బెంగళూరు: 'అమ్మా ఐ లవ్ యూ' అంటూ నాలుగేళ్ల చిన్నారి తన తల్లికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన బెంగళూరులో జరిగింది.
బెంగళూరు నగర పరిధిలోని యలహంకకు చెందిన ఈ చిన్నారి నాలుగో తరగతి చదవేది. బాలిక తల్లి ఓ గార్మెంట్ ఫ్యాకర్టీలో పనిచేస్తోంది. కాగా బాలిక గత పది రోజులుగా స్కూలుకు వెళ్లలేదు. 'అమ్మా వారంపైగా స్కూలుకు వెళ్లలేదు. దయచేసి నన్ను క్షమించు. నేను ఎక్కడికెళ్లినా నీతోనే ఉంటా. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నా' అని ఆ చిన్నారి తన తల్లికి లేఖ రాసింది. సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాలికను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
'అమ్మా నిన్ను ప్రేమిస్తున్నా'.. 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య
Published Tue, Dec 2 2014 10:59 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
Advertisement
Advertisement