
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు నగరంలోని ఓ అయిదంతస్తుల భవనం కూలి ఒకరు మృతి చెందగా, మరో నలుగురిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటికి తీసింది. సుమారు 20 మందికిపైగా శిధిలాల కింద ఇరుక్కుని ఉంటారని భావిస్తున్నారు. ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment