ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసినట్లు ఆర్మీ తెలిపింది.
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసినట్లు ఆర్మీ తెలిపింది. అయితే ఎదురుకాల్పుల్లో ఓ జవాను మరణించినట్లు పేర్కొంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా జవాన్లు కాల్పులు జరపడంతో పారిపోయారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.