ఏఐసిసి భవిష్యత్ ప్రణాళిక | AICC future planning | Sakshi
Sakshi News home page

ఏఐసిసి భవిష్యత్ ప్రణాళిక

Published Mon, Jun 23 2014 4:22 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం

న్యూఢిల్లీ: ఏఐసిసి గత సార్వత్రిక ఎన్నికలలో ఓటమిని సమీక్షిస్తూ, పనిలో పనిగా భవిష్యత్ ప్రణాళికను కూడా రూపొందిస్తోంది. ఏఐసీసీ కార్యాలయంలో ఈ రోజు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, ఏకె ఆంటోని,  జైరాం రమేష్  ఏపి, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలపై చర్చించారు. రాష్ట్రాల నేతలు కారణాలను విశ్లేషించారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన ఏపి పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య,  చిరంజీవి, జేడీ శీలం, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్  హాజరయ్యారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement