
టోల్ వసూళ్లకు బ్రేక్
న్యూఢిల్లీ: తమిళనాడులోని జాతీయ రహదారులన్నింటిపై ప్రవేశ రుసుము(టోల్ ఛార్జీలు) వసూలుకు ప్రస్తుతానికి విరామాన్ని ఇస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు.
తమిళనాడులో భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితులు దయనీయంగా మారిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 11 వరకు తమిళనాడు రాష్ట్రంలోని జాతీయ రహదారులపై టోల్ పన్ను వసూలును తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే అమల్లోకి వచ్చాయి.