహిస్తాం: స్టాలిన్ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడతాం: స్టాలిన్ఫలితాల వేళ.. అభివాదం చేసే టైంలో భావోద్వేగానికి గురైన స్టాలిన్దాదాపుగా కంటతడి పెట్టినంత పని చేసిన డీఎంకే అధినేతకొలతూర్లో స్టాలిన్ ఓటమిస్టాలిన్ను 7 వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన టీవీకే అభ్యర్థి బాబు విక్టరీ అనంతరం ‘ఫినిష్’ సంజ్ఞతో స్టాలిన్ను ఎద్దేవా చేసిన బాబువిజయహో..మార్పు నినాదంతో.. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను చావు దెబ్బ కొట్టిన విజయ్తమిళనాట అత్యధిక సీట్లు నెగ్గిన పార్టీగా తమిళగ వెట్రి కగళండీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించిన టీవీకేతొలి ఎన్నికల్లోనే తమిళనాడులో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా రికార్డు234 స్థానాల్లో పోటీ చేసి.. 108 స్థానాల్లో నెగ్గిన టీవీకే పోటీ చేసిన రెండు చోట్ల నెగ్గిన టీవీకే అధినేత విజయ్డీఎంకే కూటమి దారుణ ఓటమిడీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఓటమిమొత్తం మంత్రులంతా ఓటమిమూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే కూటమిమ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తమిళనాడు అసెంబ్లీలో హంగ్తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో విజయ్ -
ఆరు ఆప్షన్లు.. ఏది జరిగినా విజయ్ సర్కార్కు లైన్క్లియర్!
తమిళనాట దళపతి విజయ్ అపూర్వ విజయం గురించి దేశం మొత్తం చర్చ నడుస్తోంది. ఒక నటుడిగా రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అత్యధిక సీట్లు నెగ్గి ప్రభంజం సృష్టించారాయన. అలాగే ఒంటరి పోరుతోనే అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఫలితాల్లో హంగ్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ తమిళగ వెట్రి కగళం పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమి 74, అన్నాడీఎంకే కూటమి 52 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమిలో డీఎంకే 59, కాంగ్రెస్ 5, వామపక్షాలు 2, వీసీకే 2, ఇతర మిత్రపక్షాలు 4 ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకే 47, పీఎంకే 4, బీజేపీ 2 నెగ్గారు. మొత్తం 234 సీట్లు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే మరో 10 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేయనుందా? అనే చర్చ మొదలైంది. విజయ్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. మొదటి మార్గం.. ఎన్డీయే కూటమితో చేతులు కలపడం. సంఖ్యాపరంగా ఇది సులభమైనది, ఎందుకంటే రెండు పార్టీల కలయికతో మెజారిటీ వెంటనే వస్తుంది. కానీ బీజేపీతో అన్నాడీఎంకేకు ఉన్న సంబంధం విజయ్కు ఇమేజ్ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించారు కాబట్టి. రెండో మార్గం.. అన్నాడీఎంకేతోనే జట్టు కట్టడం. కానీ బీజేపీని వదిలేసి!. ఇది విజయ్కు క్లీన్ రూట్ ఇస్తుంది. యాంటీ-బీజేపీ వైఖరిని కొనసాగిస్తూనే.. ఇటు అన్నాడీఎంకే బేస్ను విజయ్ పొందగలరు. అయితే, ఎన్డీయే నుంచి బయటకు రావడం అన్నాడీఎంకేకు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే కఠిన నిర్ణయం అవుతుంది.మూడో మార్గం.. చిన్న పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడడం. తద్వారా విజయ్ తన స్వతంత్రతను నిలబెట్టుకుంటారు. “క్లీన్ బ్రేక్” ఇమేజ్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి ప్రభుత్వం బలహీనంగా ఉంటుంది. చిన్న పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉండి.. స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుంది.నాలుగో మార్గం.. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వడం. కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇవ్వడం. తద్వారా విజయ్కు మెజారిటీ వస్తుంది. అలాగే బీజేపీతోనూ విజయ్కు దూరం కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి రావొచ్చు.ఐదవ మార్గం.. రెయిన్బో కూటమి. చిన్న పార్టీలతో కలసి, అన్నాడీఎంకే లేదంటే కాంగ్రెస్ బయట మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది విజయ్ స్వతంత్రతను నిలబెట్టుకునే మార్గం. కానీ ఇది కూడా సంక్లిష్టమైన కూటమి అవుతుంది, ఇలాంటి ప్రభుత్వ నిర్వహణ కష్టతరంగా మారుతుంది.ఆరో మార్గం.. డీఎంకే మద్దతు పొందడం. ఇది అక్కడి రాజకీయాల్లో కలలో కూడా జరగని పరిణామమే అవుతుంది. విజయ్ మొదటి నుంచి డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించారు. కాబట్టి డీఎంకే మద్ధతు ప్రజల్లో ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసే చాన్స్ ఉంది. అయినప్పటికీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యమైన కలయికలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విజయ్ నేతృత్వంలో టీవీకే నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. నెగ్గిన అభ్యర్థులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారాయన. పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
అయ్యో ‘బాబు’!
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం అసలు ఫలించలేదు. పైగా ఆయన ప్రచారం చేసిన చోటల్లా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. కోయంబత్తూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగింటిలో బీజేపీ, అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు పోటీ చేశారు. వీరికి మద్దతుగా సీఎం చంద్రబాబు ప్రచారం చేసినా ఫలితం శూన్యం. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ గెలుపొందగా ఎన్డీఏ కూటమికి చెందిన అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. పొల్లాచ్చిలో వి.జయరామన్ 2వ స్థానానికి పరిమితమయ్యారు. చెన్నై అన్నానగర్లో అన్నాడీఎంకే అభ్యర్థి గోకుల ఇందిర, సాత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్కు మద్దతుగా చంద్రబాబు రోడ్షోలు నిర్వహించారు. ఈ రెండుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులకు ఓటమితప్పలేదు. ఇదిలా ఉంటే ఆవడిలో బీజేపీ అభ్యర్థి అశి్వన్కుమార్కు మద్దతుగా టీడీపీ కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారు. -
ఓటర్లు చాటుతున్నదేమిటి?
ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమిళ హీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. బెంగాల్లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. కేరళలో యూడీఎఫ్ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్ అయినా, బెంగాల్లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -
‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్!
సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయినప్పటికీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ను అభినందిస్తూ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో సూపర్స్టార్ రజనీకాంత్తో పాటు విజయ్ అంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నాడు. కాగా విజయ్కి వీరాభిమాని కావడంతో ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ విజయ్కి అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా తన అభిమాన హీరోతో కలిసి దిగిన పాత ఫోటోను షేర్ చేసుకున్న వరుణ్ చక్రవర్తి ‘అన్నా.. గెలిచాం’ అంటూ ఎమోజీతో కూడిన సింబల్ను పంచుకున్నాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తి ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సీజన్లో ఏడు మ్యాచ్లాడిన వరుణ్ చక్రవర్తి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో దారుణ ప్రదర్శన కనబరిచిన కేకేఆర్ రెండో అంచె పోటీల్లో మాత్రం వరుస విజయాలతో అదరగొడుతుంది. లేట్గా ఫామ్లోకి వచ్చిన రింకూ సింగ్ తన ఫినిషింగ్ టచ్తో కేకేఆర్కు రెండు విజయాలు సాధించి పెట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలు, 5 ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరో 5 మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో అన్నింటా గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా కేకేఆర్ ప్లేఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతాయి. కేకేఆర్ తమ తర్వాతి మ్యాచ్ల్లో రెండుసార్లు ఢిల్లీ క్యాపిటల్స్తో, ఆర్సీబీతో, గుజరాత్తో, ముంబైతో ఆడాల్సి ఉంది.ఇక వరుణ్ చక్రవర్తి దేశవాలీ క్రికెట్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. టీమిండియా తరఫున 4 వన్డేల్లో 10 వికెట్లు, 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 91 మ్యాచ్లాడిన వరుణ్ చక్రవర్తి 110 వికెట్లు తీశాడు.చదవండి: విజయ్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెటర్! -
తమిళనాడులో టీవీకే విజయ్ సంచలనం
సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకే ఘనవిజయం సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది. పార్టీ ఇప్పటికే 18 స్థానాల్లో గెలిచి, మరో 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం సమయంలో టీవీకే ఆధిక్యం తగ్గినా, కొద్ది సేపట్లోనే తిరిగి బలంగా ముందంజ వేసి డీఎంకే, ఏడీఎంకేలను దాటేసింది.టీవీకే అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేసి, రెండింటిలోనూ విజయం సాధించారు. విజయ్ పార్టీ ఈసారి ఎలాంటి కూటములు లేకుండా, ఒంటరిగా అన్ని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికలు టీవీకే, డీఎంకే, బీజేపీ మధ్య త్రిముఖ పోటీగా మారాయి.విజయ్ రాజకీయ ప్రవేశం విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెటట్రి కజగంను ప్రారంభించారు. ఎన్నికల సంఘం ఈ పార్టీని 2024 సెప్టెంబర్ 8న అధికారికంగా నమోదు చేసింది. ప్రారంభం నుంచే విజయ్ తన పార్టీని ఆధునిక ద్రావిడ సిద్ధాంతాలపై నిలబెట్టారు. దుష్ట శక్తి, అవినీతి శక్తికి ఎదురు నిలిచే ధైర్యం తన పార్టీకి మాత్రమే ఉందని ఆయన ప్రకటించారు.విజయ్ తన విజయాన్ని ఎంజీఆర్ తరహాలో రాయాలని, ఈ ఏడాదే అధికారంలోకి రావాలని సంకల్పించారు. ఆయన డీఎంకేను దుష్ట శక్తిగా, బీజేపీని సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా అభివర్ణించారు.పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. సాయంత్రం 6.00 గంటల వరకు టీవీకే 111 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 71 స్థానాల్లో, ఏడీఎంకే 52 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118. -
తమిళనాడులో ఎవరెన్ని ఓట్లు సాధించారంటే..!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల నడుమ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందా.. లేదా అనే దానిపై విపరీతమైన ఆసక్తి చోటు చేసుకుంది. ప్రధానంగా టీవీకే ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ వందకుపైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం. ఉదయం నుంచి 100 నుంచి 107 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కొనసాగుతోంది. అదే సమయంలో విజయ్ పార్టీ చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 చోట్ల 500 ఓట్ల మెజార్టీతో, 12 స్థానాల్లో రెండు వేల మెజార్టీతో విజయ్ పార్టీ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విజయ్ వంద సీట్ల మార్క్కు ఏమీ ఢోకా ఉండదు.. కానీ ప్రభుత్వాన్ని సింగిల్గా ఏర్పాటు చేయడం మాత్రం కష్టమవడం ఖాయం. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చినా అది ఎంతవరకూ సరిపోతుంది అనే దానిపై చర్చ నడుస్తోంది. దాంతో మరొక పెద్ద పార్టీతో టీవీకేకు పొత్తు అనివార్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంచితే, తమిళనాడులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్ని బట్టి.. విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లు. దాంతో విజయ్ పార్టీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో కొనసాగడానికి కారణమైంది. ఇక స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూడా విజయ్ పార్టీకి చాలా దగ్గరగానే వచ్చింది. డీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లు, కాగా డీఎంకే ఒంటరిగా సాధించిన ఓట్లు 83 లక్షలు. ఇక మూడో స్థానంలో కొనసాగుతున్న ఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లు, కాగా ఒంటరిగా ఆ పార్టీ 77 లక్షలు సాధించింది. పుంజుకున్న డీఎంకే..!కౌంటింగ్ ఆరంభమైనప్పటినుంచీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ మూడో స్థానంలో కొనసాగిన డీఎంకే.. అటు తర్వాత మెల్లగా పుంజుకుంది. తొలుత 50 సీట్లనైనా డీఎంకే గెలుస్తుందా అనే దిశ నుంచి 77 సీట్ల ఆధిక్యంలోకి డీఎంకే వచ్చింది. అంటే డీఎంకే బాగా పుంజుకుని విజయ్ పార్టీ ఊపుకు కాస్త అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం ఇంకా కొంటింగ్ జరుగుతున్న క్రమంలో డీఎంకే మరిన్ని సీట్లను గెలుచుకుని విజయ్ ఆధిక్యాన్ని తగ్గించవచ్చే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారుగా డీఎంకే ఓట్ల షేర్ అంతా కూడా టీవీకే షిప్ట్ అవడమే విజయ్ అనూహ్య ఫలితాలకు కారణమైంది. విజయ్ టీవీకే పార్టీకి ఏకధాటి ఊపు ఇవ్వకుండా డీఎంకే ఎంతో కొంత మెరుగైన ఫలితాల దిశగానే ముందుకెళుతుందనే చెప్పాలి. విజయ్ పార్టీ ఒక సీటు ఆధిక్యం తగ్గుతుంటే అదే సమయంలో డీఎంకే ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. ఇది కాస్త సస్పెన్స్ను కూడా క్రియేట్ చేస్తోంది. సీఎం స్టాలిన్ కొళత్తూర్ నుంచి ఓడి పోవడం ఆ పార్టీకి కాస్త ఎదురుదెబ్బ మినహా పుంజుకున్న తీరు.. టీవీకే ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేయడాన్ని క్లిష్టం చేస్తోంది. -
సీఎం స్టాలిన్ పరాజయం.. ఎవరా? టీవీకే గెలుపు గుర్రం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్కు బిగ్షాక్ తగిలింది. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం సాధించారు. తమిళనాడులోని అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో కొళత్తూరు ఒకటి. ఇది సీఎం ఎంకే స్టాలిన్ కంచుకోటగా ప్రసిద్ధి చెందింది. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో (2011, 2016, 2021) ఆయన ఇక్కడ గెలుపొందారు. ఈసారి మాత్రం అంచనాలు తలకిందులయ్యాయి. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు విజయం సాధించారు. ఈ ఫలితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. మధ్యాహ్నం 4.15 గంటల వరకు టీవీకే 105 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 76 స్థానాల్లో, ఏడీఎంకే 53 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118.టీవీకే విజయానికి యువ ఓటర్ల మద్దతు, అధికార వ్యతిరేక భావజాలం, బలమైన గ్రామీణ స్థాయి ప్రచారం కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫలితం తమిళనాడులో దీర్ఘకాలిక రాజకీయ దిశలో కీలక మార్పును సూచిస్తోంది. -
LIVE : దూసుకుపోతున్న విజయ్
-
టీవీకే చీఫ్ విజయ్కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీవీకే చీఫ్ విజయ్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. సోదరుడు విజయ్కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజాజీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్కు మరింత మంచి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.బెంగాల్లో బీజీపీకి వైఎస్ జగన్ అభినందనలుపశ్చిమబెంగాల్లో టీఎంసీ ఓటమి పట్ల వైఎస్ జగన్ సానుభూతి తెలియజేశారు. దీదీ(మమతా బెనర్జీ) ప్రభుత్వం ఓటమి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. పశ్చిమ బెంగాల్ అతిపెద్దగా పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీకి అభినందనలు తెలిపారు. అలాగే అక్కడ గెలిచిన ఇతర అభ్యర్థులకు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026 -
తమిళనాడు ఫలితాలు.. పవన్ ఫీలవుతాడా?
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళంలో యూడీఎఫ్ గెలుపు కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్లు డీఎంకేని గెలిపించ లేకపోవడం తండ్రి కొడుకుల పాలనపై ప్రజల అసమ్మతికి నిదర్శనంగా అది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్లకు ఆందోళన కలిగించే విషయం అవుతుంది. కాగా ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా విజయం వైపు దూసుకు వెళుతూండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొంత ఇబ్బందికరం అవుతుంది. ఇకపై పవన్ను అందరూ విజయ్తో పోల్చడం.. అతడి విజయం.. ఈతడి ధోరణిపై ప్రశ్నలూ తలెత్తుతాయి. తమిళ ఎన్నికల ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్కూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసినా ఎన్డీయేని గెలిపించలేకపోయారని, అదే సమయంలో కొన్ని సభల్లో జగన్ ఫొటోను ప్రదర్శించిన టీవీకే పార్టీ నేత విజయ్ గెలుపు బాటలో ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.జగన్ మాదిరిగా విజయ్ కూడా ఒంటరిగా పోటీలోకి దిగడం ఇంకో సారూప్యత. గట్టిగా కృషి చేస్తే పశ్చిమబెంగాల్లో మాదిరిగా తామూ గెలిచే అవకాశం ఉందన్న ఆశ ఈ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి కలిగిస్తాయి. అదే టైమ్ లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల ద్వారా తన వ్యూహాలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ గెలుపు అన్నది ఊహించిందే. పశ్చిమబెంగాల్ లో పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత, ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ హడావుడి తర్వాత అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.ఈ వ్యూహాలను గుర్తించి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కాని ఆ వైపు ఆలోచించి ఉంటే ఎలా ఉండేదో! కేరళంలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు ఛాన్స్ ఉందని ఊహించిన పరిణామమే. కాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే తిరిగి వస్తుందన్న అంచనాకు తగినట్లే జరిగింది. అన్నిటికన్నా సంచలనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీచేసి డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కు నెట్టేయడం. అందరి సలహాలను కాదని విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం ఒక రకంగా సాహసమే.దేశ రాజకీయాలలో బీజేపీ హవా కొనసాగే విధంగానే ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. మోడీ, అమిత్ షా ల కాంబినేషన్ కు ఇప్పట్లో తిరుగులేదన్న అభిప్రాయం కలుగుతుంది. కేరళంలో కూడా బీజేపీ తన వంతు ప్రయత్నం చేసినా, వారికి ఓట్లశాతం పెరుగుతుందే తప్ప సీట్లు పెద్దగా రావని అందరికి తెలుసు. దేశంలో ఉన్న ఏకైక వామపక్ష రాష్ట్రం కేరళంలో ఈసారి సీపీఎం ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోవడం వామపక్షవాదులకు నిరాశ కలిగిస్తుంది. అక్కడ గెలిచిన యూడీఎఫ్ వల్ల కాంగ్రెస్ ఆశలు కొద్దిగా చిగురిస్తాయి. కాని తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే పరాజయం చవిచూడడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది.పశ్చిమబెంగాల్లో మూడు టర్మ్లుగా అధికారంలో ఎన్న టీఎంసీపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప.బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఎన్నికల సంఘం తన వంతు పాత్ర పోషించడం వంటివి కూడా కలిసిరావడంతో బీజేపీ కల నిజమవుతోందని చెప్పాలి. ఎంత పోరాడినా మమత బెనర్జీ ఆమె పార్టీ చివరికి ఓడిపోక తప్పలేదు. ఏపీలో జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ సొంత అజెండా అనేది ఏదీ లేకుండా.. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.విజయ్కు ఉన్న ధైర్యం పవన్కు లేకుండా పోయిందని, సీఎంను అవుతానంటూ కాపు సామాజికవర్గాన్ని ఊరించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబుకు అతి విధేయుడుగా మారిపోవడం ఆ వర్గానికి అంతగా రుచించడం లేదు. పైగా ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లు టీడీపీని భుజాన మోస్తానని చెబుతున్న వైనం మద్దతుదారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చవు. పైకి బీజేపీని అభినందించినా, లోపల మనసులో మాత్రం బీజేపీ బెంగాల్ ఓడిపోయి ఉంటే,తమ ప్రాధాన్యత పెరిగి ఉండేదని టీడీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను మరింతగా పొగడక తప్పదని లోలోపల మథన డుతూండవచ్చు. మరో కీలకమైన అంశం ఏమిటంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిలు ఏపీలో మాదిరి రెడ్బుక్ అరాచకాలు చేయకపోయినా డీఎంకే ఓటమిపాలైంది. ఒక రకంగా ఆలోచిస్తే జనం కుటుంబ పాలనను వ్యతిరేకించారన్నమాట. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారు. పాలనా వైఫల్యంతో చంద్రబాబు ఉంటే, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ షాడో సీఎంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ అంటూ పోలీసులతో అరాచకాలు చేయిస్తున్నారు. అలాగే అత్యంత విలువైన విశాఖ భూములను తమ ఇష్టారీతిన 99 పైసలకే కట్టబెడుతున్న తీరుపై టీడీపీ వీర మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి ఎ బి వెంకటేశ్వరరావు వంటివారు మండిపడుతున్నారు.అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై అంతా విస్తుపోతున్నారు. స్టాలిన్, ఉదయనిధిలు అరాచకాలు, విపక్షంపై వేధింపులు వంటివి చేయకపోయినా ఓటమిపాలయ్యారని, అలాంటిది ఏపీలో ఇంత దారుణమైన పరిస్తితులు ఉంటే జనం సహిస్తారా అన్నది చర్చగా ఉంది. అంతేకాక వచ్చే మూడేళ్లలో తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ వంటివారిని ఇంతకాలం దూరంగా ఉంచిన నేపథ్యంలో టీడీపీని మళ్లీ నందమూరి వంశం అధీనంలోకి తీసుకురావాలని ఒక వేళ ఆయన ఆలోచన చేస్తే రాజకీయాలు ఎటు మళ్లుతాయో ఇప్పటికిప్పుడు ఊహింలేం.కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్కు ఉత్సాహం రావచ్చు.కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. కాని బెంగాల్ లో విజయంతో బీజేపీ తెలంగాణలో ఏ గేమ్ ఆడుతుందో అన్న భయం ఉండవచ్చు. తమిళనాడు ఫలితాలు మాత్రం చంద్రబాబు, లోకేశ్ లకు నిద్ర లేకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరీ అంత సీరియస్ రాజకీయాలు చేయడం లేదు కనుక, సొంత వ్యక్తిత్వంతో రాజకీయ పార్టని నడపాలన్న లక్ష్యంతో లేరు కనుక ఆయన పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. జగన్ కు మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దళపతి విజయ్ ఇంటికి చేరుకున్న హీరోయిన్
-
ఏం చేస్తాడులే అన్నారు... ఇప్పుడు చరిత్రను తిరగరాశాడు
-
ఊహించని మలుపు తమిళనాడు 'కింగ్'గా విజయ్..
-
గెలిచిన ఆనందం... TVK విజయ్ ఇంట్లో సంబరాలు..
-
విజయ్ గెలుపు వెనుక రహస్యం? టీవీకే సక్సెస్ పై అనలిస్ట్ కామెంట్స్
-
చరిత్రను తిరగరాశాడు... సీఎంగా విజయ్...
-
దూసుకుపోతున్న విజయ్
-
విజయ్ విజిల్ మోత తమిళనాడు అదుర్స్
-
DMK పార్టీ ఆఫీస్ వద్ద టెంట్లు పీకేస్తున్న కార్యకర్తలు
-
విజయ్ అనే నేను!
-
ట్రెండ్ సృష్టిస్తున్న టీవీకే
-
TVK విజయ్ ప్రభంజనం
-
ఎవరి జెండా మోయకుండా.. ఏ పొత్తు లేకుండా!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ‘విజిల్’ మోత దేశం మొత్తం మారుమోగుతోంది. విజయ్ మేనియా ధాటికి అధికార ప్రతిపక్ష పార్టీల కూటములు విలవిలలాడిపోయాయి. గత ఐదు దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను.. వాటి కూటముల్ని వెనక్కి నెట్టేసి రెండేళ్ల పసికూన పార్టీ టీవీకే అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది.తమిళనాట టీవీకే ప్రభంజనం కొనసాగుతోంది. ప్రధానంగా ఆ పార్టీ దెబ్బకు అధికార డీఎంకేకు మాస్టర్ స్ట్రోక్ తగిలింది. డీఎంకే ప్రధాన అభ్యర్థులంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. సంబురాల కోసం వేసిన టెంట్లు కూడా తీసేసి వెళ్లిపోయారంటే ఏ రేంజ్లో నైరాశ్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే రెండో స్థానానికి పరిమితమయ్యే చాన్స్ కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో ద్రవిడ సిద్ధాంతాన్ని తిరస్కరించిన తమిళ ఓటర్లు విజయ్ పార్టీ టీవీకే ఇచ్చిన ‘మార్పు’ అనే నినాదానికి పట్టం కట్టారు.తమిళనాట అగ్రనటుడిగా విజయ్ తెలుగువాళ్లకూ సుపరిచితుడే. 2009లో ఏర్పడిన తన విజయ్ మక్కల్ ఇయ్యక్కం అనే ఫ్యాన్స్ అసోషియేషన్ను.. 2014లో ఫిబ్రవరి 2వ తేదీన తమిళగ వెట్రి కగళం అనే పార్టీగా ఏర్పాటు చేశారు విజయ్. 2026 ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యమని ఆనాడే ఆయన ప్రకటించారు. జట్టుగా వచ్చే పార్టీలకు అధికారంలో వాటా సైతం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారాయన. ఈ ప్రకటనలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. రెండేళ్లలో ఈ పవర్ మ్యాజిక్ సాధ్యమయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. దానికి తగ్గట్లే తాను ఏ పార్టీ జెండా మోయబోమని.. సింహం సింగిల్గానే పోటీ చేస్తుందని ప్రకటనలు ఇచ్చుకుంటూ వచ్చారాయన. ఈ ప్రకటన రాజకీయ వర్గాలను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఒంటరి పోరుతో విజయ్ ఏం సాధించలేడని తేల్చి చెప్పాయి. అదే సమయంలో విజయ్ మీద ఆన్లైన్లో ట్రోలింగ్ కూడా పెరిగింది. ఈలోపు విజయ్ ఎన్నికల ర్యాలీలో భాగంగా కరూర్లో జరిగిన తొక్కిసలాట.. ఆపై సీబీఐ దర్యాప్తు.. దీనిని ఆసరగా చేసుకుని తమ కూటముల్లో చేరాలని జాతీయపార్టీల నుంచి ఒత్తిళ్లు.. చివరి సినిమా జన నాయగన్ రిలీజ్ ఆగిపోవడం(సెన్సార్ ఇబ్బందులు).. వ్యక్తిగత జీవితం రచ్చకెక్కడం.. ఇవన్నీ దళపతిని కుంగదీయడం ఖాయమని అంతా భావించారు. అయితే.. విజయ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొన్నారు. విమర్శలు, ఒత్తిళ్లు తాను చూసుకుంటానని.. మీరు గెలుపు మీదే దృష్టి సారించాలని కేడర్కు బలం అందించారు. యువత, మహిళలను ఎక్కువగా ఆకట్టకునేలా ఎన్నికల హామీలిచ్చారు. ఫలితంగా.. ఏ కూటమితో జట్టు కట్టకుండా.. ఒంటరిగా అన్నీ స్థానాల్లోనూ పోటీ చేసిన విజయ్కు అత్యధిక స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టారు తమిళనాడు ఓటర్లు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తమిళనాట తలకిందులైన లెక్కలు
తమిళనాడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అనూహ్యంగా టీవీకే ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. డీఎంకేను దాటి దూసుపోతుంది. తమిళనాడులో టీవీకే ముందంజ ఉండగా, రెండో స్థానంలో డీఎంకే, మూడో స్థానానికి అన్నాడీఎంకే పరిమితమైంది. తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. లీడింగ్లో టీవీకే విజయ్ పార్టీ దూసుకుపోతుంది.విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. టీవీకే విజయ్కు తమిళ ఓటర్లు జైకొట్టారు. హంగ్ వస్తే టీవీకే-అన్నాడీఎంకే జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి.మరోవైపు, ముందస్తుగా అప్రమత్తమైన విజయ్ పార్టీ.. తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరతీసిన సంగతి తెలిసిందే. మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ‘గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు’ అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
తమిళనాడులో TVK విజయ్ ముందంజ
-
మొదలైన తమిళనాడు కౌంటింగ్
-
నేడే కౌంటింగ్.. అందరి చూపు బెంగాల్ పైనే!
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నిక్షిప్తమైన ప్రజాతీర్పు సోమవారం బహిర్గతం కానుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజాతీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, సోమవారమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరికి లాభమో? పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా శ్రమించింది. ఈసారి బెంగాల్లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డుస్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూత్ల్లో శనివారం రీపోలింగ్ చేపట్టగా, 87 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గెలుపు తమదేనని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార తృణమూల్ కాంగ్రెస్దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటుచేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలే ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్కతాలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాపరింగ్కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. తమిళనాడులో విజయం విజయ్దేనా?తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పటా్నయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్పోల్స్ స్పష్టంచేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. అస్సాంలో 258 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించగా, 85.96 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం గమనార్హం. అధికార ఎన్డీయేలో బీజేపీతోపాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో రాయ్జోర్ దళ్, ఏజేపీ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఏపీహెచ్ఎల్సీ తదితర పార్టీలు ఉన్నాయి. కేరళలో వామపక్షాలకు చేదు అనుభవమే! కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్లో 79.63 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్పై యూడీఎఫ్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెల్చుకోవడం ఖాయమని ఎన్డీయే విశ్వాసం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే! కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలున్నాయి. – సాక్షి, నేషనల్æడెస్క్2 -
విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..!
చెన్నై: విమానం నుంచి దూకడం అంటే అది నిజంగా చాలా ప్రమాదకరమైన చర్య. అయినప్పటికీ, ప్రపంచంలో కొన్ని అరుదైన సంఘటనల్లో ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తెరిచి బయటకు దూకిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అస్వస్థతకు గురైన ఆ ప్రయాణికుడు.. ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందికి దూకేశాడు. ఈరోజు(ఆదివారం, మే 3వ తేదీస్త్ర తెల్లవారుజామున ఎయిర్ అరేబియా విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. ఇలా రెండుసార్లు వాంతులు చేసుకున్న తర్వాత భయపడి పోయిన సదరు ప్రయాణికుడు.. అత్యవసర ద్వారం ఓపెన్ చేసి అక్కడ నుంచి కిందకు దూకేశాడు. విమానం ల్యాండ్ అయ్యి టాక్సీవేపై కదులుతున్న సమయంలో కాబట్టి ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు విమానాశ్రయ అదికారులు తెలిపారు. ఆ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే స్వల్పంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అతనికి ప్రాథమిక చికత్స అందించారు. ఈ ఘటనతో ప్రధాన రన్వే ఒక గంట పాటు మూసేశారు. కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ప్రయాణికుడు విమానంలో రెండు సార్లు వాంతులు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇది అతని మానసిక, శారీరక స్థితి ప్రభావం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే, సాధారణంగా బలమైన లాకింగ్ సిస్టమ్ ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు ఎలా తెరవగలిగాడు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. భద్రతా లోపాలు ఉన్నాయా? అనే కోణంతో పాటు ప్రయాణికుడి మానసిక స్థితిని పరీక్షీస్తున్నారు. -
విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి
-
స్టాలిన్కు షాకిస్తూ.. విజయ్పై పొగడ్తల వర్షం!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డీఎంకే, అన్నాడీఎంకే, ఈ మధ్యలో టీవీకే.. ఎవరికి వారే అధికారం తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ముందస్తుగా క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.విజయ్ టీవీకే పార్టీపై స్టాలిన్ మిత్రుడు, ఎండీఎంకే(Marumalarchi Dravida Munnetra Kazhagam) అధినేత వైకో ప్రశంసలు గుప్పించారు. విజయ్ ఈ ఎన్నికల్లో మ్యాజిక్ చేసే అవకాశం లేకపోలేదని అన్నారాయన. ‘‘టీవీకే తమిళ రాజకీయాల్లో ఓ శక్తిగా అవతరించింది. రాబోయే రోజుల్లో ఇక్కడి రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపగలదు. ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం లేకపోలేదు’’ అని వైకో అభిప్రాయపడ్డారు.ఈ సందర్భగా విజయ్కు ఉన్న ప్రజాదరణను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. యువత, మహిళలు, ముఖ్యంగా ఫస్ట్టైమ్ ఓటర్లలో విజయ్కి అశేష అభిమానులు ఉన్నారని చెప్పారు. అదే సమయంలో.. ద్రవిడ ఉద్యమం తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత శక్తిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించారు వైకో. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్తో చేతులు కలిపి పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు సీట్లు కేటాయించగా.. అందులో మూడు సీట్లను డీఎంకే గుర్తు(ఉదయించే సూర్యుడు), మరో అభ్యర్థిని స్వంత గుర్తుతో వైకో బరిలోకి దించారు. ఇదిలా ఉంటే..ఎన్నికల అరంగేట్రంలోనే టీవీకే గణనీయమైన ప్రభావం చూపవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మిగతా సర్వేలు డబుల్ డిజిట్ రావొచ్చని అంచనా వేస్తుంటే.. యాక్సిస్ మై ఇండియా (Axis My India) ఎగ్జిట్ పోల్స్ మాత్రం 98–120 సీట్లు గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇప్పుడు అధికార మిత్రకూటమి సీనియర్ నేత వైకో ప్రశంసలు గుప్పించడంతో విజయ్ అభిమానులు ఉబ్బితబ్బిబైపోతున్నారు.ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు పోలింగ్లో 85.1% ఓటింగ్ నమోదైంది. అయితే.. యువత, కొత్త ఓటర్ల భాగస్వామ్యం పెరగడం TVKకి అనుకూలంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.తమిళనాడులో విజయ్కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ పీక్స్లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, యువతను ఆకర్షించే వాగ్దానాలు చేయడం ఆయనకు అదనపు బలం ఇస్తున్నాయి. విద్యార్థులకు స్టైపెండ్లు, స్టార్టప్ రుణాలు, మత్తు పదార్థాల రహిత రాష్ట్రం వంటి హామీలు ఆయన ప్రచారంలో ప్రధానంగా నిలిచాయి.డీఎంకే ఆధ్వర్యంలోని కూటమి రెండోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇదే ఖరారు చేశాయి. మరోవైపు అన్నాడీఎంకే వరుస ఓటముల తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ తన తొలి ఎన్నికలోనే అన్నాదురై, ఎంజీఆర్ల విజయదుందుభి మోగించవచ్చనే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
టీవీకే పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికారం పీఠం దక్కించుకోబోతోందన్న వార్తల మధ్య . నటుడు విజయ్ పార్టీ టీవీకే ఆఫీసుకు నిప్పు పెట్టారన్న వార్త సంచలనంగా మారింది. తిరుచిలోని టీవీకే కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారని న్యూస్18 నివేదిక తెలిపింది. శ్రీరంగం నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యాలయంగా ఉపయోగిస్తున్న ఈ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం.ఈ అగ్నిప్రమాదంలో కార్యాలయం పూర్తిగా కాలిపోయిందని, ఓటర్ల జాబితాలు, పత్రాలు, బ్యానర్లు, రోజువారీ ఎన్నికల కార్య కలాపాలకు ఉపయోగించే పరికరాలు వంటి కీలకమైన ప్రచార సామగ్రి నాశనమైనట్టు తెలుస్తోంది. శ్రీరంగం నియోజకవర్గం టీవీకే అభ్యర్థి రమేష్, గుర్తు తెలియని వ్యక్తులు తన ఎన్నికల కార్యాలయానికి నిప్పు పెట్టారని, దీంతో కార్యాలయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో తగిన భద్రత కల్పించాలని కోరారు.Tamil Nadu | An election office belonging to TVK candidate Ramesh was allegedly set on fire by unidentified persons earlier today in Pettavaythalai area under Andhanallur Union, Srirangam Assembly constituency. A formal complaint has been lodged at the local police station by…— ANI (@ANI) May 1, 2026 కాగా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా జరిగి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. ఈ ఫలితాల్లో డీఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ సునామీ తథ్యమని జోస్యం చెప్పింది. -
సైన్ లాంగ్వేజ్ ఇకపై సులభం!
చెవిటి, మూగ వారి భాష సంజ్ఞలు మాత్రమే. వీటిని కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల వారు సమాజంలో అన్ని చోట్లా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికోసమే సంజ్ఞల భాషను.. మాటల్లోకి మార్చే ఏఐ మోడల్ను రూపొందించింది 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రియాంజలి గుప్తా (Priyanjali Gupta). టెన్సర్ఫ్లో పైథాన్ ను ఉపయోగించి, అమెరికన్ సైన్ లాంగ్వేజ్ని తక్షణమే ఇంగ్లీష్ పదాలుగా మార్చే సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేసింది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ సాంకేతికతలను దివ్యాంగులకు మరింత దగ్గర చేయడంలో ఇది ఒక కీలక అడుగుగా మారనుంది...తమిళనాడుకు చెందిన ప్రియాంజాలి గుప్తా వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె వెబ్క్యామ్, ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి, సంజ్ఞలను గుర్తించి.. వాటిని తక్షణమే పదాలుగా మార్చే సాఫ్ట్వేర్ను రూపొందించింది. సంజ్ఞల భాషను అందరూ అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద, కష్టమైన సమస్య అని ప్రియాంజలికి ఉన్న బలమైన నమ్మకం. ఒక చిన్న స్థాయి సాఫ్ట్వేర్ దీనిని పరిష్కరించలేదని ఆమె ఆలోచన. సైన్ లాంగ్వేజ్లో ముఖ కవళికలు, భుజాల కదలికలతోపాటు మరిన్ని అంశాలు ఉంటాయని.. వాటన్నింటినీ అర్థం చేసుకోవడానికి చాలా బాగా శిక్షణపొందిన ఒక నెట్వర్క్ అవసరమని ఆమె భావించింది. అందుకే ఏఐ సాయంతో ఆమె ఈ మోడల్ని రూపొందించింది. సుమారు 300 చిత్రాల డేటా సెట్ను మాన్యువల్గా సిద్ధం చేసి, పైథాన్ భాషలో దీని కోడింగ్ను పూర్తి చేశారు. ప్రస్తుతానికి, ఈ వినూత్న సాఫ్ట్వేర్ కేవలం అమెరికన్ సైన్ లాంగ్వేజ్ను మాత్రమే అనువదిస్తుంది. ప్రతి భాషలో సంజ్ఞలు వేర్వేరుగా ఉంటాయి. కేవలం చేతి కదలికలే కాకుండా, ముఖ కవళికలను కూడా అర్థం చేసుకునేలా దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని ప్రియాంజలి చెబుతోంది. ఆమె రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రస్తుతానికి అవును, కాదు, దయచేసి, ధన్యవాదాలు, ఐ లవ్ యు, హలో వంటి ఆరు సంజ్ఞలను విజయవంతంగా అనువదిస్తోంది. మరిన్ని డేటా సెట్లతో దీనిని పూర్తిస్థాయి మోడల్గా మార్చేందుకు ఆమె కృషి చేస్తోంది. ఈ సాఫ్ట్వేర్ చేతులు, వేళ్ల వంటి శరీర భాగాల కదలికలను విశ్లేషించడం ద్వారా సంజ్ఞలను విజయవంతంగా టెక్ట్స్గా మారుస్తుంది. ఈ ఏఐ సాఫ్ట్వేర్ వినికిడి లోపం ఉన్నవారితో అప్పటికప్పుడే కమ్యూనికేట్ చేయడానికి ఒక డైనమిక్ మార్గంగా తోడ్పడుతుంది.ప్రియాంజలి తన ఆవిష్కరణను లింక్డ్ ఇన్ వేదికగా పంచుకోగా, అది విపరీతంగా వైరలయ్యింది. దాంతో ఎన్నోవేల మందికి ఈ కొత్త సాఫ్ట్వేర్పై ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ కోడ్ అందరికీ అందుబాటులో ఉంది. అందువల్ల శాస్త్రవేత్తలు దీనిని ఇతర భాషలకు అనుగుణంగా, మరింత మెరుగ్గా మార్చవచ్చు. ఈ చిన్న ప్రయత్నం భవిష్యత్తులో దివ్యాంగుల కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నా భవిష్యత్ లక్ష్యంసాంకేతిక రంగంలో దివ్యాంగుల కోసం తగినంత సదుపాయాలు లేవని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మూగ, చెవుడు ఉన్నవారు గూగుల్, ఎకో లేదా అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్లను ఉపయోగించాలనుకుంటే పరిస్థితి ఏంటి? మన దగ్గర దానికి సరైన పరిష్కారాలు లేవు. మా అమ్మ దగ్గరికి చదువుకునేందుకు ఒక వినికిడి లోపం ఉన్న విద్యార్థిని వస్తుండేది. ఆమె తన ఆలోచనలను వ్యక్తీకరించడంలో పడుతునన ఇబ్బందిని స్వయంగా చూశాను. అందువల్ల అటువంటి వారి గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను. అందుకే ఈ చిన్న స్థాయి మోడల్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. అలా ఆ ప్రయత్నం నుంచి వచ్చిందే ఈ సైన్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్. ప్రపంచ సమస్యలను పరిష్కరించే సాంకేతికతను నిర్మించడమే నా భవిష్యత్ లక్ష్యం. – ప్రియాంజలి గుప్తా -
బెంగాల్ కిరీటం బీజేపీదే!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు నకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ‘టుడేస్ చాణక్య’ఎగ్జిట్పోల్ స్పష్టంచేసింది. బెంగాల్ అధికార కిరీటం ఈసారి బీజేపీకి దక్కడం ఖాయమని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా మెజార్టీ మార్కు 147 స్థానాలు. బీజేపీ 192కిపైగా స్థానాలు గెల్చుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టంచేసింది. చాణక్య ఎగ్జిట్పోల్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు గెల్చుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు తేలింది. ఇతరులు కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతారని చాణక్య తెలియజేసింది. ఈ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అది అతిపెద్ద మార్పు అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజల మద్దతు బలంగా ఏకీకృతం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది ఓటర్ల ప్రాధాన్యతలో నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తోంది. బెంగాల్లో ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. మమతా బెనర్జీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వివరించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు కీలకమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుందని పేర్కొన్నాయి. 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాన్నే అంచనా వేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్కు విజయం దక్కింది. ఆ పార్టీ 215 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 77 స్థానాలు మాత్రమే దక్కించుకొని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. తమిళనాట రెండో స్థానంలో విజయ్ పార్టీ తమిళనాడులో దళపతి విజయ్ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతున్నట్టు టుడేస్ చాణక్య స్పష్టంచేసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) ఈ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో దాదాపు 63 సీట్లు సాధించబోతున్నట్లు తెలియజేసింది. అధికార డీఎంకేకు 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకేకు కేవలం 45 స్థానాలు దక్కే వీలున్నట్లు వివరించింది. విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలవబోతున్నట్లు తెలిపింది. సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల్లో 29 శాతం మంది, అత్యంత వెనుకబడిన వర్గాల్లో 27 శాతం మంది, ఎస్సీలు, క్రైస్తవుల్లో 34 శాతం మంది విజయ్ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు మాత్రం అధికార డీఎంకేకు మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. యువతలో టీవీకేకు అమితాదరణ కనిపించింది. 30 ఏళ్లలోపు ఓటర్లు, ప్రధానంగా తొలిసారి ఓటు వేసినవారు, విద్యార్థులు నిరుద్యోగులు దళపతి పార్టీకి జైకొట్టారు. మరోవైపు మెజార్టీ ఎగ్జిట్పోల్స్ మళ్లీ డీఎంకే గెలుపు ఖాయమని తెలియజేశాయి. ‘యాక్సిస్ మై ఇండియా’మాత్రమే విజయ్ పార్టీ జయకేతనం ఎగురవేయబోతున్నట్లు తేల్చిచెప్పింది. కేరళలో యూడీఎఫ్కు విజయావకాశాలు కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్యగట్టి పోటీ నెలకొన్నట్లు టుడేస్ చాణక్య ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు విజయావకాశాలు ఉన్నట్లు తెలిపింది. 140 సీట్లకు గాను యూడీఎఫ్కు దాదాపు 69 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని వెల్లడించింది. 126 సీట్లకు గాను బీజేపీ 50 శాతం ఓట్లతో ఏకంగా 102 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బెంగాల్ ఎగ్జిట్పోల్స్ ప్రకటించని ‘యాక్సిస్ మై ఇండియా’ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ను ‘యాక్సిస్ మై ఇండియా’ప్రకటించలేదు. బుధవారం ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రకటించినప్పటికీ బెంగాల్ విషయం ప్రస్తావించలేదు. గురువారం ప్రకటిస్తారని భావించగా.. అది సాధ్యం కాలేదు. బెంగాల్లో భయానక వాతావరణం నెలకొందని, ఇతరులతో మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, శాంపిల్ సేకరించే పరిస్థితి కూడా లేదని ‘యాక్సిస్ మై ఇండియా’అధినేత ప్రదీప్ గుప్తా చెప్పారు. అసంపూర్ణమైన సమాచారంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు. -
టీవీకే విజయ్ కీలక సూచనలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న కౌంటింగ్కు సంబంధించి టీవీకే అధినేత విజయ్.. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఆ రోజు జరిగే కౌంటింగ్కు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం ఆరుగంటల కల్లా ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఒకసారి లోపలికి వెళ్లిన ఏజెంట్ కడవరకూ అక్కడే ఉండాలని, అత్యంత జాగ్రత్తగా కౌంటింగ్ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుకు గురైనా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అందుకుని అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రధానంగా అభ్యర్థులు గెలిచిన తర్వాత తన వద్దకు నేరుగా రావాలన్నారు. గెలిచిన అభ్యర్థుల కోసం తాను నిరీక్షిస్తూ ఉంటానని, మధ్యలో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ పార్టీ ఆఫీస్కే రావాలన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో కీలకమైన ఫారమ్ 17C(పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల సంఖ్య, లెక్కింపులో చూపిన ఓట్లతో సరిపోతుందా లేదా అనే విషయాన్ని ధృవీకరించే పత్రం)ని అభ్యర్థులు కచ్చితంగా సరిపోల్చుకోవాలన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి మభ్య పెట్టడానికి యత్నించే వారికి చెక్ పెట్టాలన్నారు. -
విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!
-
మహిళలంతా విజయ్ వైపే, సీఎం విజయ్..! తమిళనాడులో జెన్ Z విప్లవం
-
విజయ్.. మరో MGR! TVKకి పట్టం కట్టిన యువ ఓటర్లు
-
హాట్ న్యూస్: ఎన్డీయే కూటమితో విజయ్ పొత్తు!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ.. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే-అన్నాడీఎంకే-టీవీకే పార్టీలు ఇవాళ వరుస మీటింగ్లు పెట్టుకున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత సమీకరణాలు మారుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించిన టీవీకే అధినేత విజయ్.. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమితో పొత్తుకు చేయి చాస్తాడా? అనే చర్చ జోరుందుకుంది. తమిళనాడులో డీఎంకే పార్టీదే మళ్లీ అధికారమని ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకటి రెండు మాత్రం అన్నాడీఎంకేకు అధికారం దక్కవచ్చని చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం తప్పదని.. ఆ పార్టీ ఏకంగా అధికారం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే మిగతా సర్వేలు మాత్రం విజయ్ పార్టీ డబుల్ డిజిట్ను కైవసం చేసుకోవచ్చని అంచనా వేశాయి. ఈ తరుణంలో.. విజయ్ పార్టీలో జోష్ కనబడుతోంది. సర్వేలు అంచనా వేసినట్లు.. నిజంగానే ఫలితాల్లో టీవీకే జోరు కొనసాగుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే పొత్తుల సమీకరణాలు తెర మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేతో పవర్షేరింగ్ కోసం విజయ్ చేతులు కలపబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. తమిళ రాజకీయాల్లో విజయ్ నిర్ణయం సంచలనమనే చెప్పొచ్చు.వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలో భాగం కోరుకునే పార్టీలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో చిన్నచిన్న పార్టీల నేతలతో పాటు అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపించారు. చివరకు అధిష్టానం జోక్యంతో వాళ్లంతా మెత్తబడ్డారు. మరోవైపు టీవీకే కూడా అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలు ఏనాడూ చేసింది లేదు. అయినప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్లు విజయ్తో పొత్తు కోసం ఉవ్విళ్లూరాయి. సరిగ్గా అదే టైంలో TVK–AIADMK కలిసి పని చేస్తాయంటూ ఓ ప్రచారం ఉధృతంగా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారి తీయడంతో.. అలాంటిదేం ఉండబోదని కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అలాంటిదేం ఉండబోదని.. ఎగ్జిట్పోల్స్ తర్వాత మీడియా అత్యుత్సాహం, టీఆర్పీ మోజుతోనే కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో విజయ్ పొత్తుకు వెళ్తారా? అనేది ఇప్పటికైతే అనుమానామే. -
ఆ సినిమా సీన్ను రిపీట్ చేస్తున్న విజయ్!
కొన్ని దశాబ్దాల తమిళనాడు రాజకీయలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ద్విముఖ పోరాటంగా కొనసాగుతూ వచ్చాయి. మధ్యలో ప్రత్యామ్నాయంగా పార్టీలు పుట్టుకొచ్చినా.. అవి దీర్ఘకాలం ప్రభావం చూపెట్టలేకపోయాయి. కానీ ఈసారి ఆ సీన్లోకి అగ్రనటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఈలోపు.. ఎగ్జిట్పోల్ ఫలితాలు ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. మెజారిటీ డీఎంకేకే తమిళ ఓటర్లు మళ్లీ పట్టం కడతారని తేల్చేశాయి. ఒకట్రెండు మాత్రం ప్రతిపక్ష అన్నాడీఎంకేకు అధికారం ఖాయమన్నాయి. అయితే ఆ సర్వేలే విజయ్ టీవీకే పార్టీ రెండంకెల ఫిగర్కు పరిమితం కావొచ్చని చెబుతూనే.. ఓటింగ్ శాతంపరంగా ఇంపాక్ట్ చూపించవచ్చని అంచనా వేశాయి. అయితే.. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం అనూహ్యంగా విజయ్ టీవీకే అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ 98-120 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సంఖ్య సాధారణ మెజారిటీకి మించి ఉండటంతో.. విజయ్ ముఖ్యమంత్రి పదవి వైపు దూసుకెళ్తున్నారని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా వ్యాఖ్యానించారు.దీంతో విజయ్ అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. అయితే విజయ్ మాత్రం తొందరపాటు వద్దని.. సంయమనం పాటించాలని కేడర్కు, అభిమానులకు సూచిస్తున్నారు. పోలింగ్ తర్వాత ఇంటికే పరిమితమైన ఆయన.. ఫలితాలు దగ్గర పడుతున్నా కొద్దీ వరుసగా ప్రముఖ ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవాళ టీవీకే తరఫున పోటీ చేసిన 234 మంది అభ్యర్థులతోనూ ఆయన భేటీ కానున్నారు. మురుగదాస్ డైరెక్షన్లో విజయ్ హీరోగా సర్కార్ అనే పొలిటికల్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఓటు వాల్యూ ఏంటో చెప్పే మెసేజ్తో తెరకెక్కిందా చిత్రం. సినిమా క్లైమాక్స్లో.. తన తరఫున గెలిచిన వాళ్లతో ఓ మీటింగ్ పెట్టి సీఎం క్యాండిడేట్ను అనౌన్స్ చేస్తాడు విజయ్. ఈ నేపథ్యంలో నెట్టింట ఇవాళ్టి టీవీకే మీటింగ్పైనా అలాంటి పోలికతో చర్చ నడుస్తోంది. అయితే.. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలన్నదానిపై అభ్యర్థులకు విజయ్ దిశానిర్దేశం చేస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఈ మీటింగ్పై సెటైర్లు పేలుస్తున్నారు. టీవీకే ఇప్పటికే విజయ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం కేండిడేట్ను కొంపదీసి విజయ్ మారుస్తారా? ఏంటి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. తమిళ దర్శకనిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్ తనయుడిగా వెట్రి(1984) అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా జోసెఫ్ విజయ్ వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆపై 18 ఏళ్ల వయసులో నాళఇయా తీర్పు(1992)తో హీరోగా మారాడు. రొమాంటిక్, మాస్ ఇమేజ్లతో అగ్రతారగా ఎదిగారు. ఒక పక్క మెసేజ్ ఓరియెంటల్ సినిమాలు వరుసగా తీస్తూనే.. మరోవైపు తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవతో గుర్తింపు దక్కించుకున్నారు. ఈ మధ్యలో తమిళనాడులో జరిగిన ప్రతీ పోరాటానికి, ఉద్యమానికి పార్టీలకతీతంగా ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అటుపై ఏకంగా తమిళగ వెట్రి కగళం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం దాకా.. విజయ్ అనుసరించిన వ్యూహం తమిళ ప్రజలను మరీ ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఎవరితోనూ పొత్తు ఉండదని.. ఒంటరి పోరుకే సై అంటూ హాట్ చర్చకు దారి తీశారాయన. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా.. డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించుకుంటూ మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగారు. ఒకానొక దశలో.. తమిళనాట మార్పు టీవీకేతోనే సాధ్యం అనే పిలుపుపై జోరుగా చర్చ నడిచింది. అయితే ఎంజీఆర్, జయలలితలా.. విజయ్ మరో తమిళ రాజకీయాలను శాసించే సినీ తార అవుతారా? లేదా? అనేది ఫలితాలు వెల్లడయ్యేదాకా సస్పెన్స్గానే భావించాలి. -
ఎగ్జిట్ పల్స్.. అంచనాలు తారుమారు
-
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్.. విజయ్ సీఎం అవుతాడా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళతో (బుధవారం)తో ముగిసింది. పలు సంస్థలు ఎగ్జిట్పోల్స్ విడుదల చేశాయి. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ ఇన్సైట్ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.మాట్రిజ్ సర్వే:DMK: 122-132ADMK: 87-100TVK: 10-12ఇతరులు 0-6ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్DMK 134-141AIDMK 84-90TVK 4-8టీవీకే విజయ్దే విజయం: యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశంరెండో స్థానంలో డీఎంకే 92-100పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేపట్టనుందని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి. డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది.మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా, పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చారు. 18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది. డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. ప్రధాన అభ్యర్థుల స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు. మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది.తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై మైలాపూర్లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటడు దివంగత విజయ్కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోంది. ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది. విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు. -
ఉద్యోగి కోసం బాస్ చేసిన పని.. నెటిజన్లు ఫిదా!
ఒక కంపెనీలో బాస్ అంటే.. కేవలం ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రమే కాదు, వారి కష్టాలను కూడా గుర్తించాలి. అవసరమైన సహాయం చేయాలి. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తులలో ఒకరు ప్రదీప్ కన్నన్. ఇంతకీ ఈయన ఎవరు?, ఈయన చేసిన సహాయం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.తమిళనాడుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కన్నన్.. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి, కొన్ని రోజులుగా ఆఫీసులో చాలా నీరసంగా ఉండటం, పనిపై ఏకాగ్రత చూపించకపోవడం వంటివి గమనించారు. అతను ఆలా ఉండటానికి కారణం ఏమిటని ఆరాతీస్తే.. భారీ ఎండల కారణంగా రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపోవడం లేదని తెలిసింది. అయితే.. ఇది ఉద్యోగి వ్యక్తిగత సమస్య అని వదిలేయకుండా, ప్రదీప్ అతనికి ఒక ఎయిర్ కూలర్ కొని ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.Our employee was struggling to sleep in this heat.Next day, we bought him an air cooler.Not posting this to brag.Posting this because many founders miss the real math:The cost of an air cooler is small.The cost of a:- tired mind- low energy, - bad work, and- feeling… pic.twitter.com/o6TQnuB9co— Pradeep Kannan (@Pradeepkannanj) April 21, 2026ఎయిర్ కూలర్ విలువ, కంపెనీ విలువతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉద్యోగి సమస్యకు స్పందించిన బాస్ అని పలువురు నెటిజన్లు 'ప్రదీప్ కన్నన్'ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.నిజానికి చాలా కంపెనీలలో ఉద్యోగులు జాబ్ వదిలేయడానికి కారణం, జీతం సరిపోకపోవడం కాదు. సంస్థలో వారికి విలువ ఇవ్వకపోవడం లేదా పట్టించుకోకపోవడం అని ప్రదీప్ పేర్కొన్నారు. మీ టీమ్ కేవలం పనిచేసే ఉద్యోగులు కాదు. వారు మీతో కలిసి వ్యాపారాన్ని నిర్మించే భాగస్వాములు అని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్ జీతం ఎంతో తెలుసా? -
పోటెత్తిన ఓటింగ్
కోల్కతా/చెన్నై: ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యానికి సంకేతంగా పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో, ఒకే విడతలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గురువారం 152 స్థానాలకు జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 92.72 శాతం, మొత్తం 234 స్థానాలకు జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 85.14 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే ద్వారా అర్హత లేని లక్షలాది ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదవడం గమనార్హం. శుక్రవారం ఉదయం కల్లా తుది గణాంకాలు రావొచ్చు. బెంగాల్లో అక్కడక్కడా హింసాకాండ చోటుచేసుకోవడం మినహా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కనిష్ట స్థాయిలో హింస జరగడం బెంగాల్ ఎన్నిక చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి, దేశ పౌరులుగా తమ విధిని నిర్వర్తించడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటువేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల ఎదుట రద్దీ తగ్గలేదు. వరుసలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక ఓటింగ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 9న జరిగిన అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 85.38 శాతం, పుదుచ్చేరిలో 89.83 శాతం నమోదయ్యింది. బెంగాల్, తమిళనాడులో ఇప్పటిదాకా 2011 నాటి ఎన్నికల ఓటింగే అత్యధికం. అప్పట్లో బెంగాల్లో 84.72 శాతం, తమిళనాడులో 78.29 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ రికార్డును ఈసారి ఓటర్లు తిరగరాశారు. రెండు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. తమిళనాడులో పురుషులు 83.57 శాతం మంది ఓటువేయగా, మహిళలు 85.76 శాతం మంది ఓటువేశారు. బెంగాల్లో పురుషులు 90.92 శాతం, మహిళలు 92.69 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్లో సరికొత్త రికార్డు సృష్టించిన రెండు రాష్ట్రాల ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో అర్హులైన ఓటర్లలో 91.78 శాతం మంది ఓటు వేశారు.పశ్చిమ బెంగాల్లో స్వల్ప హింస బెంగాల్లో తొలి విడత ఎన్నికల సందర్భంగా హింసాకాండ చోటుచేసుకుంది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. హింసాత్మక ఘటనలు ఓటర్ల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి. 2021లో 82.30 శాతం ఓటింగ్ నమోదు కాగా, గురువారం 92 శాతం దాటేసింది. బెంగాల్ ప్రజలు తమ హక్కులను కోల్పోకుండా ఉండేందుకే అధిక సంఖ్యలో ఓటు వేశారని టీఎంసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే పౌరులుగా తమ హక్కులను, పౌరసత్వాన్ని కోల్పోతామని ప్రజలు ఆందోళనకు గురయ్యారని, అందుకే ఆ ప్రమాదం తలెత్తకుండా అధిక సంఖ్యలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీర్భూమ్లోని ఖరిసోల్లో ఈవీఎంలలో టీఎంసీకి వేసిన ఓట్లను బీజేపీకి అనుకూలంగా నమోదు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో అధికారులు పోలింగ్ను తాత్కాలిక నిలిపివేశారు. స్థానికులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు రాళ్లతో దాడికి దిగారు. పారామిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. దక్షిణ దినాజ్పూర్లోని కుమార్గంజ్లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్పై దాడి జరిగిందని, అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలోని రహమత్ నగర్ సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే అగి్నమిత్ర పాల్ కారుపై రాళ్లతో దాడి చేసి వెనుక కిటికీని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. నవోడాలో ఏజేయూపీ నాయకుడు హుమాయున్ కబీర్ కాన్వాయ్పై కొందరు రాళ్లు విసిరారు. దీంతో అతడి మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య ఘర్షణచోటుచేసుకుంది. లాభ్పూర్, చంచల్. మురారైలలో హింసాత్మక, బెదిరింపు ఘటనలు జరిగాయి. వేర్వేరు పారీ్టల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. డోమ్కల్లో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకోకుండా కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి వందలాది ఫిర్యాదులు అందినట్లు తెలియజేసింది. జిల్లాల వారీగా చూస్తే ముర్షిదాబాద్, బంకూర, కూచ్ బెహార్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా కలింపాంగ్లో 81 శాతం నమోదయ్యింది. బెంగాల్ ఎన్నికలు అంటేనే హింసాకాండకు మారుపేరుగా చెబుతుంటారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది. రాష్ట్రంలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో అంతా ప్రశాంతం అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే, కొత్తగా రంగప్రవేశం దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో 85.14 శాతం మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే–బీజేపీ కూటమిని లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తీవ్రంగా పోరాడిన డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి హోరాహోరీగా పోరాడింది. విజయ్ పార్టీ తమిళగ వేట్రి కళగం(టీవీకే), తమిళ జాతీయవాది సీమాన్కు చెందిన నాన్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఎన్నికల రంగంలో గట్టి పోటీదారులుగా నిలిచాయి. డీఎంకే–కాంగ్రెస్, అన్నాడీఎంకే–బీజేపీ కూటములు తమ విజయం పట్ల ధీమాగా ఉన్నాయి. అత్యధికంగా కరూర్ స్థానంలో 91.86 శాతం, అత్యల్పంగా కన్యాకుమారిలో 75.50 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. చెదురు ముదురు ఘటనల మినహా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా, తక్షణం మరమ్మతులు చేసి ఓటింగ్ను కొనసాగించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. చెన్నైలోని మైలాపూర్లో ఓటర్లకు డీఎంకే డబ్బులు పంపిణీ చేస్తోందని బీజేపీ ముఖ్యనేతలు అన్నామలై, వనతి శ్రీనివాసన్ ఆరోపించారు. అధికార డీఎంకే పార్టీ ఉదయించే సూర్యుడి చిహ్నాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ నేత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తమ కుటుంబంతో సహా చెన్నైలో ఓటు వేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సేలం సిలువం పాళయం నెడుంకుళం పంచాయతీ పరిధిలోని యూనియన్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్లో కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత విజయ్ చెన్నై నీలాంకరై పోలింగ్ బూత్లో గట్టి భద్రత నడుమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, తమిళ సినీ నటులు రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, జ్యోతిక దంపతులు, కార్తీ, అర్జున్, విక్రమ్, ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, విశాల్, మణిరత్నం, సంగీత దర్శకుడు అనిరుద్, నటీమణులు త్రిష, కీర్తి సురేష్, రాధిక, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ ఓటింగ్ మాకే అనుకూలం: అన్నాడీఎంకే తమిళనాడులో 2021లో 73.63 శాతం ఓటింగ్ నమోదు కాగా, స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధించింది. 2011లో 78.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచింది. ఈసారి 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడాన్ని తమకు సానుకూలాంశంగా అన్నాడీఎంకే–బీజేపీ కూటమి నాయకులు భావిస్తున్నారు. తమిళనాట ఎస్ఆఐర్ ద్వారా ఓట్లను తొలగించారు. 2025 అక్టోబర్లో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 5.73 కోట్లకు తగ్గింది. 2021 ఎన్నికల సమయంలో 6.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 56 లక్షల మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. తమిళనాట ఓటింగ్ సరళి తమిళనాడులో 1957లో అత్యల్పంగా 47 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత 1960వ దశకం నుంచి నేటి వరకు సగటు ఓటింగ్ శాతం 70కి దరిదాపుల్లోనే ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులు చెదిరిపోయాయి.👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీవీకే కార్యకర్త అరెస్ట్.. పోలింగ్ కేంద్రంలో ఏం చేశాడంటే..?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో టీవీకే పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. టీవీకే గుర్తుపై ఓటు వేస్తూ వీడియో చిత్రీకరణ చేసిన ఆ కార్యకర్త.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద టీవీకే కార్యకర్త శక్తివేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఈ ఘటన జరిగింది.అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలింగ్ కేంద్రంలోకి తన మొబైల్ ఫోన్ను తీసుకెళ్లిన శక్తివేల్.. పార్టీ గుర్తు ‘ఈల’కు ఓటు వేస్తున్నట్లు వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో 'రీల్'గా షేర్ చేయడంతో.. సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చింది. ఓటు రహస్యాన్ని భంగపరిచే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, వీడియోలు తీయడం ఎన్నికల నిబంధనల ప్రకారం నేరమని భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అధికారులు పోలీసులను అప్రమత్తం చేయడంతో.. వారు బూత్కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శక్తివేల్పై ఎన్నికల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కఠిన నిఘా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4,023 మంది అభ్యర్థుల భవిష్యత్తును 5.73 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు -
తొలి గంటలోనే ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
పోలింగ్ కేంద్రం వద్ద తమిళనాడు సీఎం స్టాలిన్
-
Elections 2026: జోరుగా పోలింగ్
-
Tamilnadu: తమిళనాడులో పోలింగ్ కేంద్రాల్లో సెలబ్రిటీలు
-
ఓటర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లొద్దు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ అత్యవసరంగా ఓ లేఖ రాశారు. ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూనే.. పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.ఎలక్షన్ టైంలో తమిళనాడులో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సొంతూళ్లకు వెళ్లి ఓటేయాలనుకుంటున్నవాళ్లు బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు పట్టణ, నగరాల్లోనూ బస్టాండులలో పడిగాపులు పడుతున్నారు. కొయంబత్తూరులో జనం ఏకంగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఈ పరిస్థితులన్నింటినీ విజయ్ తన లేఖలో ప్రస్తావించారు. ‘‘ఓటు వేసేందుకు తమిళనాడు ఓటర్లు పోటెత్తుతున్నారు. గంట గంటకు పెరుగుతున్న ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శనం. అయితే.. పూర్తిస్థాయిలో ఓటు వేయకుండా అడ్డుకునే కుట్ర కనిపిస్తోంది. సరిపడా బస్సులు లేక ఓటర్లు అవస్థలు పడుతున్నారు. చెన్నైలోని ప్రధాన టెర్మినల్స్ అని ప్రజలతో నిండిపోయాయి. పోలింగ్ బూత్లకు ఓటర్లు చేరుకోలేకపోతున్నారు. వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి. ఓటు వేయాలన్న ఓటర్ల ఉత్సామంపై నీళ్లు చల్లొద్దు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ను మరో రెండు గంటలు పొడిగించండి’’ అని ఈసీని లేఖలో కోరారాయన. pic.twitter.com/Y7Q3Gn1mKY— TVK Party HQ (@TVKPartyHQ) April 23, 2026తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6గం.తో పోలింగ్ ముగియనుంది. అప్పటిదాకా క్యూ లైన్లో ఉన్న వాళ్లను మాత్రమే ఓటింగ్కు అనుమతించనున్నారు. అయితే బస్సుల కొరత కారణంగా విజయ్ ఆ సమయాన్ని 8గం. దాకా పొడిగించాలని ఈసీని కోరుతున్నారు.తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు విజయ్. మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఆ పార్టీ. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇదీ చదవండి: విజయ్.. ఆ సింప్లిసిటీ ఏమైంది? -
ఫస్ట్ టైం.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన విజయ్
తమిళనాట అగ్రనటుడు విజయ్ది ఒక ప్రత్యేక శైలి. నటుడిగానే కాదు.. యువతకు ఆయనో రోల్ మోడల్. ముసుగులేసుకుని ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు మద్దతు ప్రకటించడం, అభిమానులను పరామర్శించేందుకు మారువేషంలో వెళ్లడం.. ఇలా చాలాసార్లు జరిగిందే. అలాగే ఓటు వేసే టైంలోనూ ఆయన ఓ ప్రత్యేకతను ప్రదర్శించేవారు. పోలింగ్ కేంద్రానికి కాన్వాయ్ లాంటి హడావిడి లేకుండా.. సింపుల్గా సైకిల్ మీద వచ్చి ఓటేయడం ఆయనకు అలవాటుగా ఉండేది. ఎందుకని అడిగితే.. ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణహితం, ప్రజాస్వామ్యానికి అంకితభావం అంటూ యువతకు మంచి మేసేజ్ ఇచ్చేవారు. అంతేకాదు.. ఎంత ఆలస్యమైనా సరే క్యూ లైన్లో నిల్చుని ఓటేసి వెళ్లిపోయేవారు. 2021 అసెంబ్లీ ఎన్నికల టైంలోనే కాదు.. అంతకు ముందు కూడా ఆయన సింప్లిసిటీ గురించి నెట్టింట జోరుగా చర్చ నడిచేది. అయితే.. మొదటిసారి రాజకీయ నాయకుడిగా ఆ సంప్రదాయానికి ఆయన బ్రేకులు వేశారు. ఈసారి భారీగా టీవీకే శ్రేణులు, అభిమానుల కోలాహలం నడుమ కాన్వాయ్లో చెన్నైలోని నీలంకరైలో ఉన్న పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. ఆ సమయంలో క్రౌడ్కంట్రోల్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో క్యూ లైన్లో కాకుండా ఆయన్ని పక్క నుంచి లోపలికి పంపి ఓటేసేందుకు అనుమతించారు పోలింగ్ సిబ్బంది.విజయ్ ఈసారి తన టీవీకే పార్టీతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే. మొత్తం 234 స్థానాల్లోనూ ఆయన అభ్యర్థులను నిలిపారు. ఆయన కూడా పెరంబూర్, తిరుచురాపల్లి ఈస్ట్.. రెండు చోట్లా పోటీ చేస్తున్నారు. టీవీకే పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా విజయ్ పేరునే ఖరారు చేశారు. #WATCH | Tamil Nadu Elections 2026 | Vijay, TVK chief and candidate from Tiruchirappalli East and Perambur constituencies, at a polling station in Chennai after casting his vote. pic.twitter.com/yCXPjQyJEh— ANI (@ANI) April 23, 2026#WATCH | Tamil Nadu Elections 2026 | Vijay, TVK chief and candidate from Tiruchirappalli East and Perambur constituencies, leaves after casting his vote at a polling station in Chennai. pic.twitter.com/lvVizuciek— ANI (@ANI) April 23, 2026 -
తమిళనాడులో భారీగా ఎన్నికల పోలింగ్
తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.. -
తమిళనాడులో జగన్ నామ గర్జన.. విజయ్ అభిమానం
జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్లిన అభిమానులు వైఎస్ జగన్ భారీ సంఖ్యలో తరలివచ్చి వెన్నంటే ఉంటారు. తమ అభిమాన నేతపై వారికున్న అభిమానాన్ని చాటుకుంటారు. కాగా, తమిళనాడు ఎన్నికల్లో సైతం వైఎస్ జగన్ పేరు మారుమోగుతోంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే అధినేత విజయ్.. వైఎస్ జగన్పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. జగన్తో కలిసి ఉన్న ఫొటోను విజయ్ ప్రదర్శించారు. దీంతో, ఒక్కసారిగా అక్కడున్న వారిలో జోష్ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీవీకే అధినేత విజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేడి మధ్యలో, ప్రచార రథంపై నిలబడి ఉన్న విజయ్ ఒక్కసారిగా వైఎస్ జగన్ ఫొటోను పైకి ఎత్తి చూపించారు. ఆ ఫొటోను పైకెత్తిన క్షణంలోనే సభ మొత్తం ఒక్కసారిగా మార్మోగిపోయింది. “జగన్.. జగన్” అంటూ జనం గళం ఉప్పొంగిపోయింది. అది సాధారణ స్పందన కాదు. ఒక నాయకుడిపై ప్రజల్లో ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమ.. ఒక్క క్షణంలో బయటపడిన ఎమోషన్. అది ఒక ఫొటో మాత్రమే అయినా, స్పందన మాత్రం తుఫాన్లా ఎగిసిపడింది. అక్కడున్న వారంతా జగనన్న సీఎం అంటూ నినాదాలు చేశారు.Vijay holding jagan and vijay photo in TN election campaign 🇺🇿🔥🇪🇸 https://t.co/AwkL1Kuljk pic.twitter.com/SGblloxsRb— ᴊᴀɪxᴊᴀɢᴀɴɪꜱᴍ✨ (@ysj_fanboy) April 21, 2026విజయ్ ఫోటో ఎత్తిన తీరు.. జనం ఇచ్చిన ఆ రియాక్షన్.. ఈ రెండూ కలిసిన ఆ క్షణం నిజంగా ప్రజల గుండెల్లో “జగన్” అనే పేరు ఎంత లోతుగా ఉందో చూపించింది. ఇదీ జగన్ అంటే ప్రజల్లో గుండెల్లో ప్రత్యేక అభిమానమని అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. వైఎస్ జగన్ అంటే ఒక నమ్మకం.. ఒక ఇంపాక్ట్ అని మరోసారి రుజువైంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒓𝒂𝒏 𝑮𝒖𝒕𝒕𝒂 (@hiran_gutta) -
తమిళనాడులో బాబు స్పీచ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్
-
తమిళనాట హోరాహోరీ
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజులపాటు హోరాహోరీగా కొనసాగిన ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు గడువు ముగిసే చిట్టచివరి క్షణం వరకు నేతలు రోడ్ షోల ద్వారా పోటాపోటీగా ప్రచారం సాగించారు. అసెంబ్లీలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. అర్హులైన 5.73 కోట్ల మంది ఓటర్లు బరిలో ఉన్న 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్(ఈసీ) విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.రాష్ట్రంలో అధికార డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్(ఎస్పీఏ)కి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకి ప్రధాన పోటీ నెలకొంది. ఎస్పీఏలో డీఎంకే, కాంగ్రెస్లతోపాటు వామపక్షాలు, వీసీకే, ఎంఎంకే తదితర పారీ్టలున్నాయి. ఎడపాడి పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే, బీజేపీ తదితర పార్టీలతో జట్టుకట్టింది. సినీ నటుడు విజయ్కి చెందిన టీవీకే, ఒకప్పటి సినీ దర్శకుడు సీమాన్కు చెందిన నామ్ తమిళార్ కట్చి మొత్తం 234 సీట్లలో బరిలో నిలిచాయి. దీంతో, ప్రధానంగా బహుముఖ పోటీ నెలకొంది. మహామహుల ప్రచారం.. ఎన్నికల ప్రచారంలో డీఎంకే కూటమి తరఫున సీఎం ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేతలు రాహుల్, ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అన్నాడీఎంకే కూటమి తరఫున పళనిస్వామితోపాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. డీఎంకేకు మద్దతు తెలిపిన సినీ నటుడు కమల్ హాసన్కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ ఈ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. చివరి రోజైన మంగళవారం సొంత కొళత్తూరు నియోజకవర్గంలో రోడ్ షో ద్వారా సీఎం స్టాలిన్ ప్రచారం ముగించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి చెన్నైలో రోడ్షో నిర్వహించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ చెన్నై నందనంలో జరిగిన సభతో ప్రచారం ముగించారు. ఎండల వేడిని మరిపించిన ప్రచారం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేసవి ఎండలను మించిన వేడెక్కించింది. ప్రధాన వైరిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. డీఎంకేకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జతయ్యారు. అన్నాడీఎంకే కేవలం ముసుగు మాత్రమే దీని వెనుక కథ నడిపించేదంతా బీజేపీయే నంటూ వ్యాఖ్యానించారు. ఎన్డీయేకి అధికారమిస్తే మోదీ ఆడించినట్లుగా ఆడే కీలు బోమ్మ సీఎం రాష్ట్రానికి వస్తారని విమర్శించారు. అన్నాడీఎంకేను ఢిల్లీ నుంచి బీజేపీ కంట్రోల్ చేస్తుందని, ఇక్కడి పోరును తమిళనాడు వర్సెస్ ఎన్డీఏ–ఢిల్లీ పోరుగా సీఎం స్టాలిన్ అభివర్ణించారు.తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే తమిళనాడు సూపర్స్టార్ అయ్యిందని చెప్పుకొచ్చారు. దేశంలో నంబర్ వన్ రాష్ట్రం కానుందని, దక్షిణాసియాలోనే ఆదర్శం అవుతుందని చెప్పారు. ఈ విమర్శలకు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి దీటుగా బదులిచ్చారు. తమ పార్టీని ముక్కలు చేసేందుకు డీఎంకే కుట్ర పన్నగా తాము వాటిని సాగనివ్వలేదని తెలిపారు. -
స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు
సాక్షి, చెన్నై: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఒక గొప్ప ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల విద్వేష, నీచ రాజకీయాల వల్ల ఆ బిల్లు పట్టాలు తప్పిందని అన్నారు. అధికారం కేవలం తమ కుటుంబాల చేతుల్లోనే ఉండాలన్న స్వార్థంతోనే విపక్షాలు మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని, బిల్లు క్రెడిట్ను ప్రతిపక్షాలే తీసుకోవాలంటూ వ్యక్తిగతంగా అభ్యర్థించానని చెప్పారు. అయినా సరే విపక్షాలు మద్దతు ఇవ్వలేదన్నారు. సాధారణ కుటుంబాల్లో జన్మింంచిన ఆడబిడ్డలు అత్యున్నత చట్టసభలకు అధిక సంఖ్యలో రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ ఈ గొప్ప ప్రయత్నం సాకారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలే అందుకు కారణమని మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొంది ఉంటే సామాన్య కుటుంబాలకు చెందిన ఎంతోమంది తమిళ మహిళలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలు అయ్యేవారని.. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడుకు లోక్సభలో మరెన్నో సీట్లు వచ్చేవని తెలిపారు. కానీ, ఇదంతా జరగడం డీఎంకేకు ఇష్టం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. -
మోదీ గుట్టు ట్రంప్కు తెలుసు
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని.. మోదీ మాత్రం తమిళనాడును నియంత్రించాలని చూస్తున్నారని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడులో అధికారం దక్కించుకోవడానికి అన్నా డీఎంకేను గుప్పిట పట్టారని చెప్పారు. ప్రధాని మోదీ మన రైతులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఇతర దేశాలకు అమ్మేశారని, మన ఇంధన భద్రతను పరాయి దేశాలకు అప్పగించారని, మన డేటాను కూడా పంచిపెట్టారని ఆరోపించారు. శుక్రవారం పార్లమెంట్లో మోదీ ముఖంలో ఆత్మవిశ్వాసం లోపించడం చూశా మని అన్నారు. ఆయన ప్రతిపక్షాలకు ముఖం చూపించలేకపోయారని, పక్కన కూర్చుండిపోయారని చెప్పారు. మోదీ అమెరికా నియంత్రణలో ఉండటమే అందుకు కారణమని తేల్చిచెప్పారు. మన దేశాన్ని అమ్మేయడానికి భారత్–అమెరికా ఒప్పందంపై ప్రధాని సంతకం చేశారని ఆక్షేపించారు. తమిళనాడులోని రాణిపేట, పొన్నేరి, తిరుచిరాపల్లిలో శనివారం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ట్రంప్ ఎలా చెబితే అలా మోదీ తలవంచే పరిస్థితి ఉందన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నారని చెప్పారు. మోదీ ఆర్థిక లావాదేవీలు, అదానీతో మోదీకి ఉన్న బంధం గురించి ట్రంప్కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశాన్ని పరిరక్షించుకోవడానికే శుక్రవారం లోక్సభలో ప్రతిపక్షాలు డీలిమిటేషన్ బిల్లును ఓడించాయని రాహుల్ గాంధీ అ న్నారు. పార్లమెంట్లో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించాలన్నదే అసలు ఉద్దేశమని విమర్శించారు. దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల బలాన్ని తగ్గించడానికే బీజేపీ ఈ పునరి్వభజన చర్య చేపట్టిందని ధ్వజమెత్తారు. తమిళనాడును కాపాడుకోవాలంటే డీఎంకే నేతృత్వంలోని కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ కోరారు. -
వెండితెర తార... నేల పైకి
మాధవన్ విలక్షణ పాత్రలకు పేరొందిన ఆర్.మాధవన్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా సాగించిన వైవిధ్యభరిత ప్రయాణం మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియనిది రైతుగా ఆయన సాధించిన అపురూపమైన విజయం....తమిళనాడులోని పళనిలో ఉన్న ఒక బీడు భూమి మాధవన్ విజయానికి కేంద్రబిందువుగా మారింది. ఆ బీడు భూమిని కొనుగోలు చేసిన మాధవన్ ... కేవలం మూడేళ్లలోనే ఫలవంతమైన కొబ్బరితోటగా మార్చారు. నిరంతర కృషి, ప్రయోగాల ద్వారా సాధించిన ఈ మార్పు, తీయని నీరు, విలక్షణమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన నాన్ –హైబ్రీడ్ కొబ్బరి తోటగా రూపుదిద్దుకుంది.నేలతల్లి నుంచి నేర్చుకున్నా...‘వ్యవసాయంలో ప్రతి అడుగు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేసింది. ఇది ఎంతో సంతృప్తికరమైన అనుభవం. నా జీవితంలో అత్యంత ప్రతి ఫలదాయకమైన అనుభవాలలో ఒకటి. భూమి పునర్జీవం ΄పొంది, అది ఫలాలను ఇవ్వడాన్ని చూడటం అద్భుతంగా అనిపించింది. సరైన మల్చ్తో భూమిని సిద్ధం చేయడం నుంచి బావిలో సరైన చేపలను వదలడం వరకు నేను నేర్చుకున్న ప్రతి విషయం అమూల్యమైనది. ఎంతో విలువైనది’ అంటారు మాధవన్ ఎంతో సంతోషంగా...కొబ్బరిచెట్ల ప్రాజెక్ట్!తన కొబ్బరి చెట్ల పెంపకాన్ని ఒక ప్రాజెక్ట్‘ గా పేర్కొంటారు మాధవన్ . ‘ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. దీనిలో దాదాపు బీడుగా ఉన్న భూమిలో అత్యంత తీయని, సువాసనగల నాన్ –హైబ్రిడ్, స్వచ్ఛమైన ΄పొట్టి రకం కొబ్బరికాయలను పండించాము. త్వరలో నేను స్థానిక రైతుల కోసం ఒక వ్యాసం రాస్తున్నాను’ అంటున్నారు మాధవన్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నాన్ హైబ్రిడ్ కొబ్బరి తోటల గురించి కల కంటున్నారు మాధవన్.కొత్త ఫలంకోవిడ్ లాక్డౌన్ సమయంలో, మాధవన్ తన అందమైన టెర్రస్ గార్డెన్ను వీడియోల ద్వారా చూపించారు. ఒక వీడియోలో చిన్న చెర్రీ పండ్లను చూపిస్తూ, ‘ముంబై టెర్రస్కు ఒక కొత్త ఫలం వచ్చింది’ అంటూ సంబరంగా చెప్పారు. నటిస్తే ఆదాయం, అవార్డులు రావచ్చు. రైతుగా అడుగులు వేస్తే... ఆ అడుగులు ముందుతరాలకు కొత్త దారులు చూపిస్తాయి. ఈ విషయంలో మార్గదర్శిగా నిలుస్తున్నారు మాధవన్.సామాజిక గళంసామాజిక సందేశాల కోసం గళాన్ని వినిపించడంలో ముందుంటారు మాధవన్. పశుపోషణకు సంబంధించిన విషయాలను, దాని పర్యావరణ ప్రభావాన్ని తెలియజేసేలా పెటా ఇండియా విడుదల చేసిన ‘గ్లాస్ వాల్స్’ అనే వీడియోకు మాధవన్ వ్యాఖ్యానం అందించారు. ‘వధశాలలకు గాజు గోడలు ఉంటే, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారిపోయేవారు’ అన్న ఒక ప్రసిద్ధ ఆంగ్లోక్తిని ఆయన ఈ వీడియోలో మనకు వినిపిస్తారు. మాంసం, పాల పరిశ్రమలలోని రకరకాల దశలను ఈ వీడియో చిత్రీకరిస్తుంది. జంతువుల పట్ల వ్యవహరించే తీరును చూపిస్తూ, నైతికతకు సంబంధించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. తెర వెనుకసినిమా తారలు తెర వెనుక తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఒకవైపు నటనను కొనసాగిస్తూనే మరోవైపు తమవైన అభిరుచులను ఆస్వాదిస్తున్నారు. బైక్, కార్ రేసింగ్లకు పేరొందిన అజిత్ లాంటి తమిళ టాప్ హీరోల నుంచి వెయిట్ లిఫ్టింగ్లో సత్తా చాటుతున్న ప్రగతి లాంటి టాలీవుడ్ నటీమణుల దాకా...విభిన్న రంగాల్లోనూ తమను తాము నిరూపించుకుంటున్నారు. వృత్తిజీవితాన్ని, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటున్నారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
Tamil Nadu Survey: 178 స్థానాలలో గెలుపు బాటలో డీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే వర్గాలలో మంచి జోష్ నింపే విధంగా తాజాగా ఏఎన్ఎస్ సర్వే వివరాలు వెలుగు చూశా యి. ఇందులో తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభంజనం సృష్టించబోతున్నట్టుగా సమాచారం వెలువడింది. తాజా సర్వే గణాంకాల ప్రకారం ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 178 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉంది. ఎన్నికలకు ముందుగా వెలువడ్డ అనేక సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి. అదే సమయంలో ఎన్నికల నగారా మోగినానంతరం ప్రచార హోరు నేపథ్యంలో అన్నాడీఎంకేకు సైతం అనుకూలంగా సర్వేలు రావడంతో ఉత్కంఠ తప్పలేదు. అదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కీలక శక్తిగా మారనున్నట్టుగా సర్వేలు పేర్కొంటూ వచ్చాయి. ఓటరు నాడి ఎటు అన్న ఉత్కంఠ నేపథ్యంలో తాజాగా వెలువడ్డ ఈ సర్వే వివరాలను డీఎంకే అనుకూల పత్రిక ప్రకటించింది. జోన్ల వారీగా అంచనాలు సర్వే నివేదిక ప్రకారం వివిధ ప్రాంతాల్లో డీఎంకే కూటమి పరిస్థితిని వివరించారు. ఇందులో చెన్నై జోన్లో 37 నియోజకవర్గాలకు డీఎంకే కూటమి 36 స్థానాల్లో పటిష్టంగా ఉండగా, అన్నాడీఎంకే ఒకే స్థానానికి పరిమితం కానున్నట్టు ప్రకటించారు. సెంట్రల్ జోన్లో 37 స్థానాల్లో 35 చోట్ల డీఎంకే గెలుస్తుందని సర్వేలో తేల్చారు. దక్షిణ జోన్లో 58 స్థానాలకు గాను 42 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు ప్రకటించారు. జిల్లా వారీగా క్లీన్ స్వీప్ అనేక జిల్లాల్లో డీఎంకే కూటమి 100 శాతం సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో వివరించారు. ఆ మేరకు చెన్నై జిల్లాలో 16 సీట్లు, తిరువళ్లూరు జిల్లాలో 10 సీట్లు, తంజావూరు 8 సీట్లు, కాంచీపురం 11 సీట్లు, నీలగిరి, కరూర్, తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లోని అన్ని సీట్లను డీఎంకే గెలుచుకునే అవకాశం ఉందని ఆ సర్వే ద్వారా వివరించారు. విజయ్ ప్రభావం ఓట్ల శాతం పరంగా ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతుందని ప్రకటించారు. డీఎంకే కూటమి 45.4 శాతం, అన్నాడీఎంకే కూటమి 35.3 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని వివరించారు. అయితే, నటుడు విజయ్ టీవీకే 11.5 శాతం ఓట్లు, సీమాన్ ఎన్టీకే 5.6 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్టు పేర్కొన్నారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, సర్వే ప్రకారం డీఎంకే 178 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా అవతరించనున్నదని, అన్నాడీఎంకే 56 సీట్ల వద్ద నిలిచిపోయే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది. అయితే తుది ఓటరు తీర్పు అన్నది మే 4న వెలువడే ఫలితాల మేరకు ఉండబోతుండడం గమనార్హం. ఈ సర్వే తమకు అనుకూలంగా ఉండడంతో డీఎంకే వర్గాలలో జోష్ పెరిగింది. గెలుపు దిశగా మరింత ఉత్సాహంతో ప్రచారంచేసే పనిలో పడ్డారు. -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్జెండర్కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
ఇది ట్రైలర్ మాత్రమే: సీఎం స్టాలిన్
చెన్నై: లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం తమ విజయమని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. లోక్సభలో తమిళనాడు.. ఢిల్లీని ఓడించిందన్నారు స్టాలిన్. ఇది తమిళనాడుకు వ్యతిరేకంగా వచ్చిన బిల్లు అని, అది వీగిపోయిందన్నారు సీఎం స్టాలిన్. ఇదిట్రైలర్ మా త్రమేనని, ముందు అసలు సినిమా ఉందని సెటైర్లు వేశారు సీఎం స్టాలిన్.ఇక తెలంగాణ సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యత ముందు కేంద్రం తలవంచిందన్నారు. నల్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు చిరస్మరణీయమని రేవంత్ పేర్కొన్నారు. బిల్లును ఓడించిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్.. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందని కొనియాడారు.ఇదీ చదవండి:ఓడిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు -
‘విద్యార్థినులు షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ కావొద్దు’
సాక్షి,చెన్నై: ‘నేను ఈ మధ్య ఓ విషయాన్ని గమనించాను. విద్యార్థినులు తరుచుగా షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ఇలాంటి వస్త్రధారణ పట్ల అటు విద్యార్థులు, ఇటు ప్రొఫెసర్లు ఆకర్షణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైంగిక వేధింపులకు ఆస్కారం కలిగిస్తాయంటూ తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ వి. నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.వైస్ ఛాన్సలర్ వి.నాగరాజు వ్యాఖ్యలపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైస్ చాన్సలర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు. యూనివర్సిటీ అధికారులు మాత్రం.. విద్యార్థులకు ఓ తండ్రిలా మాట్లాడారే తప్పా.. విద్యార్థునులను కించ పరిచే ఉద్దేశం కాదని అన్నారు. ప్రస్తుతం ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి.విద్యార్థినులు షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులను ఆహ్వానిస్తుంది అంటూ వైస్ ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు షార్ట్స్ ధరించి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వీసీ మాత్రం తాను చేసి వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం యూనివర్సిటీ న్యాయవాద విద్యార్థులతో జరిగిన ఓ సాధారణ సమావేశంలో వైస్ ఛాన్సలర్ నాగరాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి ఆయనతో పాటు, రిజిస్ట్రార్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల డీన్లు, మహిళా సంక్షేమ కేంద్రానికి అధిపతిగా ఉన్న అధ్యాపకులతో సహా పరిపాలనలోని ఇతర సభ్యులు కూడా హాజరయ్యారు.తనపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్ని వీసీ నాగరాజు ఖండించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఏ వైస్-ఛాన్సలర్ కూడా డ్రెస్ కోడ్ పెట్టలేరు. కానీ నా అభిప్రాయం ప్రకారం, సంస్థ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో విద్యార్థుల వస్త్రధారణ ఒక అంశం కావొచ్చని అన్నారు. విద్యార్థుల ప్రశ్నలను వారి అభిప్రాయాలుగా ఆయన కొట్టిపారేశారు. నేను ఏం మాట్లాడానో అర్థం చేసుకోకుండా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఇదో ట్రాప్.. మోదీ, అమిత్ షా హామీలను నమ్మలేం’
సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఈ బిల్లు తమిళనాడు ఉనికినే దెబ్బతీసేలా ఉందని అన్నారు. డీలిమిటేషన్పై మొదటి నుంచి ఆయన కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ బిల్లు పాస్ అయితే గనుక న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అంటున్నారాయన.‘‘లోక్సభ సాక్షిగా మోదీ, అమిత్ షా ఇచ్చిన హామీలను నమ్మలేం. నోటి మాటతో కాదు.. చట్ట సభల్లో రక్షణ కల్పించాలి. చట్ట సవరణ పేరుతో కొత్త కుట్రలు.. రాష్ట్రాల హక్కులు కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే కమిషన్కు అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. ఇది రాజకీయ వ్యూహమే తప్ప.. దేశ ప్రయోజనం కోసం ఎంతమాత్రం కాదు. ..తమకు కావాల్సిన రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడమే వాళ్ల ఉద్దేశం. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నంలో భాగంగా జాగ్రత్తగా వేసిన ఓ ఉచ్చు. జనాభా నియంత్రణ పాటించే ఇక్కడి రాష్ట్రాలకు శిక్షలా ఉంది. మెజారిటీ ఉందని ఏది పడితే అది చేయడం సరికాదు. ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదు’’ అని స్టాలిన్ ఉద్ఘాటించారు.డీలిమిటేషన్ను మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో చేస్తున్నారని కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదిస్తున్నారు. అయితే.. కేంద్రం మాత్రం ఎలాంటి అన్యాయం జరగదని.. తమది భరోసా అని చెబుతోంది. పైగా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు 125 నుంచి 195కి చేరతాయి అని బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాజ్యాంగ సవరణతో కూడిన ఈ బిల్లు పాస్ కావాలంటే సభలో 2/3 మెజారిటీ అవసరం. అంటే.. 360కి అవసరంకాగా ఎన్డీయే బలం 294నే ఉంది. ఇంకో 66 సీట్లు అవసరం. దీంతో మోదీ సర్కార్ ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
విజయ్ వరాల జల్లు : భారీ హామీలతో TVK మేనిఫెస్టో
సాక్షి, చెన్నై: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ గురువారం తమిళగ వెట్రి కజగం(TVK) మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో మహిళలు, రైతులు మరియు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ చర్యలను వాగ్దానం చేశారు. విజయ్ తన మేనిఫెస్టోను నిజాయితీకి నిదర్శనంగా అభివర్ణించారు. విజయ్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు, వాగ్దానాలు ఆసక్తికరంగా మారాయి.నిజాయితీ పరిపాలనను తన సిద్ధాంతం టీవీకే పార్టీ అధినేత ప్రకటించారు. అందుకే తమ పార్టీ తొలి ఎన్నికల ప్రణాళిక కూడా నిజాయితీకి హామీలనీ, తాము స్టాలిన్ లాగా ప్రజలను తప్పుదోవ పట్టించమని వెల్లడించారు.. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో రూపొందించిన తొందరపాటు ఎన్నికల ప్రణాళిక తమది కాదని పేర్కొన్నారు. డీఎంకే, మిగతా పార్టీలన్నీ ఒకటే అని చెప్పాం కదా?... కావాలంటే ఇరు పక్షాలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలను తీసుకుని పోల్చి చూడండని విజయ్ అన్నారు.పీటీఐ ప్రకారం, ఈ ప్రకటనలలో ముఖ్యంంగా మహిళలకు నెలకు రూ. 2,500 సహాయం, పెళ్లి చేసుకునే పేదింటి వధువులకు నాణ్యమైన పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారం మహిళలు నడుపుతున్న స్వయం సహాయక బృందాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు , బడి మానేయడాన్ని నివారించడానికి తల్లులకు సంవత్సరానికి రూ. 15,000 సహాయం అందిస్తామని కూడా విజయ్ హామీ ఇచ్చారు. ప్రధాన పార్టీలు నిజమైన విధాన ప్రత్యామ్నాయాలను అందించడం కంటే, ఒకరిని మించి ఒకరు పోటీ పడాలనే లక్ష్యంతో ఒకే రకమైన వాగ్దానాలతో కూడిన తొందరపాటు ఎన్నికల ప్రణాళికలను జారీ చేస్తున్నాయని ఎద్దేవా ఏశారు. ఈ పార్టీలన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తున్న "అవినీతి ముఠాలు" అని ఆయన ఆరోపించారు. టీవీకే ఓటర్లను అదే విధంగా తప్పుదోవ పట్టించదని అన్నారు.ముఖ్యమైన హామీలుమహిళా సంక్షేమానికి నగదు సాయం: మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.నిరుపేద వధువులకు 8 గ్రాముల (కాసు) బంగారం , పట్టుచీర.మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న రైతులకు సహకార బ్యాంకుల్లో ఉన్న పంట రుణాల పూర్తి మాఫీ.వరి పంటకు క్వింటాల్కు రూ. 3,500 మద్దతు ధర (MSP).ఆరోగ్యం మరియు విద్య విషయంలో కూడా కీలక హామీని తన మానిఫెస్టోలో పొందుపర్చారు. దీనికి ప్రకారం ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా.రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రుల ఏర్పాటు మరియు ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు.విద్యా రంగానికి సంబంధించి, విద్యార్థులకు అండగా నిలిచేందుకు రూ. 20 లక్షల వరకు ఉన్నత విద్యా రుణాలను అందించనున్నట్లు TVK అధినేత ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్ పేరుతో 100 ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల విద్యను మధ్యలోనే మానేసే సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో, ప్రభుత్వ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. దీంతోపాటు తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తామని విజయ్ పేర్కొన్నారు.ప్రస్తుత అధికార పక్షం (DMK), ఇతర పార్టీలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని, తమ మేనిఫెస్టో మాత్రం ఆచరణాత్మక మైందని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
బీజేపీకి ఝలక్.. స్టాలిన్ వినూత్న నిరసన
చెన్నై: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మూడు ప్రధాన బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. మహిళా రిజర్వేషన్లు అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలను కలిగి ఉన్న ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రం తీరు పట్ల వినూత్నంగా నిరసన తెలిపారు.పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. బిల్లుకు పూర్తిగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిక్ నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాను ఎగురవేశారు. అలాగే, డీలిమిటేషన్ బిల్లు పేపర్లను కాల్చివేశారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా స్టాలిన్.. ‘ఈ ప్రతిఘటన తమిళనాడు అంతటా వ్యాపించాలి! ఫాసిస్ట్ బీజేపీ అహంకారం కూలిపోవాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.Namakkal | DMK President and Tamil Nadu CM MK Stalin, wearing black attire, today hoisted a black flag in protest against the Centre's delimitation move. He also burned a copy of the proposed Delimitation bill. pic.twitter.com/AYno2V8UCn— ANI (@ANI) April 16, 2026అంతేకాకుండా.. గత హిందీ వ్యతిరేక ఆందోళనలతో పోలుస్తూ.. గతంలో తమిళనాడు నుండి వచ్చిన ప్రతిఘటన ఢిల్లీని లొంగిపోయేలా చేసిందని, అటువంటి ఉద్యమమే ప్రస్తుత ప్రతిపాదనను సవాలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ బిల్లు తమిళులను వారి సొంత భూమిలో శరణార్థులుగా మారుస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ అహంకారాన్ని అణచివేయడానికి ఈ ఆందోళన ద్రావిడ భూమి అంతటా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు.. డీఎంకే ఎంపీలు కూడా నల్ల దుస్తులు ధరించి నేడు పార్లమెంట్ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా.. పార్లమెంట్లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనుండగా, ఒక్కో సభలో 18 గంటలపాటు చర్చకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఈ బిల్లులపై స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందా? లేక ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోతుందా? అన్నది ఉత్కంఠగా మారింది.#WATCH | Chennai | Late DMK patriarch M. Karunanidhi's daughter, Selvi Karunanidhi, joins DMK protest against the Centre's proposed delimitation bill pic.twitter.com/EomzwcjQ4X— ANI (@ANI) April 16, 2026 -
ఊహించని విషాదం.. పేలని బాంబును తన్నడంతో..
సింగ పెరుమాళ్: తమిళనాడులోని సింగపెరుమాళ్ కోయిల్ సమీపంలో రక్షణ రంగ నిషేధిత ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రెక్కింగ్కు వెళ్లిన విద్యార్థుల బృందం అక్కడ ఉన్న ఒక పేలని షెల్ను కదిలించడంతో అది ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన విద్యార్థిని బెంగళూరుకు చెందిన హిమాన్షు యాదవ్ (21)గా గుర్తించారు. ఈ విద్యార్థి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి రమేష్ సింగ్ బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్లో ఉద్యోగి.ఏప్రిల్ 13న (సోమవారం) సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఆరుగురు విద్యార్థుల బృందం అనుమతి లేకుండా హనుమంతపురం ఫైరింగ్ రేంజ్ సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొండపైకి చేరుకున్నాక వారికి ఒక లోహపు వస్తువు కనిపించింది. అది పేలని బాంబు అని తెలియక ఒక విద్యార్థి దానిని తన్నడంతో అది రాయికి తగిలి ఒక్కసారిగా పేలిపోయింది.దీంతో హిమాన్షు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను వెంటనే పోతేరిలోని ఎస్ఆర్ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తాయని.. ఆ సమయంలో పేలని షెల్ ఏదైనా అక్కడ ఉండిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సింగపెరుమాళ్ కోయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పేలుడు పదార్థం అక్కడ ఎలా ఉండిపోయిందనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. -
దక్షిణాది ఒక్కటైతే దేశ రాజకీయాలే మారిపోతాయి: కేతిరెడ్డి
తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఒక ఐక్య ఉద్యమం ప్రారంభమైంది. దేశ సమగ్ర అభివృద్ధికి కీలకంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్షాత్మక విధానాలపై గళం విప్పాల్సిన అవసరం ఏర్పడిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పేర్కొన్నారు. డిలిమిటేషన్ను ప్రస్తుతం వెంటనే అమల్లోకి తీసుకురాకూడదని, దక్షిణాది రాష్ట్రాల వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు.ఆ ప్రకటనలో కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ డిలిమిటేషన్ అంశంపై స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపారు:“దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఇక మేము సహించము. మా హక్కుల కోసం అవసరమైతే మరింత పెద్ద స్థాయిలో పోరాటం చేస్తాము.”దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటికీ దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలిచాయని, కానీ ప్రాతినిధ్యం, వనరుల పంపిణీ, విధానాల అమలు విషయంలో జరుగుతున్న వివక్షను ఇకపై సహించబోమని ఆయన అన్నారు. ఈ ఉద్యమం కేవలం ఒక ప్రాంతం కోసం కాకుండా — సమానత్వం, న్యాయం, ఫెడరల్ స్ఫూర్తి కోసం సాగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.“దక్షిణాది ఒకటైతే దేశ రాజకీయ దిశ మారుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాది వివక్షపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినట్టు చెప్పారు.దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్న మొత్తం ఎంత, తిరిగి వాటికి లభిస్తున్న వాటా ఎంత అనే ప్రశ్న నేపథ్యంలో ఈ ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక మరియు తమిళనాడు ముఖ్యమంత్రులు, అలాగే వివిధ ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసి దక్షిణాది హక్కుల పరిరక్షణ అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.అందులో భాగంగా హోసూర్లో ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యంగా డిలిమిటేషన్ (పరిధుల పునర్విభజన) ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని, దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగడంలో అన్యాయం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తప్పకుండా ప్రజలందరూ ఉప్పొంగే తరంగంలా ముందుకు వచ్చి ఉద్యమానికి సిద్ధం కావాలని, రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా కలిసి పోరాటం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. -
ఆపని చేస్తే ఎప్పుడూ చూడని ఉద్యమం చూపిస్తాం, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్
-
కేంద్రానికి ఇదే నా చివరి హెచ్చరిక: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంట్లో గనుక డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే, తమిళనాడులో ఇప్పటివరకు చూడని స్థాయిలో భారీ ఉద్యమాన్ని చేపడతానని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం తన సోషల్ మీడియాలో స్వయంగా సీఎం స్టాలిన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘అదే గనుక జరిగితే నా రాష్ట్ర ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయిస్తాను. 1960 నాటి డీఎంకే ఉద్యమాన్ని మళ్లీ పరిచయం చేస్తాను. కేంద్రానికి, ప్రధానికి ఇదే నా చివరి హెచ్చరిక’’ అని ప్రకటించారాయన. ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన. ఈ ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఉత్తర రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం లభిస్తుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో.. తమిళనాడు ప్రజల హక్కులను కాపాడేందుకు తాను వెనుకాడబోనని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ అంశంపై తమిళనాడులో ఇప్పటికే డీఎంకే కార్యకర్తలు, మిత్రపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టాలిన్ హెచ్చరికతో ఉద్యమానికి మరింత ఊపిరి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Hon’ble Prime Minister, this is Tamil Nadu’s final warning.மாண்புமிகு பிரதமர் அவர்களே, இது தமிழ்நாட்டின் இறுதி எச்சரிக்கை!#TNwillFightTNwillWin pic.twitter.com/v9wkYYM6MO— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 14, 2026 -
కోడలికి వ్యతిరేకంగా మామ ప్రచారం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో పీఎంకేలో నెలకొన్న వివాదం మరింతగా ముదురుతోంది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు న్యాయ పోరాటంచేసినా ఫలితం శూన్యం. పార్టీ, ఎన్నికల గుర్తు మామిడి పండు అన్బుమణి గుప్పెట్లోకి చేరింది. దీంతో అన్బుమణి మద్దతుదారులు ఎన్నికలలో పోటీ చేస్తున్న చోట్ల రాందాసు వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన నియోజకవర్గాలలో అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు వ్యాఖ్యల తూటాలను పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన ధర్మపురి నుంచే బయలు దేరనుండడంతో వ్యవహారం ఎలాంలలి రచ్చకు దారితీయబోతున్నదో అన్న ఉత్కంఠ నెలకొంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి పోటీ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా స్వయంగా ప్రచారానికి రాందాసు రంగంలోకి దిగారు. ప్రచార బాట సోమవారం ధర్మపురిలో సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు ప్రచారం చేయనున్నారు. 35 ఏళ్లుగా తన భుజాలపై మోసిన పార్టీ, చిహ్నంకు వ్యతిరేకంగా రాందాస్ ప్రచారం నిర్వహించనున్నడం గమనార్హం. రాందాసు మద్దతు దారులకు సిలిండర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తన అభ్యర్థులకు మద్దతుగా, అన్బుమణి అభ్యర్థులకు వ్యతిరేకంగా రామ్దాసు ప్రచార బాటకు సిద్ధమయ్యారు. సోమవారం ధర్మపురిలో తన కోడలు సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచార సభ నిర్వహించనున్నారు. కుటుంబ విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో రాందాసు ఎలాంటి వ్యాఖ్యల తూటాలను పేల్చనున్నారో వేచి చూడాల్సిందే. ఆతదుపరి 16న కుంబకోణం. 17న కాట్టుమన్నార్కోయిల్, జయకొండం, 18న తిట్టకుడి, విరుదాచలం, భువనగిరి, 19న చెయ్యార్, పోలూరు, కలసపాక్కం. 20న విక్రవాండి, సెంజి, కీల్పెన్నాత్తూరులలో అన్బుమణి పీఎంకే, మామిడి చిహ్నంకు వ్యతిరేకంగా ప్రచారంకు రాందాసు నిర్ణయించడం గమనార్హం. కాగా ఒకే పారీ్టకి చెందిన తండ్రీకొడుకులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి, ఒకరిపై ఒకరు ఓట్లు వ్యాఖ్యల తూటాలన పేల్చుకునేందుకు సిద్ధం కావడంతో పీఎంకే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ధర్మపురిలో ఈ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
తమిళనాడులో ఘోర ప్రమాదం
తమిళనాడు విరుధ్నగర్ జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. సత్తూర్ దగ్గర ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. క్షతగాత్రులకు శివకాశి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది. కొందరు కార్మికులు లోపలే చిక్కుకుని ఉన్నారని యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్నన్ అనే వ్యక్తికి చెందిన ఎక్సెల్ బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ ఉదయం వరుసగా నాలుగుసార్లు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ శబ్దం సుమారు 6 కిలోమీటర్ల దూరం వినిపించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోయారు. భారీగా మంటలు ఎగసిపడడంతో.. ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొందరు కార్మికులు పేలుడుతో దూరంగా ఎగిరిపడగా.. సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయి. ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఫ్యాక్టరీ, గోదాంలకు చెందిన 10 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో 60 మంది కార్మికులు లోపల ఉన్నారని యాజమాన్యం చెబుతోంది. దీనిని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. టపాసులు తయారు చేస్తుండగానే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంత్రి నాగేంద్రన్ శివకాశి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యువల్ కాలేదని సమాచారం. సహాయక చర్యలు పూర్తయ్యాకే నష్టం వివరాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. #WATCH | Tamil Nadu | An explosion occured at a fireworks factory near Sattur in Virudhunagar district. More details awaited.(Video Source: Fire Department) pic.twitter.com/rwuvHHHtaL— ANI (@ANI) April 13, 2026 -
తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. కాంగ్రెస్కు బిగ్ షాక్!
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకురాలు హసీనా సయ్యద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై హసీనా సయ్యద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు.నాయకత్వంపై ధ్వజం..ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మక్కై అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని, అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
వాళ్ళ తలల్ని ‘తలారీ’కి అప్పజెప్పవద్దు!
తమిళనాడు ‘తండ్రీ కొడుకుల లాకప్ డెత్’ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ‘మరణ శిక్ష’ పడింది. దీనికి బదులు యావజ్జీవ శిక్ష వేయడం సబబు అనే చర్చ మొదలవ్వడం గమనార్హం. ఈ కేసు నేపథ్యంలోకి వెళితే... జయరాజ్, బెన్నిక్స్ తండ్రీ కొడుకులు. తమిళనాడు తూత్తుకుడిలోని ‘సాత్తాన్ కుళం’లో మొబైల్ షాప్ నడిపేవారు. 2020 జూన్ ‘లాక్డౌన్’లో వాళ్ళు మొబైల్ షాప్ తెరిచి ఉంచారు. ఈ నేరానికి ఇద్దర్నీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మామూలుగా అయితే ఇంకోసారి తీయకుండా సాయంత్రం దాకా స్టేషన్లో కూర్చోబెట్టొచ్చు, ఎంతోకొంత జరిమానా వేయొచ్చు. ఇవేవీ పోలీ సులు చేయలేదు. వాళ్ళను కొట్టారు. ‘ట్రామాటిక్ షాక్’ అంటే ‘అపస్మారక స్థితి’లోకి ఆ తండ్రీ కొడుకులు వెళ్లిపోయారు. హాస్పిటల్లో చనిపోయారు.సాత్తాన్కుళం (Sathankulam) పోలీసులు... ‘వారు అరెస్ట్కు ప్రతిఘటించారు (రెసిస్టెడ్ అరెస్ట్)’. ‘స్వల్పంగా బలవంతం (మైల్డ్ ఫోర్స్) చేయవలసి వచ్చింది’. ‘చిన్నపాటి గాయాలు మాత్రమే జరిగాయి’ అంటూ ‘ప్రాథమిక సమాచార నివేదిక’ను అబద్ధాలతో నింపారు. ప్రజల్లో ఆగ్రహమూ, ఆందోళనా పెరిగాయి. మద్రాస్ హైకోర్టు దీన్ని ‘సుమోటో’గా తీసుకుంది. కోవిల్పట్టి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జి. భారతీదాసన్ను విచారణ జరిపి నేరుగా ధర్మాసనానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తరు వాత ఎఫ్ఐఆర్ మారింది. ఇండియన్ పీనల్ కోడ్లోని 302 (హత్య), 342 (అక్రమ నిర్బంధం), 201 (సాక్ష్యాల నాశనం) కింద కొత్త సెక్షన్లతో కేస్ని మళ్లీ కట్టారు. మద్రాస్ హైకోర్టు ‘ఈ కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చెయ్యమంటూ’ సీబీఐకి అప్పజెప్పింది. సీబీఐ ఆ పనిని సవ్యంగానే చేసింది.సస్పెన్షన్, ఎక్స్గ్రేషియాలతో ప్రజల నిరసనల్ని ఆపలేమని అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామికి అర్థమయ్యింది. అందుకే ఈ కేసును సీరియస్గా తీసుకోవలసి వచ్చింది. ఆ రోజు స్టేషన్లో ఉన్న మిగిలిన సిబ్బంది చేత సాక్ష్యం చెప్పించింది. దాని ఫలితంగా తొమ్మిది మంది పోలీసులకు ‘మరణ శిక్ష’ పడింది. కారణాలు ఏవైనా ఈ శిక్ష ‘పోలీస్ హింస’కు ఒక జవాబును ఇచ్చినట్లే. చదవండి: ఇంటి వద్దే ఎఫ్ఐఆర్.. ఇదొక మంచి అడుగు!ఆ తండ్రీ కొడుకుల్ని ఆ తొమ్మిది మంది పోలీసులు చంపేశారు. ఇప్పుడు కోర్టులు ఆ తొమ్మిది మందినీ చంపబోతున్నాయి. ‘ఆదిమ ప్రతీకార నీతికి ఆఖరి అవశేషం మరణ శిక్ష’ అని మానవ హక్కుల నేత బాలగోపాల్ (Balagopal) అన్నారు. ‘చట్టానికి చంపే హక్కు ఉండకూడదు. చనిపోయిన వారిలో నిర్దోషులు ఉంటే వాళ్ళు ఇంక తిరిగి రార’నీ అన్నారు. ఇలాంటి వాదాలతో మానవ హక్కుల సంఘాలు మరణ శిక్షల్ని వ్యతిరేకిస్తున్నాయి. తొమ్మిది మందికీ (ఇంకా అలాంటి క్రూర పోలీసులకీ) తాము ఎంతటి దయాహీనులమో తెలియాలి అంటే వాళ్ళ తలల్ని ‘తలారీ’కి అప్పజెప్పడం కాదు; వాళ్లను జీవించనిద్దాము! జీవించినంత కాలమూ శిక్షిద్దాము!– నన్నూరి వేణుగోపాల్ మానవ హక్కుల కార్యకర్త -
తమిళనాడులో అధికార మార్పు తప్పదా? సర్వేలో ఏముందంటే
మరికొద్ది రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎన్ఎన్, సీఓటర్ ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఓపీనియన్ పోల్ సంచలన ఫలితాలను చూపుతోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీ-ఓటర్, CNN-News18 వెల్లడించిన ఓపీనియన్ ఫోల్ ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న DMK మరియు ప్రధాన ప్రతిపక్షం AIADMK మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు నివేదికలు తెలిపాయి. సీఓటర్ సర్వే ప్రకారం ఎన్నికల్లో డీఎంకే 41 శాతం ఓట్లు సాధించే అవకాశాలుండగా, ఏఐడీఎంకేకు 38 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సీఎన్ఎన్- న్యూస్ 18 సర్వే ప్రకారం ఏఐడీఎంకేకు 41 శాతం, డీఎంకేకు 39 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.అదే సీట్ల విషయానికి వస్తే ఆశ్చర్యంగా ఏఐడీఎంకే కూటమికి 130-140 సీట్లు, డీఎంకే కూటమికి 90-100 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే తెలిపింది. అదే విధంగా విజయ్ పార్టీకి 2-6 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే విషయంలో ఎం.కె. స్టాలిన్ మరియు ఎం. పళనిస్వామి ఇద్దరూ 39% మద్దతుతో సమానంగా ఉన్నారు. అయితే తమిళనాడులో మెుత్తం 234 స్థానాలుండగా మెజారిటీ మార్కు 118 కాగా ప్రస్తుత సర్వేల ప్రకారం 130 - 140 సీట్లు (ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది కూటమి: 90 - 100 సీట్లు, TVK విజయ్ పార్టీ 2 - 6 సీట్లు సాధించే అవకాశం ఉంది.అయితే ఈసారి AIADMK, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా, DMK తన పాత మిత్రపక్షాలతో కలిసి బరిలోకి దిగుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో AIADMK కూటమికి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే గతంలో చాలా సార్లు సర్వేల అంచనాలు తలకిందులైన సంగతి తెలిసిందే. -
బీదతోపాటు ఉన్నదెవరు?
సింగరాయకొండ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ నుంచి తమిళనాడు బోట్లు వదిలేయడం వెనుక అధికార తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు హస్తం ఉందని మత్స్యకారులు వెల్లడించడం సంచలనంగా మారింది. అయితే బీద మస్తాన్రావు ముగ్గురు మత్స్యకారులకు రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పి, ఆ డబ్బులు తెచ్చి ఇచ్చిన వారి పేరు మాత్రం బయటకు చెప్పకపోవడం గమనార్హం. మత్స్యకారులకు సుపరిచితమైన అధికార తెలుగుదేశం పార్టీ నేతలే తెరవెనుక ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత నెల 14న హార్బర్ నుంచి తమిళనాడులోని కరైక్కల్కు చెందిన నాలుగు సోనా బోట్లు వదిలేయడం వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చేందుకు సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా పాకల పంచాయతీ పోతయ్యగారి పట్టపుపాలెంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన దాదాపు ఐదు వేల మంది మత్స్యకారులు సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మంగళవారం ఉదయం 7 గంటల వరకూ అంటే 14 గంటల పాటు పెద్దలు పంచాయితీ నడిపారు. తొలుత బోట్లను వదిలేసిన నెల్లూరు జిల్లా కొత్తబంగారుపాలెంకు చెందిన జాలిరెడ్డి, ఇస్కపల్లికి చెందిన తోటయ్య, పాతపాలెంకు చెందిన శెట్టిలను సమావేశంలో అందరిముందూ హాజరుపరిచారు. గత నెల 14న ఏం జరిగిందో చెప్పాలని మత్స్యకార పెద్దలు నిలదీశారు. బోట్లు వదిలేసింది తామేనని వారు అంగీకరించారు. అయితే తెర వెనుక సూత్రధారులు, పాత్రధారుల పేర్లు వెల్లడించలేదు. పేర్లు చెప్పి తీరాల్సిందేనని మత్స్యకారులు పట్టుపట్టడంతో ఆరుగంటల తర్వాత అంటే రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇస్కపల్లికి చెందిన తోటయ్య వాస్తవాలను సభ ముందుంచారు. బోట్లు వదిలేయాలని అధికార టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు డబ్బులు ఇచ్చారని వెల్లడించాడు. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పడం తీవ్ర సంచలనాన్ని కలిగించింది. కావలి సీఐ పాత్ర కూడా ఉందని మరో సభ్యుడు శెట్టి వెల్లడించాడు. అయితే అసలు డబ్బులు తెచ్చి ఇచి్చన వారి పేర్లు మాత్రం వారు వెల్లడించలేదు.రూ.5 కోట్లు చెల్లించాలిబోట్ల వదిలివేతకు నాలుగు గ్రామాల మత్స్యకారులు బాధ్యత వహించాలని పెద్దలు ఆదేశించారు. దీనికి ఆయా గ్రామాల కాపులు సమ్మతించటంతో రూ.5 కోట్లు చెల్లించాలని హుకుం జారీ చేశారు. అయితే మత్స్యకారులు రూ.1.50 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి మత్స్యకార పెద్దకాపులు అంగీకరించలేదు. దీంతో కొద్దిసేపు సందిగ్ధం నెలకొంది. ఈలోగా మత్స్యకారులు డబ్బులు అయినా ఇస్తాము లేదా మూడు బోట్లను తెచ్చి పెడతామని చెప్పారు. కానీ పెద్ద కాపులు ససేమిరా అన్నారు. ఒక దశలో వదిలేసిన బోట్లను తెచ్చి పెట్టాలని పెద్ద కాపులు చెప్పారు. రెండు కొత్త బోట్లు కొనిస్తామని ఇస్కపాలెం కాపులు చెప్పడంతో ఒక దశలో చెన్నాయపాలెం, ఇస్కపల్లి మత్స్యకారుల మధ్య వాగ్వాదం రేగింది. దీంతో పెద్ద కాపులు సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. అయితే ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని మత్స్యకార పెద్ద కాపులు స్పష్టం చేశారని తెలిసింది. రెండు మూడు రోజుల్లో పెద్దలు ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. సమావేశానికి పోలీసులు మఫ్టీలో బందోబస్తు నిర్వహించారు. -
అఫిడవిట్ వైరల్.. మాజీ సీఎంకు ఇల్లు, కారు లేవు!
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. సుమారు 5 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున ఎడప్పాడిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పలువురు కీలక నేతలు నామినేషన్లు సమర్పించారు. అయితే, పళనిస్వామి నామినేషన్ అఫిడవిట్పై చర్చ మొదలైంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ సీఎం పళనిస్వామి నామినేషన్ చర్చనీయాంశంగా మారింది. ఆయన తన కుటుంబానికి రూ.8.99 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తనకు చరాస్తులు రూ.50.86 లక్షలు ఉన్నాయని.. ఇల్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, వంటి స్థిరాస్తులేవని చెప్పారు. తనకుగానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి వాహనాల్లేవని వెల్లడించారు. ఆయన సతీమణి రాధకు స్థిర, చరాస్థులు కలిపి రూ.5.61 కోట్లు ఉన్నట్లు, ఉమ్మడి కుటుంబం పేరుమీద మరో రూ.2.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు పళనిస్వామి చెప్పారు. దీంతో, ఆయన అఫిడవిట్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన అబద్దం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.ముగిసిన నామినేషన్ల పర్వంమార్చి 15న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాగా, 30వ తేది నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఇందులో మూడు రోజులు సెలవు దినాలు వచ్చాయి. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం మూడు గంటలతో నామినేషన్లు ముగిశాయి. మంగళవారం పరిశీలన జరుగుతోంది. ఉప సంహరణ తర్వాత ఈనెల 9వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు. సమాచారం మేరకు రాష్ట్రంలో 5072 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులు 4097, మహిళలు 974, ఇతరులు ఒకరు ఉన్నారు. -
లాకప్డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
సాక్షి, చెన్నై/అమరావతి: తమిళనాడులో కలకలం సృష్టించిన తండ్రీ కుమారుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరి మృతికి కారణమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. మృతుల కుటుంబాలకు రూ.1.40 కోట్లను పరిహారంగా చెల్లించాలని తొమ్మిది మంది పోలీసులను కోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి నేర చరిత్ర లేని తండ్రీ కుమారులను అత్యంత క్రూరంగా హింసించి చంపడం ‘అరుదైన కేసు‘గా న్యాయస్థానం అభివర్ణించింది. ఈ మేరకు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి.ముత్తుకుమార్ సోమవారం తీర్పు వెలువరించారు. దేశ న్యాయ చరిత్రలో లాకప్ డెత్ కేసులో ఇంత మంది పోలీసులకు ఓ కోర్టు మూకుమ్మడిగా మరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. మరణశిక్ష పడిన వారిలో ఎస్.శ్రీధర్ (అప్పటి ఇన్స్పెక్టర్). పి.రఘు గణేష్ (సబ్–ఇన్స్పెక్టర్), కె.బాలకృష్ణన్ (సబ్–ఇన్స్పెక్టర్), ఎస్.మురుగన్ (హెడ్ కానిస్టేబుల్), ఏ.సామిదురై (హెడ్ కానిస్టేబుల్), ఎం.ముత్తురాజ్ (కానిస్టేబుల్), ఎస్.చెల్లదురై (కానిస్టేబుల్), థామస్ ఫ్రాన్సిస్ (కానిస్టేబుల్), ఎస్.వెయిలుముత్తు (కానిస్టేబుల్) ఉన్నారు. మరో నిందితుడిగా ఉన్న స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దొరై కేసు విచారణలో ఉండగా కరోనాతో మరణించారు.షాపు ఎక్కువ సేపు తెరిచి ఉండటమే వారు చేసిన పాపం..తండ్రీ కుమారులైన జయరాజ్, బెన్నిక్స్లు మొబైల్ దుకాణం నిర్వహించేవారు. కోవిడ్ సమయంలో వీరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సేపు షాపు తెరిచారన్న ఆరోపణలతో (ఆ తరువాత దర్యాప్తులో ఇది అవాస్తమని తేలింది) 2020 జూన్ 19న తుత్తుకూడి జిల్లా సత్తాన్కులం పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. లాకప్లో వారిని తీవ్రంగా కొట్టి హింసించడంతో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక జూన్ 22–23 తేదీల్లో బెన్నిక్స్, జయరాజ్ మరణించారు. పోలీసులు దారుణంగా హింసించడం వల్లే వీరిద్దరూ మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో మొత్తం 10 పోలీసులపై కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.హైకోర్టు జోక్యంతో సీబీఐకి...ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టింది. పోలీసు అధికారులపై హత్యాయత్నం మోపడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. నిందితులైన పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హైకోర్టు గుర్తించింది. దీంతో దర్యాప్తులో జాప్యం జరగకుండా, సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు పారదర్శక విచారణ కోసం సీఐడీకి అప్పగించింది. అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. హత్య, అక్రమ నిర్బంధం, తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, తప్పుడు అభియోగాలు మోపడం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, నేరాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాల కింద సీబీఐ కేసు దర్యాప్తు జరిపింది.కీలకంగా మహిళా కానిస్టేబుల్ సాక్ష్యం..మృతులు జయరాజ్, బిన్నిక్స్లపై పోలీసులు మోపిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో సీబీఐ తేల్చింది. ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. తండ్రీ కుమారులను పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని.. లాఠీలపై, బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె సీబీఐకి వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరా రికార్డింగ్లు ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా సెట్ చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఆ ఆధారాలన్నింటితో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ జరిపిన మదురై కోర్టు ఆరేళ్ల తరువాత తీర్పు వెలువరించింది.ముమ్మాటికీ హత్యే...జయరాజ్, బెన్నిక్స్ శరీరాలపై ఉన్న గాయాలు ‘అసాధారణమైనవి..’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ గాయాలే వారి మరణానికి ప్రధాన కారణమయ్యాయని పేర్కొన్నారు. జయరాజ్, బెన్నిక్స్లు తమను తామే గాయపరుచుకున్నారన్న నిందితుల(పోలీసులు) వాదనను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు. పోస్ట్మార్టం నివేదికలను పరిశీలించిన అనంతరం పోలీసులు నిరంతరం, పదే పదే చేసిన దాడి వల్లే ఆ గాయాలు అయినట్లు స్పష్టం చేశారు. జయరాజ్కు గతంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, అయితే ఆయన మరణం ఆ అనారోగ్యం వల్ల సంభవించలేదని, పోలీసుల చేతిలో అనుభవించిన తీవ్ర శారీరక హింస వల్లే ప్రాణాలు కోల్పోయారని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. జయరాజ్, బిన్నిక్స్ ఆంగ్లేయుల కాలంలో ఇలాంటి దాడులు జరిగినట్లు విన్నామని, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు తండ్రీ కుమారులను పోలీసులు కరల్రు, ఇనుప రాడ్లతో చిత్రహింసలకు గురిచేశారని నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు స్పష్టమైందన్నారు. ఇ¯న్స్పెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డారని, వారు పైఅధికారులకు ఫిర్యాదు చేసి ఈ మరణాలను ఆపి ఉండవచ్చని, అలా కాకుండా ఈ నేరంలో భాగస్వాములయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఇది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారించింది. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన తొమ్మిది మంది పోలీసు అధికారులను దోషులుగా ప్రకటించి వారికి మరణశిక్షను విధించింది. -
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్లో ఇండస్ట్రీ
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (Subashini Balasubramaniyam) చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అయ్యప్పంతంగళ్లో గల తన నివాసంలో సుభాషిణి మృతదేహం లభ్యమైంది. సుభాషిణి ఆకస్మిక మరణం అటు టెలివిజన్ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న నటి ఆకస్మిక మరణం తోటి నటీ నటుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రాథమిక పోలీసు విచారణలో ఇది ఆత్మహత్యగా తేలింది. వీడియో కాల్లో తన భర్తతో జరిగిన వ్యక్తిగత వాగ్వాదం తర్వాత ఆమె తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణను కొన సాగిస్తున్నారు. ఆమె మరణం సోషల్ మీడియాలో తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. అభిమానులు, తోటి నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆమె నటనకు సంబంధించిన క్లిప్లు, జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆమెను కేవలం ఒక నటిగానే కాకుండా, ఆయా పాత్రలకు సహజత్వాన్ని తీసుకువచ్చిన గొప్ప నటిగా గుర్తు చేసుకుంటున్నారు. శ్రీలంక నుండి తమిళ టెలివిజన్ వరకు సుభాషిణి ప్రయాణం ఆశయం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచిపోతుందంటూ సంతాపం వెలిబుచ్చారు. ఆమె జీవితం విషాదాంతమైనప్పటికీ, మంచి నటిగా ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటున్నారు. View this post on Instagram A post shared by Subashini balasubramaniyam (@subashini_balasubramaniyam)ఎవరీ సుభాషిణి సుభాషిణి స్వస్థలం శ్రీలంక. తమిళ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలనే ఆశయంతో ఆమె చెన్నైకి వలస వచ్చింది. ఎంతోమంది వర్ధమాన నటుల మాదిరిగానే, ఎన్నోకష్టనష్టాలకోర్చి అవకాశాలను దక్కించుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటూ, ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని సక్సెస్ఫుల్ కరియర్కు బాటలు వేసుకుంది. నటనపై ఆమెకున్న పట్టుదల, అభిరుచి, ఆమెలోని భావోద్వేగాలను, తెరపై అద్భుతంగా ప్రదర్శించే పాత్రలను సంపాదించడంలో సహాయ పడ్డాయి. ముఖ్యంగా 'కాయల్' సీరియల్తో ఆమెకు మంచి బ్రేక్త్రూ లభించింది, ఇందులో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్ టీవీలో స్థిరమైన ఫాలోయింగ్ను కలిగి ఉన్న ఈ షో, ఆమెను వెలుగులోకి తీసుకువచ్చి, అనేక తమిళ కుటుంబాలలో సుపరిచితమైన నటి నిలిపింది. ఈ సీరియల్లో సుభాషిణి పాత్ర చిత్రణ ద్వారా అనేక ప్రశంసలను అందుకుంది. -
మా మేనిఫెస్టోనే సూపర్స్టార్: స్టాలిన్
విరుధునగర్/విరాలిమలై: 2026 అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే మేనిఫెస్టో సూపర్ స్టార్ వంటిదని ఆ పార్టీ చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. హామీలు ఎవ్వరైనా ఇస్తారు కానీ, తమ పార్టీ ఇచ్చిన హామీలను మాత్ర మే ప్రజలు నమ్ముతారని చెప్పారు. విరుధునగర్లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో స్టాలిన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ‘అన్ని వయస్సుల వారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు.. ఇలా అందరూ డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ఇష్టపడతారు. ఇష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. అందుకే నేను విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో 2026 ఎన్నికల క్షేత్రంలో సూపర్స్టార్ లాంటిది’అని ఆయన చెప్పారు. ‘‘విశ్వసనీయత కలిగిన వ్య క్తుల వాగ్దానాలనే ప్రజలు విశ్వసిస్తారు. ఇతరులు ఏది చెప్పినా జనం నమ్మరు’’ అని స్టాలిన్ అన్నారు.ఢిల్లీ టీమ్ను ఇంటికి పంపించాలి: ఉదయనిధితమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తి కోసం ఈ ఎన్నికల్లో ఢిల్లీ టీమ్ను ఇంటికి సాగనంపాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రజలను కోరారు. ఈ ఎన్నికలను ఢిల్లీ టీమ్కు, తమిళనాడు టీమ్కు మధ్య జరిగే యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. డీఎంకే కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టడం ద్వారా ఢిల్లీ టీమ్ను ఇంటికి పంపించేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడును నియంత్రించేందుకు ఢిల్లీ ఉపయోగిస్తున్న రిమోట్కంట్రోల్ను పగుల గొట్టాలన్నారు. -
కరుణానిధిని గృహనిర్బంధం చేశారు: పళని స్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని చివరి రోజుల్లో గృహనిర్బంధంలో ఉంచారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సంచలన ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. శనివారం తిరువణ్ణామలైలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘కరుణానిధి గురించి డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి ఎ.రాజా చెప్పిన విషయాలనే గుర్తు చేస్తున్నా. తండ్రిని గృహనిర్బంధంలో ఉంచడం న్యాయమేనా అని సీఎం స్టాలిన్ను ఉద్దేశించి ఒక వీడియోలో రాజా ప్రశ్నించారు’’ అని చెప్పారు. మాజీ సీఎం జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామన్న స్టాలిన్, తన తండ్రి కరుణానిధిని గృహనిర్బంధంలో ఉంచిన వారిపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే దీనిపై విచారణ చేయించి, బాధ్యులను శిక్షిస్తామని పళనిస్వామి ప్రకటించారు. 2021–26 మధ్య కాలంలో తమిళనాడును అప్పుల్లో, అవినీతిలో, డ్రగ్స్ వాడకంలో, శాంతిభద్రతల వైఫల్యంలో స్టాలిన్ నంబర్వన్ స్థానానికి తీసుకెళ్లారని విమర్శించారు. ఆయన కేవలం ఫొటోషూట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. -
వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో చరిత్ర : ఎవరీ రినీ సంపత్?
అమెరికాలోని ఎన్నికల చరిత్రలో మరో భారతీయ మహిళ చర్రిత సృష్టించారు. వాషింగ్టన్ డీసీ (Washington, DC) మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా 31 ఏళ్ల రినీ సంపత్ చరిత్ర సృష్టించారు. 'అమెరికన్ డ్రీమ్' సాకారం కోసం ఏడేళ్ల వయసులోనే అమెరికాకు వలస వచ్చిన ఆమె ఇపుడు 2026 మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన నామినేషన్ అర్హతను ఆమె సాధించడం విశేషం.తమిళనాడులో తేనిలో జన్మించిచారు రినీ సంపత్. తన ఏడవ ఏట తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్లో పట్టా పొందారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు మరియు ప్రభుత్వ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 'థారోస్' (Tharros) అనే సంస్థకు డైరెక్టరీగా వ్యవహరిస్తున్నారు. రినీప్రచారాస్త్రాలు -నినాదాలుగత పదేళ్లుగా వాషింగ్టన్ డీసీలోనే నివసిస్తున్న రినీ మేయర్ పదవికి జరిగే ఎన్నికల బ్యాలెట్లో స్థానం సంపాదించారు. నగరంలోని ప్రాథమిక సేవలను మెరుగుపరచడమే తన లక్ష్యమని సంపత్ నొక్కి చెప్పారు. ‘ఫిక్స్ ద బేసిక్స్’ (Fix the Basics) “కొత్త డీసీ” (A new DC) అనే నినాదంతో అంటూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం.పోటోమాక్ నదిలో మురుగునీరు కలవకుండా అడ్డుకోవడం.ధరలను తగ్గించడం.911 అత్యవసర సేవల వెయిటింగ్ సమయాన్ని తగ్గించడం.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!తమ కుటుంబం అమెరికాకు రావాలని తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని మార్చివేసిందని రినీ చెబుతారు. తన మూలాలే ప్రజా సేవకు తన ప్రేరణకు కేంద్రమన్నారు. తన తాతగారు తనకెప్పుడూ పెద్ద స్ఫూర్తి అని, ప్రజా సేవలో ఆయన మార్గమే తనను నడిపిస్తుందంటారామె. "నేను రాజకీయ నాయకురాలిని కాదు. నాకు ఎటువంటి ప్రత్యేక ప్రయోజన గ్రూపులతో సంబంధం లేదు. నగర ప్రాథమిక సేవలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టే ఒక బయటి వ్యక్తి అవసరం ఉందని రినీ పేర్కొన్నారు.కాగా ఈసారి ఎన్నికల్లో రినీ సంపత్.. జనీస్ లూయిస్ జార్జ్, కెన్యాన్ మెక్డఫీ, గ్యారీ గుడ్వెదర్, రాబర్ట్ ఎల్ గ్రాస్, రోండా హామిల్టన్ వంటి వారితో తలపడుతున్నారు. ఆమె నామినేషన్ పత్రాలపై 4,500 కంటే ఎక్కువ మంది ప్రజలు సంతకాలు చేసి మద్దతు తెలపడం విశేషం.ఇదీ చదవండి : ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్! -
ఎన్నికల బరిలో లాటరీ కింగ్ ఫ్యామిలీ.. వారి ఆస్తులు ఎంతంటే?
చెన్నై/పుదుచ్చేరి: లాటరీ కింగ్గా గుర్తింపు పొందిన శాంటియాగో మార్టిన్ కుటుంబంలోని ముగ్గురు తమిళనాడు, పుదుచ్చేరిల్లో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా...? వీరు వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగడమే అసలైన కిటుకు. మార్టిన్ భార్య లీమా రోజ్(59) ఇటీవలే అన్నాడీఎంకేలో చేరి లాల్గుడి నియోజకవర్గంలో పోటీకి దిగారు.మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్(38) సొంతంగా లక్ష్య జననాయక కట్చి(ఎల్జేకే)అనే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పుదుచ్చేరిలో బీజేపీ, ఏఐఎన్నార్సీల ఎన్డీయేలో ఈ పార్టీ కూడా ఉంది. చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ స్థానానికి పోటీ పడుతున్నారు.మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున(43), విజయ్ సారథ్యంలోని టీవీకే తరఫున చెన్నైలోని విల్లివాక్కమ్లో పోటీకి దిగారు. ఈ ముగ్గురూ ఏప్రిల్ 9, 13వ తేదీల్లో జరిగే పోలింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, మార్టిన్ గ్రూప్ కంపెనీ ఎండీగా ఉన్న జోస్ చార్లెస్ తనకు రూ.597 కోట్ల ఆస్తులు, అర్జున రూ.197 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించుకున్నారు. -
జయలలిత ఇల్లు సీజ్
-
తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితకు చెందిన హైదరాబాద్లోని ఇంటిని అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలోని జయలలిత ఇంటిని అధికారులు సీజ్ చేశారు. రూ.83 లక్షల ఇంటి పన్ను పెండింగ్లో ఉండడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పలుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమెను అభిమానులు పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు), అమ్మ అని పిలుచుకునేవారు. రాజకీయాల్లోకి రాకముందు జయలలిత సినిమాల్లోనూ నటించారు. మరోవైపు, జయలలితకు భారీగా ఆస్తులు ఉన్నాయి. జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు గతంలో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. పసిడి ఆభరణాలు, నగదుతో పాటు ఆస్తుల పత్రాలను మూడు ట్రంకు పెట్టెల్లో అధికారులు తమిళనాడు సర్కారుకు అప్పగించారు. -
నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్.. టీవీకే అధినేత ఆస్తులెంత?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ఇవాళ (మార్చి 30) కోలతూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచే ఆయన 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కోలతూర్ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న అభవృద్ధి పనులపై స్టాలిన్ ఓ పుస్తకం విడుదల చేశారు."మేము భారీ విజయం సాధించనున్నాం. గత మూడు ఎన్నికలతో పోల్చితే ఈ సారి మరింత భారీగా మద్దతు కనపడుతోంది. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తమిళనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సారి భారీ విజయం సొంతమవుతుంది" అని స్టాలిన్ చెప్పారు.డీఎంకే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 164 స్థానాల్లో పోటీ చేస్తుంది, 70 స్థానాలు మిత్ర పార్టీలకు సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 28, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి 5, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐఎం)కి 5, వీసీకేకు 8, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది. ఇతర చిన్న పార్టీలలో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే)కి 10, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కి 2 స్థానాలు, ఇంకా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చిన విజయ్ నామినేషన్ సమర్పించారు. విజయ్తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. విజయ్ తన అఫిడవిట్లో రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. TVK Chief Vijay declares ₹405 crore of movable assets and ₹115 crore of immovable assets in his affidavit while filing nomination for Perambur assembly constituency pic.twitter.com/03U4JC28GC— Arvind Gunasekar (@arvindgunasekar) March 30, 2026 -
తమిళనాడు: టీవీకే అభ్యరుల జాబితా విడుదల
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నిలక పోరు తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేయనున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగనున్నారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు.డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామన్న విజయ్.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని విజయ్ నిర్ణయించడంతో ఆ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమిళగ వెట్రి కళగంతో తొలి సారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు విజయ్ ఉరకలు తీస్తున్నారు. కేడర్ను బలోపేతం చేస్తూ, ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించడమే కాకుండా, వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు.అయితే, పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకోగా.. అనుమతి లభించలేదు. పెరంబూరులో తన ఎన్నికల ప్రచారానికి అధికారులు అనుమతి నిరాకరించడంపై విజయ్ అందులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. తన ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బ్యూరోక్రట్లు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాడమే కాకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. తమ ఉద్యోగు బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. -
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఇలా..
చెన్నై: వచ్చే నెలలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే పార్టీ- కాంగ్రెస్ల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ మేరకు డీఎంకేతో జట్టు కట్టిన కాంగ్రెస్తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సీట్ల సర్దుబాటును ఈరోజు(శనివారం, మార్చి 28వ తేదీ) ప్రకటించారు. తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను డీఎంకే 164, కాంగ్రెస్ 28, డీఎండీకే 10 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక వీసీకే 8 స్థానాల్లో, సీపీఐ 5, సీపీఎం 5, ఎండీఎంకే 4 స్థానాలను కేటాయించారు. ఇక డీఎంకే పోటీ చేసే పలు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ బరిలోకి దిగుతుండగా, చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ చేయనున్నారు. బోడినాయక్కనూర్ నుంచి పన్నీరు సెల్వం పోటీ దిగుతుండగా, కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలోకి సెంథిల్ బాలాజీ బరిలో ఉండనున్నట్లు డీఎంకే వెల్లడించింది. -
తమిళనాడు ఎన్నికల బరిలో సినీ దర్శకుడు
చెన్నై: తమిళ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ప్రముఖ దర్శకుడు, నటుడు, సుందర్ సి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈయననే డీఎంకే (DMK) మళ్ళీ బరిలోకి దించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ నెలకొననుంది. సుందర్ సి భార్య, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.దర్శకుడి భార్య ఖుష్బూ స్పందిస్తూ.. ‘సినీ కెరీర్లో మూడు దశాబ్దాల పాటు నా భర్తకు ఈ రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని.. అందుకే ఇప్పుడు వారికి సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్యగా నేను గర్వపడుతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.సుందర్ సి (సుందర్వేల్ చిదంబరం) జనవరి 21, 1968న జన్మించారు. ఆయన 1990లో ‘వాళ్కై చక్కరం’తో నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. 1995లో ‘మురై మానమ్’తో దర్శకుడిగా మారారు. దాదాపు 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 10కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కళైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. తన భార్యతో కలిసి పలు టెలివిజన్ సిరీస్లను నిర్మించారు. -
గెలిచే తంబీ ఎవరో..?
కన్యాకుమారి.. భారతీయులకు సుపరిచిత ప్రాంతం..! తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా దక్షిణ భాగంలో ఉన్న విలవన్కోడ్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారుతోంది. ఇందుక్కారణం.. ఆ ప్రాంతం రబ్బరు పరిశ్రమలకు నెలవు. యాలకులు, లవంగాలు సుగంధ ద్రవ్యాల పంటలకు కేరాఫ్ అడ్రస్..! అంతేకాదు.. చారిత్రక చిత్తరల్ కొండ ఆలయం, తిక్కురిచి మహాదేవ ఆలయం, నట్టాలం శంకరనారాయణ దేవస్థానం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు టఫ్గా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నా.. గెలుపోటములను ఏమాత్రం అంచనా వేయని పరిస్థితులున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?కన్యాకుమారి జిల్లాలో ప్రధాన వాణిజ్య పట్టణమైన మార్తాండంతోపాటు.. కుళితురై, కలియక్కవిలై, అరుమనై వంటి ప్రముఖ ప్రదేశాలు విలవన్కోడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కొండప్రాంతమైన కొడియార్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతాల్లో రబ్బరు తోటలు సమృద్ధిగా ఉన్నాయి. రబ్బరు ప్రాసెసింగ్ పరిశ్రమలకు విలవన్కోడ్ అడ్డా అని చెప్పవచ్చు. జీడిమామిడి తోటలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. కేరళ, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో పండే జీడిమామిడి ప్రాసెసింగ్ మిల్లులు కూడా విలవన్కోడ్లో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నాడర్ సామాజికవర్గం మెజారిటీగా ఉంది. వీరి తర్వాత నాయర్లు, ఈలవలు, వెల్లలార్లు, ఎస్సీలు, ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్తోపాటు.. సీపీఎం, బీజేపీలకు మంచి క్యాడర్ ఉందని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 11 సార్లు, సీపీఎం ఐదు సార్లు విజయం సాధించగా.. బీజేపీ క్రమంగా తన ఓటుబ్యాంకును పెంచుకుంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ. పురుష ఓటర్ల సంఖ్య ఒక లక్షా 11 వేల 990 కాగా.. మహిళా ఓటర్లు ఒక లక్షా 13 వేల 226 మంది ఉన్నారు. ముగ్గురు థర్డ్ జెండర్లు కూడా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.ఈ నియోజకవర్గ ప్రజల చిరకాల డిమాండ్ అయిన.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు హామీపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో ఈ హామీ పేరుతో ప్రధాన పార్టీలు తమను మోసగిస్తున్నాయనే భావన ఇక్కడి ఓటర్లలో ఉంది. దీంతోపాటు.. జీడిమామిడి మిల్లుల అప్గ్రేడేషన్, జీడిమామిడి కార్మికుల రోజుకూలీ పెంపు వంటి డిమాండ్లు పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడ అటవీ చట్టానికి సంబంధించిన సమస్యలతోపాటు.. నెయ్యర్ ఎడమగట్టు కాల్వలో నీటి విడుదల లేకపోవడం వంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు అంటేనే.. అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లు రాజకీయాలు కొనసాగుతాయి. ఈ నియోజకవర్గంలో మాత్రం.. ఆ రెండు పార్టీల ప్రాబల్యం కనిపించదు. అయితే.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ హామీని నెరవేరుస్తామంటూ బీజేపీ.. కాంగ్రెస్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. -
ఎవరిదో గెలుపు? బలాలు.. బలహీనతలు ఇవే..!
తమిళనాడు ఎన్నికలంటేనే.. నీలగిరిలో రాజకీయాలు వేడెక్కిపోతాయి. శీతల విడిదికి కేంద్రాలుగా ఉన్న నీలగిరి కొండల్లో వేడి రాజుకుంటుంది. తూర్పు, పశ్చిమ కనుమల కలయికకు కేంద్రబిందువైన నీలగిరుల్లో.. ఊటీ, కున్నూరు, కూడలూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎన్నికలు ఏవైనా కానీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను అంచనా వేయడం తలలు పండిన విశ్లేషకులకు కూడా సాధ్యం కాదనే విషయం ఇక్కడి అభ్యర్థులను కల్లోలపరుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలపై విశ్లేషణను ఎక్కడా మిస్సవ్వకుండా చదివేయండి..అంత ఈజీ కాదు..ఊటీ, కున్నూరు, కూడలూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ కూటమి రెండు చోట్ల.. అన్నాడీఎంకే ఒకచోట బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఇక్కడ గెలుపోటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఊటీ నియోజకవర్గాన్ని ఇక్కడ అధికారికంగా ఉదగై అంటారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.గణేశ్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పర్యాటకమే ప్రధాన ఆర్థిక వ్యవస్థ. టీ-కాఫీ తోటలకు నెలవు. అయితే.. కీలకమైన పరిశ్రమలు మూతపడడంతో ఇక్కడ నిరుద్యోగిత పెరుగుతోంది. స్థానిక సమస్యలు తోడవ్వడం యాంటీ-ఇన్కంబెన్సీకి దారితీసే ప్రమాదాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే..! ఇక కున్నూరు నియోజకవర్గం డీఎంకేకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతం. టీ-కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులకు ఈ నియోజకవర్గం నిలయం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా డీఎంకేకు కలిసివచ్చే అంశమే..! అయితే.. తేయాకును సేకరణకు ఇచ్చే కూలీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఇక్కడి కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని అన్నాడీఎంకే అడ్వాంటేజ్గా తీసుకుంటే.. పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఆ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే..ఇక కూడలూరు నియోజకవర్గంలో గిరిజన ఓటర్లదే ఆధిపత్యం. అనూహ్య ఫలితాలకు ఈ నియోజకవర్గం వేదిక. ఇక్కడ ఇరులర్, కురుంబర్ వర్గాలు గెలుపోటములను శాసిస్తాయి. వీరితోపాటు.. పడుగర్ వర్గానికి పెద్దమొత్తంలోనే ఓటుబ్యాంకు ఉంది. ఈ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ అభ్యర్థి విజయం కరతలామలకమే..! గిరిజనుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చే అభ్యర్థికే ఇక్కడి ఓటర్లు పట్టంకడతారు.ఆ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే..మొత్తానికి నీలగిరిలోని మూడు నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే.. ఏ పార్టీ అయినా.. ఉపాధి, పరిశ్రమల కల్పన, తేయాకు సేకరణ కూలీ ధర, కార్మికుల సంక్షేమం వంటి అంశాలు కీలక భూమిక పోషిస్తాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పడుగర్ వర్గం ఓటు బ్యాంకు అత్యంత కీలకం. డీఎంకే, కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు వేర్వేరుగా ఓటు బ్యాంకులు ఉన్నప్పటికీ.. ఈసారి పెరిగిన యువ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.ఏది ఏమైనా.. ఊటీలో విజయానికి కాంగ్రెస్ ఈసారి చమటోడ్చాల్సిందే..! కున్నూరును తిరిగి నిలబెట్టుకోవాలంటే.. కార్మికుల కూలీ ధరలపై డీఎంకే స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇక కూడలూరులో అన్నాడీఎంకే బలంగా కనిపిస్తున్నా.. నెక్-టు-నెక్ పోటీ తప్పదని తెలుస్తోంది. -
తమిళ పీఠం: ‘2021’ సీన్ రిపీట్? షాకిస్తున్న సీక్రెట్ సర్వే?
ద్రవిడ గడ్డపై సంచలన రాజకీయాలకు తెరలేచింది. 2026 ఏప్రిల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల, నేతల వ్యూహ ప్రతివ్యూహాలు మరింత పదునెక్కాయి. కుల సమీకరణలు, సంక్షేమ పథకాల హామీలు, పొత్తుల లెక్కలతో చెన్నైలోని వార్ రూమ్లు హోరెత్తిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి తమిళనాట గతంలో ఎన్నడూ లేని విధంగా ‘చతుర్ముఖ పోటీ’ నెలకొంది. అధికార డీఎంకే (డీఎంకే) కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (ఏఐడీఎంకే) కూటమిలతో పాటు, స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే), సీమాన్ సారథ్యంలోని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్టీకే)లు ఎన్నికల బరిలోకి దిగాయి. 2026 తమిళనాడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనేది అంచనా వేయాలంటే, 2021 నాటి ఓటర్ల నాడిని విశ్లేషించడం అవసరం. ఈ నేపధ్యంలోనే ‘లోకనీతి-సిఎస్డీఎస్’ నిర్వహించిన సర్వే గణాంకాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.2021 తీర్పు: గణాంకాలు ఏం చెబుతున్నాయి?పదేళ్ల ఏఐఏడీఎంకే పాలనకు స్వస్తి పలికి.. ఎంకే స్టాలిన్ను ముఖ్యమంత్రిని చేసిన 2021 ఎన్నికల్లో ప్రధానంగా ద్విముఖ పోరు సాగింది. ఆ ఎన్నికల్లో డీఎంకే 39.1 శాతం ఓట్లను సాధించగా, ఏఐఏడీఎంకే 34.1 శాతంతో సరిపెట్టుకుంది. కూటముల పరంగా చూస్తే డీఎంకే కూటమికి 45.4 శాతం, ఏఐఏడీఎంకే కూటమికి 39.7 శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచిన సంఖ్య 6.6 శాతం. ఇది సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే (ఎన్టీకే) సాధించిన ఓట్ల శాతం. ఇక కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్ఎం)2.6 శాతం, టీటీవీ దినకరన్ ‘ఏఎంఎంకే’ 2.5 శాతంతో తమ ఉనికి చాటుకున్నాయి.వారసత్వ పోరులో ‘స్టాలిన్’ టాప్నాడు జయలలిత, కరుణానిధి లేని తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో వారసత్వంపై ఓటర్లు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 78.2 శాతం మంది ఓటర్లు కరుణానిధి అసలైన వారసుడు స్టాలినే అని తేల్చిచెప్పారు. అటు ఏఐఏడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి 47.4 శాతం మంది మద్దతు లభించగా, ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) కేవలం 8.9 శాతానికే పరిమితమయ్యారు. ఇటీవలే ఓపీఎస్ తన కుమారుడితో పాటు డీఎంకేలో చేరడం ఆసక్తికరంగా మారింది.డబుల్ ఇంజిన్ సర్కార్పై వ్యతిరేకత?హిందీ బెల్ట్ రాజకీయాలకు భిన్నంగా తమిళనాడు తన ప్రత్యేకతను చాటుకుంటూవస్తోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమిళ ఓటర్లు 2021లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 51.9 శాతం మంది కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయగా, 47.5 శాతం మంది కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉండాలి అనే (డబుల్ ఇంజిన్) వాదనను తిరస్కరించారు. బీజేపీ ఎదుగుదల రాష్ట్ర సామాజిక ఐక్యతకు కీడు అని 40.3 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం.సంక్షేమం వెర్సస్ అవినీతిగత ఏఐఏడీఎంకే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, విద్యుత్, తాగునీరు తదితర రంగాల్లో మంచి మార్కులే సాధించినప్పటికీ (53.5 శాతం సంతృప్తి), అవినీతి ఆ పార్టీ కొంపముంచింది. 67.3 శాతం మంది ప్రజలు ఏఐఏడీఎంకే పాలనలో అవినీతి పెరిగిందని భావించారు. మరోవైపు తమిళనాడు సంక్షేమ పథకాలు (ఉచిత పాలు, సైకిళ్లు, అమ్మ క్యాంటీన్లు) ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వీటిలో 70 నుంచి 85 శాతం మంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ ఇచ్చారు.2026 పొత్తుల చదరంగంప్రస్తుతం డీఎంకే తన మిత్రపక్షాలైన కాంగ్రెస్ (28 సీట్లు), సీపీఐ (5), ఎండీఎంకే (4) వంటి పార్టీలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న ఏఐఏడీఎంకే, బీజేపీలు తిరిగి ఒక్కటయ్యాయి. కానీ పార్టీల చీలికలు ఈ కూటమిని వేధిస్తున్నాయి. ఈ గ్యాప్లో నటుడు విజయ్ తన ‘టీవీకే’ పార్టీతో చక్రం తిప్పాలని చూస్తున్నారు. డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా ఆయన ఒంటరిగా 234 స్థానాల్లో పోటీకి దిగారు.నిర్ణయాత్మక శక్తి ఎవరు?తమిళ ఓటరు చాలా తెలివైనవాడు. 23 శాతం మంది ఓటర్లు పోలింగ్ రోజే ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకుంటారనే మాట వినిపిస్తుంది. కులం, మతం కంటే పార్టీ గుర్తుకే (53.3%) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సారి ఎన్నికల్లో ‘జెన్ జెడ్’ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఈ నేపధ్యంలో స్టాలిన్ తన కోటను కాపాడుకుంటారా? ఎడప్పాడి తిరిగి పుంజుకుంటారా? లేక విజయ్ ‘తమిళగ వెట్రి’ గెలుపు సాధిస్తారా? అనే ప్రశ్నలకు మే నెలలో వెలువడే ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి. ఇది కూడా చదవండి: పండుగలకు వంటగ్యాస్ సిలిండర్ ఉచితం -
టికెట్ అడిగితే తిట్లు… చివరికి సస్పెన్షన్!
తమిళనాడు: ప్రయాణికులకు టిక్కెట్ ఇవ్వకుండా నిద్రపోయిన ఓ ఉద్యోగి సస్పెండ్కు గురయ్యాడు. విద్యుత్ రైళ్ల సర్వసు ఉదయం 3.30కు మొదలైన అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3.36 గంటలకు పార్కు స్టేషన్లో బయల్దేరాల్సిన ఎలక్ట్రిక్ రైలులో వెళ్లేందుకు ప్రయాణికులు టికెట్ కౌంటర్కు రాగా అక్కడ ఉద్యోగి గాఢ నిద్రలో ఉండటం గమనించి, అద్దం తట్టిలేపారు. తర్వాత అతను ప్లాట్ఫాం 2కి వెళ్లాలని, రైలు బయలుదేరబోతోందని చెప్పాడు. తన నిద్రకు భంగం కలిగించారని చిర్రెత్తుకొచ్చిన ఆ ఉద్యోగి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. దిక్కున్న చోట చెప్పుకోండని దూషించాడు. ఈ ఘటనను సెల్ఫోన్లో రికార్డు చేసి ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయి రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు సీసీటీవీ కెమెరాల వీడియో రికార్డింగ్ను పరిశీలించారు. విధి నిర్వహణలో నిద్రపోవడంతోపాటు ప్రయాణికుడితో అనుచితంగా వ్యవహరించాడని గుర్తించారు. రైల్వే ఉద్యోగిని సస్పెండ్ చేశారు. -
తమిళనాడులో దారుణం.. వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో కుక్క దాడులు దారుణంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూకి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. తాజాగా తమిళనాడులో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంటి ముందు నుంచి వెళ్తున్న వారిపై ఓ పెంపుడు కుక్క దాడి ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, తమ కుక్క దాడి చేస్తున్న సమయంలో దాని యజమానులు చూస్తూ ఉండిపోవడం దారుణం. దీంతో, వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో వేదారణ్యం సమీపంలోని తోప్పుతురై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పవితా, ఆమె తల్లి తమ ఇంటికి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క వారిపై దాడికి పాల్పడింది. వారిద్దరూ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇంటి గేటు తెరిచి ఉండటంతో కుక్క బయటకు వచ్చి పవితాను వెంబడించి దాడి చేసింది. పవితా నేలపై పడిపోయి తీవ్రంగా బాధపడుతుండగా ఆమె తల్లి.. కుక్కను తప్పించే ప్రయత్నం చేయగా.. అది ఆమెపై కూడా దాడి చేసింది.అయితే, కుక్క దాడి చేస్తున్న సమయంలో ఇంటి యజమానులు బయటకు వచ్చారు. పవితా, ఆమె తల్లిపై కుక్కు దాడి చేస్తున్నా వారు కుక్కను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సాయం చేయకుండా.. ఇంటి గేటును మూసివేశారు. అనంతరం, బాధితులు ఇద్దరూ కుక్కను లోపలికి పిలవాలని చెప్పినా వారు పట్టించుకోలేదు. వారితోనే(బాధితులతో యజమానులు) వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆమె కుక్కను కర్రతో కొట్టిన తర్వాత అది అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడితో బాధితులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వేదారణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఈ దాడిలో యజమానుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | நாகை: வேதாரண்யம் அருகே தாய் மற்றும் மகளை கடித்து தாக்கிய வளர்ப்பு நாயை வேடிக்கை பார்த்த உரிமையாளர் #SunNews | #DogIssue | #UntrainedDogs pic.twitter.com/xKB7LsyPTh— Sun News (@sunnewstamil) March 21, 2026 -
శశికళ వెన్నుపోటు.. ‘నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్’!
తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపించే వెన్నుపోటు రాజకీయాలు ఇప్పుడు తమిళనాట ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ రాజకీయంగా ఒంటరయ్యారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా నిలిచిన ఆర్బీ ఉదయ్కుమార్ ఇప్పుడు అదే శశికళ వ్యూహాలకు బలవుతున్నారా? ఆనాడు అండగా నిలిచిన ఉదయ్ ఓటమికి శశికళ పావులు కదుపుతున్నారా? అందుకే ఆమె తిరుమంగళం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారా? ఇప్పుడు దక్షిణ తమిళనాడులో.. ఇంకా చెప్పాలంటే మదురైలో ఇదే చర్చ జరుగుతోంది.మదురై జిల్లాలోని తిరుమంగళం నియోజకవర్గానికి వీఐపీ అసెంబ్లీ సెగ్మెంట్గా పేరుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. శశికళ ఇప్పుడు ఈ నియోజకవర్గంపై దృష్టిసారించడం ఇందుకు ప్రధాన కారణం. శశికళ శిష్యుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష ఉపనేత అయిన ఆర్బీ ఉదయ్కుమార్ని ఓడించేందుకు శశికళ వ్యూహాలకు పదునుపెడుతున్నారనే చర్చ తిరుమంగళంలో జరుగుతోంది. నిజానికి ఉదయ్కి ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు రెండుసార్లు అప్రతిహతంగా విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు.జయలలిత మరణం తర్వాత.. శశికళకు మద్దతుగా నిలిచిన వారిలో ఉదయ్ ముందంజలో ఉంటాడు. అయితే.. ఆ తర్వాత వీరి మధ్య దూరం ఎందుకు పెరిగింది?? ఈ ప్రశ్నకు తదనంతర పరిణామాలే ప్రధాన కారణమనే సమాధానం వస్తోంది. జయ మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం అయ్యారు. దాంతో.. ఉదయ్ ఆయన వర్గానికి దగ్గరయ్యారు. అయితే.. ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. సొంతపార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారు. అంతేకాదు.. పొత్తుధర్మంలో భాగంగా ఈ సీటును ఎన్డీయేకు ఇవ్వడానికి కూడా పళనిస్వామి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ తనకే టికెట్ దక్కినా.. ఉదయ్ని ఓడించడమే లక్ష్యంగా శశికళ పావులు కదుపుతున్నారు. దీంతో.. ఉదయ్ విజయం అంత సులభమేమీకాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా.. ఇక్కడ దళపతి విజయ్ పార్టీ టీవీకే చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటు పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరాక.. తిరుమంగళంలో కూడా పరిణామాలను అంచనావేసే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.జయలలితకు నెచ్చెలిగా ఉంటూ.. రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న శశికళ.. ఇప్పుడు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు వస్తున్నారు. టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే నుంచి బహిష్కరణకు గురైన సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయన్సర్ జీవా నాచియార్తో సంప్రదింపులు జరుపుతున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న జీవా నాచియార్ ముక్కులత్తోర్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే వర్గానికి చెందిన ఉదయ్కుమార్కు ఇది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా ఉదయ్ వర్గీయులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఉదయ్ మద్దతుదారులను డీఎంకేలో చేర్చుకున్నారు. ఈ పరిణామాలు పళనిస్వామి వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది.ఒకప్పుడు ఉదయ్ మద్దతుదారులుగా ఉన్నవారు ఇప్పుడు పళనిస్వామికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ పరిణామాలను తట్టుకుని ఉదయ్ విజయం సాధించి, హ్యాట్రిక్ను నమోదు చేసుకుంటారా? శశికళ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి, విజయం సాధిస్తుందా? పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా.. వీరి వివాదం మూడో వ్యక్తి విజయానికి బాటలు వేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
భార్య సంగీతతో మరో చిక్కు..? విజయ్కు షాక్ తగలనుందా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ దాఖలు చేయబోయే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే పట్టుదలతో విజయ్ ఉండగా.. అయితే, ఆయన అసలు ఎన్నికల్లో నిలబడగలరా? అంటూ డీఎంకేలోని న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో అప్రమత్తమైన విజయ్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేంత తీవ్ర వ్యవహారంగా మారిందిఎన్నికల కేసుల్లో అనుభవం ఉన్న కొందరు డీఎంకే న్యాయవాదులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. "భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి తన ఆస్తుల వివరాలను దాచకూడదు. సమగ్రమైన అఫిడవిట్ను సమర్పించడం తప్పనిసరి. ఆ అఫిడవిట్లో అభ్యర్థి తన పేరుతో ఉన్న చరాస్తులు, స్థిరాస్తులే కాకుండా.. భార్య, కుమారులు, కుమార్తెల పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాల నిల్వలు, ఆదాయపు పన్ను వివరాలన్నింటినీ సమర్పించాలి.ఇందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. ఈ అఫిడవిట్ను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచుతారు. ఎవరైనా ఇందులో తప్పుడు సమాచారం, ఆస్తులను దాచడం వంటివి గుర్తిస్తే.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. అయితే, ప్రస్తుతం.. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం విజయ్ నామినేషన్ దాఖలు చేయడంలో అడ్డంకిగా మారవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆమె పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయి? బ్యాంకు నిల్వలు ఎంత? ఏవైనా అప్పులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు విజయ్ దగ్గర స్పష్టమైన సమాధానాలు ఉన్నాయా? అనే సందేహాలు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.విజయ్, ఆయన భార్య గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ కాలంలో ఆమె తన పేరు మీద, పిల్లల పేరు మీద గానీ ఏవైనా ఆస్తులు కొన్నారా? అప్పులు చేశారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా? వంటి వివరాలు విజయ్కు తెలిసే అవకాశం లేదు. తన భార్యతో సంప్రదిస్తేనే విజయ్ తన నామినేషన్లో సరైన వివరాలను పొందుపరచగలరు. కానీ, ప్రస్తుతం వారద్దరూ మాట్లాడుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది.అందుకే విజయ్ నామినేషన్ చట్టపరమైన చిక్కులు కలగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ నామినేషన్ దాఖలును మా సీనియర్ లాయర్లు నిశితంగా గమనిస్తారు, దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి’’ అని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దీనిపై విజయ్కు చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?. భార్యతో విడిగా ఉంటున్నందున కొత్తగా కొన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేనని చెప్పడానికి చట్టపరమైన వెసులుబాటు ఉందా? అని దానిపై విజయ్ సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
మోదీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన విజయ్
-
ఎన్నికల వేళ పొత్తులపై కుండబద్దలు కొట్టిన విజయ్
చెన్నై: పొత్తులపై టీవీకే చీఫ్, సినీనటుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తనను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు.తమిళనాడులోని మహాబలిపురంలో విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మేము ప్రజల టీమ్. కొందరు మమ్మల్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు... కానీ, అది పని చేయలేదు. మేము ఏదో ఒక కూటమిలో చేరతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎప్పుడూ లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెబుతున్నాను. దానిపై రాజీ పడము. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే నమ్మవద్దు. మన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం" అని అన్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.కాగా, దీనిపై ఇప్పటికే టీవీకే నేత ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. అలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. -
ఎన్నికల బాజా!
ఈసారి ఏప్రిల్ అధిక ఉష్ణోగ్రతలతోపాటు ఎన్నికల వేడిని కూడా చవిచూడబోతోంది. నాలుగు రాష్ట్రాలు– తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ప్రకటించింది. బెంగాల్లో రెండు దఫాలుగా ఏప్రిల్ 23, 29ల్లో పోలింగ్ జరగనుండగా, మిగిలినచోట్ల 9న ఒకే దఫాతో ముగుస్తుంది. అన్నింటి ఫలితాలూ మే 4న వెలువడతాయి. 2006 నుంచి చూస్తే వేలంపాట మాదిరి అయిదు నుంచి ఎనిమిది దఫాలుగా పోలింగ్ సాగిన చరిత్రగల బెంగాల్లో ఈసారి కేవలం రెండు దఫాలతో సరిపెట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరిపి 60.06 లక్షల మంది ఓటర్లను త్రిశంకు స్వర్గంలో ఉంచిన ఈసీ... ఆ విషయం తేలకుండానే బెంగాల్ ఎన్నికలు నిర్వహించబోతోంది. ఆ విషయంలో వచ్చిన ఫిర్యాదులను హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఏర్పడే అప్పిలేట్ ట్రిబ్యునళ్లు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే 705 మంది ఆ పనిలో ఉన్నారు. రోజుకు లక్ష ఫిర్యాదుల్ని పరిష్కరిస్తున్నారు. అలా చూసుకుంటే నామినేషన్ల ఘట్టం ముగిసే ఏప్రిల్ 9 నాటికి 39 లక్షలమంది వినతులు పరిష్కారమవుతాయి. వారిలో ఎందరికి ఓటేసే భాగ్యం దక్కుతుందోగానీ... ఎటూ తేలకుండా 20 లక్షల మందికిపైగా మిగిలిపోతారు. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం 23(3) ప్రకారం నామినేషన్ల గడువు ముగిశాక ఎన్నికల జాబితా మారకూడదు. అధికారంలో ఉండగా ఏం చేసినా, ఎన్నికల సీజన్ వచ్చేసరికి వాగ్దానాలు వరదలై పారటం మనకు రివాజైంది. అధికారంలో ఉన్న వెసులుబాటు ఉపయోగించుకుని ఏదో పథకం పేరిట మహిళా ఓటర్ల ఖాతాలకు డబ్బు పంపిణీ సంప్రదాయం నిరుడు నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ ఎన్డీయే కూటమి మొదలెట్టింది. దానికింద 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున పంపిణీ అయ్యాయి. దీనికి మలి దశ కూడా ఉంటుందని చెప్పడం మరింత లాభించింది. మహిళలంతా ఎన్డీయేకు నీరాజనాలు పట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ఆ బాటలోనే 1.31 కోట్లమంది మహిళల ఖాతాలకు రూ. 5,000 చొప్పున గత నెలలో బదిలీ చేశారు. ఇవిగాక రాబోయే రోజుల్లో పార్టీలు విడుదల చేయబోయే మేనిఫెస్టోల నిండా ఎటూ ఉచితాల మోత మోగుతుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఒక్క అస్సాంలో తప్ప మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. పుదుచ్చేరిలో మాత్రం ప్రాంతీయ పక్షం ఎన్నార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. ఓట్ల శాతం క్రమేపీ పెరుగుతూ వస్తున్న బెంగాల్లో ఈసారి నిర్ణయాత్మక పాత్ర పోషించగలమని ఆ పార్టీ విశ్వసిస్తోంది. కానీ వచ్చిన ఏ అవకాశాన్నయినా అంత తేలిగ్గా వదలని తృణమూల్ అధినేత, సీఎం మమతా బెనర్జీ ముందు ఎవరి ఎత్తుగడలైనా ఫలించటం అంత తేలిక కాదు. సినీ నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన టీవీకే పార్టీతో పొత్తు ఖరారైతే తమిళనాడు తమ జోలెలో పడుతుందని బీజేపీ ఆశిస్తోంది. మిత్రపక్షం అన్నా డీఎంకేపై పెద్దగా ఆశలేమీ లేవు. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను ఢీకొనడం కష్టమే. కేరళలో వరసగా పదేళ్లు సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ఏలుబడి సాగింది గనుక అక్కడ కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్లో బాగా ఆశలున్నాయి. 2014 నుంచి వరసగా అధికారంలోకొస్తున్న అస్సాంలో బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. 2023 నాటి నియోజకవర్గాల పునర్విభజనతో ముస్లిం ప్రాతినిధ్యం ఉండే స్థానాలు 23కి పడిపోవడం, మొన్నటి బడ్జెట్లో మహిళలకూ, యువతకూ ప్రకటించిన రూ. 5,000 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలు ఆ ఆత్మవిశ్వాసానికి మూలం. కాంగ్రెస్ సంస్థాగత బలహీనతలు సరేసరి. ఈ ఎన్నికలు ఈసీ విశ్వసనీయతకు కూడా పరీక్ష. లోక్సభలో అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోతున్న తరుణంలో ఈసారైనా తటస్థత పాటిస్తుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ, హోం కార్యదర్శినీ మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై రెండేళ్లు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ఆ సంస్థ వైఖరి ఈ ఎన్నికల విషయంలో మారకపోతే మరిన్ని ఛీత్కారాలు తప్పవు. మొత్తానికి ఏ పార్టీ జాతకం ఏమిటో తెలియడానికి మే నాలుగో తేదీ వరకూ ఆగక తప్పదు. -
విజయ్కి డిప్యూటీ సీఎం పోస్టా? కుండబద్దలు కొట్టిన టీవీకే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్న నేపథ్యంలో సినీనటుడు విజయ్కు చెందిన టీవీకే ఇప్పటికీ పొత్తులపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ కూటమి తమిళనాడులో గెలిస్తే విజయ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.అయితే, పొత్తుల గురించి వస్తున్న ఇలాంటి ప్రచారానికి చెక్ పెట్టేందుకు టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. కూటమి గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదని, అలాగే వదంతులను నమ్మవద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.‘ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యం.కొన్ని నిర్దిష్ట పార్టీలతో, రాజకీయ నాయకులతో ఏ స్థాయిలోనూ చర్చలు జరగలేదని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. గతంలో కూడా కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలతో కలుస్తున్నామంటూ ఇలాంటి తప్పుడు వార్తలు రావడం అందరికీ తెలిసినదే, అది నిజం కాదు.అయితే ప్రజలు, టీవీకే కార్యకర్తల్లో గందరగోళం కొనసాగించేందుకు డీఎంకే ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేస్తోంది. బాధ్యతాయుత మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వినియోగదారులు నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఇలాంటి వదంతులు ప్రచారం చేయొద్దు. నిజమే గెలుస్తుంది!’ అని చెప్పారు. -
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
నదులకు లాలపోసే తల్లులు!
ప్రాణం పోసే శక్తి స్వరూపిణి స్త్రీ. మనుషులకే కాదు దైవసమానమైన నదులకు కూడా ప్రాణం పోస్తోంది ఆ శక్తి. జీవం కోల్పోయి, మృత్యుదిబ్బలుగా మారిన ఎన్నో నదులకు దేశవ్యాప్తంగా ప్రాణం పోస్తున్నారు మహిళలు. సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నారు...తమిళనాడులోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లాల గుండా ప్రవహించే పాలార్ నది ఉపనది నాగనది పూర్వవైభవం కోల్పోయింది. ఎండిపోయి నిర్జీవంగా మారింది. వర్షాలు పడినా సరే ఆ మృత నదిలో నీటి గలగలలు లేవు. ఈ నది ఎండి పోవడం పంట పొలాలపై, అక్కడి ప్రజల ఉపాధిపై ప్రభావం చూపింది. ఎంతోమంది పొట్ట చేతపట్టుకొని పట్టణాల బాట పట్టారు.ఈ నేపథ్యంలో నదిని పునర్జీవింపజేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది. ఈ కార్యక్రమంలో మహిళలు క్రియాశీల పాత్ర పోషించడం విశేషం. వెయ్యిమంది మహిళలు సంవత్సరం పాటు 21 గ్రామ పంచాయతీలలో రీఛార్జ్ బావులు, రెండు వందల బౌల్డర్ చెక్లను నిర్మించారు. బౌల్డర్ చెక్లతో నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేయడానికి, నీటి కోతను నివారించడానికి, భూగర్బ జల మట్టాలను పెంచడానికి ఎంతో కష్టపడ్డారు.వారి శ్రమ ఫలించిందిభూగర్భ జలాలు పెరిగాయి. అవి నాగనదిలోకి వెళ్లాయి. నది మెల్లగా ప్రాణం పోసుకోడం మొదలైంది. ఈ వార్త తెలిసిన మరింతమంది మహిళలు నాగనది పునర్జీవనోద్యమంలో భాగం అయ్యారు.ఇప్పుడు..నాగనది ఏడాది పొడవునా ప్రవహిస్తోంది. ఈ సజీవ ప్రవాహం ఈ ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసింది. వ్యవసాయం తిరిగి మొదలైంది. తమిళనాడులోని పదిహేను జిల్లాలలో ఇరవై అయిదు నదులను పునర్జీవింప చేయడానికి నాగనది స్ఫూర్తిగా మారింది.కోసీ నది కోసం...అటవీ నిర్మూలన పెరగడం వల్ల కోసీ నది ప్రమాదంలో ఉందని గ్రహించిన సామాజిక కార్యకర్త బసంతిదేవి బాధపడడానికి మాత్రమే పరిమితం కాలేదు. తన బాధ్యతగా గట్టిపని ఏదైనా చేయాలని అనుకుంది. నదితోపాటు సమీపంలోని అడవులను కాపాడాలని నిర్ణయించుకుంది.‘నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఉద్యమంలో మహిళలను భాగం చేయడానికి ఊరూ వాడా తిరిగింది ఉత్తరాఖండ్కు చెందిన బసంతి. ఎన్నో సంవత్సరాలు అలుపెరుగని కృషి చేసింది. వందలాది మంది మహిళలను కోసి నది పరిరక్షణ ఉద్యమంలో భాగం చేసింది. వందలాది గ్రామ మహిళలు చెట్లను రక్షించడానికి, మొక్కలను నాటడానికి, నదిని కాపాడుకోవడానికి నడుం కట్టారు.ప్రతి గ్రామంలో ఏర్పడిన మహిళా సంఘాల సమష్టి కృషి ద్వారా అడవుల నరికివేత ఆగిపోయింది. మొక్కలు చెట్లు అయ్యాయి. కోసి నది ప్రాంతంలో ఎండిపోయిన ప్రదేశాలలో నీరు సమృద్ధిగా దొరకడం మొదలైంది. నీటి ఊటలు పునర్జీవనం పొందాయి. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.‘సేవ్ కోసీ ఉద్యమం’ నేటికీ కొనసాగుతుండడం విశేషం.‘మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజులలో చాలా సందేహాలు ఉండేవి. అయితే ఉద్యమకారులకు సంకల్పబలం తప్ప సందేహాలు ఉండకూడదు అనే మాట మాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఉద్యమాన్ని విజయవంతం చేసింది’ అంటుంది ఉత్తరాఖండ్లోని చోప్రియాలి గ్రామానికి చెందిన భువనేశ్వరీ. ఆమె ‘మహిళా మంగళ్ దళ్’ సభ్యురాలు.నదుల నేస్తం... నీతా పటేల్గుజరాత్లోని వెనకబడిన జిల్లాలలో డాంగ్ ఒకటి. ఈ జిల్లాలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తున్న క్రమంలో నర్మదా, బహ్రూచ్ కొండ ప్రాంతాల్లో జూన్ అక్టోబర్ మాసాల మధ్య సమృద్ధిగా వర్షాలు కురిసిన్పటికీ ఆ ప్రాంతాలలో పచ్చదనం లేకపోవడాన్ని గమనించింది నీతా పటేల్. గ్రామస్తులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది పటేల్.గ్రామాలు తిరుగుతూ ఎంతోమందిని సమీకరించింది. వందలాదిమందితో వేలాది మొక్కలు నాటించింది. డాంగ్ జిల్లాలో ప్రవహించే పూర్ణ, ఖాప్రి, అంబికా, గిరా, దోధాద్ నదులపై ఎన్నో చెక్ డ్యామ్లు, గ్రూప్ వెల్స్, చెక్ వాల్స్, బోరీ బంద్లు (ఇసుక నిండిని సంచుల) ఏర్పాటు చేసింది. ఎన్నో గ్రామాలలో మహిళలతో నీటి సంఘాలు ఏర్పాటు చేయించింది. సౌరశక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థలను నీతా అభివృద్ధి చేసింది. దీనివల్ల వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ‘నది పరిరక్షణ ఉద్యమంలో విజయం సాధించడానికి ఈ ఉద్యమంలో భాగమైన ఎంతోమంది గిరిజన మహిళలు కారణం’ అంటుంది నీతా పటేల్....వీరు మాత్రమే కాదు జయశ్రీ వెంకటేశన్(తమిళనాడు), గౌరీ మిరాషి (కామ్ నది, ఔరంగాబాద్), కిరణ్ కౌర్ (బహ్మపుత్ర/వారద బేసిన్, అస్సాం), శాంతిరాయ్ (తీస్తా నది, పశ్చిమ బెంగాల్), జల్ సహేలి (ఉత్తర్ప్రదేశ్)... ఎంతో మంది వాటర్ ఛాంపియన్లు మృత్యుశయ్యపై ఉన్న నదులకు జీవం పోస్తున్నారు. నదుల కళ్లలో కొత్త వెలుగు తీసుకు వస్తున్నారు.సేవ్ గంగోత్రిపర్వతారోహకురాలు అయిన డాక్టర్ హర్షవంతి ‘సేవ్ గంగోత్రి’ ప్రాజెక్ట్తో ఎంతోమందిలో అవగాహన కలిగిస్తోంది. భోజ్ అడవిని పునరుద్ధరించే పని చేపట్టింది. వేలాది మొక్కలు నాటించింది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి ప్రాంతంలో ప్రధాన జల వనరుల దగ్గర పరిస్థితులను మెరుగు పరచడానికి విశేష కృషి చేసింది. నదుల రక్షణ, పర్యావరణంపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘మహిళా శక్తితో ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు’ అంటుంది హర్షవంతి.మన నదులు మన భవిష్యత్విధ్వంసక నీటి అభివృద్ధి ప్రాజెక్ట్లను (పెద్ద డామ్లు) వ్యతిరేకించడానికి, నదులకు జీవం పోసి కాపాడుకోవడానికి నదుల పరిరక్షణ దినం మొదలైంది. ఈ సంత్సరం థీమ్: మన నదులు–మన భవిష్యత్. నదీ పర్యావరణ వ్యవస్థలను రక్షించడం, పునరుద్ధరించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎన్నో సమావేశాలు, సదస్సులు, నదులను శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతాయి, బ్రెజిల్లోని కురిటిబాలో 1997లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నదుల పరిరక్షణ దినోత్సవానికి బీజం పడింది. -
విజయ్ వైపు.. ఆ ముగ్గురి చూపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో చేరే పార్టీల జాబితా దాదాపుగా ఖరారైంది. అయితే టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన పిలుపునకు ఎట్టకేలకు ముగ్గురు స్పందించారు. ఈ ముగ్గురి విజయ్తో కలిసి మెగా కూటమి దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. డీఎంకే మెగా కూటమి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఏఏ పారీ్టలు ఉన్నాయో దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఇక, అన్నాడీఎంకే– బీజేపీ కూటమిలోనూ అదే పరిస్థితి. కాగా సంకీర్ణ ధర్మం మేరకు పాలనలోనూ భాగస్వామ్యం అన్న నినాదంతో తనతో కలిసి వచ్చేవారికి అధికారంలో వాటా ఇస్తానన్న విజయ్ వైపుగా ఇంత వరకు ఎవ్వరూ దృష్టి పెట్ట లేదు. చివరకు ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్కు మరింత బలాన్ని ఇచ్చేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఓ వైపు ,దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ మరోవైపు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరిన దృష్ట్యా, డీఎంకేలో తమకు అవకాశం లేక పోవడంతో ఇక విజయ్ పక్షాన నిలబడేందుకు రాజకీయ అనుభవజు్ఞడైన రాందాసు నిర్ణయించి, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ సైతం రాందాసు పిలుపునకు స్పందించినట్టు ప్రచారం. రహస్యంగా చర్చలు.. ఈ ప్రచారానికి అద్దం పట్టే విధంగా ఆమె మంగళవారం రాత్రి తైలాపురంలో రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. తనకు వెన్నుపోటు పొడిచిన పళణిస్వామి, టీటీవీ దినకరన్కు గట్టిగా బుద్ది చెప్పే రీతిలో అన్నాడీఎంకే కేడర్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా చిన్నమ్మవ్యూహాలకు పదును పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్, ముక్కళత్తోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా ఆయనకు దన్నుగా నిలబడేందుకు సన్నద్ధమవుతున్నట్టు చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను కలిగిన పుదియ తమిళగం నేత కృష్ణస్వామి సైతం విజయ్కు దన్నుగా నిలబడే రీతిలో సిద్ధమైనట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే సజావుగా వ్యవహారాలన్నీ సాగి, వ్యూహాలు ఫలించిన పక్షంలో విజయ్ నేతృత్వంలోమెగా కూటమి తథ్యమని రాందాసు ,చిన్నమ్మ శశికళ శిబిరంలోని కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం. -
భయపడాల్సిన పనిలేదు.. ఎల్పీజీ కొరతపై మోదీ భరోసా
తిరుచిరాపల్లి/కొచ్చి: పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో కొత్తగా భారత్లో వెలుగుచూసిన ఎల్పీజీ కొరతపై జనం భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో బుధవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘పశ్చిమాసియా సంక్షోభంపై తమిళనాడు ప్రజలకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. ఈ సమయంలోనూ భారత్ మొదట్నుంచీ అవలంభిస్తున్న విధానాన్నే నేను నమ్ముతా. ఎలాంటి సంక్షోభకాలంలోనైనా భారతీయుల స్వప్రయోజనాలకే మా ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుంది. ప్రస్తుత కష్టకాలంలో మన విధానం మారదు. ఇప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. పుకార్లకు ఎవరూ ప్రాధాన్యత ఇవ్వొద్దు. ప్రజలను ఒక్కటే కోరుతున్నా. కేవలం సరైన, విశ్వసనీయ సమాచారం మాత్రమే అందరితో పంచుకోండి. కోవిడ్ మహావిలయకాలంలోనూ భారత్ ఎంత పరిణతి చెందిన దేశమో 140 కోట్ల మంది భారతీయులు రుజువుచేశారు. అచ్చం అలాగే ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని మ నం విజయవంతంగా ఎదుర్కొని సమస్య నుంచి గట్టెక్కుతాం’’అని మోదీ వ్యాఖ్యా నించారు. గల్ఫ్ దేశాలు ఆదుకుంటున్నాయి: పశ్చిమాసియా యుద్ధవాతారణంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఎన్డీఏ ప్రభుత్వంతోపాటు గల్ఫ్ దేశాలు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాయని మోదీ ప్రకటించారు. బుధవారం కేరళంలోని కొచ్చిలో ఎన్డీఏ ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇరాక్లో చిక్కుకున్న నర్సులను కావొచ్చు, యెమెన్లో ఉగ్రవాదుల చెరలో బందీగా ఉన్న ఫాదర్ టామ్ను కావొచ్చు సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ ఏనాడూ తన పౌరులను గాలికి వదిలేయలేదు’ అన్నారుఆందోళన అనవసరంఅవసరాలకు తగినంత ఎల్పీజీపై సరఫరా ఎప్పట్లా 2.5 రోజుల్లోనే రీఫిల్ డెలివరీ: కేంద్రంన్యూఢిల్లీ: ‘‘దేశంలో అవసరాలకు తగినన్ని ఎల్పీజీ నిల్వలున్నాయి. గృహావసరాల డిమాండ్ను పూర్తిస్థాయిలో తీర్చడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు’’అని కేంద్రం బుధవారం పేర్కొంది. ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదని పెట్రోలియం, సహజ వాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ స్పష్టం చేశారు. ‘‘ఆందోళనతో రీఫిల్స్ అధిక బుకింగ్, డీలర్ల అక్రమ నిల్వల వంటివి తప్పుడు సమాచార వ్యాప్తికి దారి తీస్తున్నాయి. వాస్తవానికి గృహ వినియోగదారులకు రీఫిల్ సిలిండర్ పశ్చిమాసియా కల్లోలానికి ముందు మాదిరిగానే సగటున 2 నుంచి 2.5 రోజుల్లోనే అందుతోంది’’అని ఆమె మీడియాకు వెల్లడించారు. ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం మోపాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. గృహేతర ఎల్పీజీ సరఫరాలో ఆస్పత్రులు, విద్యా సంస్థల వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 90 శాతం హార్మూజ్ జలసంధి గుండానే వస్తోంది’’అని తెలిపారు. ఎల్ఎన్జీ నిల్వలతో కూడిన రెండు నౌకలు త్వరలో భారత్ చేరుకోనున్నట్టు శర్మ వెల్లడించారు. హార్మూజ్ గుండా భారత్కు చమురు, సహజ వాయువు, ఎల్పీజీ రవాణా రెండు వారాలుగా తీవ్రంగా ప్రభావితం కావడం తెలిసిందే. రష్యా తదితర దేశాల నుంచి చమురు సరఫరా అవుతున్నా ఎల్పీజీ, ఎల్ఎన్జీ విషయంలో మాత్రం సమస్య నెలకొంది. దాంతో ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ సరఫరాను పెంచుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. -
తమిళనాడులో ట్విస్ట్.. విజయ్కి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: టీవీకే అధినేత, నటుడు విజయ్కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాలని తాజాగా నోటీసులు పంపింది. ఈ క్రమంలో మార్చి 10న దర్యాప్తు సంస్థ అధికారుల ఎదుట హాజరుకావాలన్న సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఇక, కరూర్ ఘటనలో విజయ్ ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ఢిల్లీలోని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపారు. ఈ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆరుగంటల పాటు జరిగిన ఈ దర్యాప్తులో.. కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.#TamilNadu: #CBI has reportedly issued a summons to actor and Tamilaga Vettri Kazhagam (#TVK) chief #Vijay, asking him to appear for inquiry on March 10 in connection with the #Karur crowd stampede case.— South First (@TheSouthfirst) March 9, 2026గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం కోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్ను రద్దు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆదేశించింది.ఇక, తమిళనాడులో కరూర్లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు,కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం,ఆహారం,నీరు,మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను ఖండించారు. -
టీవీకే చీఫ్ విజయ్ మ్యానిఫెస్టో.. వారికి బంపరాఫర్
చెన్నై: త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ పొలిటికల్ హీట్ ఊపందుకుంది. తమిళనాడులో కొత్తగా ఆవిర్భించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఎన్నికలకు భారీ హామీలతో ముందుకెళ్లడానికి సిద్ధమైంది. ఈ మేరకు టీవీకే చీఫ్ విజయ్.. తమ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇందులో మహిళలకు బంపరాఫర్లు ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం(మార్చి 7వ తేదీ) తన ఎన్నికల హామీలను ప్రకటించారు విజయ్. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, యువతులకు వివాహ బహుమతిగా బంగారపు ఉంగరం, పట్టు చీరలతో పాటు అన్ని కుటుంబాలకు ఉచితంగా ఆరు ఎల్పిజి సిలిండర్లు వంటి అనేక వాగ్దానాలను ప్రకటించారు. తన తమిళగ వెట్రీ కజగం అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న మహిళలందరికీ నెలవారీ సహాయం అందించబడుతుందని విజయ్ స్పష్టం చేశారు.మహిళలపై నేరాలకు సంబంధించి జీరో పారదర్శకత విధానాన్ని అమలు చేయడానికి “రాణి వెలు నాచ్చియార్ ఫోర్స్” అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమిళనాడులో సుమారు 500 బృందాలను రద్దీ ప్రదేశాల్లో భద్రత కోసం నియమిస్తామన్నారు. ఈ బృంద సభ్యులు బాడీ కెమెరాలతో అందుబాటులో ఉంటారన్నారు.అలాగే, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను వేగంగా విచారించి న్యాయం అందించేందుకు “అంజలై అమ్మాళ్ సూపర్ ఫాస్ట్ మహిళా కోర్టులు” ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
బిడ్డ కోసం అమాంతం బావిలోకి దూకేసిన తల్లి..!
‘అమ్మ’ గొప్పదనం గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి మరీ బిడ్డల్ని కాపాడు కుంటుంది. తరతరాల చరిత్ర ఈ సత్యాన్ని పదే పదే నిరూపిస్తూనే ఉంది. పిల్లల్ని కాపాడటానికి తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఉదంతం బిడ్డలపై తల్లి ప్రేమ, చూపించే ధైర్య సాహసాలపై మరోసారి చర్చకు తావిచ్చింది. మాతృత్వం గౌరవాన్ని మరింత ఇనుపడింపజేసిన ఈ సంఘటన మంగళవారం జరిగింది.ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం తమిళనాడులోని నంబియూర్ సమీపంలో అయియంకట్టు తొట్టంలో తన కూతురిని కాపాడటానికి 55 ఏళ్ల మహిళ లోతైన బావిలోకి దూకేసింది. ఊంజపాళయంకు చెందిన సుందరం కుమార్తె దివ్య (27) స్పెషల్ నీడ్ చైల్డ్. ఇందుకోసం చికిత్స కూడా పొందుతోంది. ఆత్మహత్య చేసుకోవాలని ఆమె బావిలోకి దూకేయడంతో అక్కడే ఉన్న తల్లి ముత్తుమణి క్షణం కూడా ఆలోచించికుండా కూతుర్ని కాపాడేందుకు సాహసానికి పూనుకుంది. వెంటనే తాను కూడా బావిలోకి దూకేసి, కుమార్తెను గట్టిగా పట్టుకుంది. సహాయం కోసం ఆమె వేసిన కేకలు ఆ ప్రాంతం అంతటా ప్రతిధ్వనించాయి. దీంతో పొరుగువారు అప్రమత్తమై కడ్తూర్ పోలీసులకు, నంబియూర్ అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేదాకా ఆమె బిడ్డను కాపాడుకుంది. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ముత్తుమణి ధైర్యాన్ని స్థానికులు ప్రశంసలు కురిపించారు. తల్లీ బిడ్డల్ని కాపాడిన అగ్నిమాపక శాఖ కృషిని కూడా కొనియాడారు ఈ సంఘటనపై పోలీసులు సాధారణ విచారణ ప్రారంభించారు.In a split-second act of courage, a 55-year-old woman jumped into a deep well to save her daughter, triggering a dramatic rescue operation in Aiyankattu Thottam near Nambiyur on Tuesday.Divya, 27, daughter of Sundaram from Oonjapalayam, reportedly leaped into a well in the… pic.twitter.com/TeRzAkL4kF— IndiaToday (@IndiaToday) March 4, 2026 -
విజయ్పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు
తమిళనాట తన రాజకీయ ఉజ్వల భవిష్యత్తుకోసం కలలు కంటున్న సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు విజయ్ నెత్తిన మరో బాంబు పడింది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందనీ, ఎంత చెప్పినా వినడం లేదని ఆరోపిస్తూ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ వద్ద సుమారు పదేళ్లపాటు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సెల్వరాజ్ సెల్వం, ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.సెల్వరాజ్ సెల్వం ఆరోపణలు2015లో 'పులి' సినిమా షూటింగ్ సమయంలో, ఆహారంలో వెంట్రుక వచ్చిందనే నెపంతో విజయ్ తనపై దాడి చేశారని సెల్వరాజ్ ఆరోపించాడు. తనను కొట్టి, కిందపడిపోతే గుండెలపై తొక్కారని, అయితే మరుసటి రోజు తన కోపాన్ని అసిస్టెంట్పై చూపించినందుకు క్షమాపణలు కూడా చెప్పారని పేర్కొన్నాడు.అంతేకాదు తన కూతురి పెళ్లికి విజయ్ను స్వయంగా పిలిచినా ఆయన రాలేదని, ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదని సెల్వరాజ్ ఆరోపించాడు. అనారోగ్య సమస్యల రీత్యా విజయ్ను కలవడానికి ప్రయత్నించినా, ఆయన చుట్టూ ఉన్నవారు తనను దగ్గరకు రానివ్వడం లేదని పేర్కొన్నాడు. అలాగే విజయ్ వద్ద పనిచేసే డ్రైవర్ రాజేంద్రన్ వంటి ఇతరులు తనను శత్రువులా చూసేవారని, విజయ్కు తాను వండిన వంటల్లో ఉప్పు కలిపి తనపై చెడ్డ పేరు వచ్చేలా చేసేవారని సెల్వరాజ్ సంచలన విషయాలు వెల్లడించడం నెట్టింట చర్చకు దారి తీసింది.இதான் சார் Superstar 💥💥 pic.twitter.com/Owi3zHQpHM— என் உயிர் Superstar ரஜினி ரசிகன் (@A_CROW_KILLER) February 12, 2026తినడానికి తిండిలేదు, అప్పుల బాధలుప్రస్తుతం తాను తీవ్రమైన పేదరికంలో ఉన్నానని సెల్వరాజ్ వాపోయారు. 'GOAT' షూటింగ్ సమయంలో తనకు గుండెపోటు వచ్చిందని, శస్త్రచికిత్స కోసం 10 లక్షల రూపాయలు అప్పు చేశానని చెప్పారు. రెండేళ్లు అయ్యింది. సహాయం కోసం విజయ్ సర్ను కలవడానికి ప్రయత్నించాను, కానీ అతని వాళ్ళు నన్ను అతని దగ్గరికి రానివ్వరు. నేను వేరే చోట పని కోసం అప్పుల బాధతో కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నానని, కడుపు నిండి తినేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోయాడు. తన భార్య మెడలో పుస్తెల తాడు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పదేళ్ల సర్వీస్ తర్వాత, విజయ్ తండ్రి ,దర్శకుడు చంద్రశేఖర్తో అరవై చిత్రాలకుపైగా పనిచేసిన తాను ఈ పరిస్థితిలో ఉంటానని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి: విజయ్కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలుఅయితే సెల్వరాజ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలపై విజయ్ టీమ్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక వివరణ రాలేదు.విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్న పుకార్ల నేపథ్యంలో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తండ్రిని సోషల్ మీడియాలో అన్-ఫాలో చేశారనే వార్తలు కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి : ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్కు విడాకుల నోటీసులు -
డీఎంకే సర్కార్ అవినీతిమయం: ప్రధాని మోదీ
సాక్షి, చెన్నై/పుదుచ్చేరి: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. డీఎంకే మంత్రులు అవినీతిలో పరస్పరం పోటీపడుతున్నారని విమర్శించారు. డీఎంకే సర్కారు అవినీతికి పాల్పడడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. పేదలు, రైతులు, యువతను దోచుకుందని ధ్వజమెత్తారు. ఈ అవినీతి ప్రభుత్వానికి ఇకపై అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని తేలి్చచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం మదురైలో బహిరంగ సభలో ప్రసంగించారు. అవినీతి, అసమర్థ పాలనతో తమిళనాడు ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కచ్చతీవులను శ్రీలంకకు అప్పగించి తమిళనాడుపై కక్ష తీర్చుకుందన్నారు. తమకు అధికారం అప్పగిస్తే తమిళనాడును అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, ఏఎంఎంకే వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్ సభలో పాల్గొన్నారు.పుదుచ్చేరిని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్ పుదుచ్చేరిని గతంలో ఢిల్లీలోని ఒక కుటుంబానికి ఏటీఎంగా కాంగ్రెస్ మార్చేసిందని మోదీ నిప్పులు చెరిగారు. ఆదివారం అక్కడ రూ.2,714 కోట్ల ప్రాజెక్టులకు ఆయన ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తర్వాత సభలో మాట్లాడారు. పుదుచ్చేరి అభివృద్ధికి ఆ కాంగ్రెస్, డీఎంకే స్పీడ్ బ్రేకర్గా మారాన్నారు. బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ పాలనలో పుదుచ్చేరి ప్రగతి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ ఆదివారం తమిళనాడులో తిరుప్పరకుండ్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ దోతీ, కుర్తా ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణచేశారు. పూజల్లో పాల్గొన్నారు. -
ఎంకే స్టాలిన్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు సీఎం స్టాలిన్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Warm birthday greetings to Thiru @mkstalin Avargal. Wishing you good health and continued happiness.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2026 -
విజయ్కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు
టీవీకే పార్టీ అధ్యక్షుడు, అగ్రహీరో దళపతి విజయ్కు మరో బ్యాడ్ న్యూస్ తప్పదా. భార్య సంగీతసోర్నలింగంతో విడాకుల వార్తల మధ్య, మరో ఎదురు దెబ్బ తగలనుందా? తమిళనాట సీఎం కావాలని కలలు కంటున్న విజయ్ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్కుడి సంచలన అంచనాలు వైరల్గా మారాయి. ఏమిటా అంచనాలు? ఈ కథనంలో తెలుసుకుందాం. తమిళనాడు ప్రస్తుతం కీలకమైన ఎన్నికల సీజన్ కు సిద్ధమవుతున్న వేళ, అందులోనూ విజయ్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సమయంలో విజయ్ చుట్టూ ఉన్న వివాదాల తుఫాను విజయ్ ఇమేజ్కు కళంకంగా మారింది.ఇదీ చదవండి : ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్కు విడాకుల నోటీసులు27 నంబరు గండంనటన నుంచి రాజకీయ అరంగేట్రం చేసింది మొదలు వరుస కష్టాలు తప్పడం లేదు. మరీ ఆయన జీవితంలో27 నంబరు కలిసి రావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగాతమిళనాడులోని కరూర్ జిల్లాలో విజయ్ పార్టీ (TVK) సభ సందర్బంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగింది.భార్య సంగీత తమిళనాడు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల పిటిషన్ను దాఖలు చేసిన ఫిబ్రవరి 27న వెలుగులోకి వచ్చింది. దీంతో 27 ఏళ్ల వైవాహిక బందం సంక్షోభంలో పడింది.ఇటీవలి చిత్రం జన నాయగన్ ఆలస్యం , కోర్టు పోరాటం తర్వాత, విజయ్ భార్య విడాకుల కోసం దాఖలు చేయడంతో, విజయ్ కష్టాలు అంతులేనివిగా కనిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు దళపతి విజయ్ భవిష్యత్తుపై జ్యోతిష్కుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సూపర్ స్టార్ కు మరో ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేశారు. ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం జ్యోతిష్కుడు ప్రశాంత్ కిని విజయ్ రాజకీయ గమనం గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది. “2030 తర్వాత దళపతి విజయ్ రాజకీయాల్లో గొప్ప విజయం సాధిస్తాడు. కానీ ఈసారి మాత్రం తమిళ రాజకీయాల్లో ఆయన ఉనికి చాటుకుంటాడు అంతే….!! ఆయన ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఈసారి కాదు….!! (sic).”మరొక పోస్ట్లో, “దళపతి విజయ్ ఈసారి తమిళనాడు ముఖ్యమంత్రి కాలేరు….!! అని పేర్కొన్నాడు. ఎం. జి.రామచంద్రన్, జయలలిత మాదిరిగానే చరిత్ర పునరావృతం కావచ్చని వ్యాఖ్యానించడం వైరల్గా మారింది. -
డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీ ఎంకే బహి ష్కృత నేత ఓ.పన్నీర్ సెల్వం (ఓపీఎస్) డీఎంకేలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఆయన డీఎంకే కండువాను కప్పుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకేలో చేరడం తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. సీఎం స్టాలిన్ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, అన్నాదురై, కరుణానిధి చూపిన దారిలో ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోతూ పార్టీని, ప్రభుత్వాన్ని ఆదర్శంగా నడిపిస్తున్నారని కొనియాడారు. ‘దేశం మొత్తం స్టాలిన్ నాయకత్వాన్ని నిశితంగా గమనిస్తోంది. రాజకీయ పార్టీని ఎలా నడపాలో ఆయన కొత్త వ్యాకరణం నిర్దేశించారు. తమిళనాడు ప్రజలకు సమర్థవంతమైన, గొప్ప ప్రశంసనీయమైన పరి పాలనను అందిస్తున్నారు’అని కొనియాడారు. -
ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్కు విడాకుల నోటీసులు
చెన్నై: తమిళ నటుడు, టీవీకే చీఫ్కు విజయ్కు భారీ షాక్ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో విజయ్ వివాహేతర సంబంధమే విడాకులకు కారణమంటూ పిటిషన్లో పేర్కొనడం సంచలనం రేపుతోంది.సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నాడని సంగీత ఆరోపించింది. 2021లో ప్రతివాదికి నటితో అక్రమ సంబంధం ఉందని ఆమె పేర్కొంది. అయితే సంబంధాన్ని ముగించాలని హామీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్లో మార్పులేదని పాత ధోరణే కొన సాగుతోందనేది సంగీత ప్రధాన అరోపణ. అదే భర్తనుంచి చట్టబద్ధంగా విడిపోవాలనే తన నిర్ణయానికి పునాది వేసింది. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. జీవిత భాగస్వామి వివాహేతర సంబంధంలో ఉన్నట్టు లేదా అవతలి వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు తేలితే, ప్రత్యేక వివాహ చట్టం, 1954 విడాకులకు అనుమతిస్తుంది. సంగీత పిటిషన్ ఈ రెండు చట్టపరమైన కారణాలను విచారిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం జిల్లా కోర్టు ముందు ఉంది. కాగా విజయ్,సంగీత తమ విభేదాలను బహిరంగంగా అంగీకరించనప్పటికీ గత రెండేళ్లుగా విజయ్ నుండి విడిగా నివసిస్తున్న సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు మహిళా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించి కేసును కుటుంబ సంక్షేమ కమిటీకి బదిలీ చేసింది.వారి సుదీర్ఘ మౌనం అభిమానులు, మీడియాలో నిరంతర ఊహాగానాలకు ఆజ్యం పోసింది. 1999 ఆగస్టులో ప్రేమవివాహం చేసుకున్న ఈ జంటకు జాసన్ సంజయ్ (25) , దివ్య షాషా (20) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమా నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చి ఇటీవల తమిళగ వెట్రి కజగం(TVK) పార్టీని ప్రారంభించిన విజయ్ కెరీర్, ప్రజా జీవితంలో ఈ పరిణామం కీలకమైంది అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు విజయ్ బృందం లేదా సంగీత ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియో


