
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్లతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
గవర్నర్ ఇటీవల టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నరసింహన్తో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment