
ఎయిర్పోర్టులో ఏకే-47 బుల్లెట్ల కలకలం
న్యూఢిల్లీ: ఎయిర్పోర్టులో ఏకే-47 బుల్లెట్లతో ఓ వ్యక్తి సంచరించడం కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఏకే-47 బుల్లెట్లు తీసుకెళ్లేందుకు యత్నించిన ఓ వ్యక్తిని విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న ముఖేశ్ ఆర్య అనే ప్రయాణికుడు తన బ్యాగులో అక్రమంగా ఏకే-47 బుల్లెట్లు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే తనిఖీలు చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.