
ప్రతీకాత్మక చిత్రం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంపం ద్వారా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. రిక్టర్ స్కేలు భూకంప తీవ్రత 4.0 గా నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ అధికారంగా వెల్లడించింది. సోమవారం ఉదయం 6.06 గంటలకు భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. అలాగే భూకంప కేంద్రం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లా కేంద్రంగా గుర్తించారు. ఈ ఘటనకు సంభవించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment