నేడు హస్తినకు గవర్నర్ | Governor Narasimhan on Thursday morning to go to the Delhi | Sakshi
Sakshi News home page

నేడు హస్తినకు గవర్నర్

Published Thu, Apr 24 2014 3:14 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

నేడు హస్తినకు గవర్నర్ - Sakshi

నేడు హస్తినకు గవర్నర్

 సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. శుక్రవారం కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. రాష్ట్రపతి పాలన గడువు పెంపు ఎలా అనే అంశంపై చర్చించేందుకే నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఈ నెలాఖరుకు రెండు నెలలవుతుంది. ఈలోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. లేదంటే ఇన్ని రోజులు సుప్తచేతనావస్థలో ఉన్న అసెంబ్లీ క్రియాశీలతలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పూర్తిగా రద్దు చేసి రాష్ట్రపతి పా లన విధించడమా? లేదా మరేదైనా మార్గం అవలంబించాలా? అనే విషయమై రాష్ట్రపతితోను, కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో ఆయన చర్చించనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement