Earthquake
-
నేపాల్లో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు
ఖాట్మాండు: హిమాలయ దేశం నేపాల్లో భూమి కంపించింది. సింధుపల్చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. నేపాల్లోని సింధుపల్చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడే భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు. భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని తెలిపారు. భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలందరూ బయటకు పరుగులు తీశారు. ఇక, భారత్, చైనా, టిబెట్ సరిహద్దుల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, నేపాల్ భూకంపం ప్రభావం మన దేశంలోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించింది. బీహార్ రాజధాని పాట్నాతో పాటు పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. Un sismo de magnitud 5.5 sacudió hoy cerca de Kathmandu, Nepal. El sismo se sintió con fuerza en la India, Bután y Bangladesh. Sin embargo, no se reportan víctima ni daños. #earthquake pic.twitter.com/X49YtPaUrf— Centinela35 (@Centinela_35) February 28, 2025An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit Nepal at 2.36 IST today. (Source - National Center for Seismology) pic.twitter.com/OtockGLncO— ANI (@ANI) February 27, 2025 -
కోల్కతా సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం
-
ఢిల్లీని కుదిపేసిన భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు బిహార్లోని సివాన్లో సోమవారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.0గా నమోదైంది. ప్రకంపనల కేంద్రం ఎర్రకోటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధౌలా కువాన్లోని ఝీల్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఉదయం 5.36 గంటల సమయంలో కంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) తెలిపింది. ఈ ప్రాంతంలో భూమి కంపించిన సమయంలో పెద్దపెద్ద శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. భూమికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలను సాధారణ భూకంపాలుగా పరిగణిస్తారు. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఎక్కువ నష్టం సంభవించేందుకు అవకాశముంటుంది. ఝీల్ పార్క్ ప్రాంతంలో ఏటా కనీసం రెండుమూడుసార్లు భూమి కంపిస్తుంటుందని స్థానికులు తెలిపారు. 2015లో ఇక్కడ సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. ప్రకంపనలతో భయపడిన ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లోని జనం భూకంపం వచ్చిందంటూ రోడ్లపైకి చేరుకున్నారు. ఇంత తీవ్రమైన భూకంపం ఇంతకు ముందెన్నడూ తాము చూడలేదని పలువురు తెలిపారు. భారీగా శబ్దాలు రావడంతో ఎంతో భయపడిపోయామని చెప్పారు. భూకంపంతో ఎవరూ గాయపడలేదని, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో సంభవించిన భూ ప్రకంపనలతో ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తదుపరి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ‘ఎక్స్’లో సూచించారు. అధికారులు పరిస్థితులను గమనిస్తున్నారన్నారు. బిహార్లోనూ ప్రకంపనలుబిహార్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. ముఖ్యంగా శివాన్ చుట్టుపక్కల జిల్లాల్లో భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. శివాన్లో ఉదయం 8 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలను గుర్తించామని ఎన్సీఎస్ తెలిపింది. భూకంపం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. సివాన్లో ప్రకంపనలతో భయకంపితులైన జనం ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.తరచూ ఎందుకు?ఢిల్లీలో భూకంపాలు అసా ధారణమేం కాదు. ఢిల్లీ ప్రాంతం క్రియా శీల భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. హిమాలయాలకు దగ్గరగా ఉండటంతోపాటు ప్రపంచంలో అత్యంత భూకంప చురుకైన ప్రాంతాలలో ఒకటిగా ఉంది. కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ఆవలి హిమాలయ పర్వతాలకు ఇవతలి వైపు హిమాలయాలకు మధ్య నెలకొన్న ఒత్తిడి( మెయిర్ బౌండరీ థ్రస్ట్–ఎంబీటీ) అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఢిల్లీ–హరిద్వార్ రిడ్జ్, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫాల్ట్, మొరాదాబాద్ ఫాల్ట్, సోహ్నా ఫాల్ట్, యమునా నదీ రేఖతో సహా అనేక భూకంప అనుకూల ప్రాంతాలు దేశరాజధాని భూభాగానికి సమీపంలో ఉన్నాయి. దీంతో భూకంపాల తీవ్రత అధికం. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం ఢిల్లీ భూకంప జోన్–4లో ఉంది. జోన్–4 అంటే భూకంపాల ప్రమాదం ఎక్కువ ఉంటుందని అర్థం. ఇలాంటి జోన్లో భూకంపాలు సాధారణంగా రిక్టర్ స్కేల్పై ఐదు లేదా ఆరు తీవ్రతతో వస్తాయి. అప్పు డప్పుడు ఏడు లేదా 8 తీవ్రతతో సంభవిస్తాయి. అయితే ఈ జోన్ పరిధి∙నిరంతరం మారు తూ ఉంటుంది. రిక్టర్ స్కేల్పై నాలుగుగా నమోదైనాసోమవారం రిక్టర్ స్కేల్పై కేవలం 4 తీవ్రతతో సంభవించినప్పటికీ దాని ప్రభావం మాత్రం తీవ్రంగా కనిపించింది. అందుకు కారణం ఉంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వస్తాయి. భూకంపం పుట్టిన ప్రదేశంలో దాని శక్తి తీవ్రంగా ఉంటుంది. దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రకంపనలు బలహీ నమవు తాయి. నేల రకం వంటి స్థానిక భౌగోళిక పరిస్థితులు కూడా కదలికల్లో హెచ్చు తగ్గులకు కారణ మవుతాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ విషయానికొస్తే భూఉపరి తలానికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇది నగరం అంతటా బలమైన ప్రకంపనలను సృష్టించింది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి ఉత్తర ప్రాంతాల్లో సంభవించే భూకంపాల వల్ల ఢిల్లీలో స్వల్ప కదలికలు న మోదవుతాయి. అయితే, సోమవారం æ భూకంప కేంద్రం ఢిల్లీ సమీపంలో ఉండటంతో ఢిల్లీ–ఎన్సీఆర్లో మరింత తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీలో భూకంపం
-
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం
-
ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం
-
ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో ఆదివారం ఉదయం 10:40 గంటల సమయంలో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సింగన్నపాలెం, మారెళ్లలోనూ భూమి కంపించింది. దీంతో, భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక, శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లురులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శనివారం రిక్టార్ స్కేల్పై 3.1 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. కాగా, గత మూడేళ్ల కాలంలో ఇక్కడ వరుసగా భూ ప్రకంపనలు వస్తున్నాయి. దీంతో, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో మళ్లీ కంపించిన భూమి.. ఎక్కడంటే?
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మండ్లమ్మురు, తాళ్లూరు మండలాల్లో పలు చోట్లు శనివారం ఉదయం భూమి కంపించింది. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని మండ్లమ్మురు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించింది. ఈ రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు వచ్చాయి. అదే సమయంలో ఏపీలో విశాఖ సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. -
అది భూకంపం కాదు.. బాంబు దాడే!
నియంత పాలకుడి పీడ విరగడైందన్న సిరియా ప్రజల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఓపక్క ప్రభుత్వ ఏర్పాటునకు తిరుగుబాటు దళాలు కొర్రీలు పెడుతున్న వేళ.. మరోవైపు మిలిటరీ స్థావరాలు, ఆయుధ కారాగార ధ్వంసం పేరిట ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు ఆ దేశ ప్రజలు. తాజాగా..తాజాగా.. టార్టస్ రీజియన్లో భూమి కంపించినంత పనైంది. రిక్టర్ స్కేల్పై 3 తీవ్రత నమోదైంది. అది భూకంపం అని భావించినవారందరికీ.. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్స్ రైట్స్ షాకిచ్చింది. ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడి అని ప్రకటించింది.వైమానిక దాడుల్లో భాగంగా.. స్థావరాలపై బాంబులు ప్రయోగించాయి ఇజ్రాయెల్ బలగాలు. ఆ ప్రభావంతో.. అగ్ని గోళం తరహాలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భూమి కంపించినంత పనైంది. 2012 నుంచి ఇప్పటిదాకా సిరియా తీరం వెంట ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో.. అతిపెద్ద దాడి ఇదేనని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్స్ రైట్స్ ప్రకటించింది. 23వ ఎయిర్ ఢిపెన్స్ బ్రిగేడ్ బేస్పై జరిగిన దాడిగా ఇది తెలుస్తోంది. JUST IN: 🇮🇱 Israel continues to conduct airstrikes in Syria. pic.twitter.com/06nQDxz3Fw— BRICS News (@BRICSinfo) December 15, 2024 ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇది భూకంపం కంటే రెండు రేట్ల వేగంతో ప్రయాణించిందట. అలా.. 800 కిలోమీటర్ల దూరంలోని టర్కీ నగరం ఇస్నిక్లోని భూకంప కేంద్రం ఈ తీవ్రతను గుర్తించడం గమనార్హం.Thank you, @CeciliaSykala . The #explosion of the ammunition depot at #Tartus , Syria was detected at Iznik, Türkiye magnetometer station 820 km away. Signal took 12 minutes to travel in the lower ionosphere. That's about twice as fast as earthquake signals travel. https://t.co/rs2nH1wtwL pic.twitter.com/3u4KYbD57f— Richard Cordaro (@rrichcord) December 16, 2024ఇక.. సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చాలాకాలంగానే కొనసాగుతున్నాయి. హెజ్బొల్లాకు అత్యాధునిక ఆయుధాలు చేరకుండా ఉండేందుకే వైమానిక దాడులతో నాశనం చేస్తున్నామని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. సిరియాతో యుద్ధం మా అభిమతం కాదు. కానీ, మా దేశ భద్రతకు ముప్పు వాటిల్లో అంశంపై.. మరీ ముఖ్యంగా ఉత్తర సరిహద్దుపైనే మా దృష్టి ఉంది అని బెంజిమన్ నెతన్యాహూ చెబుతున్నారు. మరోవైపు.. సిరియాకు ఆయుధ సహకారం అందించిన రష్యా.. తాజా పరిణామాలతో తన స్థావరాలను ఖాళీ చేస్తోంది. తాజాగా దాడి జరిగిన స్థావరం కూడా రష్యాకు చెందినదే అనే ప్రచారం నడుస్తోంది. -
మహబూబ్ నగర్లో కంపించిన భూమి
మహబూబ్నగర్, సాక్షి: తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. ఈసారి మహబూబ్ నగర్లో స్వల్పస్థాయిలో భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్పై 3 తీవ్రతతో నమోదైందని అధికారులు వెల్లడించారు.శనివారం మధ్యాహ్నాం 1గం.22ని. ప్రాంతంలో దాసరిపల్లి పరిధిలో భూమి కంపించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో.. జూరాల ప్రాజెక్టు ఎగువన, దిగువన భూమి కంపించింది. తాజాగా.. ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం గోదావరి తీర ప్రాంతం వెంట.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కనిపించింది. అలాగే హైదరాబాద్తో పాటు ఏపీలోని కొన్ని చోట్ల కూడా కొన్నిసెకన్లపాటు భూమి కంపించడం గమనార్హం.ఇదీ చదవండి: తెలంగాణను వణికించిన భూకంపం! -
మరోసారి అమెరికాను వణికించిన భూకంపం
-
తెలుగు రాష్ట్రాల వెన్నులో వణుకు పుట్టించిన భూకంపం
-
ఏమిటీ సీస్మిక్ జోన్లు.. మనం ఎక్కడున్నాం?
భూకంపాలు వచ్చేందు కు అవకాశం ఉండే ప్రాంతాలను సీస్మిక్ జోన్లుగా పేర్కొంటారు. భూమి లోపలి పొరల పరిస్థితి, వాటి మధ్య ఖాళీలు, పగుళ్లు, కదలికలు వచ్చే అవకాశం వంటి అంశా లను పరిశీలించి వీటిని.. ఎంత స్థాయిలో ప్రకంపనలు రావొచ్చనేది అంచనా వేస్తారు. ఆ తీవ్రతను బట్టి ఒకటి నుంచి ఐదు వరకు జోన్లుగా విభజిస్తారు. జోన్–1లో ఉంటే అత్యంత స్వల్ప స్థాయిలో... జోన్–5లో ఉంటే తీవ్ర స్థాయిలో తరచూ భూకంపాలు వచ్చే ప్రాంతం అని చెప్పవచ్చు.రాష్ట్రంలో భూకంప జోన్లు ఇలా..జోన్–1: అతి స్వల్ప స్థాయిలో ప్రకంపనలకు అవకాశం ఉండే ప్రాంతాలు. ఇక్కడ ప్రకంపనలు వచ్చినా మనం గుర్తించలేనంత స్వల్పంగా ఉంటాయి.జోన్–2: ప్రకంపనల తీవ్రత 0.1 నుంచి నాలుగు పాయింట్ల వరకు ఉండే ప్రాంతాలివి. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, నిజామాబాద్, నల్లగొండతోపాటు ఏపీలోని కర్నూల్, నంద్యాల, అనంతపురం ప్రాంతాల వరకు జోన్–2లో ఉన్నాయి. ఇక్కడ వచ్చే ప్రకంపనలతో దాదాపుగా ఎలాంటి నష్టం ఉండదు.జోన్–3:భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 నుంచి 6 వరకు నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలివి. మహారాష్ట్రలో చంద్రాపూర్ నుంచి మొదలై ఉత్తర తెలంగాణలో గోదావరి నది వెంట ఉన్న రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి, బెల్లంపల్లి, భద్రాచలం, ఖమ్మంతోపాటు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, ఒంగోలు, నెల్లూరు తదతర ప్రాంతాలు జోన్–3 పరిధిలోకి వస్తాయి. దేశంలో చూస్తే పశ్చిమ తీర ప్రాంతాలు, గంగా, యమునా నది పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడి భూకంపాలతో కొంత వరకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.జోన్–4:భూప్రకంపనల తీవ్రత 6 నుంచి 7 పాయింట్ల వరకు ఉండే ప్రాంతాలివి. ముంబై సహా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ వంటివి జోన్–4లో ఉన్నాయి. ఇక్కడ భారీ భూకంపాలు, తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.జోన్–5: భూకంపాల తీవ్రత 7 పాయింట్లు, అంతకు మించి వచ్చే ప్రమాదమున్న ప్రాంతాలివి. హిమాలయ పర్వత ప్రాంతాలు, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్ రాష్ట్రంలోని కొంత భాగం దీని పరిధిలో ఉన్నాయి. ఇక్కడ వచ్చే భూకంపాలు అత్యంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. -
వరదలు.. పెనుగాలులు.. భూకంపం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు నిలయంగా మారుతున్నాయి. కొన్నేళ్ల నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ఏటా ఏదో ఒక విపత్తు ఎదురవుతోంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా అతి భారీ వర్షాలు, వరదలు, పెనుగాలులు టోర్నడోలు, ఇప్పుడు భూకంపం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.అతి భారీ వర్షాలతో..2022 జూలై 14 నుంచి 16 వరకు ఈ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. ఏ క్షణమైనా కరకట్ట కొట్టుకుపోయి భద్రాచలం మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. 2023 జూలై 27న భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఒక్కరోజే 64.9 సెంటీమీటర్ల వాన పడింది. అందులో కేవలం మూడు గంటల్లోనే 46.4 సెంటీమీటర్ల అతి భారీ వాన పడింది. అదేరోజు జయశంకర్ జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 31న నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షంపడి మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులకు కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఖమ్మం పట్టణం, పరిసర గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.లక్ష చెట్లను కూల్చేసిన పెనుగాలులుఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల మధ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తీవ్ర పెను సుడిగాలులు వీచాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో ఏకంగా 334 హెక్టార్ల పరిధిలో లక్ష వరకు చెట్లు కూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వాయు విధ్వంసానికి కారణాలను ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేదు. ఇక్కడే భూకంప కేంద్రాలురాష్ట్రంలోని సిర్పూర్, జైనూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, వరంగల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలు భూకంప సీస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్నాయి. బొగ్గు గనులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ భూమి నుంచి భారీ శబ్దాలు రావడం సాధారణంగా మారిపోయింది. ఇదే ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పుడు 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో మణుగూరులో స్వల్ప స్థాయిలో మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి కూడా. భారీగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు తవ్వకాలు, గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు వంటివి విపత్తులకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. వేడి నీటిబుగ్గలకూ కేంద్రంములుగు జిల్లాలోని రామన్నగూడెం ప్రాంతంలో వేడి నీటిబుగ్గలు ఉన్నాయి. 1954లో ఇక్కడ చమురు నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరిపి వదిలేసిన బోరులోనుంచి ఇప్పటికీ వేడి నీళ్లు వెలువడుతూ ఉన్నాయి. భూమి పొరల్లో పగుళ్ల వల్ల నీళ్లు మరింత లోతుకు వెళ్లి... అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడై పైకి ఉబికివస్తాయని నిపుణులు చెబుతున్నారు.మానవ తప్పిదాలపై ప్రకృతి హెచ్చరికలివి!మానవ తప్పిదాలపై ప్రకృతి చేసిన హెచ్చరికలను మనం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం తాడ్వాయి అడవుల్లో టోర్నడోల తీవ్రత కారణంగా లక్ష చెట్లు నేలకొరిగినప్పుడే భూకంపాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ఘటన జరిగాక కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వం, వర్సిటీలు, ఎన్జీఆర్ వంటి సంస్థలు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. మనం గోదావరి బెల్ట్ను నాశనం చేశాం. ప్రాజెక్టుల కోసం అడవులు నరికేశాం. భూమి లోపల పొరలు ఎలా ఉన్నాయి? డ్యామ్ల వల్ల వాటికి ఏ మేరకు నష్టం అన్నది సాంకేతికంగా పరిశీలించలేదు. అది భూకంపాలకు కారణమవుతోంది.– పాకనాటి దామోదర్రెడ్డి, పర్యావరణవేత్త -
వరదలు.. పెనుగాలులు.. భూకంపం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు నిలయంగా మారుతున్నాయి. కొన్నేళ్ల నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ఏటా ఏదో ఒక విపత్తు ఎదురవుతోంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా అతి భారీ వర్షాలు, వరదలు, పెనుగాలులు టోర్నడోలు, ఇప్పుడు భూకంపం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.అతి భారీ వర్షాలతో..2022 జూలై 14 నుంచి 16 వరకు ఈ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. ఏ క్షణమైనా కరకట్ట కొట్టుకుపోయి భద్రాచలం మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. 2023 జూలై 27న భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఒక్కరోజే 64.9 సెంటీమీటర్ల వాన పడింది. అందులో కేవలం మూడు గంటల్లోనే 46.4 సెంటీమీటర్ల అతి భారీ వాన పడింది. అదేరోజు జయశంకర్ జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 31న నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షంపడి మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులకు కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఖమ్మం పట్టణం, పరిసర గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.లక్ష చెట్లను కూల్చేసిన పెనుగాలులుఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల మధ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తీవ్ర పెను సుడిగాలులు వీచాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో ఏకంగా 334 హెక్టార్ల పరిధిలో లక్ష వరకు చెట్లు కూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వాయు విధ్వంసానికి కారణాలను ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేదు. ఇక్కడే భూకంప కేంద్రాలురాష్ట్రంలోని సిర్పూర్, జైనూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, వరంగల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలు భూకంప సీస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్నాయి. బొగ్గు గనులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ భూమి నుంచి భారీ శబ్దాలు రావడం సాధారణంగా మారిపోయింది. ఇదే ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పుడు 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో మణుగూరులో స్వల్ప స్థాయిలో మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి కూడా. భారీగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు తవ్వకాలు, గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు వంటివి విపత్తులకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.వేడి నీటిబుగ్గలకూ కేంద్రంములుగు జిల్లాలోని రామన్నగూడెం ప్రాంతంలో వేడి నీటిబుగ్గలు ఉన్నాయి. 1954లో ఇక్కడ చమురు నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరిపి వదిలేసిన బోరులోనుంచి ఇప్పటికీ వేడి నీళ్లు వెలువడుతూ ఉన్నాయి. భూమి పొరల్లో పగుళ్ల వల్ల నీళ్లు మరింత లోతుకు వెళ్లి... అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడై పైకి ఉబికివస్తాయని నిపుణులు చెబుతున్నారు.మానవ తప్పిదాలపై ప్రకృతి హెచ్చరికలివి!మానవ తప్పిదాలపై ప్రకృతి చేసిన హెచ్చరికలను మనం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం తాడ్వాయి అడవుల్లో టోర్నడోల తీవ్రత కారణంగా లక్ష చెట్లు నేలకొరిగినప్పుడే భూకంపాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ఘటన జరిగాక కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వం, వర్సిటీలు, ఎన్జీఆర్ వంటి సంస్థలు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. మనం గోదావరి బెల్ట్ను నాశనం చేశాం. ప్రాజెక్టుల కోసం అడవులు నరికేశాం. భూమి లోపల పొరలు ఎలా ఉన్నాయి? డ్యామ్ల వల్ల వాటికి ఏ మేరకు నష్టం అన్నది సాంకేతికంగా పరిశీలించలేదు. అది భూకంపాలకు కారణమవుతోంది.– పాకనాటి దామోదర్రెడ్డి, పర్యావరణవేత్త -
మేడారంలో భూకంపం!
సాక్షి, హైదరాబాద్/ ములుగు/ ఏటూరునాగారం/ సాక్షి నెట్వర్క్: బుధవారం ఉదయం.. సమయం 7.27 గంటలు.. ములుగు జిల్లా మేడారంలోని దట్టమైన అటవీ ప్రాంతం.. ఉన్నట్టుండి ఏదో కలకలం.. ఒక్కసారిగా అంతా ఊగిపోవడం మొదలైంది.. నిమిషాల్లోనే ఇది వందల కిలోమీటర్ల దూరం వ్యాపించింది. ముఖ్యంగా గోదావరి నది పరీవాహక ప్రాంతమంతటా విస్తరించింది. తమ చుట్టూ ఉన్నవన్నీ ఊగిపోతున్నట్టుగా కనిపించడంతో జనం గందరగోళానికి గురయ్యారు.. మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం ఇది. ఇక్కడ రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ – ఎన్సీఎస్) ప్రకటించింది. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఇంతకుముందు 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు అదేస్థాయిలో ప్రకంపనలు రావడం గమనార్హం. అయితే భూకంపాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉన్న జోన్–2, 3ల పరిధిలో తెలంగాణ ఉందని... ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ‘నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’శాస్త్రవేత్తలు తెలిపారు. కంపించిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం వద్ద ప్రభావం ఎక్కువగా కనిపించింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలపై భక్తులు, పూజారులు ఉన్న సమయంలో వచ్చిన ప్రకంపనలతో.. అమ్మవార్ల హుండీలు, పల్లెం, ఇతర సామగ్రి కదలిపోయాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి కూడా. బుధవారం మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 4న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నడోలతో వేలాది చెట్లు నేలమట్టం కావడానికి.. ఇప్పుడు వచ్చిన భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని, దీనిపై అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావం మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు భూకంపం రాగా.. సుమారు రెండు, మూడు నిమిషాల తర్వాత దూర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. భూకంప కేంద్రం నుంచి చుట్టూ సుమారు 225 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాయి. ఏపీలో ఎనీ్టఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్పంగా రెండు, మూడు సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెబ్సైట్, భూకంప్ మొబైల్యాప్ ద్వారా వెల్లడైంది. ఇది రెండో పెద్ద భూకంపం... గోదావరి నది పరీవాహక ప్రాంతం వెంబడి రిక్టర్ స్కేల్పై 2 నుంచి 4 తీవ్రత వరకు భూకంపాలు వచ్చినా.. ఇలా 5 పాయింట్లకు పైన తీవ్రత ఉండటం అరుదని నిపుణులు చెబుతున్నారు. 1969 జూలై 5న భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపమే పెద్దది. 1983లో మేడ్చల్లో 4.8, 2021లో పులిచింతలలో 4.6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు మేడారంలో వచ్చిన భూకంపం గత 55 ఏళ్లలో రెండో పెద్దదిగా రికార్డయింది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి చూస్తే... ఇది నాలుగో అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. సమ్మక్క, సారలమ్మ మహిమ అనుకున్నాం.. మేడారంలోని సారలమ్మ గద్దె వద్ద ఉదయం పూజలు చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మవార్ల గద్దెలు, గ్రిల్స్ ఊగడం మొదలుపెట్టాయి. రెండు, మూడు సెకన్లు గద్దెలు కదిలాయి. భయాందోళనకు గురయ్యా. ఇది సమ్మక్క, సారలమ్మ తల్లుల మహిమ అనుకున్నా.. తర్వాత భూకంపం అని తెలిసింది. – కాక కిరణ్, సారలమ్మ, పూజారి దేశంలోనే సురక్షిత ప్రాంతం హైదరాబాద్ భూకంపాల విషయంలో దేశంలోనే అత్యంత సురక్షిత ప్రదేశం హైదరాబాద్. తెలంగాణలోని చాలా ప్రాంతాలు దక్కన్ పీఠభూమిపై ఉండటంతో భూకంపాల ప్రమాదం చాలా తక్కువ. సాధారణంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకింత సేఫ్జోన్లోనే ఉన్నాయి. అయితే గోదావరి నదికి దగ్గరిలోని పరీవాహక ప్రాంతాల్లో తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుంది. వేల ఏళ్లుగా నది ప్రవాహం వల్ల భూగర్భంలో ఏర్పడే పగుళ్లు (ఫాల్ట్స్) దీనికి కారణం. 5 పాయింట్లలోపు వచ్చే భూకంపాలతో ప్రమాదమేమీ ఉండదు. భవనాలు ఊగడం, పగుళ్లురావడం వంటివి జరగొచ్చు. ఆరు, ఏడు పాయింట్లు దాటితేనే భవనాలు కూలిపోతాయి. – పూర్ణచంద్రరావు, పూర్వ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఇక్కడ తరచూ ప్రకంపనలు సాధారణమే.. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో తరచూ మనం గమనించలేనంత స్వల్ప స్థాయిలో భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఈ జోన్ పరిధిలో రిక్టర్ స్కేల్పై 6 పాయింట్ల వరకు భూకంపాలు వచ్చే వీలుంది. జియోలాజికల్, టెక్టానిక్ యాక్టివిటీని బట్టి తెలంగాణ జోన్–2, జోన్–3ల పరిధిలో ఉంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు జోన్–2లోకి వస్తాయి. ఇప్పుడు భూకంపం సంభవించిన ప్రాంతం జోన్–3లో ఉంది. ఏపీలోని ప్రకాశం, ఒంగోలు, అద్దంకి వంటివి కూడా జోన్–3లోనే ఉన్నాయి. – ఎం.శేఖర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్జీఆర్ఐ భూమి పొరల్లో సర్దుబాటుతోనే.. భూమి లోపలి పొరల్లో అసమతౌల్యత ఉంటే సర్దుబాటు అయ్యే క్రమంలో భూకంపాలు వస్తాయి. మేడారం భూకంపం అలాంటిదే. నేల పొరల్లో సర్దుబాటు పూర్తయ్యే వరకు కంపనాలు వస్తూ ఉంటాయి. గతంలో సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల్లో హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు లినియమెంట్ ఉన్నట్టు తేలింది. అయితే భారీ వర్షాలు, పెనుగాలులకు భూకంపాలకు సంబంధం లేదు. వాటికి గ్లోబల్ వార్మింగ్ వంటి వాతావరణ మార్పులే కారణం. ఈ ఏడాది ఉత్తరార్ధ గోళంలో భీకర వర్షాలు కురిశాయి. దుబాయ్ వంటి ఎడారి దేశాల్లో వరదలు వచ్చాయి. – చకిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సర్వే ఆఫ్ ఇండియా -
55 ఏళ్ల తర్వాత ఆ రేంజ్లో.. భయపెట్టిన భూకంపం!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల వెన్నులో ఇవాళ(బుధవారం, డిసెంబర్ 4 2024) స్వల్ప భూకంపం వణుకు పుట్టించింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు.. బయటకు పరుగులు తీశారు. మీడియా కథనాలతో తమవారి క్షేమసమాచారం గురించి.. ప్రకంపనల గురించి ఆరాలు తీస్తూ కనిపించారు. మరోపక్క.. మళ్లీ భూకంపం రావొచ్చన్న వదంతుల నడుమ చాలా గ్రామాల్లో ప్రజలు సాయంత్రం దాకా రోడ్ల మీదే గడుపుతూ కనిపించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని, తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు హైదరాబాద్లోని సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించిందన్నారు.ఆస్తి, ప్రాణ నష్టం నమోదు కాలేదని ప్రకటించారు.👉హైదరాబాద్ సహా ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.👉1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారు 50 ఏళ్ల తర్వాత నేడు ఆ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని తెలిపారు. 👉హైదరాబాద్, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్-3లో ఉన్నాయన్నారు. కానీ, జోన్-5లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. దీంతో.. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.👉ములుగు నుంచి 50 కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఏటూరు నాగారం భూకంప కేంద్రంలో రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రతగా భూకంపం నమోదైంది. గతంలో 1969, 2018లో కొత్తగూడెం, భద్రాచలంలో భూ ప్రకంపనలు వచ్చాయి.👉తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై తెలంగాణ విపత్తు నిర్వహణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ములుగు జిల్లా మేడారం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. భూమికి 40 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉన్నందున ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఎలాంటి నష్టం జరగలేదని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, వదంతులు నమ్మొద్దని తెలిపింది. -
‘మళ్లీ భూ ప్రకంపనలు’.. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చక్కర్లు
జయశంకర్, సాక్షి: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా.. ఆఖరికి ఫోన్లలో మాట్లాడిన ఈ ఉదయంపూట సంభవించిన భూ ప్రకంపనల గురించే చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ లోని కాటారం , మల్హార్ రావు, మహముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో నాలుగు సెకండ్ల పాటు కంపించిన భూమి.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే..ఇది చర్చ వరకే పరిమితం కాలేదు. ‘‘మళ్లీ భూకంపం వస్తోందంటూ..’’ సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్.. వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. దీంతో జనం హడలిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపై కూర్చుని.. భూకంపం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన పోలీసులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వణికిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో భూకంప తీవ్రత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అలాగే.. రంగాపురం గ్రామంలోని ఓ ఇంటి పెంకులు ఊడిపడిపోవడంతో.. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. తమ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు చూడలేదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం సేఫ్ జోన్గానే ఉందని, స్వల్ప ప్రకంపనలకు భయపడనక్కర్లేదని, భారీ భూకంపాలు అసలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ భూకంపాల సంభవించే అవకాశాలపై.. అలాగే వీక్ జోన్ల పరిశీలనపై తమ అధ్యయనం కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.20 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై భూకంపం!.. చిత్రాల కోసం క్లిక్ చేయండి -
భాగ్యనగరంలో భూకంపం.. ఉలిక్కిపడ్డ నగరవాసులు
-
తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి.. 20 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
-
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, జగ్గయ్యపేట.. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో సహా హైదరాబాద్లో కూడా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7:27 గంటలకు రెండు నిమిషాల పాటు భూమి కంపించింది. దీంతో, ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. కాగా, ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు స్టేట్స్లో ఇలా భూమి కంపించడం గమనార్హం. ఈ మేరకు సీఎస్ఐఆర్ ఓ ఫొటోను విడుదల చేసింది. Got a whatsapp forward video from Bhadrachalam, Telangana. A strong one 😮Credits to respective owner pic.twitter.com/i3OR9wFfM4— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024 వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్, రాజేంద్రనగర్ సహా రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలోని చాలా జిలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అటు, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూమి కంపించింది. ఖమ్మంలోకి నేలకొండపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలోని చుండడ్రుగొండలో బుధవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు తెలిపారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.For the first time in last 20years, one of the strongest earthquake occured in Telangana with 5.3 magnitude earthquake at Mulugu as epicentre.Entire Telangana including Hyderabad too felt the tremors. Once again earthquake at Godavari river bed, but a pretty strong one 😮 pic.twitter.com/RHyG3pkQyJ— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూమి కంపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. దీంతో, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే, కేససముద్రం, మహబూబాబాద్, బయ్యారంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే, వరంగల్లోని పలు ప్రాంతాల్లో 5 నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించిన భూమి. దీంతో, భయాందోళనలో స్థానికులు ఉన్నాయి. భూమి కంపించడంపై ఉదయాన్నే సిటి మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, తిరువూరు, నందిగామ, గుడివాడ, మంగళగిరి, జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్టు చెబుతున్నారు. బుధవారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. -
ఇరాన్ భూగర్భ అణుపరీక్షలు?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పరాకాష్టకు తీసుకెళ్తోందా? అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5న శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 ప్రాంతంలో ఇరాన్లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా భూ¿ౌతిక సర్వే విభాగం ధ్రువీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్లోనూ ప్రకంపనలు కన్పించాయి.యి. ఇది భూకంపం కాదని, కచి్చతంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంట్కు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూ కంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కి.మీ. లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు. -
జపాన్లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
టోక్యో: జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించటంతో.. జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పెద్దగా ప్రకంపనలు చోటుచేసుకొనప్పటికీ.. భూకంపం సంభవించిన 40 నిమిషాల్లోనే ఇజు దీవుల్లోని హచిజో ద్వీపంలో దాదాపు 50 సెంటీమీటర్ల అతి చిన్న సునామీ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, సముద్రపు నీరు ఒక మీటరు ఎత్తులో ఎగసిపడితే సునామి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.All tsunami warnings lifted for Japan's Izu and Ogasawara islands after earlier 5.6 magnitude earthquake https://t.co/bWfknc7WAj— Factal News (@factal) September 24, 2024క్రెడిట్స్: Factal Newsఈ క్రమంలోనే అధికారులు.. ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్లో గత రెండు నెలల్లో అనేక చిన్న భూకంపాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబరు 23న తైవాన్లో 4.8 తీవ్రత, సెప్టెంబర్ 22న ఎహిమ్లో 4.9 తీవ్రత, సెప్టెంబర్ 21న చిబాలో 4.6 తీవ్రతతో చిన్న భూకంపాలు సంభవించాయి.చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది -
Russia: రష్యాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఇది చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏడుగా నమోదైంది. భూకంప కేంద్రం తూర్పు కంచట్కా ద్వీపకల్ప తీరంలో ఉందని వెల్లడయ్యింది. ఈ భూకంపం దరిమిలా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు.భూకంపం అంటే భూమిలోని క్రస్ట్ పొరలో అకస్మాత్తుగా విడుదలయ్యే ఒత్తిడి శక్తి. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు ప్రకంపనలు పుట్టించే తరంగాలు విడుదలవుతాయి. క్రస్ట్లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు అది బలహీన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా భూకంపాలు ఏర్పడుతాయి. అయితే భూకంప తీవ్రత అధికంగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకూ విస్తరిస్తాయి. Magnitude 7.0 earthquake strikes off #Russia, tsunami warning issued: #US monitors. https://t.co/eLyx1YCU4L pic.twitter.com/wWvMMnmKZb— Arab News (@arabnews) August 17, 2024 -
జపాన్ను కుదిపేసిన తీవ్ర భూకంపం
టోక్యో: జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. క్యుషు దీవిలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూమికి సుమారు 30 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిచినన్ నగరంతోపాటు మియజాకి ప్రిఫెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది. భూకంప కేంద్రానికి సమీపంలోని మియజాకి విమానాశ్రయంలో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు రన్వేను మూసివేశారు. పొరుగునే ఉన్న కగోíÙయా ప్రిఫెక్చర్లోని ఒసాకిలో కాంక్రీట్ గోడలు ధ్వంసమయ్యాయి. క్యుషు, షికోకు దీవుల తీరం వెంబడి అలలు సుమారు 1.6 అడుగుల ఎత్తున సుమారు అరగంటసేపు ఎగిసిపడ్డాయి. దీంతో, అధికారులు ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలిచ్చారు. భూకంపం తాకిడితో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. -
జపాన్లో భారీ భూకంపం
జపాన్లోభారీ భూకంపం సంభవించింది. దక్షిణ ద్వీపం క్యుషు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్స్కేల్పై తొలిసారి 6.9 తీవ్రతతో, రెండోసారి 7.1 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది . జపాన్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ జపాన్లోని క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉంది.ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.అదే విధంగా జపాన్కు వాతావరణ శాత సునామీ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దీవులైన క్యుషు, షికోకులోని పసిఫిక్ తీరంలో సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సముద్రం, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్జెడ్) వెల్లడించింది.యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. -
USA Earthquake: కాలిఫోర్నియాలో భూకంపం.. 4.9 తీవ్రత నమోదు
అమెరికాలోని కాలిఫోర్నియాలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. లాస్ ఏంజెల్స్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం బార్స్టో సమీపంలో ఉంది. కాలిఫోర్నియాలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విపత్తు కారణంగా చోటుచేసుకున్న ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు.యూఎస్ టుడే అందించిన వివరాల ప్రకారం శాన్ బెర్నార్డిగో కౌంటీతో పాటు, లాస్ ఏంజిల్స్, కెర్న్, రివర్సైడ్, ఆరెంజ్ కౌంటీలలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. కాలిఫోర్నియాలోని ప్రజలు భూకంపానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే వారి అనుభవాలను తెలియజేశారు.భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని బార్స్టో ఫైర్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్ బెటాలియన్ చీఫ్ ట్రావిస్ ఎస్పినోజా తెలిపారు. లాంగ్ బీచ్ మేయర్ రెక్స్ తన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటివరకు నగరంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదన్నారు. -
జమ్ముకశ్మీర్లో భూకంపం.. 3.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) విడుదల చేసిన సమాచారం ప్రకారం జమ్ము కాశ్మీర్లో శనివారం సాయంత్రం 5.34 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అయితే దీని కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.జమ్ముకాశ్మీర్లో సంభవించే తేలికపాటి భూకపాలు కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం కిష్త్వార్ ప్రాంతంలో ఉందని అధికారులు తెలిపారు. భూమికి 10 కి.మీ లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కశ్మీర్ లోయ కూడా ఒకటి. గతంలో ప్రకృతి ప్రకోపానికి ఈ ప్రాంతం బలయ్యింది.2005లో కశ్మీర్ లోయలో సంభవించిన భూకంపాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేదు. ఆ ఏడాది అక్టోబర్ 8న ఇక్కడ బలమైన భూకంపం వచ్చింది. దీని ప్రభావానికి 69 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 75 వేల మంది గాయపడ్డారు. నాడు భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. -
ఫిలిప్పీన్స్లో 7.1 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్లో ఈరోజు(గురువారం)బలమైన భూకంపం సంభవించింది. సోక్స్సర్జెన్కు 106 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలెబ్స్ సముద్రంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపం లోతు 620 కిలోమీటర్లు.భూకంపం ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపించినప్పటికీ భారీగా నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ వార్తలు లేవు. అలాగే భూకంపం తర్వాత ప్రభుత్వం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఫిలిప్పీన్స్లోని మిండానావోలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. EQ of M: 6.7, On: 11/07/2024 07:43:18 IST, Lat: 6.02 N, Long: 123.31 E, Depth: 650 Km, Location: Mindanao Philippines. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/d5AEc6OJZP— National Center for Seismology (@NCS_Earthquake) July 11, 2024 -
ఇరాన్లో భూకంపం.. నలుగురు మృతి
ఇరాన్లోని కష్మార్లో భూకంపం సంభవించంది. ఈ విపత్తులో నలుగురు మృతిచెందారు. 120 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదయ్యింది. భూకంపం కారణంగా మృతిచెందివారి వారి సంఖ్యను కష్మార్ గవర్నర్ హజతుల్లా షరీయత్మదారి ధృవీకరించారు.భూకంపం బారినపడి తీవ్రంగా గాయపడిన 35 మంది బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. భూకంపం కారణంగా కష్మార్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాత భవనాలు దెబ్బతిన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ళు) లోతులో సంభవించింది. ఇరాన్ టెలివిజన్ భూకంపం ఫుటేజీని ప్రసారం చేసింది. దానిలో కొన్ని భవనాలు బీటలువారడం కనిపిస్తుంది. అలాగే కార్మికులు భవన శిధిలాలను తొలగిస్తున్న దృశ్యాలను కూడా చూపించారు.ఇరాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో టర్కీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, ముగ్గురు మృతిచెందారు. 800 మందికి పైగా జనం గాయపడ్డారు. కాగా 2003లో ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. బామ్ నగరంలో 6.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 31వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. -
దక్షిణ కొరియాలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు
దక్షిణ కొరియాలో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు బువాన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. ఈ వివరాలను వాతావరణ శాఖ మీడియాకు తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైనట్లు పేర్కొంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ దక్షిణ కొరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే. అయితే ఈ భూకంపం కారణంగా నష్టం వాటిల్లినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదు. నార్త్ జియోల్లా ప్రావిన్స్లోని అగ్నిమాపక శాఖ అధికారి జో హే-జిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపానికి సంబంధించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి సుమారు 80 కాల్స్ వచ్చాయన్నారు. ఈ భూకంపం కారణంగా బువాన్లో ఓ ఇంటి గోడ కూలిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.భూకంపాలను వాటి తీవ్రత పరంగా వివిధ వర్గాలుగా విభజిస్తారు. 2.5 నుండి 5.4 తీవ్రతతో వచ్చే భూకంపాలు మైనర్ కేటగిరీలో ఉంటాయి. 5.5 నుండి 6 తీవ్రతతో వచ్చే భూకంపం స్వల్ప స్థాయిలో ప్రమాదకరమైన భూకంపంగా పరిగణిస్తారు. 6 నుండి 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లయితే, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 7 నుండి 7.9 తీవ్రతతో సంభవించే భూకంపాలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. -
రాజస్థాన్లో భూకంపం.. భయంతో జనం పరుగులు
రాజస్థాన్లో శనివారం అర్థరాత్రి కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. భూకంప కేంద్రం సికార్ జిల్లాలోని హర్ష పర్వతం అని తెలుస్తోంది. భూకంపం కారణంగా జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శనివారం అర్థరాత్రి 11.47 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రియాక్టర్ స్కేల్పై 4.2గా నమోదైంది. భూకంపానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం చాలాసేపు ఇళ్ల బయటనే ఉండిపోయారు. పరిస్థితి కుదుటపడ్డాక వారంతా తిరిగి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. -
పాపాయిల కోసం ప్రాణాలే అడ్డేసిన నర్సులు
తైవాన్లో వచ్చిన అతిపెద్ద భూకంపం అక్కడి ప్రజలను వణికించింది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడం ప్రకపనలు రేపింది. పెద్ద పెద్ద భవనాలు, నివాస గృహాలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా మార్గాలు స్థంభించాయి. ఈ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోను, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియో ఒకటి నెటిజనుల అభిమానాన్ని సంపాదించుకుంది. భూకంపం ప్రభావం అక్కడి ఆసుపత్రులను కూడా ప్రభావితంచేశాయి. ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న వారు, ఆపరేషన్ థియేటర్లలో ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందుకు ఆయా విభాగాల వైద్యులు, నర్సులు అప్రమత్తమవుతారు.ప్రాణాలకు తెగించి మరీ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఘటనే తైవాన్ భూంకపం సమయంలోనూ చోటు చేసుకుంది. (చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!) భూకంపం తైవాన్ను అతలాకుతలం చేస్తున్న సమయంలో స్థానిక ఆసుపత్రిలోని నర్సులు వెంటనే స్పందించారు. ఆస్పత్రి మెటర్నిటీ వార్డులో పసికందుల ప్రాణాలు కాపాడడానికి రంగంలోకి దిగారు. భూప్రకంపనలను గుర్తించిన వెంటనే పరుగు పరుగున వచ్చి ఉయ్యాలలో నిద్రపోతున్న శిశువులను రక్షించే ప్రయత్నం చేయడం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. ప్రసూతి యూనిట్లోని నలుగురు సిబ్బంది ఉయ్యాలలను కదలకుండా ఉంచడానికి, గట్టిగా పట్టుకోవడానికి కష్టపడ్డారు. ఒక పక్క బిల్డింగ్ అటూ ఇటూ ఊగుతోంది. దీనికి పసిబిడ్డలు ఉయ్యాలలూ కదిలిపోతున్నాయి. మరోవైపు కిటికీలు పగులుతాయోమోనన్న భయం. ఈ సమయంలో వారి ఆందోళన, కష్టం సీసీటీవీలో రికార్డైనాయి. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) These nurses risk their lives to literally save lives of babies during earthquake in Taiwan. Real life heros! Be safe🙏pic.twitter.com/Q8YLdSKQkJ — Nico Gagelmann (@NicoGagelmann) April 4, 2024 -
Japan Earthquake: జపాన్లో కంపించిన భూమి..
టోక్యో: తైవాన్ భూకంప ఘటన మరువకముందే తాజాగా జపాన్లో భూమి కంపించింది. గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. దీంతో, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. కాగా, తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం తైవాన్లో భూకంపం వచ్చిన మరుసటి రోజే నేడు జపాన్లో భూమి కంపించింది. హోన్షు తూర్పు తీరంలో రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్ రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 🚨🇯🇵 BREAKING: 6.3 magnitude earthquake near the east coast of Japan pic.twitter.com/Ro97HguPVZ — Kacee Allen 🇺🇸 (@KaceeRAllen) April 4, 2024 ఇదిలా ఉండగా.. తైవాన్లో బుధవారం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో 25 ఏండ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి. A dog sensed an earthquake in Taiwan seconds before it happened and alerted its owner..🐕🐾😳#Taiwan #Tsunami #Japan #TaiwanEarthquake #earthquake pic.twitter.com/10SdmUDENd — Zainab Fatima (@ZainabFati18) April 4, 2024 తైవాన్లో భూకంపం సందర్భంగా చిన్నారులను కాపాడిన నర్సులు.. ⚡️Nurses in a #Taiwan Hospital protecting babies during #earthquake.#Taiwan #earthquake #Japanpic.twitter.com/rF5It43iYO — Tajamul (@Tajamul132) April 4, 2024 -
తైవాన్లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్లో ఉంది. -
Taiwan Earthquake: తైవాన్లో భారీ భూకంపం.. జనజీవనం అతలాకుతలం (ఫొటోలు)
-
తైవాన్ లో భారీ భూకంపం
-
తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్లో దృశ్యాలు
తైవాన్లో అత్యంత భారీ భూకంపం తైవాన్ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనే భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు యోగ క్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. భూకంపం తీవ్రత దృశ్యాలు అనేక చోట రికార్డైనాయి. పలు ఆకాశహర్మ్యాలు, అనేక ఇళ్లు కూలి పోయాయి. చాలా చోట్ల రవాణా మార్గాలు దెబ్బ తిన్నాయి. మెట్రో రైలు, స్విమ్మింగ్ పూల్, దృశ్యాలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. దీంతో తూర్పు తైవాన్తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. కానీ ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. సెప్టెంబరు 1999లో సంభవించిన భూకంపానికి 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. भूकंप के समय मेट्रो के भीतर का हाल#earthquake #Taiwan pic.twitter.com/gd1dGN3BeA — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) April 3, 2024 Visuals of a Swimming Pool when the 7.4 earthquake hit Taiwan. #earthquake #Taiwan #Tsunami pic.twitter.com/YsBgfO9e2g — Aajiz Gayoor (@AajizGayoor) April 3, 2024 -
తైవాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ
తైపీ: తైవాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. -
పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు!
పపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుందని, కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్జెడ్) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతున ఉంది. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈ విపత్తులో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఏడుగురు మృతి చెందారు. -
మహారాష్ట్ర, అరుణాచల్లో భూకంపం.. భయంతో జనం పరుగులు!
మహారాష్ట్ర, అరుణాచల్లో ఈరోజు (గురువారం) ఉదయం భూమి కంపించింది. మహారాష్ట్రలోని నాందేడ్లో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాందేడ్తో పాటు పర్భానీ, హింగోలిలో భూ ప్రకంపనలు కనిపించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్లో గురువారం ఉదయం 6 గంటల 8 నిముషాలకు భూకంప సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మహారాష్ట్ర కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్లో గురువారం తెల్లవారుజామున రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1:49 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్లో ఉంది. దీని లోతు సుమారు 10 కిలోమీటర్లు. రెండవ భూకంపం 3.40 గంటలకు సంభవించింది. రెండో భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమెంగ్లో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.4గా నమోదైంది.ఈ రెండు భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
Earthquake: ఢిల్లీలో భారీ భూప్రకంపనలు
ఢిల్లీ: పొరుగు దేశం చైనాలో భారీ భూకంపంతో.. మన దేశ రాజధాని ప్రాంతం వణికిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు చోటు చేసుకోగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. చైనా దక్షిణ ప్రాంతం జిన్జియాంగ్లో రిక్టర్ స్కేల్పై 80 కిలోమీటర్ల లోతున 7.2 తీవ్రతతో భూమి కంపించింది. ఆ ప్రభావం ఢిల్లీతో పాటు ఎన్సీఆర్(National Capital Region)లోనూ కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. Earthquake of Magnitude:7.2, Occurred on 22-01-2024, 23:39:11 IST, Lat: 40.96 & Long: 78.30, Depth: 80 Km ,Location: Southern Xinjiang, China for more information Download the BhooKamp App https://t.co/FYt0ly86HX@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/E184snmSyH — National Center for Seismology (@NCS_Earthquake) January 22, 2024 ఇదిలా ఉంటే.. చైనా భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. అక్కడ వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 🔺#Breaking :A 7.1-magnitude #earthquake jolted Wushi County in Aksu Prefecture in northwest China's #Xinjiang Uygur Autonomous Region at 2:09 a.m. on Jan 23 (Beijing Time), according to the China Earthquake Networks Center. Stay Safe‼️ pic.twitter.com/GE9vkkMuCh — Record GBA (@RecordGBA) January 23, 2024 మరోవైపు.. దేశ రాజధాని ప్రాంతం తరచూ భూ ప్రకంపనలకు కేంద్రంగా ఉంటోంది. పొరుగు దేశాల్లో ఎక్కడ భూమి కంపించినా .. ఏ స్థాయిలో ప్రకంపనలు సంభవించినా.. ఆ ప్రభావం ఢిల్లీ రీజియన్లో కనిపిస్తోంది. జనవరి 11వ తేదీన ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో 6.1 తీవ్రతతో అఫ్గనిస్థాన్లో భూకంపం సంభవించగా.. పాకిస్థాన్తో పాటు ఢిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అంతకు ముందు నేపాల్ భూకంప ప్రభావమూ కనిపించింది. -
ఆఫ్గనిస్థాన్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదు
కాబూల్: ఆఫ్గనిస్థాన్లో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమి లోపల 17 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా తెలియదు. గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఆఫ్ఘనిస్థాన్లో ఇదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఇదీ చదవండి: హౌతీలపై అమెరికా మిత్రపక్షాల వైమానిక దాడులు -
ఉత్తర భారత్ను వణించిన భూకంపం..
న్యూఢిల్లీ: ఉత్తర భారతం భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ రీజియన్, పంజాబ్, ఘజియాబాద్ జమ్ము కశ్మీర్లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఈ ప్రభావం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Another Earthquake in Islamabad Pray for everyone safety#Earthquake #Islamabad pic.twitter.com/ykMZ3tNuUS — Muhammad Fayyaz (@fayyaz_85) January 11, 2024 భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం అఫ్గనిస్తాన్లోని ఫైజాబాద్లో గుర్తించింది పరిశోధన కేంద్రం. భూకంపం తీవ్రతకు జమ్మూకశ్మీర్ పూంచ్ సెక్టార్లో కొండచరియలు విరిగిపడ్డాయి. భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఎవరికి ఎటువంటి గాయాలు, ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. Earthquake of Magnitude:6.1, Occurred on 11-01-2024, 14:50:24 IST, Lat: 36.48 & Long: 70.45, Depth: 220 Km ,Location: Afghanistan for more information Download the BhooKamp App https://t.co/fN2hpmK3jO @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/q5pkBVscsW — National Center for Seismology (@NCS_Earthquake) January 11, 2024 Earthquake of magnitude 6.1 on Richter scale hits Afghanistan, tremors felt in North India.#Earthquake #Delhi #DelhiNews #EarthquakeNews #Noida #JammuAndKashmir #earthquake #DelhiNCR #Earthquake pic.twitter.com/bR6xWokMcJ — Neha Bisht (@neha_bisht12) January 11, 2024 🇮🇳Earthquake tremors felt in Poonch, India, too.#JammuAndKashmir #Earthquake #Delhi #India #climatecrisis #emergency #DelhiNCR pic.twitter.com/YreWZoOHTF — Attentive Media (@AttentiveCEE) January 11, 2024 -
90 ఏళ్ల మృత్యుంజయురాలు
టోక్యో: జపాన్లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదం మిగిలి్చంది. వంద మందికిపైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. 90 ఏళ్లకుపైగా వయసున్న ఓ వృద్ధురాలు శిథిలాల నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడం ఆశ్చర్యం కలిగింది. ఇషికావా జిల్లాలోని సుజు సిటీలో భూకంపం వల్ల కూలిపోయిన రెండంతస్తుల భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ వృద్ధురాలు బయటకు వచి్చంది. ఆహారం, నీరు లేక బలహీనంగా మారిన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించారు. ఏకంగా 124 గంటలపాటు ఆమె ఈ శిథిలాల కిందే ఉండిపోయింది. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, మాట్లాడగలుతోందని, ఆమె కాళ్లకు గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. జపాన్లో ఆరు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో కనీసం 126 మంది మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. -
73కు చేరిన ‘జపాన్’ మరణాల సంఖ్య
సుజు: నూతన సంవత్సరం రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్లో సోమవారం రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో వచి్చన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 73కు పెరిగింది. భారీ వర్షాలు, చంపేసే చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంక ఏర్పడుతోందని, అయినాసరే సహాయక చర్యల్ని ముమ్మురం చేసినట్లు ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం చెప్పారు. సగం కూలిన భవనాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నారని సహాయక సిబ్బంది అంచనావేశారు. రాత్రంతా కేవలం నాలుగు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండటంతో చలిలో శిథిలాల వద్ద అన్వేషణ, గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడిన 300 మందిని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. 33,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. -
రెండు రోజుల్లో 155 ప్రకంపనలు
వజిమ: జపాన్లో సోమ, మంగళవారం సంభవించిన వరుస ప్రకంపనలతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. రెండు రోజుల్లో మొత్తం 155 ప్రకంపనలు నమోదైనట్లు భూకంప విభాగం తెలిపింది. సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు కావడంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. మంగళవారం పశ్చిమ తీరంలోని ఇషికావ ప్రిఫెక్చర్లో భూకంప సంబంధిత ప్రమాద ఘటనల్లో 50 మందికి పైగా చనిపోగా మరో 16 మంది గాయపడ్డారు. పలు భవనాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ వ్య వస్థలు దెబ్బతినడంతో సుమారు 33 వేల నివాసా లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన హైవేలు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ భూ ప్రకంపనలు సంభవించే ప్రమాదమున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు కోరారు. పశ్చిమ తీరంలోని హొన్షు దీవి నుంచి 97 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు షెల్టర్లలోకి తరలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జపాన్లో భూకంపం నేపథ్యంలో పొరుగునే ఉన్న రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు కూడా సునామీ హెచ్చరికలను జారీ చేశాయి. -
ఆఫ్గనిస్థాన్లో భూకంపం.. అరగంట వ్యవధిలో రెండుసార్లు
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో బుధవారం 30 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. మొదట ఫైజాబాద్ సమీపంలో రాత్రి 12:28 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 నమోదైంది. మళ్లీ రాత్రి 12:55 గంటలకు మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఈసారి ఫైజాబాద్కు తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో భూకంపం కనిపించింది. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రత ఉన్నట్లు సమాచారం. ఈ విపత్తులో ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల డిసెంబర్ 12, 2023నే భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. అంతకు ముందు గత ఏడాది అక్టోబర్లో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రమాదంలో బలమైన ప్రకంపనల కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. ఆఫ్గనిస్థాన్లో గత రెండు దశాబ్దాలలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో సుమారు 2,000 మంది మరణించారు. ఇదీ చదవండి: జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ -
#JapanEarthquake : జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు (ఫొటోలు)
-
జపాన్లో సునామీ హెచ్చరికలు
టోక్యో: ద్వీప దేశమైన జపాన్లో నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం సంభవించింది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటల తరువాత పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా తెలియజేసింది. ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. తొలుత సాయంత్రం 4.06 గంటల ప్రాంతంలో మొదలైన ప్రకంపనలు 4.32 గంటల వరకు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రత సాయంత్రం 4.10 గంటలకు రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. భూకంపం దాటికి సముద్రంలో ఐదు అడుగుల మేర అలలు ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పశి్చమ కోస్తా తీరంలోని ఇషిగావా, నిగాటా, టొమయా జిల్లాలకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇషిగావాకు మేజర్ సునామీ హెచ్చరిక, మిగిలిన పశి్చమ తీర ప్రాంతానికి తక్కువ తీవ్రత కలిగిన సునామీ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని గంటల తర్వాత సముద్రంలో అలల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సాధారణ సునామీ హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. తీర ప్రాంతాల్లోని జనం తక్షణమే సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని సూచించింది. నిగాటా, టొమయాలో 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. ఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రధాని కిషిడా చెప్పారు. శిథిలాల కింద బాధితులు! ఇషిగావా జిల్లాతోపాటు సమీప ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయని వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. రాజధాని టోక్యోతోపాటు కాంటో ఏరియాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. అధికారులతో పాటు సైన్యమూ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఉభయ కొరియాలతో పాటు రష్యాలోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. టోక్యోలోని భారత రాయబార కార్యాలయం బాధితులకు సమాచారం, సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. -
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికల్ని జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయని వెల్లడించింది. ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. భూకంప ప్రభావంతో సముద్ర అలలు తీరం వైపు దూసుకొస్తున్నాయి. సునామీ అలలతో నోటో, ఇషికావా జపాన్లో నదిలో అలలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్నాయి. సునామీ వచ్చే అవకాశం ఉండటంతో జపాన్ పశ్చిమ తీరంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #Tsunami waves are flowing back up the river in Noto, Ishikawa japan#Japan #earthquakes #EarthwuakeInJapan pic.twitter.com/2MKF7u7U7i — Ritesh Kumar (@riteshkumar1926) January 1, 2024 భూకంప దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. భూప్రకంపనలతో స్టోర్లోని వస్తువులు చెల్లాచెదురవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భూకంపానికి సంబందించి ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు విడుదల చేయలేదు. హొకురీకు అణు విద్యుత్ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగాయా? అని అధికారులు తనిఖీ చేస్తున్నారు. Store Owner records his store shake after 7.4 m earthquake hit Japan Tsunami warning is in Effect#Japan #tsunami #warning #deprem #sismo #地震 #earthquake #japanese #japannews pic.twitter.com/KJxlv0j1ii — Hollow dreams (@ChrisKolen001) January 1, 2024 మార్చి 11, 2011న, జపాన్లోని హోన్షు ద్వీపం ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. భయంకరమైన సునామీ ఏర్పడటానికి కారణమైంది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా మరణించారు. ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్లో అణు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: Happy New Year: 2024.. దునియాలో కొత్తగా జరగనుంది? -
చైనాలో భూకంపం
బీజింగ్/జిషిషాన్: వాయవ్య చైనాను భూకంపం కుదిపేసింది. సోమవారం అర్ధరాత్రి గన్సు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ భూకంపం ధాటికి చాలా ఇళ్లు నేలమట్టమై 127 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రం క్విన్ఘాయీలోనూ ఈ ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 700 మందికి పైగా గాయాలపాలయ్యారు. శిథిలాల వద్ద యుద్దప్రాతిపదికన గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం గ్రామీణ ప్రాంతాల్లో సంభవించడంతో మట్టి ఇళ్లు ఎక్కువగా కూలాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో జనం ఇళ్లు వదిలి భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వార్త తెలిసి అధ్యక్షుడు జిన్పింగ్ యుద్ధప్రాతిపదికన వేలాదిగా సహాయక బృందాలు తరలివెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. ‘‘భూకంపం ధాటికి విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చలికాలం, అందునా మైనస్ 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత సహాయక చర్యలకు అవరోధంగా మారింది’’ అని బ్లూ స్కై రెస్క్యూ టీమ్ చీఫ్ కమాండర్ వాంగ్ యీ చెప్పారు. గన్సు, క్విన్ఘాయీ ప్రావిన్సుల్లో సంభవించిన ఈ భూకంపం కేంద్రస్థానం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని చైనాయంత్రాంగం ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంపం వచ్చిన క్విన్ఘాయీ ప్రావిన్స్.. తరచూ భూకంపాలొచ్చే టిబెట్ హిమాలయ ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. -
చైనాలో భారీ భూకంపం.. వందకు పైగా మృతులు?
China Earthquake News: భారీ భూకంపం(Earthquake Today) మన పొరుగు దేశం చైనాను కుదిపేసింది. గత అర్ధరాత్రి సమయంలో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు ఇప్పటిదాకా 110కిపైగా మృతదేహాల్ని వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాయువ్య గన్స్, కింగ్హై ప్రావిన్స్ల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం 5.9గా పేర్కొంది. భూకంపం వల్ల వందల మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లను బయటకు తీసే క్రమంలో మృతదేహాలు బయటపడుతున్నాయి. మొబైల్ టార్చ్ల వెలుతురులో రెస్క్యూ.. చైనాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. విపరీతంగా మంచు కురవడం, వాన కురుస్తుండడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అర్ధరాత్రి భూకంపం నేపథ్యంలో చేపట్టిన సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని తెలుస్తోంది. రెస్క్యూ టీం వాహనాలను రోడ్లపై పేరుకుపోయిన మంచు ముందుకు వెళ్లనివ్వడం లేదు. దీంతో సిబ్బందికి స్ట్రెచర్లను మోసుకుంటూ కొంతదూరం వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు అంధకారం నెలకొనడంతో.. సెల్ఫోన్ టార్చ్ల వెలుతురులోనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి బృందాలు. రెస్క్యూ బృందాలు తమ శక్తిమేర సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రకటించారు. మరోవైపు సోషల్మీడియాలో భూకంప తాలుకా దృశ్యాలు కనిపిస్తున్నాయి. Un terremoto de magnitud 6,2 se produjo en la provincia china de Gansu, informaron medios locales. pic.twitter.com/ZqmF31JB5e — Sarah Ilych♦️♥️🧸RIA Novosti (@Sarah83336937) December 18, 2023 #BreakingNews :--Death toll from earthquake in central China rises to 111, hundreds injured... #ChinaEarthquake #china #Earthquake #ChinaNews #Death #ChinaSuarez pic.twitter.com/nTy0YmePzX — Vikas Bailwal (@VikasBailwal4) December 19, 2023 SISMO DE MAGNITUD 6 EN #CHINA DEJA AL MENOS 86 MUERTOS Este lunes, un sismo de magnitud 6 se registró en la provincia china de #Linxa- #Gansu, según informó el Servicio Geológico de Estados Unidos (USGS). Este movimiento telúrico dejó al menos 86 muertos y varios… pic.twitter.com/5JeTjZpApn — El Dato Noticias Morelos (@eldatomx) December 19, 2023 గతంలో.. భూకంపాలు చైనాలోనూ సర్వసాధారణమే. ఈ ఏడాది ఆగష్టులో 5.4 తీవ్రతతో తూర్పు చైనాలోభూకంపం సంభవించి 23 మంది గాయపడ్డారు. కిందటి ఏడాది సెప్టెంబర్లో సిచువాన్ ప్రావిన్స్లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 100 మంది చనిపోయారు. అయితే.. 2008లో రిక్టర్ స్కేల్పై 7.9 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం మాత్రం 87 వేల మందిని కబళించింది. అందులో దాదాపు ఆరు వేల మంది చిన్నారులే ఉన్నారు. ఇదీ చదవండి: అక్కడ తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే.. -
లఢక్లో భూకంపం.. ఉత్తరభారతంలో ప్రకంపనలు
లఢక్: లఢక్లోని కార్గిల్లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కార్గిల్లో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. An earthquake of magnitude 5.5 on the Richter Scale hit Kargil, Ladakh at around 3:48 pm today: National Center for Seismology pic.twitter.com/Z5bBYur7y4 — ANI (@ANI) December 18, 2023 రిక్టర్ స్కేల్పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నెలకొని ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. ఈరోజు తెల్లవారుజామున పాకిస్థాన్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇదీ చదవండి: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం -
ఫిలిప్పీన్స్లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మనీలా: ఫిలిప్పీన్స్లోని మిండనావో దీవిని శనివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూమిలో 32 కిలోమీటర్ల లోతులో రాత్రి 10.37 గంటల సమయంలో ఇది సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్, ఇండోనేసియాలోని కొన్ని ప్రాంతాలు, మలేసియాలో సునామీ అలలు మీటరు ఎత్తున ఎగసిపడే అవకాశముందని అంచనా వేసినట్లు పసిఫిక్ సునామీ వారి్నంగ్ సెంటర్ తెలిపింది. -
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
Philippines Massive Earthquake Tsunami Warning ఫిలిప్సీన్స్లో మరోసారి భారీగా భూమి కంపించింది. మిండనావోలో శనివారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం 63 కిమీ (39 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. దీంతో జనం భయకంపితులయ్యారు. 50కి పైగా నివాసాలు, ఇతర భవనాలను ధ్వంసమైనాయి. దీంతో అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నవంబరు 17న సంభవించిన భూకంపంలో సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సులో కొంత ప్రాణ నష్టం జరిగింది. కాగా పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ ప్రాంతాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప , అగ్నిపర్వత క్రియాశీల జోన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. PHIVOLCS has issued a #Tsunami Warning for the #Philippines after the powerful #earthquake (#lindol) in #Mindanao. People in the Philippines and nearby countries need to check local authorities for local tsunami information and the aftershocks of the earthquake. #sismo #quake https://t.co/YEsbKT3sVs pic.twitter.com/TlCo8Y0lsR — 🌊 Earthquake Updates Worldwide - #StopWar 🎗️ (@InfoEarthquakes) December 2, 2023 -
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం
ఫిలిప్పీన్స్ మరోసారి భారీ భూకంపంతో కంపించి పోయింది. శుక్రవారం దక్షిణ ఫిలిప్పిన్స్ మిందానో ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని జర్మనీ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని, భూకంప నష్టంపై తక్షణ సమాచారం ఏదీ లేదని ప్రకటించింది. అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ సూచించింది. తాను ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇదే బలమైన భూకంపం అని షియా లేరాన్ తెలిపారు. దీంతో జనం భయాందోళనలతో పరుగులు తీశారని చెప్పారు. భూకంప కేంద్రం నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దావో సిటీలో జరిగే సమావేశానికి ఆమె హాజరుకానున్నారు. అలాగే బలమైన భూకంపంతో గోడలు దెబ్బతిన్నాయని, కంప్యూటర్లు కింద పడిపోయాయని దక్షిణ కోటాబాటోలోని జనరల్ శాంటోస్ నగరానికి చెందిన రేడియో అనౌన్సర్ లెనీ అరనెగో తెలిపారు. జనరల్ శాంటాస్ సిటీ విమానాశ్రయంలోని ప్రయాణికులను టార్మాక్కు తరలించారని భూకంపం సంభవించినప్పుడు విమాన ప్రయాణికుడు మైఖేల్ రికాఫోర్ట్ తెలిపారు. జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కేంద్రం "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్లో భూకంపాలు తరచూ సంభవిస్తూంటాయి. దీంతోపాటు గత వారం పది రోజుల్లో పలు దేశాల్లో భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. 🧵 Video and images emerging after a M6.7 earthquake struck Mindanao in the #Philippines. Terrifying 😳 pic.twitter.com/KkKVLU53vt — Volcaholic 🌋 (@volcaholic1) November 17, 2023 🧵 Video and images emerging after a M6.7 earthquake struck Mindanao in the #Philippines. Terrifying 😳 pic.twitter.com/KkKVLU53vt — Volcaholic 🌋 (@volcaholic1) November 17, 2023 -
14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి
రేగ్యావిక్: ఒక భూ కంపం వస్తేనే ప్రజలు వణికిపోతారు.పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి.అలాంటిది ఐస్లాండ్ దేశంలో కేవలం 14 గంటల్లో ఎనిమిది వందల సార్లు భూమి కంపించిందంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వరుస భూ కంపాలు బెంబేలిత్తిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఐస్లాండ్ మెట్ ఆఫీస్ తెలిపిన దాని ప్రకారం రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో గ్రిండావిక్ గ్రామంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.రాజధాని రేగ్యావిక్కు 40 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ప్రకంపనల కారణంగా ఇళ్లలోని కిటికీల తలుపులు, వస్తువులు కొద్దిసేపు ఊగాయి.వరుస భూ ప్రకంపనలు సంభవించినపుడు అగ్నిపర్వతం బద్దలయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఐలాండ్ దేశంలో 33 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి.యూరప్లోనే ఇది అత్యధికం. ఇదీ చదవండి...అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత -
ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు
శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఇండోనేషియా ఉలిక్కిపడుతోంది. తాజాగా.. రిక్టర్ స్కేల్పై దాదాపు 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాందా సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయ్యింది. అంబోన్కు 370 కిలోమీటర్ల దూరంలో.. 146 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బాందా సముద్రంలో టానింబర్ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్ర నమోదు అయ్యిందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం ప్రకటించింది. ఈ దీవి జనాభా లక్షా 27 వేలు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం.. మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించింది. ఏడాది వేల భూకంపాలు ఇండోనేషియా జనాభా 27 కోట్లను పైనే. ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్లో ఈ దేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన టెక్టోనిక్ ప్లేట్ల బెల్ట్గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ను చెబుతుంటారు. ఈ కారణంగానే అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఇండోనేషియా ఉంది. అందుకే ఆ దేశాన్ని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక.. గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై వరుసగా 7, 6.9, 5.1 తీవ్రతతో నమోదు అయ్యాయి. గత వారంగా 15సార్లు భూమి కంపించింది. నెల వ్యవధిలో 68 సార్లు భూమి కంపించగా.. ఏడాది కాలంగా 782సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 1.5 తీవ్రతతో చిన్నపాటి ప్రకంపనల నుంచి శక్తివంతమైన ప్రకంపనలే వాటిల్లాయి ఇక్కడ. 2020లో ఇండోనేషియాలో 8,260సార్లు భూకంపాలు సంభవించాయి. కానీ, అంతకు ముందు ఏడాదిలో 11,500 సార్లు భూమి కంపించింది. -
నేపాల్లో మరోసారి భూకంపం
కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్ ప్రజలను మరోసారి భూకంపం భయపెట్టింది. శుక్రవారం భూకంపం సంభవించిన పశ్చిమ నేపాల్లోని జజర్కోట్ పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4.31 గంటల సమయంలో భూమి కంపించింది. ఆ తర్వాత 4.40 సమయంలో 4.5 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలు నమోదయ్యాయి. తాజా భూకంప కేంద్రం జజర్కోట్ జిల్లాలోని రమిదండాలో ఉందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాజధాని కఠ్మాండులోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకు న్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. తాజా భూకంపంతో వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో గత శుక్రవారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 157కు చేరుకుంది. -
ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు
ఢిల్లీ: దేశ రాజధానితో సహా ఉత్తర భారతంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. సోమవారం సాయంత్రం 4:18 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. నేపాల్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతంలో భూమి వణికింది. Earthquake tremors felt in Delhi. Details awaited. pic.twitter.com/nRMLKZ9DdK — ANI (@ANI) October 15, 2023 గత నాలుగు రోజుల్లో వరుసగా మూడో సారి భూమి కంపించింది. ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో సామాగ్రి కిందపడిపోయిందని స్థానికులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు తెలిపారు. Earthquake measuring 5.6 on the Richter scale struck Nepal at 1616 hours today, says National Center for Seismology (NCS). — ANI (@ANI) November 6, 2023 ఇదీ చదవండి: మహిళా అధికారి హత్య కేసులో మాజీ డ్రైవర్ అరెస్టు -
Nepal earthquake: నేపాల్ను కుదిపేసిన భూకంపం
కఠ్మాండు: హిమాలయ దేశం నేపాల్లోని మారుమూల పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన తీవ్ర భూకంపంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మందికి పైగా గాయపడ్డారు. వందలాదిగా నివాసాలు ధ్వంసమయ్యాయి. దేశ రాజధాని కఠ్మాండుకు పశి్చమాన 500 కిలోమీటర్ల దూరంలోని జజర్కోట్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని అధికారులు తెలిపారు. అనంతర ప్రకంపనలు 159 వరకు నమోదైనట్లు చెప్పారు. జాజర్కోట్తోపాటు రుకుమ్ జిల్లాపైనా భూకంప ప్రభావం చూపిందని పేర్కొన్నారు. తీవ్రతకు కఠ్మాండుతోపాటు భారత్ రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. ఘటనా ప్రాంతంలో నేపాల్ సైన్యం, పోలీసు బృందాలు సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. నేలమట్టమైన ఇళ్ల శిథిలాల్లో చిక్కుబడిపోయిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు అవరోధం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య జాజర్కోట్, రుకుమ్ జిల్లాల్లో కలిపి 157కి చేరుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అదేవిధంగా, క్షతగాత్రుల సంఖ్య 160 దాటిందని పేర్కొంది. మృతుల్లో జజర్కోట్ జిల్లా నల్గధ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ సరితా సింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్లు దెబ్బతినడంతోపాటు భూ ప్రకంపనలు కొనసాగుతుండటంతో భయభ్రాంతులకు గురైన జనం రాత్రంతా వీధుల్లోనే జాగారం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం జనం చిమ్మచీకట్లోనే తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’శనివారం ఉదయం వైద్య బృందంతో భూకంప ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. సుర్ఖెట్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. నేపాల్ భూకంపంలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించడంపై భారత ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత మేర నేపాల్ ప్రజలకు సాయం అందిస్తామని ప్రకటించారు. టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉన్న నేపాల్కు భూకంపాల బెడద ఎక్కువగా ఉంటోంది. 2015లో నేపాల్లో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో 9వేల మంది చనిపోగా మరో 22 వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. 8 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో నేపాల్లో మూడుసార్లు భూకంపం సంభవించింది. -
నేపాల్లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే..
హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్లో మరోసారి భూమి కంపించింది. ఈ విపత్తులో 70 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావం భారతదేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా కనిపించింది. నేపాల్లో గతంలోనూ అనేక భూకంపాలు సంభవించాయి. 2015లో నేపాల్లో సంభవించిన భూకంపంలో ఎనిమిది వేల మంది మృత్యువాతపడ్డారు. అయితే నేపాల్లో తరచూ భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి? శాస్త్రవేత్తలు దీనిపై ఏమంటున్నారు? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపాల్ భౌగోళిక స్వరూపమే తరచూ భూకంపాలు సంభవించడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేపాల్లో 17 శాతం ప్రాంతం మాత్రమే మైదానం. మిగిలిన ప్రాంతంలో పర్వతాలు, అడవులు ఉన్నాయి. నేపాల్ ఉత్తర చివరలో ఎత్తయిన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. నేపాల్ తరచూ భూకంపాలకు ఎందుకు గురవుతుందో తెలసుకోవాలంటే ముందుగా భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. భూమి అనేది భారీ టెక్టోనిక్ ప్లేట్లతో రూపొందింది. భూమిలోపలి ఈ టెక్టోనిక్ ప్లేట్లు వివిధ పరిస్థితుల కారణంగా కదులుతూ ఉంటాయి. అలాగే ఒకదానికొకటి ఢీకొంటాయి. నేపాల్.. రెండు భారీ టెక్టోనిక్ ప్లేట్ల అంచున ఉంది. నేపాల్ ఇండో-ఆస్ట్రేలియన్, యురేషియన్ ప్లేట్ల మధ్య ఉంది. ఈ రెండు ప్లేట్లు ఢీకొన్నప్పుడు నేపాల్లో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ రెండు ప్లేట్లు ప్రతి సంవత్సరం ఐదు సెంటీమీటర్ల చొప్పున ఒకదానిపైకి మరొకటి ఎక్కేలా కదులుతున్నాయి. ఫలితంగా నేపాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. ఐదు సెంటీమీటర్ల వేగం చిన్నదిగా అనిపించినప్పటికీ, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు పలకల తాకిడి కారణంగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయని చెబుతారు. నేపాల్కు ఉన్న మరో పెద్ద సమస్య అక్కడి బలహీనమైన భవనాలు. ఇవి బలమైన భూప్రకంపనలను తట్టుకోలేవు. భూకంపం వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే.. -
Nepal Earthquake: నేపాల్లో భూకంప విధ్వంసం.. శిథిలమైన భవనాలు (ఫొటోలు)
-
ఉత్తర భారతంతో పాటు నేపాల్ లో అర్ధరాత్రి భూకంపం
-
ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ భారీగా భూప్రకంపనలు
ఢిల్లీ: నేపాల్లో 6.4 తీవ్రతతో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం.. అక్కడ పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. అయితే ఈ భూకంప తీవ్రతకు ఉత్తర భారతం వణికిపోయింది. నేపాల్లో భూకంప నమోదు ప్రాంతానికి 500 కి.మీపైగా దూరంలో ఉన్న ఉత్తర భారత దేశంలోనూ ఈ ప్రభావం కనిపించింది. ఢిల్లీతో పాటు యూపీ, బీహార్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. సుమారు 20 సెకన్ల పాటు భారీగానే భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్తో పాటు యూపీ ప్రయాగ్రాజ్, ఫరీదాబాద్, గురుగ్రామ్, భాగ్పట్, వారాణాసి, సుల్తాన్పూర్, కుషీనగర్, గోరఖ్పూర్, మీర్జాపూర్లోనూ ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక రోడ్లపై పరుగులు పెట్టారు. దీనికి సంబంధించి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. North India including bihar patna , delhi ncr , Gurgaon , haryana and Nepal hit by a scary earthquake.#earthquake #Delhi #Nepal #DelhiNCR #Noida #Tremors #भूकंप #Bihar #Patna #lucknow pic.twitter.com/TK72oCKfOV — Dr. Shivam dubey (@ShivamdubeYspn) November 4, 2023 #WATCH | Bihar: People come out of their homes as tremors felt in Patna pic.twitter.com/PoINrMXIA1 — ANI (@ANI) November 3, 2023 -
భారీ భూకంపం: నేపాల్ లో 70 మంది దుర్మరణం, పలువురికి గాయాలు
-
నేపాల్ భారీ భూకంపం: 140కి చేరిన మృతుల సంఖ్య
ఖాట్మాండు: నేపాల్ పెను భూకంపం (Nepal earthquake).. పలువురిని పొట్టనబెట్టుకుంది. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటిదాకా 140 మృతదేహాల్ని వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. గాఢనిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో.. ప్రాణాల కోసం పరుగులు తీసేందుకు అవకాశం కూడా లేకపోయింది. రుకమ్, జజర్కోట్లో ఇళ్లు వందల సంఖ్యలో నేలమట్టం అయ్యాయి. శిథిలాలు తొలగిస్తోన్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. గాయపడిన వాళ్ల సంఖ్య వందల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఆధారంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇదీ చదవండి: భూకంపం ఎన్ని రకాలు? ఏది అత్యంత ప్రమాదకరం? నేపాల్లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రత నమోదు అయ్యింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్కోట్లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. రాత్రి దాటాక సంభవించిన భూకంప తీవ్రతకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ తెగిపోయింది. జనం రాత్రంతా రోడ్లపైనే గడిపారు. పైగా అర్ధరాత్రి కావడంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదు. ఉదయం నుంచి సహాయక చర్యలు తీవ్రతరం చేశారు. నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగగా.. భూకంప బాధిత ప్రాంతాలల్లో ప్రధాని పుష్ప కమల్ పర్యటించనున్నట్లు సమాచారం. క్షతగ్రాతుల రోదనలతో ఆస్పత్రుల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. More then 128 people died and above 500 were injured after a strong 6.4 magnitude earthquake in Nepal... #Nepal #NepalEarthquake #earthquakenepal #earthquake #BREAKING_NEWS #latestnews #NepalNews #Jajarkot #Kathmandu pic.twitter.com/6c4MILmvaY — Vikas Bailwal (@VikasBailwal4) November 4, 2023 Tragedy strikes again in #Nepal . A powerful 6.4-magnitude earthquake claims 129 lives, above 500 reported injured shaking northwestern districts. Prayers for #Nepal 🙏🙏 #NepalEarthquake #earthquake pic.twitter.com/6rjl3A3vm3 — Stranger (@amarDgreat) November 4, 2023 नेपाल के जजरकोट में कल रात आए भूकंप से के कारण काफी नुकसान हुआ। तबाही की तस्वीरें...#earthquakes #NepalEarthquake pic.twitter.com/lKWK5nxg7x — Kuldeep Raghav 🇮🇳 (@ImKuldeepRaghav) November 4, 2023 రుకమ్ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్కోట్లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగే కొద్దీ.. మృతదేహాలు అక్కడ మరిన్ని బయటపడుతున్నాయి. నిన్న రాత్రి భూకంపం సంభవించడంతో సహాయ చర్యలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ భూకంపాలు సహజమే! భూకంపాల జోన్లో ఉన్న హిమాలయా దేశం నేపాల్లో ప్రకంపనలు సర్వసాధారణమే. తక్కువ తీవ్రతతో ప్రకంపనలు సంభవించినప్పటికీ.. ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంటాయి అక్కడ. ఇక్కడ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్లోకి నెట్టి హిమాలయాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల భూకంపాలు సంభవించడం సర్వ సాధారణంగా మారింది. గత నెలవ్యవధిలోనే మూడు భూకంపాలు(పెద్దగా నష్టం వాటిల్లలేదు) సంభవించాయక్కడ. అక్టోబర్ 3వ తేదీన రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంపైనా ప్రభావం చూపించింది. ఇక కిందటి ఏడాది నవంబర్లో దోతీ జిల్లాలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆరుగురిని బలిగొంది. అయితే.. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం మాత్రం నేపాల్ చరిత్రలోనే పెను విషాదాన్నే మిగిల్చింది. నాటి భూకంపంలో 12 వేల మందికి పైగా మరణించగా.. పదిలక్షల భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇదీ చదవండి: ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే.. భారత ప్రధాని దిగ్భ్రాంతి నేపాల్ భారీ భూకంపం, భారీగా ప్రాణ నష్టం సంభవించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది అని ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. నేపాల్లో భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి బాధగా ఉంది. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు యావత్ భారతదేశం సంఘీభావం ప్రకటిస్తోంది. సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారాయన. అలాగే మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించిన ప్రధాని మోదీ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. Deeply saddened by loss of lives and damage due to the earthquake in Nepal. India stands in solidarity with the people of Nepal and is ready to extend all possible assistance. Our thoughts are with the bereaved families and we wish the injured a quick recovery. @cmprachanda — Narendra Modi (@narendramodi) November 4, 2023 ఇవీ కూడా చదవండి: నేపాల్కు శాస్త్రవేత్తల హెచ్చరిక! నేపాల్లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే.. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటే ఏమిటి? -
ఇండోనేసియాలో భూకంపం
జకార్తా: ఇండోనేసియా ఆగ్నేయప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఈస్ట్ నుసా తెంగ్గారా ప్రావిన్స్ రాజధాని కుపంగ్కు 21 కిలోమీటర్ల దూరంలో భూమికి 36 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. దీని తీవ్రతతో కుపంగ్ నగరంలోని ఇళ్లు, ఇతర భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. -
Earthquake in Nepal: నేపాల్లో భూకంపం
కాఠ్మండు: నేపాల్ రాజధాని కాఠ్మండును ఆదివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ధడింగ్ జిల్లా కేంద్రంగా ఉదయం 7.39 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూమి కంపించిందని యంత్రాంగం తెలిపింది. మరో 29 నిమిషాల అనంతరం ధడింగ్ జిల్లాలోనే భూ ప్రకంపనలు మరో నాలుగుసార్లు సంభవించినట్లు పేర్కొంది. దీంతో, రాజధాని ప్రాంతంలోని 20 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయని, మరో 70 వరకు ఇళ్ల గోడలు బీటలువారాయని పేర్కొంది. ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదని వెల్లడించింది. భూకంపం ప్రభావం బాగ్మతి, గండకి ప్రావిన్స్ల వరకు కనిపించింది. -
భూకంపాలను తట్టుకొని నిలబడే ఇల్లు, కేవలం 26 గంటల్లోనే..
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అంటే జీవితంలో ఈ రెండు పనులు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనేది దాని అర్థం. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నది చాలామందికి కలగా ఉంటుంది. అయితే ఇదంత చిన్న విషయం కాదు. ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. పునాది మొదలు పైకప్పు దాకా కొన్ని నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా భారత నిర్మాణ రంగంలో త్రీ డైమెన్షనల్ ప్రింటింగ్ అనే కొత్త టెక్నాలజీ వచ్చి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేదు.జస్ట్.. ఇంటి స్థలం ఒక్కటి చాలు. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు భూకంపాలను తట్టుకొని నిలబడి ఇంటి నిర్మాణాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ప్రముఖ సిమెంట్ కంపెనీ ప్రోగ్రెసో తన మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ ఇంటిని నిర్మించింది. ప్రోటోటైప్ డిజైన్తో భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ ఇంటిని డిజైన్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం 26 గంటల్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు భూకంపాలను తట్టుకొని నిలబడగలదు. 49 స్క్వైర్ఫీట్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఇందులో COBOD ప్రింటర్ను ఉపయోగించారు. రీసెంట్గా బెంగళూరులో తొలి 3డి ప్రింటింగ్తో ఏర్పాటైన పోస్టాఫీస్ నిర్మాణంలోనూ ఇదే తరహా ప్రింటర్ను ఉపయోగించారు. ఇంటి పైకప్పులను రాంచో రకం తాటాకులతో నిర్మించారు. ఈ తరహా నిర్మాణం సాధారణంగా కొన్నేళ్లుగా లాటిన్ అమెరికాలో ఉపయోగిస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో పాటు ఇంటిని కాస్త వేడిగా ఉంచుతుంది. 3డీ ప్రింటింగ్ నిర్మాణం ముఖ్యంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలాకు బాగా సరిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో 3డీ నిర్మాణం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేకుండా కేవలం ఇంటి స్థలం ఉంటే చాలు అందమైన ఇంటిని కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. రోబోల మాదిరిగా రోజుల్లోనే ఇంటిని కట్టిపడేస్తోందీ ఈ 3డీ టెక్నాలజీ. జస్ట్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇల్లు రెడీ అవుతుంది మరి. 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి? సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు.అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు. -
అఫ్గానిస్తాన్లో మళ్లీ భూకంపం
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లో మరోసారి భూకంపం సంభవించింది. ఈనెల 7వ తేదీన శక్తివంతమైన భూకంపం చోటుచేసుకున్న హెరాట్ ప్రావిన్స్లోనే ఆదివారం మళ్లీ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం హెరాట్ ప్రావిన్స్ రాజధాని హెరాట్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో భూమికి 8 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. తాజా భూకంపం తాకిడికి నలుగురు చనిపోగా మరో 150 మందికి పైగా గాయపడినట్లు స్వచ్చంద సంస్థలు తెలిపాయి. బలోచ్ ప్రాంతంలోని రబట్ సాంగి జిల్లాలోని కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 7న భూకంపం సంభవించిన హెరాట్ ప్రావిన్స్లో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. మొత్తం 2 వేల మందికి పైగా చనిపోగా మృతుల్లో 90 శాతం వరకు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
వారంలోనే అఫ్గానిస్తాన్లో మళ్లీ భూకంపం
చాహక్: అఫ్గానిస్తాన్లో మళ్లీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదయ్యింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు భూమి కంపించింది. పశ్చిమ అఫ్గానిస్తాన్లో హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది ఇటీవలె అఫ్గానిస్తాన్ పశ్చిమ ప్రాంతాన్ని పెనుభూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్లో అఫ్గానిస్తాన్లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు. -
అఫ్గాన్లో భూకంపం.. బాధితులను పట్టించుకోని తాలిబన్ సర్కార్
అఫ్గాన్లో భూకంపం.. బాధితులను పట్టించుకోని తాలిబన్ సర్కార్ -
రషీద్ ఖాన్ మంచి మనసు.. ఆఫ్గాన్ భూకంప బాధితులకు విరాళం
ఆఫ్గానిస్తాన్లో సంభవించిన భుకంపం పెను విషాదం మిగిలిచ్చింది. ఈ ఘటనలో దాదాపు 2400 పైగా మృతిచెందారు. భూకంపం ధాటికి ఏకంగా 12కు పైగా గ్రామాలు నేలమట్టమయ్యాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో ఆఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల ఫీజు రూపంలో తనకు వచ్చే మొత్తం ఆదాయాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు రషీద్ ప్రకటించాడు. "ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రావిన్స్లోని హెరాత్, ఫరా, బాద్గీస్ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రవిషాదం మిగిల్చిందని తెలిసి చాలా బాధపడ్డాను. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను. అదే విధంగా భూకంప బాధితులను అదుకునేందుకు ఫండ్స్ సేకరించేందుకు త్వరలో ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెడతానని ట్విటర్లో రషీద్ పేర్కొన్నాడు. చదవండి: అజారుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! అందుకే అనర్హత వేటు... ఇక మర్చిపోవాల్సిందే! I learned with great sadness about the tragic consequences of the earthquake that struck the western provinces (Herat, Farah, and Badghis) of Afghanistan. I am donating all of my #CWC23 match fees to help the affected people. Soon, we will be launching a fundraising campaign to… pic.twitter.com/dHAO1IGQlq — Rashid Khan (@rashidkhan_19) October 8, 2023 -
అఫ్గాన్ భూకంపం..2,400కు చేరిన మరణాలు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లోని హెరాట్ ప్రావిన్స్లో శనివారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం మరికొన్ని మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 2,445కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, క్షతగాత్రుల సంఖ్య గతంలో ప్రకటించిన 9,240 కాదన్నారు. 2వేల మంది మాత్రమే గాయపడ్డారన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. హెరాట్లోని ఏకైక ప్రధాన ఆస్పత్రి వెలుపల బాధితుల కోసం బెడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తెలిపింది. సోమవారం మరోసారి భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై రోడ్లపైకి చేరుకున్నారు. అఫ్గాన్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి అబ్దుల్ బరాదర్ సోమవారం హెరాట్ ప్రావిన్స్లో పర్యటించారు. ఇజ్రాయెల్ పరిణామాలపైనే ప్రపంచదేశాల దృష్టి కేంద్రీకృతం కావడంతో అఫ్గాన్లో భూకంపబాధితులకు సాయం నెమ్మదిగా అందుతోంది. దశాబ్దాలపాటు అంతర్యుద్ధంతో చితికిపోయిన అఫ్గానిస్తాన్ ప్రజలకు తాజాగా సంభవించిన భూకంపం మరింత కుంగదీసింది. అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినప్పటికీ చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని పొరుగుదేశాలు మాత్రమే అఫ్గాన్లకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. అఫ్గాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీకి చెందిన 20 బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. నీడ కోల్పోయిన వారికోసం తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేసింది. -
2 వేలు దాటిన అఫ్గాన్ మరణాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ పశి్చమ ప్రాంతాన్ని శనివారం కుదిపేసిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్లో అఫ్గానిస్తాన్లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు. అఫ్గాన్లో నాలుగో అతి పెద్ద నగరమైన హెరాత్ కేంద్రంగా శనివారం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 2,100కి చేరువలో ఉందని ఆదివారం తాలిబన్ సమాచార, సాంస్కృతిక శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రయాన్ చెప్పారు. మరో 9,240 మందికి తీవ్ర గాయాలయ్యాయని 1,320 ఇళ్లు నేలమట్టమయ్యాయని ఆయన తెలిపారు. డజనుకి పైగా బృందాలు అత్యవసర సహాయ చర్యల్లో మునిగిపోయాయి. కొన్ని గ్రామాల్లోకి సహాయ సిబ్బంది అడుగు పెట్టడానికి కూడా వీల్లేకుండా శిథిలాలతో నిండిపోయాయి. ఎటు చూసినా శిథిలాల్లో చిక్కుకున్న వారి రోదనలే వినిపిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడడానికి సహాయ బృందాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ చేతులనే ఆయుధాలుగా చేసుకొని శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటకి వస్తున్నాయి. మరికొందరు స్థానికులు శిథిలాల మీద పాకుతూ వెళుతూ వాటిని తొలగిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని కాపాడుతున్నారు. హెరాత్లో నేలమట్టమైన ఓ ఇంటి శిథిలాల్లో నుంచి ఆదివారం ఒక శిశువును అక్కడి వారు కాపాడుతున్న దృశ్యాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ప్రసారం చేసింది. అక్కడే శిథిలాల నుంచి ఓ మహిళ చేయి బయటికి కనిపిస్తుండటం కూడా రికార్డయ్యింది. ఆ మహిళ చిన్నారి తల్లేనని స్థానికులు తెలిపారు. ఆమె బతికున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధితులకు అందుతున్న సాయం.. అఫ్గాన్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి నుంచి భూకంప బాధితుల్ని కాపాడేందుకు యూనిసెఫ్ దుస్తులు, దుప్పట్లు, టార్పాలిన్లు తదితరాలను పంపించింది. ఐరాస వలసల విభాగం నాలుగు అంబులెన్సులు, వైద్యులు, ఇతర సిబ్బందిని అక్కడి ఆస్పత్రికి పంపించింది. మూడు మొబైల్ వైద్య బృందాలను జెందాజన్ జిల్లాకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ కూడా 80 మంది రోగులకు సరిపోయే అయిదు మెడికల్ టెంట్లను హెరాత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం వంటి సంస్థలు కూడా అత్యవసరాలను అఫ్గానిస్తాన్కు అందజేస్తామని ప్రకటించాయి. -
అఫ్గాన్ భూకంప విలయం.. 2000 మంది మృతి
కాబూల్: ఆఫ్గానిస్థాన్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు దశాబ్దాల్లో ఇంతస్థాయిలో భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అధికారులు తెలిపారు. వేలాది ఇళ్లు నేలకూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. Today’s earthquake in Herat province of Afghanistan has completely destroyed four villages and many people have lost their lives. May Allah have mercy on them. pic.twitter.com/zWArtneBZs — اماراتي ځـدراڼ (@AmaratyD34809) October 8, 2023 అఫ్గాన్–ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని హీరట్ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. భూకంప ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 400కు పైగా ఇళ్లు నేలకూలాయి. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ఏడాది తూర్పు ఆఫ్గానిస్థాన్లో భయంకరమైన భూకంపం సంభవించింది. కొండప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ భూకంపంలో దాదాపు 1000 నుంచి 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్లో మరింత దారుణం.. యుద్ధంలోకి ‘హెజ్బొల్లా’ గ్రూప్ Follow the Sakshi Telugu News channel on WhatsApp: -
అఫ్గాన్లో భూకంపం..120 మంది మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లో సంభవించిన భూకంపంలో 120 మంది చనిపోగా, 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం తాకిడికి హీరట్ ప్రావిన్స్ జెందా జాన్ జిల్లాలోని నాలుగు గ్రామాల్లోని డజన్లకొద్దీ ఇళ్లు ధ్వంసమయినట్లు అఫ్గాన్ జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. అఫ్గాన్–ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని హీరట్ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. భూకంప నష్టం, మృతులకు సంబంధించి తాలిబన్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. Today’s earthquake in Herat province of Afghanistan has completely destroyed four villages and many people have lost their lives. May Allah have mercy on them. pic.twitter.com/zWArtneBZs — اماراتي ځـدراڼ (@AmaratyD34809) October 8, 2023 #Blak_Day 11 members of a family living in this house have lost their lives and are buried under the rubble of their house. Their house has completely collapsed, their bodies are still under the rubble. Today’s earthquake in Herat & Badghis provinces of Afghanistan has caused hug pic.twitter.com/RE5p6ytL2G — ابو محمد عمر (@MdafYn) October 8, 2023 -
ఢిల్లీని వణికించిన భూకంపం..!
-
ఢిల్లీలో భారీ భూకంపం
ఢిల్లీ: దేశ రాజధానిలో భారీ భూకంపం సంభవించింది. పలుచోట్ల భూప్రకంపనలు సంభవించగా.. జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్కు సమీపంలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది. ఢిల్లీతో సహా పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్లో 40 సెకన్లపాటు భూప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 2:25 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. కార్యాలయాలు, ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. #earthquake In Delhi - NCR people coming out from offices pic.twitter.com/9G8lAImsVZ — ROAMER BOYS YT (@PUBGInd98835045) October 3, 2023 దేశ రాజధానిలో నేడు రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. మొదట ఆఫ్గానిస్థాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. రెండోసారి నేపాల్ భూకేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇదీ చదవండి: Pakistan Earthquake Prediction: పాకిస్తాన్కు భారీ భూకంపం ముప్పు? -
సూర్యాపేట జిల్లాలో స్వల్ప భూకంపం
హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలో శుక్రవారంరాత్రి మళ్లీ స్వల్ప భూకంపం వచ్చింది. పలు గ్రామాలతోపాటు పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు పలువురు తెలిపారు. దాదాపు 5 నుంచి 10 సెకండ్లపాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలను కొద్దిమంది మాత్రమే గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ నెల 19న ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి కేంద్రంగా వచ్చిన భూకంపం 2.3 మ్యాగ్నట్యూడ్గా నమోదైంది. కాగా, 2020, 2022 సంవత్సరాల్లో కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం వచ్చిన భూకంపం 3.0 మ్యాగ్నట్యూడ్గా నమోదైంది. ఇప్పడు మళ్లీ భూకంపం రావడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
నాలుగు రోజుల గ్యాప్లో 6వేల మంది మృతి!
రెండూ ఆఫ్రికన్ దేశాలే. కానీ, ప్రకృతి ప్రకోపానికి తీరని నష్టంతో తల్లడిల్లిపోతున్నాయి. కేవలం నాలుగే రోజుల వ్యవధిలో.. ఈ రెండు దేశాల్లో ఆరు వేలమంది ప్రాణాలు పోయాయి. ఒకవైపు మొరాకోలో సంభవించిన భూ విలయం.. మరోవైపు లిబియాలో పోటెత్తిన జల విలయం.. వేల మందిని బలిగొనడమే కాకుండా.. ఊహించని స్థాయిలో ఇరు దేశాలకు నష్టం కలగజేశాయి. ఆఫ్రికా దేశం లిబియాలోని దెర్నా నగరాన్ని వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. ఒక్క ఆ నగరంలో వరదల ధాటికి 2 వేల మందికిపైగా మృతి చెందారు. మిగతా అన్నిచోట్లా కలిపి మృతుల సంఖ్య వెయ్యికి పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మరణాలు కాకుండా.. కొన్ని వేల మంది గల్లంతయ్యారు. 48 గంటలు గడిచినా వాళ్ల జాడపై ఇంకా స్పష్టత రాలేదు. జాడ లేకుండా పోయిన వాళ్ల సంఖ్య పదివేలకు పైనే ఉండొచ్చని అధికారిక వర్గాల అంచనా. అంటే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని లిబియా ప్రధాని ఒసామా హమద్ చెబుతున్నారు. మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి వారం రోజులుగా ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా సహా ప్రధాన నగరాలను డిజాస్టర్ జోన్గా ప్రకటించారు. ఒక్కసారిగా డ్యామ్లు తెగిపోయి ఉప్పెన.. ఊళ్లను ముంచెత్తింది. జనాలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దెర్నాలో అయితే వరద పెను విలయం సృష్టించింది. మరోవైపు విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తాగు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించడంతో.. జనం బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. మొరాకోలో మృత్యుఘోష శుక్రవారం రాత్రి మొరాకోలో సంభవించిన భూకంపం.. 3 వేల మందికిపైగా ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంది. సహయాక చర్యల్లో ఇంకా మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ప్రకృతి విలయం దాటిచ మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. భూకంపం వచ్చి నాలుగు రోజులు గడుస్తుండడంతో.. బాధితులు సజీవంగా బయటపడతారన్న ఆశలు కనుమరుగైపోయాయని అధికారులు అంటున్నారు. మొరాకోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ పెను విపత్తు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు వణికిపోయాయని తెలిపింది. దీంతో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. -
Morocco : 2000 దాటిన భూకంప మృతుల సంఖ్య
మర్రకేశ్: మొరాకోను భూకంపం అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి సంభవించిన భూప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఉలికిపడి వీదుల్లోకి పరుగులు తీశారు. వేలాది భవనాలు నేలమట్టం కాగా.. శిధిలాల్లో చిక్కుకుని 2000 మందికిపై పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విపత్తులో 2,012 మంది ప్రాణాలు కోల్పోగా, 2,059 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం చరిత్రలో ఇంత పెద్ద భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అధికారులు అన్నారు. తీరప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో బలమైన ప్రకంపనలు సంభవించాయని పేర్కొన్నారు. ఘటనాస్థలాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. MOMENTS BEFORE DISASTER: Horrific moments of the earthquake caught on CCTV footage. BREAKING NEWS: A devastating 6.8 magnitude earthquake that rattled Morocco on Friday night is believed to have left at least 300 people dead and 153 injured. pic.twitter.com/U12GfYPfRL — Cypy The Great (@Cypy254) September 9, 2023 భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. #Morocco #earthquake: The next 48 hours will be “#critical” for saving #lives. https://t.co/tmR0ZCnfDg— The Skuup (@TSkuup) September 10, 2023 2004లో, ఈశాన్య మొరాకోలోని అల్ హోసీమాలో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో కనీసం 628 మంది మరణించారు. 926 మంది గాయపడ్డారు.1960లో అగాదిర్లో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 12,000 మందికి పైగా ప్రాణాలను హరించింది. US President Joe Biden "deeply saddened" over loss of lives in Morocco earthquake Read @ANI Story | https://t.co/qqLDEElZAq#USPresident #JoeBiden #moroccoearthquake pic.twitter.com/l9heuiUfGB — ANI Digital (@ani_digital) September 10, 2023 మొరాకో భూకంపంపై ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి. ఇదీ చదవండి: Morocco earthquake: వణికిన మొరాకో -
Morocco: భూకంప విలయం.. 1000 మంది మృతి
రాబత్: ప్రకృతి విలయంతో ఆఫ్రికా దేశం మొరాకో తల్లడిల్లిపోయింది. శుక్రవారం రాత్రి సమయంలో మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 1000 మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎటు చూసినా భవనాలు కుప్పకూలిపోయి.. అయిన వాళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 11.11 సమయంలో మధ్య మొరాకో మర్రకేచ్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 7.2 త్రీవతతో భూకంపం సంభవించింది. ఉన్నట్లుండి భవనాలు కుప్పకూలిపోయాయి. రోడ్డుల వెంట ఉన్న జనం.. ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రంతా రోడ్ల మీదే గడిపారు. భూకంపం ధాటికి.. వందల సంఖ్యలో మరణించి ఉంటారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. మరో 300 మందిదాకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని ప్రభుత్వం చెబుతోంది. Moment when powerful 6.8 magnitude #earthquake rocked #Morocco atleast 296 dead #moroccoearthquake #moroccosismo #Sismo #viral #BREAKING pic.twitter.com/2fyjtgEC2O — Utkarsh Singh (@utkarshs88) September 9, 2023 మొరాకో భూకంపం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్(ట్విటర్)లో ఆయన సంతాప సందేశం ఉంచారు. Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to… — Narendra Modi (@narendramodi) September 9, 2023 యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.11 గం. ప్రాంతంలో కొన్ని సెకండ్ల పాటు భారీగా భూమి కంపించింది. భూమి ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఆ తర్వాత.. 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు వెల్లడించింది. అయితే మొరాకో నేషనల్ సెయిస్మిక్ మానిటరింగ్ అండ్ అలర్ట్ నెట్వర్క్ మాత్రం.. తీవ్రత 7గా ఉన్నట్లు చెబుతోంది. అలాగే.. కేవలం 8 కిలోమీటర్ల లోతునే ప్రకంపనల కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది. Earthquake Morocco Richter 6.8#marrakech #agadir #casablanca #fes#مراكش #فاس #أغادير #الدار_البيضاء#moroccoearthquake #morocco #earthquakemorocco #earthquake#زلزال_المغرب #هزة_أرضية pic.twitter.com/EXBcv4rw17 — Jalal (@jalaloni) September 8, 2023 Scenes from Morocco's earthquake aftermath Understandably, people don't want to go back indoors because fearing aftershocks#earthquake #Maroc #moroccoearthquake #Morocco #earthquakemorocco #pray #hope #god #Marrakesh pic.twitter.com/cKg1bq0maq — Kinetik (@KinetikNews) September 9, 2023 మొరాకోలో స్వల్పతీవ్రతతో సంభవించే భూకంపాలకు సైతం తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. 1960లో రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. వేల మందిని బలిగొనడం గమన్హార్హం. ఇదిలా ఉంటే.. పోర్చుగల్, అల్జీరియాలోనూ భూకంపం సంభవించినా.. అవి స్వల్ఫ ప్రకంపనలే అని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని సమాచారం. -
Chile Quake: కుదిపేసిన భారీ భూకంపం
శాంటియాగో: దక్షిణ అమెరికా దేశం చిలీ తీర ప్రాంతం.. భారీ భూకంపంతో Earthquake in Chile చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి. అయితే శక్తివంతమైన ప్రకంపనల తర్వాత.. ఎలాంటి నష్టం వాటిల్లిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం రాత్రి ఉత్తర చిలీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని.. భూకంపం కేంద్రం కోక్వింబోలో నలబై కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ మాత్రం.. 6.5 తీవ్రతతో మధ్య చిలీ రీజియన్లో భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణామెరికా దేశమైన చిలీ.. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 526 మంది మృతి చెందారు. ప్రకంపనల ధాటికి ప్రజలు వణికిపోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. Strong 6.2-magnitude earthquake hits central Chile, close to La Serena pic.twitter.com/1RrnyAe3Uq — BNO News (@BNONews) September 7, 2023 #Chile 🇨🇱 Reacciones al sismo Magnitud 6.3. pic.twitter.com/hZq7ruWuo4 — InfoSismologic (@EarthquakeChil1) September 7, 2023 Tremors felt and can be seen… Coquimbo in San Juan #Sismo #Temblor #temblor #terremoto #Chile #LaSerena pic.twitter.com/LJEd2dY0a9 — Shadab Javed (@JShadab1) September 7, 2023 #Chile #Chilenos Momento del Sismo M6.6 Percibido en La Serena, #Chile. (Septiembre 06, 2023). #Temblor #Earthquake #Climagram #Coquimbo pic.twitter.com/xZRi7sR437 — 𝔸𝕝𝕖𝕛𝕒𝕟𝕕𝕣𝕠 𝔽𝕣𝕚𝕒𝕤 ♚ ✖️ (@FriasAlejandro_) September 7, 2023 -
ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్కు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది. ఇక భూ అంతర్భాగంలో 518 కిలోమీటర్లు దిగువన కదలికలు సంభవించాయని సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. అయితే ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. మరోవైపు యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రత 7.1గా పేర్కొంది. ఇక.. సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ (Tsunami) వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. Notable quake, preliminary info: M 7.1 - Bali Sea https://t.co/nBlmJ2rQia — USGS Earthquakes (@USGS_Quakes) August 28, 2023 ఇదిలా ఉంటే.. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ (NCS) పేర్కొంది. అలాగే.. మంగళవారం వేకువజామున 3.50 గంటలకు అండమాన్ సముద్రంలో (Andaman Sea) కూడా భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. Earthquake of Magnitude:4.1, Occurred on 29-08-2023, 10:13:33 IST, Lat: 28.95 & Long: 83.26, Depth: 10 Km ,Location: 244km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/xaeC85fU3v@Dr_Mishra1966@KirenRijiju@ndmaindia@Indiametdept pic.twitter.com/cTUd6bvz6h — National Center for Seismology (@NCS_Earthquake) August 29, 2023 -
మణుగూరులో భూ ప్రకంపనలు..
భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరులో మరోసారి భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా, వారం రోజుల్లో అక్కడ భూమి రెండుసార్లు కంపించడం విశేషం. వివరాల ప్రకారం.. మణుగూరులో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించింది. శుక్రవారం 4.40 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మణుగూరులోని శేషగిరినగర్, బాపనకుంట, శివలింగాపురం, విఠల్నగర్, రాజుపేటలో భూమి కంపించింది. ఈ క్రమంలో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. కాగా, వారం రోజుల్లో అక్కడ భూమి రెండు సార్లు కంపించింది. ఇది కూడా చదవండి: సేత్వార్ సమస్యలకు ‘చెక్’ -
ఫ్యుకుషిమా నుంచి అణు జలాల విడుదల
ఒకుమా: జపాన్ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది. వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్ను జపాన్ మీడియా లైవ్లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు. జపాన్ సీఫుడ్పై నిషేధం: చైనా జపాన్ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి. -
Fukushima nuclear disaster: పసిఫిక్లో ‘అణు’ అలజడి
టోక్యో: జపాన్లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జపాన్ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్ పసిఫిక్ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి. కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు! హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
జమ్మూ కాశ్మీర్లో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేలుపై..
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఈరోజు తెల్లవారు జామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 37 గా నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ. భూమి ఉపరితలానికి 5 కి.మీ లోతున భూకంపం సంభవించిందని వారు తెలిపారు. అక్కడక్కడా చిన్నగా భూమి అదిరినట్టుగా అనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ భూకంపం తీవ్రత కొంచెం ఎక్కువైనా భదేర్వా, కిష్త్వార్, ఉధంపూర్, ధోడా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు 2-5 సెకన్ల వరకు భూమి కంపించినట్లు చెబుతున్నారు స్థానికులు. ఆ సమయానికి అందరూ గాఢనిద్రలో ఉంటారని అదృష్టవశాత్తు భూకంపం తీవ్రత పెద్దగా లేదని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎంపీగా లోక్సభలోకి రాహుల్ -
చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు..
బీజింగ్: చైనా తూర్పు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 5.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సంస్థ వెల్లడించింది. ప్రమాదంలో డజన్ల కొద్దీ భావనాలు నేలమట్టం కాగా 21 మంది మరణించినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. 23 injured, buildings collapse as 5.4 earthquake hits east Chinahttps://t.co/JDhANJihBW pic.twitter.com/vnBgC3pOoa — Gulf Today (@gulftoday) August 6, 2023 దక్షిణ షెజోలోని శాండోంగ్ ప్రావిన్స్ లో ఆదివారం తెల్లవారుజాము 2.33 గంటలకు సంభవించిన ఈ భూకంపం ఉపరితలానికి 10కి.మీ. లోతున పుట్టిందని, సుమారు 26 కిలోమీటర్ల మేర ఇది ప్రభావం చూపిందని తెలిపింది యూఎస్ జియోలాజికల్ సంస్థ. భూకంపం తీవ్రతకు కనీసం 126 భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలిపాయి శాండోంగ్ అధికారిక బృందాలు. Twenty-one injured in east #China magnitude 5.5 earthquake pic.twitter.com/JLF0pXXbo0 — DD India (@DDIndialive) August 6, 2023 కూలిన భవనాలు, గోడలతో రోడ్ల మీద ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న శిధిలాలే కనిపిస్తున్నాయి. ఈ విపత్తులో భూమి సుమారుగా 52 సార్లు కంపించడంతో సుమారుగా 21 మంది తీవ్రంగా గాయపడ్డారని, శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చన్నారు అధికారులు. ఇంతవరకు ఎటువంటి ప్రాణ నష్టమైతే జరగలేదని వారు స్పష్టం చేశారు. 5.5 earthquake in eastern China pic.twitter.com/6xLHvQvYHK — Kim Green (@KimGree57363126) August 6, 2023 చాలా దశాబ్దాల తర్వాత చైనాలో ఈ స్థాయిలో భూకంపం చోటు చేసుకుందని దీని తీవ్రత కూడా జనాన్ని భయభ్రాంతులకి గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. భూకంపం సమయంలో తల తిరుగుతున్నట్లు అనిపించిందని ఒకరు సోషల్ మీడియాలో తెలపగా.. మరొకరు భూకంపం అదురుకు గుండె జారినట్లైందని వెంటనే భయంతో రోడ్ల మీదకు పరుగులు తీసినట్లు తెలిపారు. Earthquake hits eastern China, injuring 21 Follow us on Rumble: https://t.co/Nuc9nUzTc5 pic.twitter.com/g3vUynvjcA — RT (@RT_com) August 6, 2023 భూకంపం తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. ఈ వీడియోలు చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి శాండోంగ్ కు సహాయాక బృందాలను పంపగా వారు సహాయక చర్యలకు ఉపక్రమించారు. అసలే భారీ వర్షాలతోనూ, వరదలతోనూ కొట్టుమిట్టాడుతున్న చైనాను ఈ భూకంపం మరింత కుదిపేసింది. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ -
భూకంప శిథిలాల కింద ఊపిరిపోసుకున్న బిడ్డ ఇప్పుడిలా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటే ఇంకా ఆ దృశ్యాలు కళ్లముందు మెదులుతాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ శిథిలాల కిందే ఓ శిశువు ఊపిరి పోసుకుంది. ఆ 'జననం ఓ అద్భుతం' అనే చెప్పాలి. అంతటి విషాదంలో అందరిలో ఓ కొత ఆశను రేకెత్తించినట్లు 'మిరాకిల్గా ఆ బేబి' పుట్టడం అందర్ని ఒకింత ఆనందసభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇప్పుడూ ఆ శిశువు ఎలా ఉందంటే? నాటి సిరియా భారీ భూకంపంలో శిథిలాల కింద ఆ పసికందు కనిపించినప్పుడు, ఆమె బొడ్డు తాడు తల్లి నుంచి ఇంకా తెగిపోలేదు. ఆ చిన్నారి ఈ ప్రపంచంలోకి వచ్చిన కాసేపటికే ఆమె తల్లి కన్నుమూసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచాన్ని ఆకర్షించింది. తల్లి లేకపోయిన ఆ చిన్నారి ఆస్పత్రిలో వైద్యుల సాయంతో కోలుకుంది. ఇప్పుడు ఆ శిశువుకి ఆరు నెలలు. చాలా ఆరోగ్యంగా ఉంది. సిరియాలోని జిండిరెస్ పట్టణంలో ఆ చిన్నారి తన మేనత్త, మేనమామ, వారి ఏడుగురు పిల్లల మధ్య పెరుగుతోంది. ఆమె నవ్వుతుంటే వాళ్ల నాన్న, అక్కలే గుర్తుకొస్తున్నారని ఆ చిన్నారి మేనమామ ఖలీల్ అల్ సవాడీ అన్నారు. ఆ విషాద ఘటనలో ఆమె తండ్రి, తల్లి, నలుగురు అక్కలు ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుటుంబంలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి అఫ్రానే. ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ఎంతోమంది ముందుకొచ్చారు కూడా. ఆఖరికి అయినవాళ్ల అయిన ఆ చిన్నారి మేనమామ, మేనత్తలకు ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. ఎన్నో టెస్ట్లు నిర్వహించిగానీ వారికి ఆ పాపను అప్పగించలేదు ఆస్పత్రి యజమాన్యం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే చేసిన పని ఆ పాపకు కొత్తపేరు పెట్టడమే. ఆ చిన్నారికి ఆమె తల్లి 'అఫ్రా' పేరునే పెట్టారు. నిజానికి ఆ శిశువుని కాపాడిని రెస్క్యూ సిబ్బంది, ఆస్పత్రి యజమాన్యం ఆ చిన్నారికి 'అయా' అని పేరు పెట్టడం జరిగింది. 'అయా' అంటే అరబిక్లో అద్భుతం అని అర్థం. ఆమె నా కూతుళ్లలో ఒకత్తని, దాన్ని చూడకుండా కాసేపు కూడా ఉండలేనన్నారు ఆ చిన్నారి మేనమామ ఖలీల్. ఇక జిండిరెస్లోని ఖలీల్ ఉంటున్న ఇల్లు కూడా బాగా భూకంపం కారణంగా బాగ దెబ్బతిందని, అందువల్ల తాముఅక్కడే ఎక్కువ కాలం ఉండలేకపోయామన్నారు ఖలీల్. దీంతో కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టినట్టయిందని, పిల్లలను స్కూల్కి పంపే స్థోమత కూడా లేదని ఖలీల్ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఖలీల్ లాగానే ఎన్నో వేల కుటుంబాలు అత్యంత దయనీయ స్థితిలో బతుకుతున్నాయి. అంతేగాదు ఆ విషాద ఘటనలో దాదాపు 50 వేలమంది మరణించారని, మరో 50 వేలమంది నిరాశ్రయులయ్యినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది కూడా. (చదవండి: బస్సు డ్రైవర్ కూతురికి లండన్లో ఉద్యోగం) -
అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి..
పోర్ట్ బ్లెయిర్: ఉపఖండానికి సమీపంలోని అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.0 గా నమోదైనట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(NCS). ఈ రోజు తెల్లవారుజామున నికోబార్ ద్వీపాల్లో 5.40 గంటలకు 9.32 లాటిట్యూడ్ 94.03 లాంగిట్యూడ్ వద్ద ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ(NCS). ప్రాణనష్టం గానీ ఆస్తినష్టం గానీ జరిగినట్లు ఎక్కడా సమాచారం లేదు. గడిచిన ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్లో భూకంపం సంభవించడం ఇది రెండో సారి కావడం విశేషం. గత నెల చివర్లో కూడా అండమాన్లో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.9గా నమోదైంది. హిందూ మహా సముద్ర తీరంలో వరుసగా భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళనకారమే అంటున్నాయి NCS వర్గాలు. An earthquake of magnitude 5.0 on the Richter Scale hit Nicobar Islands today at around 5:40 am: National Centre for Seismology pic.twitter.com/VOyw7RKfHm — ANI (@ANI) August 2, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? -
అండమాన్ను కుదిపేసిన భూకంపం
ఢిల్లీ: అండమాన్ నికోబార్ను ఈ ఉదయం భూకంపం కుదిపేసింది. పది కిలోమీటర్ల లోతున.. రిక్టర్ స్కేల్పై 6 తీవ్రతతో నమోదు అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. హిందూ మహాసముద్రంలో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలుస్తోంది. అండమాన్తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. 2 #earthquakes in the Indian Ocean, magnitude 6.1 Andaman Is, & mag 5.9 southwest Indian Ridge nearer to Africa. @rrichcord @LaytenHolland pic.twitter.com/1W2Vk7blFs — Cecilia Sykala (@CeciliaSykala) July 28, 2023 -
Jaipur: అరగంట గ్యాప్లో మూడు భూకంపాలు!
ఢిల్లీ: వరుస భూకంపాలతో రాజస్థాన్ రాజధాని, పింక్ సిటీ జైపూర్ ఉలిక్కిపడింది. పొద్దుపొద్దున్నే కేవలం అరగంట గ్యాప్లోనే మూడు భూకంపాలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. శుక్రవారం వేకువ ఝామున జైపూర్ కేంద్రంగా.. 4.09ని ప్రాంతంలో పదికిలోమీటర్ల లోతున ఒకటి, . 4.22ని. ప్రాంతంలో 3.1 తీవ్రతతో ఐదు కిలోమీటర్ల లోతున ఇంకొకటి, 4.25 ప్రాంతంలో 3.4 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతున మరొకటి.. మొత్తం మూడుసార్లు భూమి కంపించింది. స్వల్ప ప్రకంపనలే అయినా.. ప్రజలు వణికిపోయారు. కొందరు నిద్ర నుంచి మేల్కొని భయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఇక ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రకంపనల విషయాన్ని రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సైతం ట్విటర్ ద్వారా ధృవీకరించారు. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు ట్విటర్లో పోస్ట్ అవుతున్నాయి. మరోవైపు మణిపూర్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. What a scary day to witness such high magnitude #earthquake in #Jaipur. Please be safe! pic.twitter.com/hGDgfCHYtL — Jahnvi Sharma (@JahnviSharma01) July 20, 2023 #earthquake See the dogs on the street in deep sleep suddenly waking up #jaipur #भूकंप pic.twitter.com/oGYz942g9i — Rameshwar Singh (@RSingh6969a) July 20, 2023 जयपुर में तेज़ भूकंप के झटके महसूस किए गए हैं। I hope you all are safe! #Jaipur #earthquake pic.twitter.com/FWAEvBTw7A — Dr.Kirodi Lal Meena (@DrKirodilalBJP) July 20, 2023 -
7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
అలస్కాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో యూఎస్లోని పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భూకంప తీవ్రత భూమిలోపల 9.3 కిలోమీటర్ల మేర సంభవించినట్లు పేర్కొన్నారు. అలస్కా ద్వీపకల్పంతో సహా అలూటియన్ దీవులు, కుక్ ఇన్లెట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు. అలస్కా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఉంది. తరచూ భూకంపాలకు నిలయంగా మారుతోంది. Notable quake, preliminary info: M 7.4 - 106 km S of Sand Point, Alaska https://t.co/ftepDWDKb7 — USGS Earthquakes (@USGS_Quakes) July 16, 2023 అలస్కాలో చివరిసారిగా అత్యధికంగా 1964లో 9.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. అలస్కా ద్వీపకల్పం, యూఎస్ పశ్చిమ తీరం, హవాలీని సునామీ అతలాకుతలం చేసింది. 250 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది. ఇదీ చదవండి: America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
మెక్సికోలో పెను భూకంపం..
మెక్సికో: మెక్సికోలో మరోసారి పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టంగానీ ఆస్తి నష్టంగానీ జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. మెక్సికో నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం సెంట్రల్ మెక్సికోలో తెల్లవారుజాము 2.00 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం భూమి ఉపరితలానికి సుమారు 10 కి.మీ లోతున సంభవించి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ.. మెక్సికోలో భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి సర్వసాధారణంగానే జరుగుతుంటాయి. గత నెలలోనే పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూకంపం వచ్చింది. మే 18న గ్వాటెమాల, దక్షిణ మెక్సికో ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత 6.6గా నమోదవ్వగా మే 25న పనామా-కొలంబియా సరిహద్దులో వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఈ రెండు సందర్భాల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదు. ఇది కూడా చదవండి: గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు! -
ఉత్తర భారతాన్ని వణికించిన భారీ భూకంపం..!
-
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం
-
ఉత్తరాదిని వణించిన భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.7గా నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1:30 తర్వాత సంభవించిన భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్లో ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్ని శ్రీనగర్లో భూమి బలంగా కంపించింది. దోడా జిల్లాలోని గండోహ్ భలెస్సా గ్రామ సమీపంలో 5.7 తీవ్రత నమోదైంది. మణిపూర్లో స్వల్పంగా భూమి కంపించగా.. పాకిస్థాన్లోని లాహోర్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంపం దాటికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని చూస్తుంటే భూకంపం ప్రభావంతో ఇంట్లోని వస్తువులు ఊగిపోతున్నట్లు కనిపిస్తుంది. కాగా ఆఫ్ఘనిస్తాన్లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో గత నెల చివర్లో ఢిల్లీలో తేలికపాటి ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. An earthquake of magnitude 5.7 on the Richter scale occurred 30km southeast of Kishtwar in Jammu & Kashmir: EMSC#Earthquake! #Delhi pic.twitter.com/K8WW2XjR6R — Siddhant Anand (@JournoSiddhant) June 13, 2023 Visuals of #earthquake in Lahore..! pic.twitter.com/UiWWKlaXLb — Adeel Asif 🇵🇰 (@AdeelAsifPk) June 13, 2023 Earthquake rocks Lahore pic.twitter.com/WyLASStX3W — Raftar (@raftardotcom) June 13, 2023 #earthquake felt in Delhi and northern part of India.pic.twitter.com/NRBm3zndwU — Amit Kumar 🇮🇳 (@Imamit521) June 13, 2023 -
Indonesia Earthquake: జావాను కుదిపేసిన భూకంపం
జకార్తా: భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఉత్తర ప్రాంతం వైపుగా జావా ద్వీపాన్ని భారీ ప్రకంపనలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(USGS) ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం భారీ ప్రకంపనలు జావా చుట్టుపక్కల కుదిపేశాయి. అయితే.. భూకంప కేంద్రం 594 కి.మీ లోతులో కేంద్రీకృతం కావడంతో సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అధికారులు చెప్తున్నారు. అయితే.. సురబయ, టుబాన్, డెన్పాసర్, సెమరాంగ్లలో ప్రకంపనల తీవ్రత స్పష్టంగా కనిపించిందని ఇండోనేషియా విపత్తు ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో నష్టంపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే.. USGS భూకం తీవ్రత 7గా నమోదు చేయగా.. మరోవైపు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మో లాజికల్ సెంటర్ (EMSC) భూకంపం 592 కిమీ (368 మైళ్ళు) లోతుతో 6.5 తీవ్రతను నమోదు చేసింది. -
జపాన్లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.1 తీవ్రత..
టోక్యో: జపాన్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. ఉత్తర్ జపాన్లోని అమోరిలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే భూకంపం కారణంగా ఏమైనా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందా? అనే విషయాలపై మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. భూకంప తీవ్రత భారీగా నమోదైనప్పటికీ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు' -
భారీ భూకంపం.. 11 మంది మృతి.. 170 మందికి పైగా గాయాలు
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన దాయాది దేశంలో నిత్యావసర నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. పాలు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్ వంటి ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతుండటంతో ఏం కొనలేక, తినలేక పాక్ ప్రజలు అల్లాడుతున్నారు. అడుగడుగున కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్కు ప్రకృతి విపత్తు రూపంలో మరో ఆపద చుట్టుముట్టింది. పాకిస్తాన్, అఫ్గనిస్తాస్తాన్లో పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదైంది. రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనాలు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడడంతో నివాసితులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాక్లో భూకంపం దాటికి ఇద్దరు మహిళలు సహా ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా 160 మందికిపైగా గాయపడ్డారు. అఫ్గనిస్తాన్ ఈశాన్య లాగ్మాన్ ప్రావిన్స్లో ఇద్దరు మరణించగా ఎనిమిదిమంది గాయపడ్డారు. #زلزله Allah Almighty protect our brothers and sisters. Prayers for Pakistan ⚫Powerful 7.7⚫#Earthquake#sialkot #Rawalpindi #lahore #Afghanistan #Turkey #Pakistan #astagfirullah pic.twitter.com/UFPvdwOXEp — ᴀʙᴅᴜʟRehman (@may_be_abdul) March 21, 2023 అఫ్గనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతం భూ ఉపరితలం నుంచి 187 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహట్, లక్కీ మార్వాట్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం నమోదైనట్లు పేర్కొంది. అదే విధంగా గుజ్రాన్వాలా, గుజరాత్, సియాల్కోట్, కోట్ మోమిన్, మద్ రంఝా, చక్వాల్, కోహట్, గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. BREAKING: Cracks appear in multiple buildings in Islamabad after strong earthquake hits Pakistan pic.twitter.com/wL812kN02Q — Truthseeker (@Xx17965797N) March 21, 2023 భూకంప విపత్తుపై స్పందించిన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులను ఆదేశించారు. అయితే పాక్లో భూకంపాలు సర్వసాధారణం. ఈ ఏడాది జనవరిలో ఇస్లామాబాద్లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2005లో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం 74,000 మందికిపైగా పొట్టనపెట్టుకుంది. Massive earthquake in Lahore#earthquake pic.twitter.com/nBxIJPKlny — Pakistan Tourism 🇵🇰 (@PakistanJannatt) March 21, 2023 అంతర్జాతీయ భూకంప కేంద్రం ప్రకారం.. పాకిస్తాన్తో పాటు, భారతదేశం, అఫ్గానిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోనూ మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలో సుమారు 2 నిమిషాల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లు, భవనాలు కదలడంతో తీవ్ర భయాందోళనకు గురైన జనాలు బయటకు పరుగులు తీశారు. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియరాలేదు. భూకంపం వల్ల జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల సేవలకు అంతరాయం కలిగింది. అఫ్గానిస్తాన్లోని ఫైజాబాద్కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడయ్యింది. -
కొమురంభీం జిల్లాలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు..
కౌటాల/చింతమానెపల్లి: చింతమానెపల్లి: కుమురం భీం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. కొద్ది సెకన్లపాటు వచ్చిన ప్రకంపనలతో ఆయా మండలాల ప్రజలు భయాందోళనలకు గుర య్యారు. సిర్పూర్(టి) నియోజకవర్గం కేంద్రంగా భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కాగా, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. కౌటాల, సిర్పూర్(టి), చింతల మానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోని వస్తువులు కింద పడటంతో గమనించిన పలువురు భయాందోళనలతో బయటకు పరుగెత్తారు. భూప్రకంపనల ద్వారా ఎలాంటి నష్టం లేదని, ప్రజలు భయాందోళనలకు గురికా వొద్దని అధికారులు తెలిపారు. చదవండి: ‘సిట్’ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు.. -
ఢిల్లీ సహా ఉత్తరాదిన పెను భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.6గా రికార్డయ్యింది. అఫ్గానిస్తాన్లోని హిందూకుషిలో భూఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలియజేసింది. రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియరాలేదు. భూకంపం వల్ల జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల సేవలకు అంతరాయం కలిగింది. అఫ్గానిస్తాన్లోని ఫైజాబాద్కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడయ్యింది. పాక్, అఫ్గాన్లో భారీ ప్రకంపనలు ఇస్లామాబాద్: భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్లో మంగళవారం రాత్రి బలమైన భూప్రకంపనలు నమోదయ్యాయి. ఇది రిక్టర్ స్కేల్పై 6.8గా రికార్డయ్యింది. పాకిస్తాన్లోని లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, జీలం, షేక్పురా, స్వాత్, ముల్తాన్, షాంగ్లా తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం అందలేదు. పాకిస్తాన్ భూకంప ప్రభావిత దేశమే. దేశంలో 2005లో సంభవించిన భూకంపం వల్ల 74,000 మంది మృతిచెందారు. -
Earthquake: ఈక్వెడార్లో భారీ భూకంపం.. 14 మంది మృతి..
పెరు, ఈక్వెడార్లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా మచాలా, క్యుయెన్సా నగరాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. భూప్రకంపనల ధాటికి జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా మొత్తం 14 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈక్వెడార్ అధ్యక్షుడు గ్విల్లెర్మో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మచాలాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇతర నగరాలను కూడా సందర్శిస్తానని చెప్పారు. చదవండి: కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది -
టర్కీలో మరోసారి భూకంపం
టర్కీ aka తుర్కియేను మరోసారి భూకంపం వణికించింది. శనివారం ఉదయం గోక్సన్ జిల్లాలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆ ప్రకంపనలతో భీతిల్లిన జనం వీధుల వెంట పరుగులు తీశారు. గోక్సన్ జిల్లాకు నైరుతి వైపున ఆరు కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రకంపనలు వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రకంపనల ధాటికి నష్టం ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి మొదటి వారంలో సంభవించిన భారీ భూకంపంతో ఇప్పట్లో కోలుకోలేని విధంగా టర్కీ నష్టపోయింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మరోవైపు టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియా సైతం భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. ఇదిలా ఉండగా.. టర్కీ భూకంప బాధితుల సహాయార్థం కేరళ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 10 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: కరోనా పుట్టుకపై మరో షాకింగ్ కోణం! -
తుర్కియే- సిరియా భూకంపాలు: కదిలే భూమిని కనిపెట్టలేమా!
మనిషి చూపులు అంతరిక్షం అంచులను తాకుతున్నాయి! కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఏముందో? ఏం జరుగుతుందో.. దుర్భిణుల సాయంతో ఇట్టే పసిగట్టగలుగుతున్నాం! కానీ.. మన కాళ్లకింద నేల లోపలి రహాస్యాలు మాత్రం.. ఇప్పటికీ చేతికి చిక్కకుండానే ఉన్నాయి! తుర్కియే- సిరియాల్లో ఇటీవలి భూకంపాలు రెండూ.. ఇందుకు తాజా నిదర్శనం! వాన రాకడ.. ప్రాణం పోకడలను కొంచెం అటు ఇటుగానైనా గుర్తించగల మానవ మేధ..భూకంపాల విషయానికి వచ్చేసరికి ఎందుకు విఫలమవుతోంది? ఫిబ్రవరి ఆరు.. 2023.. తెలతెలవారుతుండగానే తుర్కియే ఆగ్నేయ ప్రాంతాన్ని మహా భూకంపం కుదిపేసింది. ప్రజలింకా నిద్రలో ఉండగానే.. భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ముంచుకొచ్చిన ఈ విలయం తాకిడికి వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం గురించి ప్రపంచానికి తెలిసింది కూడా ప్రకంపనల ద్వారానే అంటేనే ఈ భూకంపాలు ఎంత నిశ్శబ్దంగా మనిషిని కబళించగలవో ఇట్టే అర్థమైపోతుంది. తుర్కియేలో తొలి భూకంపం సంభవించిన కొన్ని గంటల తరువాత సిరియా ఉత్తర ప్రాంతంలో సుమారు 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. రెండు భూకంపాల కేంద్రాలూ భూమికి అతితక్కువ లోతులోనే పుట్టాయి. దీంతో కదలికల తీవ్రత ఎక్కువగా ఉండింది. ప్రధాన భూకంపం తరువాత వచ్చిన ప్రకంపనలూ ఎక్కువ కాలం కొనసాగాయి. రక్షణ చర్యలకు విఘాతం కలిగించే స్థాయిలో ఇవి ఉండటం గమనార్హం. సహాయక పనుల కోసం అక్కడికి చేరుకున్న వారు కూడా.. నేల కుప్పకూలిపోవడం, గ్రౌండ్ లిక్విఫికేష¯Œ వంటి ప్రమాదాల్లో చిక్కుకునే రిస్క్ ఉందని అమెరికా జియలాజికల్ సర్వే హెచ్చరించింది కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించడం వీలైంది. 228 గంటల తరువాత కూడా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది కానీ.. అప్పటి నుంచి ఇప్పటివరకూ అందరి మనసులను.. ఈ భూకంపాలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయామన్న ప్రశ్న మాత్రం వేధిస్తూనే ఉంది. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపాలతో సుమారు 41 వేల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. గాజియాన్టెప్ పట్టణం సమీపంలో తొలి భూకంపం తరువాత కూడా పలుమార్లు భూమి కంపించింది. ఈ ఆఫ్టర్షాక్స్ మధ్యలోనే ఇంకో భూకంపమూ సంభవించింది. తొలి భూకంపం తీవ్రత 7.8. ఆ లెక్కల ప్రకారం ఇది చాలా పెద్ద భూకంపం. భూమి లోపల వంద కిలోమీటర్ల పొడవైన ఫాల్ట్లైన్ లో రావడంతో పరిసరాల్లోని భవనాలకు తీవ్ర నష్టం జరిగింది. ఏటా సంభవించే అత్యంత ప్రమాదకరమైన భూకంపాలను పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కేవలం రెండు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం, అంతకుముందు పదేళ్లలోనూ నాలుగు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం గమనార్హం. అలాగని కేవలం ప్రకంపనల ఫలితంగానే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే ప్రజలు ఇళ్లల్లో నిద్రలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకో కారణం.. ఆ ప్రాంతాల్లోని భవనాల దృఢత్వం! తుర్కియే, సిరియా.. రెండింటిలోనూ భూకంపాలను తట్టుకోగల భవనాలు దాదాపుగా లేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 200 ఏళ్లుగా భూకంపాల్లేవు.. తుర్కియే, సిరియాల్లో గత 200 ఏళ్లుగా చెప్పుకోదగ్గ తీవ్రతతో భూకంపాలు లేవు. పోనీ చిన్నస్థాయిలోనైనా ప్రకంపనలేవైనా నమోదయ్యాయా? అంటే అదీ లేదు. దీంతో ఆ ప్రాంతంలో భూకంపాల సన్నద్ధత కూడా తక్కువగానే ఉండింది. 1970 నుంచి ఈ ప్రాంతంలో ఆరు కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు మూడే మూడు నమోదయ్యాయి. ఇంతకీ భూకంపాలు ఎందుకొస్తాయి? ఎలా వస్తాయన్న అనుమానం కలుగుతోందా? సమాధానాలు తెలుసుకుందాం! కాకపోతే ఇందుకోసం భూమి నిర్మాణాన్ని కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ మాదిరిగానే భూమి కూడా పొరలు పొరలుగా ఉంటుందని మనం చదువుకుని ఉంటాం. ఈ పొరల్లో అన్నింటికంటే పైన ఉన్నదాన్ని క్రస్ట్ అంటారు. మన కాళ్ల కింద మొదలై కొన్ని కిలోమీటర్ల లోతు వరకూ ఉంటుంది ఈ పొర. దాని దిగువన మాంటెల్, అంతకంటే దిగువన కోర్ అని పేర్లున్న పొరలు ఉంటాయి. ఇప్పుడు పై పొర క్రస్ట్ గురించి కొంచెం వివరంగా.. భూమి మొత్తం ఇది ఒకే ఒక్కటిగా ఉండదు. ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఒక్కో ముక్కను టెక్టానిక్ ప్లేట్ అని అంటారు. ఈ ప్లేట్లు స్థిరంగా కాకుండా.. కదులుతూ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్లు కదిలే క్రమంలో ఘర్షణ పుడుతూంటుంది. రెండు ప్లేట్లు ఢీకొనడం.. లేదా ఒకదాని కిందకు ఒకటి చేరడం.. లేదా ఒకదానికి ఒకటి దూరంగా జరగడం వంటి నాలుగు రకాల కదలికల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఘర్షణ జరగుతూ ఉంటుంది. అత్యధిక పీడనం నిల్వ అవుతూ వస్తుంది. ఈ పీడనం కారణంగా ఒక్కోసారి ఒక ప్లేట్ అకస్మాత్తుగా ఇంకోదానిపై జరగడం వల్ల అప్పటివరకూ అక్కడ నిల్వ ఉన్న పీడనం భూకంపం రూపంలో విడుదల అవుతుంది. తుర్కియే, సిరియాల్లో భూకంపాలు సంభవించిన ప్రాంతం మూడు టెక్టానిక్ ప్లేట్ల సంగమ స్థలం. అనటోలియా, అరేబియన్ , ఆఫ్రికా ప్లేట్లు కలిసే చోటనే భూకంపాలు సంభవించాయి. అరేబియా ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్ ప్లేట్పై ఒత్తిడి తెచ్చిన కారణంగా భూకంపం సంభవించింది. 1822 ఆగస్టు 13న ఈ ప్రాంతంలోనే 7.4 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఆ తరువాత ఆ స్థాయి భూకంపం వచ్చింది ఈ ఏడాదే. 1822 నాటి భూకంపంలోనూ ఈ ప్రాంతంలో ప్రాణనష్టం, విధ్వంసం ఎక్కువగానే నమోదైంది. ఒక్క అలెప్పో నగరంలోనే 7000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏడాది పాటు కొనసాగిన ప్రకంపనలు మరింత విధ్వంసం సృష్టించాయి. తాజాగానూ ప్రకంపనలు మరికొంత కాలం కొనసాగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయాం? వాస్తవానికి భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి టెక్నాలజీ లేదు. చాలా చాలా కష్టమైన వ్యవహారమీ భూకంపాలు. భూకంపం జరిగిన తరువాత కూడా కేవలం ఒకట్రెండు నిమిషాలు మాత్రమే దాని సంకేతాలు మనకు తెలుస్తూంటాయి. అందుకే భూకంపాల గురించి తెలిసే ఈ అతికొద్ది సమాచారం ఆధారంగా వాటిని ముందుగానే గుర్తించడం పెను సవాలుగా మారింది. నిజానికి 1960ల నుంచే భూకంపాలను ముందుగా గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. టెక్టానిక్ ప్లేట్ల అమరిక, లోటుపాట్లు (ఫాల్ట్లైన్స్) అత్యంత సంక్లిష్టంగా ఉన్న కారణంగా ఇప్పటివరకూ సాధించింది కొంతే. ప్రపంచం మొత్తం వ్యాపించిన ఫాల్ట్లైన్లకు తోడు భూమి లోపలి నుంచి పలు రకాల శబ్దాలు, సంకేతాలు వెలువడుతూండటం కూడా పరిస్థితిని మరింత జటిలం చేశాయి. భూకంపం ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? తీవ్రత ఎంత? అన్న మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగల పద్ధతిని ఆవిష్కరించగలిగితే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఇప్పటివరకూ ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. జంతువుల ప్రవర్తన నుంచి అయనోస్ఫియర్ వరకూ.. భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అనేక ప్రయత్నాలు చేశారు. భూకంపం వచ్చే ముందు జంతువులు ప్రవర్తించే తీరుతో మొదలుపెట్టి భూ వాతావరణపు పైపొర అయనోస్ఫియర్లోని కణాల పరిశీలన వరకూ అనేక రకాలుగా యత్నిస్తున్నారు. తాజాగా మనుషులు గుర్తించలేరేమో అని.. సూక్ష్మమైన సంకేతాలను గుర్తించేందుకు కృత్రిమ మేధను వాడే ప్రయత్నమూ జరుగుతోంది. భూమి మాదిరిగానే ఉండే మోడల్ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్ సాయంతో ఇటలీలోని సేపియేంజా యూనివర్సిటీ అధ్యాపకుడు క్రిస్ మరోన్ ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశోధనశాలలో తాము భూకంపాలను బాగానే గుర్తించగలగుతున్నామని, వాస్తవ పరిస్థితుల్లో మాత్రం విఫలమవుతున్నామని మరోన్ తెలిపారు. చైనాలో శాస్త్రవేత్తలు అయనోస్ఫియర్లో విద్యుదావేశంతో కూడిన కణాలు భూకంపాల వల్ల ఏవైనా కంపనలు సృష్టించాయా? వాటి ద్వారా ముందస్తు గుర్తింపు వీలవుతుందా? అన్నది పరిశీలిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఫోర్క్యాస్టింగ్కు చెందిన జింగ్ లియూ అంచనా ప్రకారం భూకంపానికి ముందు రోజుల్లో అయనోస్ఫియర్లో మార్పులు జరుగుతాయి. ఫాల్ట్ జోన్ల ప్రాంతం పైన భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు రావడం వల్ల విద్యుదావేశ కణాలు కంపనలు సృష్టిస్తాయి. 2010 ఏప్రిల్లో కాలిఫోర్నియాలోని బాజా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దానికి పది రోజుల ముందే అయనోస్ఫియర్లో మార్పులను గమనించామని ఆయన చెబుతున్నారు. చైనా ఇంకో అడుగు ముందుకేసి అయనోస్ఫియర్లో జరిగే ఎలక్ట్రికల్ తేడాలను గుర్తించేందుకు 2018లో ‘చైనా సెసిమో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శాటిలైట్’ను ప్రయోగించింది కూడా. గత ఏడాది చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్ సెంటర్ శాస్త్రవేత్తలు ఒక ప్రకటన చేస్తూ భూకంపానికి 15 రోజుల ముందు అయనోస్ఫియర్లోని ఎలక్ట్రాన్ల సాంద్రత గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2021 మే, 2022 జనవరి నెలల్లో చైనాలో వచ్చిన భూకంపాలకు ముందు ఈ పరిశీలనలు జరిగాయి. ఇజ్రాయెల్లోని ఏరియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము భూకంపాలను 48 గంటల ముందే 83 శాతం కచ్చితత్వంతో గుర్తించగలమని ఇటీవలే ప్రకటించారు. గత 20 ఏళ్లలో అయనోస్ఫియర్లోని ఎలక్ట్రాన్ కంటెంట్లో వచ్చిన మార్పులకు కృత్రిమ మేధను జోడించడం ద్వారా ఇది సాధ్యమైందని వారు చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. జపాన్లో కొంతమంది కొన్ని విచిత్రమైన సూచనలు చేస్తున్నారు. భూకంపాలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో నీటి ఆవిరి ఆధారంగా భూకంపాలను ముందుగానే గుర్తించవచ్చునని, అది కూడా 70 శాతం కచ్చితత్వంతో చేయవచ్చునని చెబుతూండటం విశేషం. కాకపోతే ఈ పద్ధతిలో నెల రోజులు ముందు మాత్రమే భూకంపాన్ని గుర్తించ వచ్చు. మరికొందరు భూ గురుత్వాకర్షణ శక్తిలో వచ్చే మార్పుల ఆధారంగా భూకంపాలను గుర్తించవచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే.. శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ భూకంపాలను అవి సంభవించేందుకు ముందుగానే కచ్చితంగా గుర్తించడం సాధ్యంకావడం లేదనేది నిష్ఠుర సత్యం!! మీకు తెలుసా..? ► యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే లెక్కల ప్రకారం భూమి ఏటా కొన్ని లక్షల సార్లు కంపిస్తూంటుంది. వీటిల్లో చాలావాటిని మనం అస్సలు గుర్తించం. తీవ్రత తక్కువగా ఉండటం, లేదా జనావాసాలకు దూరంగా సంభవించడం దీనికి కారణం. అయితే ఏటా సంభవించే భూకంపాల్లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగినవని దాదాపు 17 వరకూ ఉంటాయి. ఎనిమిది స్థాయి తీవ్రత ఉన్నది ఒక్కటైనా ఉంటుంది. ► టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా హిమాలయాల ఎత్తు పెరుగుతోందని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. అలాగే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం మొత్తం లాస్ ఏంజిలెస్ వైపు కదులుతోంది. మన గోళ్లు పెరిగినంత వేగంగా అంటే ఏడాదికి రెండు అంగుళాల చొప్పున ఈ కదలిక ఉన్నట్లు అంచనా. సా¯Œ ఆండ్రియాస్ ఫాల్ట్ రెండు వైపులు ఒకదాని కింద ఒకటి జారిపోతూండటం వల్ల ఇలా జరుగుతోంది. అయితే ఈ రెండు నగరాలు కలిసిపోయేందుకు ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల సమయం ఉందిలెండి! ► 2011 మార్చి 11న జపాన్ తీరంలో 8.9 తీవ్రతతో వచ్చిన భూకంపం మన రోజు లెక్కను మార్చేసింది. భూమిలోపలి పదార్థం పంపిణీ అయిన తీరులో భూకంపం మార్పు తేవడంతో భూమి కొంచెం వేగంగా ► భూకంపం తరువాత ఆ ప్రాంతాల్లోని కాలువలు, చెరువుల్లోని నీరు కొంచెం కంపు కొడతాయి. అడుగున ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదిలినప్పుడు అక్కడ చిక్కుకుపోయి ఉన్న వాయువులు పైకి రావడం దీనికి కారణం. ► 2010 ఫిబ్రవరి 27న సంభవించిన 8.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా చిలీలోని కోన్ సెప్కియాన్ నగరం పశ్చిమం దిక్కుగా సుమారు పది అడుగులు జరిగింది! మొత్తం భూకంపాల్లో 90 శాతం పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి వస్తూంటాయి. ► 2015లో నేపాల్లో వచ్చిన 7.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా పలు హిమాలయ పర్వతాలు కుంగిపోయాయి. ఇందులో ఎవరెస్టు కూడా ఉంది. కనీసం ఒక్క అంగుళం మేర దీని ఎత్తు తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
టర్కీ, సిరియా భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య
అంకారా: టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు రెండు దేశాల్లో 50,000పైగా మృతి చెందారు. ఒక్క టర్కీలోనే 44,218 మంది మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. అదే విధంగా సిరియాలో 5,914 మంది మృతి చెందినట్లు తెలిపారు. దీంతో రెండు దేశాల్లో కలిపి మరణించిన వారి సంఖ్య 50 వేలు దాటింది. కాగా ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో సెను భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత హృదయ విదారకమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఇదీ ఒకటి. తెలవారుతూండగానే 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఘోర విపత్తులో ఎత్తైన భవనాలు నెలకొరిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 1,60,000 భవనాలు, 5,20,000 అపార్టుమెంట్లు ధ్వంసమవడం లేదా దెబ్బతినడం జరిగిందని అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే ఇంతటి విషాదం తర్వాత కూడా టర్కీలో పలుమార్లు మళ్లీ భూకంపాలు నమోదవ్వడం గమనార్హం. -
ఉత్తర భారతంలో స్వల్ప భూకంపం
సాక్షి, ఢిల్లీ: ఉత్తర భారత దేశంలో రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల సహా పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి కంపించింది. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంపం కేంద్రం ఉత్తరాఖండ్ ఫితోరాగఢ్లో పదికిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఉదయం పొరుగు దేశం నేపాల్లో భూమి స్వల్పంగా కంపించగా.. ఆ ప్రభావం నార్త్ ఇండియాలో చూపించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతాల్లోనూ నిన్న భూమి స్వల్పంగా కంపించింది కూడా. Earthquake of Magnitude:4.4, Occurred on 22-02-2023, 13:30:23 IST, Lat:29.56 & Long:81.70, Depth: 10 Km ,Location: 143km E of Pithoragarh, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/MNTAXJS0EJ@Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/ovDBNhb7VO — National Center for Seismology (@NCS_Earthquake) February 22, 2023 -
టర్కీలో మళ్లీ భూకంపం.. ముగ్గురు మృతి.. 200 మందికి గాయాలు..
ఇస్తాన్బుల్: టర్కీ, సిరియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. హతాయ్ ప్రావిన్స్ డిఫ్నీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ముడు అపార్ట్మెంట్లు కూలిపోయాయి. ముగ్గురు చనిపోయారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. భూకంపం సంభవించింది సరిహద్దు ప్రాంతం కావడంతో సిరియాలోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఆరుగురు గాయపడ్డారు. Moment of the earthquake from Kayseri #Turkey #turkiyeearthquake pic.twitter.com/NoDuZ1iEll — Mandy Ricci (@ADV561SDV56) February 21, 2023 రెండు వారాల క్రితమే టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. వేల భవనాలు కుప్పకూలి 47,000 మందికిపైగా చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.. ఇప్పుడు మళ్లీ భూకంపం రావడం ఆందోళనకు గురిచేస్తోంది. #Turkey 🇹🇷#turkeyearthquake2023 New earthquakes in Turkey in the city of Hatay shook the south of the country. from 6.4, 6.2. There were deaths as well as missing and thousands of wounded. It was announced that a new tsunami is coming in Iskenderum among others city.👇🏻 pic.twitter.com/vq5DROI1Vz — Daniel Von Sáenz ☭⃠🇵🇪🇯🇪🇩🇪➕️ (@DanielS12576850) February 21, 2023 అయితే తాజాగా భూకంపం వచ్చిన ప్రాంతంలో జనాలు ఎక్కువగా నివసించడం లేదని అధికారులు పేర్కొన్నారు. గత భూకంపంలో కూలిపోయిన తమ ఇళ్ల నుంచి సామాన్లు, వస్తువులు తీసుకోవాడనికి వెళ్లి ఉంటారని చెప్పారు. New,Bandara di Hatay #Turkey diguncang gempa M6.4 kedalaman 10km senin,20/02/2023 air laut surut.#turkeyearthquake2023 #TurkeySyriaEarthquake2023 pic.twitter.com/lOztUAAHyw — 📿 frenkyf¹ (@frenkyfi) February 21, 2023 చదవండి: విద్వేషమే విడదీసింది! కొరియన్ యుద్ధానికి కారణమెవరు? చివరకు మిగిలింది -
టర్కీ భూకంపం.. రెండుగా చీలిన గ్రామం..13 అడుగులు కుంగిన ఇళ్లు
ఇస్తాన్బుల్: టర్కీలో ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపం 11 రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 46వేల మందికిపైగా మరణించారు. అయితే ఈ భూకంపం కారణంగా హతాయ్ రాష్ట్రంలోని డెమిర్కోప్రు అనే గ్రామం రెండుగా చీలీపోయిది. భూప్రంకనల ధాటికి భారీ పగుళ్లు వచ్చి ఇక్కడి ఇళ్లు భూమిలోకి 13 అడుగుల మేర కుంగిపోయాయి. ఈ కారణంగా భూకంపం ముందు రోడ్డపక్కన కన్పించిన ఇళ్లు ఇప్పుడు మాయమయ్యాయి. 1000 మంది నివసించే ఈ గ్రామంలో ఇళ్లన్నీ కుంగిపోయాయి. ఎటు చూసినా శిథిలాలు, నేలకూలిన చెట్లు, మురికి నీరే కన్పిస్తోంది. తన ఇల్లు 4 మీటర్ల లోతులోకి కుంగిపోయిందని 42 ఏళ్ల మహిర్ కరటాస్ అనే వ్యక్తి వెల్లడించాడు. ఈ గ్రామంలో తొలినాళ్లలోనే ఈయన ఇల్లు కట్టుకున్నాడు. అదృష్టవశాత్తు గ్రామంలో ఎవరూ చనిపోలేదని, కానీ చాలామందికి గాయాలయ్యాయని వివరించాడు. భూకంపం వచ్చినప్పుడు ఈ గ్రామంలోని ప్రజలు ఇళ్ల కిటికీల నుంచి బయటకు దూకేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీసి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. భూప్రకంపనల వల్ల ఈ గ్రామంలోని ఓ పశువుల కొట్టం కూడా కుంగిపోయింది. దాని మధ్యలో చీలికలు వచ్చాయి. దీంతో ఓ ఆవు అందులోనే కూరుకుపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి.. -
టర్కీ భూకంపం.. మృత్యువుతో పోరాడి ఓడిన స్టార్ ఫుట్బాలర్
ఫుట్బాల్లో విషాదం నెలకొంది. టర్కీలో సంభవించిన భూకంపంలో శిథిలాల కింద చిక్కుకున్న ఘనా ఫుట్బాలర్ క్రిస్టియన్ అట్సూ 11 రోజులు మృత్యువుతో పోరాడి శనివారం(ఫిబ్రవరి 18న) కన్నుమూశాడు. క్రిస్టియన్ అట్సూ మృతిని ఘనా ఫుట్బాల్ అధికారికంగా ప్రకటించింది. ''ఈ విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం. మృత్యువుతో పోరాడి అలసిపోయిన క్రిస్టియన్ అట్సూ ఇవాళ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి.'' అంటూ నానా సెక్కెర్ ట్వీట్ చేశారు. ఇక టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పావుగంట వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. ఇప్పటికే మృతుల సంఖ్య 20వేలు దాటింది. ప్రస్తుతం అతను టర్కీష్ సూపర్ క్లబ్ హట్సేపోర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్ అట్సు సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటే ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్నాడు. ఫిబ్రవరి 7న రెస్క్యూ టీమ్ వచ్చి అట్సూను శిథిలాల నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఇన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అట్సూకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి చనిపోయినట్లు వైద్యలు దృవీకరించారు. అట్సు చెల్సియా ఫుట్బాల్ క్లబ్కు కూడా గతంలో ప్రాతినిధ్యం వహించాడు. న్యూక్యాసిల్కు ఐదేళ్ల పాటు ఆడిన క్రిస్టియన్ అట్సు 2021లో సౌదీ అరేబియా క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే టర్కీష్ ఫుట్బాల్ క్లబ్కు మారాడు. ఇక ఘనా తరపున 65 మ్యాచ్లాడిన అట్సూ 9 గోల్స్ చేశాడు. It is with the heaviest of hearts that I have to announce to all well wishers that sadly Christian Atsu’s body was recovered this morning My deepest condolences go to his family and loved ones. I would like to take this opportunity to thank everyone for their prayers and support — Nana Sechere (@iAmNana7) February 18, 2023 -
న్యూజిలాండ్ను వణికిస్తున్న సైక్లోన్ గాబ్రియెల్
-
శిథిలాల్లో 'అద్భుతం'.. 228 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడి..
తుర్కియే, సిరిమాలో సంభవించిన వరుస భూకంపాలు మాటలకందని విషాదాన్ని నింపాయి. ఘోర విపత్తు తలెత్తి 9 రోజులు అవుతున్నా.. నేటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాల శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే దర్శనమిస్తున్నాయి. భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.. వేలాది మంది విగతా జీవులుగా మారారు. మరికొందరు అయిన వారిని కోల్పోయి అనాథలుగా మిగిలారు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి! ఘోర మృత్యుకంపం ధాటికి ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. మొత్తంగా భారీ భూకంపం రెండు దేశాల్లో పూడ్చుకోలేని నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే ఇప్పటికీ పలుచోట్ల చిన్నారులు, మహిళలతో సహా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అద్భుతమనే చెప్పాలి. భూకంపం వచ్చిన 9 రోజుల తర్వాత కూడా ఇద్దరు మహిళలు సజీవంగా బయటపడ్డారు. తుర్కియేలోని కహ్రామన్మారస్లో శిథిలాల కింద చిక్కుకున్న 45 ఏళ్ల మెలికే ఇమామోగ్లు, 74 ఏళ్ల సెమిలే కెకెక్ అనే ఇద్దరి మహిళలను రెస్క్యూ సిబ్బంది బుధవారం సురక్షితంగా బయటకు తీశారు. మహిళను రక్షించి అంబులెన్స్లో ఆసపత్రికి తరలిస్తున్న దృశ్యాలను డారికా మేయర్ ముజాఫర్ బియిక్ షేర్ చేశారు. మరోవైపు భూకంపాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన మరో తుర్కియే నగరం అంటాక్యాలో 228 గంటల తర్వాత (గురువారం) శిథిలాల కింద నుంచి ఎరిల్మాజ్ అనే మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను సజీవంగా బయటకు తీశారు. రక్షించిన సిబ్బందితో మొదటగా ఆమె ‘ఇది ఏ రోజు’ అని అడగటం గమనార్హం. అంతేగాక తుర్కియేలో ధ్వంసమైన భవనం శిథిలాల నుంచి ముస్తఫా అనే 13 ఏళ్ల బాలుడిని రక్షించారు. సుమారు 74 దేశాలకు చెందిన సహాయక బృందాలు ప్రజలను ప్రాణాలతో కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తుర్కియే ప్రభుత్వం తెలిపింది. Kahramanmaraş Dulkadiroğlu ilçesinde arama-kurtarma çalışmaları 9. günde de devam ediyor. Depremin 226. saatinde ekiplerimizin çalışmalarıyla enkaz altından canlı olarak çıkartılan 74 yaşındaki Cemile Kekeç teyzemizin kurtarma çalışmalarına şahitlik ettik. 📍Kahramanmaraş pic.twitter.com/PtL7XOcDo6 — Muzaffer Bıyık (@muzafferbiyik) February 15, 2023 -
టర్కీ భూకంపంలో వేలకు పైగా అనాథలైన చిన్నారులు
-
న్యూజిలాండ్లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.1 తీవ్రత
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో బుధావరం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. పరాపరౌముకు వాయవ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత 15 నిమిషాల్లోనే 31వేల మంది తాము ఉన్న చోట్ల భూమి కంపించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 30 సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే భూకంపం కారణంగా ఏమైనా ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై స్పష్టత లేదు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెప్పారు. A 6.2 magnitude earthquake has struck near the city of Wellington in New Zealand. #earthquake #NewZealand #Wellington #earthquakes pic.twitter.com/GQ2esClqa4 — Dp Rathi (@rathi_dp) February 15, 2023 న్యూజిలాండ్లో ఇప్పటికే సైక్లోన్ గేబ్రిల్లే విధ్వంసం సృష్టిస్తోంది. దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. వివిధ ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో10,500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో భూకంపం రూపంలో మరో ఉపద్రవం రావడం న్యూజిలాండ్ను కలవరపాటుకు గురిచేస్తోంది. #NewZealand Now 6.1 magnitude #earthquake in New Zealand , people in shock@IsraelinNZ @nytimes @nytimesworld @BBCWorld @CNN #ValentinesDay #joker2 #SUGA_AgustD_TOUR #ChampionsLeague #BabarAzam𓃵 #บิวเป็นพีทที่สมบูรณ์แบบ #14february #mha380 #AgustD #หวานใจมิวกลัฟ #Quantumania pic.twitter.com/6WbDovUPbY — Journalist Amit kumar 'देव' (@AmitKum995) February 15, 2023 A state of emergency has been declared in New Zealand as 'unprecedented' storm lashes North Island. Read more: https://t.co/zt61o4VdId pic.twitter.com/ETJiaE738Z — SBS News (@SBSNews) February 14, 2023 New Zealand has declared a state of national emergency in the wake of Cyclone Gabrielle. Take a look at the extent of the flooding in Hawke's Bay, NZ:pic.twitter.com/KXAt9hs3lC — Steve Hanke (@steve_hanke) February 14, 2023 New Zealand declared a state of emergency for only the third time in its history after Cyclone Gabrielle flooded parts of the country. The cyclone cut power to 225,000 residents, stranded people on rooftops and swept at least one sailor out to sea. https://t.co/fLzWhOlL7Q pic.twitter.com/581xvHSHCk — The New York Times (@nytimes) February 15, 2023 చదవండి: లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న భర్త.. దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య..! -
Turkey and Syria Earthquake: బాల్యం శిథిలం
అమ్మ పొత్తిళ్లలో హాయిగా పడుకోవాల్సిన అభం శుభం తెలియని పసికందులు అందరినీ కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఎందుకీ విపత్తు ముంచుకొచ్చిందో తెలీక నిలువ నీడ లేక ఎందుకు రోడ్లపైకొచ్చామో అర్థం కాక బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం ఎందరో చిన్నారుల్ని అనాథల్ని చేసింది. వీరిలో చాలా మంది రోజుల పసికందులే. ఇప్పటికే అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న సిరియాలో భూకంపం పిల్లల నెత్తిన పిడుగుపాటులా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, అధికార కాంక్షతో మానవులు చేస్తున్న యుద్ధాలు చిన్నారులకు ఎలా శాపంగా మారుతున్నాయి..? తుర్కియే భూకంపంలో శిథిలాల మధ్యే ఒక పసిపాప భూమ్మీదకొచ్చింది. బిడ్డకి జన్మనిచ్చిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోవడంతో పుడుతూనే అనాథగా మారింది. అయా (అరబిక్ భాషలో మిరాకిల్) అని పేరు పెట్టి ప్రస్తుతానికి ఆస్పత్రి సిబ్బందే ఆ బిడ్డ ఆలనా పాలనా చూస్తున్నారు. ఈ రెండు దేశాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటే ఎక్కువగా పిల్లలే శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటకి వస్తున్నారు. 10 రోజుల నుంచి 14 ఏళ్ల వయసున్న వారి వరకూ ప్రతీ రోజూ ఎందరో పిల్లలు ప్రాణాలతో బయటకి వస్తున్నారు. వారంతా తల్లిదండ్రులు, బంధువుల్ని కోల్పోయి అనాథలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిన్నారులకు అండగా యునిసెఫ్ బృందం తుర్కియే చేరుకుంది. తుర్కియేలో 10 ప్రావిన్స్లలో 46 లక్షల మంది చిన్నారులపై ప్రభావం పడిందని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పారు. సిరియాలో బాలల దురవస్థ పన్నెండేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో ఇప్పటికే చిన్నారులు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణంలో గత పదేళ్లలో సిరియాలో 50 లక్షల మంది జన్మిస్తే వారిలో మూడో వంతు మంది మానసిక సమస్యలతో నలిగిపోతున్నారు. బాంబు దాడుల్లో ఇప్పటికే 13 వేల మంది మరణించారు. పులి మీద పుట్రలా ఈ భూకంపం ఎంత విలయాన్ని సృష్టించిందంటే 25 లక్షల మంది పిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసినట్టుగా యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఇంతమందికి సరైన దారి చూపడం సవాలుగా మారనుంది. పిల్లల భవిష్యత్తుకి చేయాల్సింది ఇదే.! ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విద్య, సంక్షేమం కోసం కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యునిసెఫ్ ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, కరువు, పేదరికం ఎదుర్కొనే దేశాల్లో పిల్లలకి భద్రమైన భవిష్యత్ కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది... ► ప్రభుత్వాలు యూనివర్సల్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్లతో పిల్లలకు ప్రతి నెలా ఆదాయం వచ్చేలా చూడాలి. ► శరణార్థులు సహా అవసరంలో ఉన్న పిల్లలందరికీ సామాజిక సాయం అందేలా చర్యలు చేపట్టాలి. ► ప్రకృతి వైపరీత్యాల ముప్పున్న ప్రాంతాలతో పాటు , ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల్లో సంక్షేమ వ్యయాన్ని వీలైనంత వరకు పరిరక్షించాలి. ► పిల్లల చదువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు బడి బాట పట్టేలా చర్యలు తీసుకోవాలి. ► మాత శిశు సంరక్షణ, పోషకాహారం అందించడం. ► బాధిత కుటుంబాలకు మూడు పూటలా కడుపు నిండేలా నిత్యావసరాలపై ధరల నియంత్రణ ప్రవేశపెట్టాలి. చిన్నారులపై పడే ప్రభావాలు ► ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులతో ప్రభావానికి లోనయ్యే పిల్లల సంఖ్య సగటున ఏడాదికి 17.5 కోట్లుగా ఉంటోందని యునెస్కో గణాంకాలు చెబుతున్నాయి. ► ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలతో ఒంటరైన పిల్లలు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల వారిలో పెరుగుదల ఆరోగ్యంగా ఉండదు. ఇలా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిన పిల్లల్లో 18% వరకు ఉంటారు. ► 50% మంది పిల్లలు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. భూకంపం వంటి ముప్పులు సంభవించినప్పుడు గంటల తరబడి శిథిలాల మధ్య ఉండిపోవడం వల్ల ఏర్పడ్డ భయాందోళనలు వారిని చాలా కాలం వెంటాడుతాయి. ► సమాజంలో ఛీత్కారాలు దోపిడీ, దూషణలు, హింస ఎదుర్కొంటారు. బాలికలకు ట్రాఫికింగ్ ముప్పు! ► తుఫాన్లు, వరదలు, భూకంపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. ► 2021లో ప్రకృతి వైపరీత్యాలు, ఉక్రెయిన్ వంటి యుద్ధాల కారణంగా 3.7 కోట్ల మంది పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
37 వేలు దాటిన భూకంప మృతులు.. లక్ష దాటే అవకాశం..!
ఇస్తాన్బుల్: తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 37వేలకు చేరింది. ఇందులో టర్కీకి చెందిన వారు 31,643 మంది కాగా.. సిరియాకు చెందిన వారు 5,814 మంది అని అధికారులు తెలిపారు. శిథిలాలు మొత్తం తొలగిస్తే మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా.. టర్కీ, సిరియాకు ఇతర దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలతో సాయం అందిస్తున్నాయి. టర్కీకి ఇప్పటికే భారత్ వైద్య, రెస్క్యూ బృందాలను పంపింది. మరోవైపు సిరియాకు రష్యా సాయం చేస్తోంది. ఆ దేశానికి చెందిన 300 మంది సైనికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. pawsitivepawsrescues Miracle, after 7 days, this pittie survived buried from the earthquake in turkey! #Turkey #turkey🇹🇷 #Earthquake #survivor pic.twitter.com/lGjPVd2ksV — Rob Cardella (@RobertoCardel18) February 14, 2023 #Turkey Antakya before and after the devastating #earthquake pic.twitter.com/HolDmYrbRO — AlAudhli العوذلي (@AAudhli) February 14, 2023 చదవండి: అమెరికా మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి -
Turkey-Syria earthquake: భూకంప మృతులు 35,000
అదియామాన్: తుర్కియే, సిరియాలో వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా 35,000 మందిపైగా మరణించారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కొందరు శిథిలాల్లో చిక్కుకొని సజీవంగా బయటపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తుర్కియేలోని దక్షిణ హతాయ్ ప్రావిన్స్లో 13 ఏళ్ల బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. తుర్కియేలో ఉష్ణోగ్రత మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వాపోతున్నారు. భూకంపం వల్ల తుర్కియేకు 84.1 బిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లినట్లు టర్కిష్ ఎంటర్ప్రైజ్ అండ్ బిజినెస్ కాన్ఫెడరేషన్ అంచనా వేసింది. -
వైరల్ వీడియో: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
-
Turkey-Syria Earthquake: టర్కీ సహాయక చర్యల్లో అద్భుతాలు
-
శిథిలాల కింద 90 గంటలపాటు సజీవంగా 10 రోజుల పసికందు
-
కోలుకోక ముందే దెబ్బ మీద దెబ్బ.. టర్కీలో మరోసారి భూకంపం..
ఇస్తాంబుల్: గత సోమవారం సంభవించిన భారీ భూకంపంతో కకావికలమైన టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలుచోట్ల భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దక్షిణ టర్కీ నగరం కహ్రమన్మరాస్ సమీపంలో 15.7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల భవనాలు కూలిపోయినట్లు గానీ, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. 34వేలకు పెరిగిన మృతులు.. తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 34వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. వేల మంది గాయపడినట్లు చెప్పారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు టర్కీ హతాయ్ ఎయిర్పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దెబ్బతిన్న రన్వేను రిపేర్ చేసినట్లు చెప్పారు. దొంగతనాలు.. భూకంపం కారణంగా సర్వస్వం కోల్పోయి వేల మంది ప్రజలు నిరాశ్రయులైతే.. మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలో చొరబడి వస్తువులు, నగలు, డబ్బులు దోచుకెళ్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నందున దొంగలపై కఠిన చర్యలు తప్పవని అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ హెచ్చరించారు. సాధారణంగా వాళ్లకు ఒక్కరోజు ఉండె జైలు నిర్భంధం ఇప్పుడు నాలుగు రోజులకు పెరిగినట్లు గుర్తు చేశారు. లూటీలకు పాల్పడిన 57 మందిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. చదవండి: మరో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన అమెరికా..వారంలో నాలుగోది! -
భారత్లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు..
న్యూఢిల్లీ: తుర్కియే, సిరియాలో భారీ భూకంపం అనంతరం భారత్లో కూడా భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణలు అంచనావేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవి నిజరూపం దాల్చుతున్నాయి. దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. గుజరాత్లో శనివారం, అస్సాంలో ఆదివారం భూప్రకంపనలు రాగా.. తాజాగా సోమవారం ఉదయం సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 4.3 తీవ్రత నమోదైంది. ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని యుక్సోం ప్రాంతంలో 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం ట్విట్టర్లో తెలిపింది. ఉదయం 4:15 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు పేర్కొంది. Earthquake of Magnitude:4.3, Occurred on 13-02-2023, 04:15:04 IST, Lat: 27.81 & Long: 87.71, Depth: 10 Km ,Location: 70km NW of Yuksom, Sikkim, India for more information Download the BhooKamp App https://t.co/FgmIkxe9Q2@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/1FuxFI7Ire — National Center for Seismology (@NCS_Earthquake) February 13, 2023 అస్సాం, గుజరాత్లోనూ ఆదివారం అస్సాంలోనూ భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. అంతుకుముందు రోజు గుజరాత్ సూరత్లోనూ 3.8 తీవ్రతో భూమి కంపించింది. దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. మనకు ముప్పు ఎంత? -
అదే దైన్యం..! కోలుకోని తుర్కియే, సిరియా.. 33 వేలు దాటిన మృతుల సంఖ్య
అంటాక్యా (తుర్కియే): ఆరు రోజులు గడిచినా భూకంప ప్రకోపం ప్రభావం నుంచి తుర్కియే, సిరియా ఏమాత్రమూ తేరుకోలేదు. కుప్పకూలిన వేలాది భవనాల శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. మరోవైపు లక్షలాది మంది సర్వం పోగొట్టుకుని కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగలడంతో ఈ విపత్తు క్రమంగా పెను మానవీయ సంక్షోభంగా మారుతోంది. వారికి కనీస వసతులు కల్పించడం కూడా ప్రభుత్వానికి సవాలుగా పరిణమిస్తోంది. దాంతో బాధితుల్లో ఆక్రోశం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. మరోవైపు రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటికే 33 వేలు దాటేసింది. తుర్కియేలోనే కనీసం 80 వేల మందికి పైగా గాయపడ్డారు. మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వెలికితీత, సహాయ కార్యక్రమాలు నత్తనడకన నడుస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భూకంపం రావచ్చని ముందే సమాచారమున్నా దాన్ని ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి భారీ జన నష్టానికి కారకులయ్యారంటూ తుర్కియేలో వందలాది మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేస్తున్నారు. తుర్కియేలో ఈ శతాబ్ది విపత్తుగా పరిగణిస్తున్న ఈ భూకంపం ధాటికి 500 కిలోమీటర్ల పరిధిలో 1.3 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. సిరియాలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలు ప్రభుత్వ, వేర్పాటువాదుల అధీనంలోని ప్రాంతాల మధ్య విస్తరించడం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఇప్పటిదాకా 4,000కు పైగా మరణించారని అంచనా. వీరంతా మృత్యుంజయులు తుర్కియేలో ఓ రెండు నెలల చిన్నారిని ఏకంగా 128 గంటల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా రక్షించారు! అదియమాన్ నగరంలో ఓ ఆరేళ్ల బాలున్ని ఏకంగా 151 గంటల అనంతరం ఆదివారం కాపాడారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం! మరో చిన్నారి బాలికను కూడా 150 గంటల తర్వాత కాపాడారు. అంటాక్యాలో మరో 35 ఏళ్ల వ్యక్తిని 149 గంటల తర్వాత కాపాడారు. శిథిలాల కింద చిక్కిన వారిని గుర్తించేందుకు థర్మల్ కెమెరాలు తదితర మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత్తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన సిబ్బంది అహోరాత్రాలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో చెమటోడుస్తున్నారు. -
టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు..
ఇస్తాన్బుల్: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాలు తవ్వేకొద్ది వేల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 29,000మందికిపైగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీలో 24,617 మంది, సిరియాలో 4,500 మంది మరణించినట్లు తెలిపారు. పరిస్థితి చూస్తుంటే ఈ సంఖ్య 50 వేలకు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అధికారులు అంచనా వేస్తున్నారు. టర్కీ, సిరియా భూకంపం ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏడో రోజూ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు సహా అనేక మందిని సహాయక బృందాలు రక్షించాయి. దక్షిణ టర్కీ హతాయ్ ప్రావిన్స్లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని 149 గంటల తర్వాత బయటకు తీశారు. మరోవైపు టర్కీ దేశస్థులు తమ దేశంలోని బంధువుల ఇంట్లో తాత్కాలికంగా తలదాచుకోవచ్చని జర్మనీ తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిలో తమవంతు సాయం అందిస్తామని చెప్పింది. ఇతర దేశాలు కూడా టర్కీకి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. చైనా 53 టన్నుల టెంట్లను సాయంగా అందించింది. భారత్ ఇప్పటికే సహాయక బృందాలతో పాటు వైద్య బృందాలు, ఔషధాలు, ఇతర సామగ్రిని టర్కీకి పంపింది. చదవండి: టర్కీ విధ్వంసం.. మూత్రం తాగి బతికిన యువకుడు -
Turkey-Syria earthquake: ఆశలు సమాధి?
అంటాక్యా: తుర్కియే, సిరియాలో భూకంపం వచ్చి అయిదు రోజులు దాటిపోవడంతో కనిపించకుండా ఉన్న తమ సన్నిహితులు క్షేమంగా తిరిగి వస్తారన్న విశ్వాసం అందరిలోనూ సన్నిగిల్లుతోంది. ఇప్పటివరకు 26 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ శవాల గుట్టలు బయటకు వస్తూనే ఉన్నాయి. తుర్కియేలో హతే ప్రావిన్స్కు వెళ్లి ఫుట్బాల్ బృందంలో ఉన్న వారందరి మృతదేహాలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు తుర్కియేలో మాత్రమే 80 వేల మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటే, 10 లక్షల మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ శవాల మధ్య జీవచ్ఛవాలుగా మారిన కొందరు కొన ఊపిరితో ఉన్న ప్రాణాలతో బయటపడుతున్నారు. 80 ఏళ్ల ముదుసలి నుంచి పది రోజుల బాలుడు వరకు దాదాపుగా 120 గంటల సేపు శిథిలాల కింద కూరుకుపోయిన వారు ఇప్పటివరకు 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్ వాసి మృతి భూకంపం వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోయిన భారతీయుడు, ఉత్తరాఖండ్కు చెందిన విజయ్కుమార్ గౌడ్ మరణించాడు. అతను బస చేసిన హోటల్ శిథిలాల నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. ఉత్తరాఖండ్లోని పౌరి జిల్లాకు చెందిన విజయ్కుమార్ గౌడ్ బెంగళూరు కంపెనీలో పని చేస్తున్నారు. ఆఫీసు పని మీద తుర్కియే వెళ్లారు. అప్పుడే కుదిపేసిన భూకంపం ఆయన నిండు ప్రాణాలను తీసేసింది. అతని చేతి మీద ఉన్న ఓం అన్న టాటూ సాయంతో గౌడ్ మృతదేహాన్ని గుర్తు పట్టినట్టుగా భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఒకే కుటుంబంలో ఐదుగురు క్షేమం గజియాంటెప్ ప్రావిన్స్ నర్డాగ్లో ఒక ఇల్లు కుప్పకూలిపోయి, ఆ ఇంట్లో శిథిలాల కింద చిక్కిన ఉన్న ఐదుగురు కుటుంబసభ్యులను సహాయ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మొదట తండ్రి హసన్ అస్లాన్ను శిథిలాల కింద నుంచి బయటకు తీయాలని అనుకుంటే , ఆయన తన కొడుకు, కూతుళ్లని మొదట బయటకు తీయండని మొరపెట్టుకున్నాడు. మొత్తమ్మీద అందరినీ కాపాడిన సహాయ సిబ్బంది గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. పదిరోజుల పసికందు మృత్యుంజయుడు గడ్డ కట్టించే చలి, భవనం శిథిలాల మధ్య, నీళ్లు, పాలు లేకుండా భూకంపం పది రోజుల వయసున్న బాలుడు 90 గంటల సేపు పోరాటం చేశాడు. చివరికి గెలిచి మృత్యుంజయుడై తిరిగి వచ్చాడు. తుర్కియేలో భూకంప ప్రభావం అధికంగా ఉన్న హతే ప్రావిన్స్లో శిథిలాల కింద తల్లి, తన పదేళ్ల బాలుడు యాగిజ్ ఉలాస్తో నాలుగు రోజులు అలాగే ఉండిపోయింది. సహాయ సిబ్బంది సిమెంట్ శ్లాబుల తొలగిస్తూ ఉండగా ఆ పసికందు మూలుగు వినిపించింది. జాగ్రత్తగా శిథిలాల నుంచి తొలగించి ప్రాణాలతో ఉన్న ఆ బాలుడిని థర్మల్ బ్లాంకెట్లో చుట్టి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఈ మిరాకిల్ బాయ్ చురుగ్గా ఉన్నప్పటికీ తల్లి బాగా నీరసించిపోయే దశలో ఉంది. -
ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై తీవ్రత ఎంతంటే..?
జకర్తా: ఇండోనేషియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.0 తీవ్రత నమోదైంది. తలాడ్ ఐలాండ్స్ సమీపంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఇండోనేషియా జియోగ్రఫీసిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. #Gempa Dirasakan Magnitudo: 6.0, Kedalaman: 11 km, 11 Feb 2023 15:55:06 WIB, Koordinat: 3.67 LU-126.76 BT (Pusat gempa berada di Laut 37 km Tenggara Melonguane) #BMKG https://t.co/OiHiTwvX8x — BMKG (@infoBMKG) February 11, 2023 అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదు. దీని వల్ల సునామీ వచ్చే ప్రమాదం కూడా లేదని అధికారులు తెలిపారు. చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు.. -
ఆశలు ఆవిరి.. టర్కీలో భారతీయ యువకుడు మృతి
సాక్షి, బెంగళూరు: టర్కీలో అదృశ్యమైన భారతీయ యువకుడు విగత జీవిగా మారాడు. వ్యాపార పనుల నిమిత్తం టర్కీ వెళ్లిన భారత్కు చెందిన ఓ యువకుడు ఫిబ్రవరి 6న అక్కడ సంభవించిన వరుస భూకంపాల తర్వాత అదృశ్యమైన విషయం తెలిసిందే. భూకంపం సంభవించి నాలుగు రోజులైనా అతని ఆచూకీ తెలియలేదు. అయితే విజయ్ కుమార్ బస చేసిన హోటల్ శిథిలాల వద్ద శుక్రవారం అతని పాస్పోర్టు ఇతర వస్తువులు లభించాయి. తాజాగా శనివారం విజయ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అతడు బస చేసిన మలత్వాలోని హోటల్ శిథిలాల కింద విజయ్ కుమార్ మృతదేహం గుర్తించినట్లు టర్కీలోని భారత రాయబార కార్యాలయం దృవీకరించింది. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. విజయ్ మృదేహాన్ని అవశేషాలను అతని కుటుంబానికి వీలైనంత త్వరగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. We inform with sorrow that the mortal remains of Shri Vijay Kumar, an Indian national missing in Turkiye since February 6 earthquake, have been found and identified among the debris of a hotel in Malatya, where he was on a business trip.@PMOIndia @DrSJaishankar @MEAIndia 1/2 — India in Türkiye (@IndianEmbassyTR) February 11, 2023 అసలేం జరిగిందంటే కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రాంతానికి చెందిన ఇంజినీర్ టర్కీలో చోటు చేసుకున్న భూ కంపంలో గల్లంతయ్యాడు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన విజయ్కుమార్ బెంగళూరులో పీణ్యలోని నైట్రోజన్ ఉత్పత్తి సంస్థలో తమ్ముడితో కలిసి ఇంజినీర్గా పని చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఇద్దరూ నివాసం ఉంటున్నారు. ఫ్యాక్టరీకి అవసరమైన పరికరాల కోసం విజయ్కుమార్ నాలుగు నెలల క్రితం టర్కీకి వెళ్లారు. తుర్కియేలోని తూర్పు అనటోలియా ప్రాంతం మలత్యాలోని అవ్సర్ హోటల్లో దిగాడు. టర్కీలో భూకంపం వచ్చినప్పటినుంచి విజయ్కుమార్ నుంచి ఫోన్ రాలేదని తమ్ముడు అరుణ్కుమార్ తెలిపారు. ఈ క్రమంలో టర్కీలో అదృశ్యమైన విజయ్కుమార్ పాస్పోర్ట్, వస్తువులు లభించాయి. అతను బస చేసినట్లు భావిస్తున్న హోటల్ శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగించిన తర్వాత స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అద్భుతం: 90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల చిన్నారి -
టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు..
ఇస్తాన్బుల్: తుర్కియే, సిరియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. భూకంపం దాటికి ఇళ్లు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడగా.. మరొకొందరు మాత్రం తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. అయితే సోమవారం శిథిలాల కింద చికుక్కున్న 17 ఏళ్ల యువకుడు అద్నాన్ ముహమ్మెత్ కోర్కుట్ అనూహ్యంగా నాలుగు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. 94 గంటలపాటు శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడిపిన అతడు గొంతు ఎండిపోకుండా తన మూత్రం తాగి బతికినట్లు భయానక విషయాలు వెల్లడించాడు. ఈ నాలుగు రోజులు ఎలా గడిచాయో స్వయంగా అతని మాటాల్లోనే.. 'సోమవారం ఇంట్లో నిద్రోపోయా. ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇళ్లు కూలిపోయింది. నేను శిథిలాల కింద చిక్కుకున్నా. బయటకు రాలేని పరిస్థితి. సహాయక సిబ్బందికి నేను కన్పిస్తానే లేదో అని భయం వేసింది. నిద్రపోవద్దని ఫోన్లో ప్రతి 25 నిమిషాలకు అలారం పెట్టుకున్నా. రెండు రోజుల తర్వాత బ్యాటరీ అయిపోయి ఫోన్ స్విచాఫ్ అయింది. నాకు బాగా దాహం వేసినప్పుడు నా మూత్రమే తాగా. ఆకలి వేసినప్పుడు ఇంట్లోని పూలు తిన్నా. చివరకు 94 గంటల తర్వాత సహాయక సిబ్బంది నాకు కన్పించారు. కానీ నా మాటలు వారికి వినపడుతాయో లేదో అని ఆందోళన చెందా. శిథిలాలు తొలిగించేటప్పుడు నన్ను చూడకపోతే వాటి కిందే నలిగిపోతా అనుకుని భయపడ్డా. కానీ చివరకు నన్ను వారు చూసి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నన్ను కాపాడిన వాళ్లకి రుణపడి ఉంటా.' అని యువకుడు ఆస్పత్రిలో తన నాలుగు రోజుల నరకయాతన వివరించాడు. 📌Gaziantep'te 95.saatte 17 yaşındaki Adnan Muhammet Korkut enkazdan sağ olarak kurtarıldı. pic.twitter.com/fP4Bq1vseg — Şoreş Seven 7️⃣🐬🍃🕊🕊🕊H D P🕊🕊🕊 (@Sores1SevenHDP) February 10, 2023 తుర్కియే, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 24వేల మందికిపైగా చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతోమందిని సహాయక సిబ్బంది రక్షించారు. వీరిలో చిన్నారులు, అప్పడే పుట్టిన పసికందులు కూడా కన్పించారు. కొందరు తల్లిదంద్రులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డలను కాపాడుకున్నారు. చదవండి: కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. తన ప్రాణాలు అడ్డేసి కుమారుడ్ని కాపాడిన తండ్రి.. -
90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల శిశువు.
భూకంపం తర్వాత టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరుస భూకంపాల తర్వాత భవన శిథిలాల గుట్టలు ఆ భయానక దృశ్యానికి సాక్షాలుగా నిలిచాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భూ ప్రళయంలో కన్నుమూసిన వారు ఇప్పటి వరకు 25 వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 20 వేల మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మరోవైపు గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయిన శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఘోర విపత్తు ద్వారా కూతురిని కోల్పోయిన తండ్రి, తల్లిని కోల్పోయిన చిన్నారులు, తోబుట్టువులు ఇలా పలు చోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు సజీవంగా బయటపడటం ఊరట కలిగిస్తోంది. మృత్యుంజయులుగా బయటపడుతున్న చిన్నారులు తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. తాజాగా హతయ్ ప్రావిన్సులో శిథిలాల కింద మరో మహిళ, నవజాత శిశువు మృత్యంజయులుగా నిలిచారు. భూకంపం సంభవించిన 90 గంటల తర్వాత శిథిలాల నుంచి తల్లితో సహా యాగిజ్ ఉలాస్ అనే పది రోజుల శిశువును అధికారులు రక్షించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి మరణాన్ని జయించింది చిన్నారి. అనంతరం దుప్పటిలో చుట్టి హతే ప్రావిన్స్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదే హతే ప్రావిన్స్లో భూ ప్రళయం చోటుచేసుకున్న 100 గంటల తర్వాత శిథిలాల నుంచి 3 ఏళ్ల జైనెప్ ఎలా పర్లక్ అనే చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చదవండి: Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత..! -
గుజరాత్లో భూకంపం..రిక్టర్ స్కేలుపై..
అహ్మదాబాద్: గుజరాత్లో స్వల్ప భూకంపం సంభవించింది. సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున రిక్టర్స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోందైందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మొలాజికల్ రీసెర్చ్(ఐఎస్ఆర్) అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత 12.52 నిమిషాలకు భూమి కంపించినట్లు వెల్లడించారు. సూరత్లోని పశ్చిమ నైరుతి తీరాన 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నారు. భూ ప్రకంపనలు 5.2 కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయి. భూకంప కేంద్రం జిల్లాలోని హజీరా తీరాన అరేబియా సముద్రంలో ఉంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం.. రాష్ట్రం అధికంగా భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001లలో గుజరాత్లో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. 2001 కచ్ భూకంపం గత రెండు శతాబ్దాల్లో భారత్లో సంభవించిన మూడవ అతి పెద్ద, రెండో అత్యంత విధ్వంసక భూకంపం. ఆ సమయంలో 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు. కాగా ఈ వారంలోనే టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఎత్తైన భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో వాటి శిథిలాలకింద చిక్కుకొని అనేకమంది ప్రాణాలు విడిచారు. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 20 వేలు దాటింది. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: కాంగ్రెస్ ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు -
మృత్యుంజయులుగా బయటపడుతున్న చిన్నారులు
-
Turkey Syria Earthquake: ప్లీజ్ దేవుడా! ఒక్క బిడ్డనైనా కాపాడు..
టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆ శిథిలాల కింద చితికిన బతుకులు విషాధ గాథలు పేగులు మెలిపెట్టించేలా ఉన్నాయి. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు, అనాథలుగా మారిన చిన్నారులతో కన్నీటి సంద్రాన్ని తలిపించేలా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. మరోవైపు కొందరూ ఆ శిథిలా కింద తమవారు బతికే ఉండాలని ఆత్రంగా ఎదురుచూపులు. ఆయా ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది శిథిలలు తొలగింపు కార్యక్రమాలు కొనసాగిస్తుండగా..నాజర్ అల్ వకా అనే వ్యక్తి ప్లీజ్ దేవుడా ఒక్క బిడ్డనైన బతికించు అంటూ దీనంగా విలపించాడు. సరిగ్గా ఆ శిథిలాల వద్ద వాకా కూర్చొని వారి కోసం ఆత్రుత పడుతుండగా కనిపించిన ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా బోరున విలపించాడు. కాంక్రీట్ దిమ్మల మధ్య చితికిపోయిన తన భార్య, పిల్లలను చూసి అతను ఏడుస్తున్న విధానం అక్కడ ఉన్న అందర్నీ కంటతడి పెట్టించింది. వాకా ఎంతమంది పిల్లలను కోల్పోయాడనేది స్పష్టం కాలేదు గానీ, ఇద్దరు పిల్లలు మాత్రం రక్షక సిబ్బంది సజీవంగా తీసినప్పటికీ కాసేపటికే వారు చనిపోయారు. అతడి పెద్ద కుమార్తె తన చెల్లెలు మృతదేహాన్నిఒడిలో పెట్టుకుని విగతజీవిగా కనిపించింది. ఈ మేరకు వాక భూకంపం జరిగిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. సిరియా అంతర్యుద్ధంలో అతలా కుతలమైన నాటి ఘటనలు మళ్లీ పునురావృతమయ్యిందా! అన్నట్లు ఉంది అని కన్నీటిర్యంతమయ్యాడు. ఈ ఘటన జరిగినప్పుడూ తాను బయటకు పరుగుపెడుతూ..దేవుడా ఒక్క బిడ్డనైనా బతికించు చాలు అని ప్రార్థించాను, కానీ ఇప్పడూ తాను సర్వకోల్పోయానంటూ బోరుమన్నాడు. అక్కడి స్మసశాన వాటికలన్ని పెద్దలు, చిన్నారుల మృతదేహాలతో కిక్కిరిసిపోయాయి. (చదవండి: Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య) -
శిథిలాల కిందే ఊపిరిపోసుకుంది..'ఆ జననం ఓ అద్భుతం'
తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసింది. ఆ ప్రకృతి విలయం ఇరుదేశాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. దీంతో ఎటూ చూసిన పేకమేడల్లా కూలిని భవనాల కింద చితికిన బతుకులే కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్ని అక్కడ ప్రజలకు అంత తేలికగా మర్చిపోలేని ఘోర విషాదాన్ని మిగిల్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులో సిరియాలోని జెండెరిస్ పట్టణంలో శిథిలా కింద ఓ ఆడ శిశువు జన్మించడం అందర్నీ షాక్కి గురిచేసింది. ఇలాంటి విషాద సమయంలో జన్మించిన ఆ శిశువు జననం ఒక కొత్త ఆశను రేకెత్తించింది. సోమవారం సంభవించిన భూకంపం తదనంతరం భద్రతా బలగాలు రెస్క్యూ చర్యలు చేపడుతుండగా..సిరియాలో శిథిలాల కింద ఓ తల్లి ఒక ఆడబిడ్డకి జన్మినిచ్చిన సంగతి తెలిసింది. ఆ శిశువు తల్లి బొడ్డు తాడుకు జత చేయబడి ఉండటంతో సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఐతే ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్లు అందరూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆ శిథిలాల కింద గజగజలాడే చలిలో ఓ చిన్నారి ఏడుపును గమనించి రెస్క్యూ టీం అప్రమత్తమై రక్షించారు. The moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake. May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW — Talha Ch (@Talhaofficial01) February 6, 2023 ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడటంతో పాపను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో ఓ వైద్యుడి భార్య ఆ చిన్నారికి పాలందించింది. ప్రస్తుతం ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. ఐతే ఆ చిన్నారి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి తీసుకువెళ్తానని ఆమె మేనమామ చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో పుట్టడం విశేషం అంటూ.. ఆ చిన్నారికి అయా అని పేరు పెట్టారు. 'అయా' అనగా అరబిక్లో 'అద్భుతం' అని అర్థం. ఆమె జననం ఓ అద్భుతం అంటూ అక్కడ ప్రజలు ఆ శిశువుకి ఈ పేరు పెట్టారు. (చదవండి: 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ బిల్గేట్స్) -
షాకింగ్.. భూకంపం ధాటికి 6 మీటర్లు పక్కకు జరిగిన టర్కీ!
ఇస్తాన్బుల్: టర్కీలో సోమవారం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘోర వివత్తులో వేల మంది చనిపోయారు. అయితే భూకంపం కారణంగా టర్కీ దేశం ఐదారు మీటర్ల దూరం పక్కకు జరిగినట్లు భూవిజ్ఞాన పరిశోధకులు తెలిపారు.. ట 'సోమవారం టర్కీలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలు అది ఉన్న టెక్టోనిక్ ప్లేట్లను మూడు అడుగుల నుంచి 10 మీటర్ల వరకు కదిలించి ఉండవచ్చు. టర్కీ పశ్చిమం వైపు సిరియాతో పోలిస్తే ఐదు నుంచి ఆరు మీటర్లు పక్కకు జరిగే అవకాశం ఉంది.' అని ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతంలోని మార్పుల గురించి మాట్లాడుతూ.. 190 కిలోమీటర్ల పొడవు, 25 వెడల్పుతో భారీ పగుళ్లు ఏర్పడి, భూమి భీకరంగా కదిలిందని పేర్కొన్నారు. తొమ్మిది గంటల వ్యవధిలో రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు వచ్చాయన్నారు. వాస్తవానికి భూమి కంపిస్తూనే ఉందని రిక్టర్ స్కేల్పై 5-6 డిగ్రీల వద్ద తరచుగా గణనీయమైన తీవ్రతతో నాశనం అవుతూనే ఉందన్నారు. అదే సమయంలో చిన్నపాటి కుదుపులకు గురైనట్లు వివరించారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని పేర్కొన్నారు. చదవండి: 38 ఏళ్లోచ్చినా గర్ల్ఫ్రెండ్ లేదు.. నా కుమారుడులో ఏదో లోపం ఉంది.. ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లికి షాక్..! -
భూకంప మృతుల సంఖ్య వేలల్లో..!
భూకంప మృతుల సంఖ్య వేలల్లో..! -
ఘోర విపత్తు.. దారణంగా టర్కీ పరిస్థితి.. శాటిలైట్ ఫోటోలు వైరల్
టర్కీ, సిరియాలో ఇటీవల సంభవించిన వరుస భూకంపాలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. ప్రకృతి విలయానికి ఇరు దేశాలూ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఎటుచూసినా కూలిన భవన శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే దర్శనమిస్తున్నాయి. ఘోర మృత్యుకంపం ధాటికి ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేలమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద భారీగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15,383 వేలకు చేరింది. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఒక్క తుర్కియేలోనే దాదాపు 12,391 మంది ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 2,992 మంది మరణించినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. తుర్కియే, సిరియా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆప్తుల ఆక్రందనలు, మిన్నింటిన రోదనా దృశ్యాలతో భయానంకంగా తయారయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలన్నింటినీ తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. అయితే ఎత్తయిన వేలాది భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాలను తొలగించడం తలకుమించిన పనిగా మారింది. చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత? శాటిలైట్ దృశ్యాలు విడుదల రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా విలవిల్లాడుతున్నాయి. తాజాగా భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన శాటిలైట్ విడుదల చేసిన దృశ్యాలు ఉపద్రవం సృష్టించిన వినాశనం కళ్లకు అద్దం పట్టిన్నట్లు చూపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన అత్యవసర ఆశ్రయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ భూకంపం కారణంగా ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాలన్నీ నేలమట్టమైన దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. టర్కీలోని దక్షిణ నగరాలైన అంటాక్యా, కహ్రమన్మరాస్, గాజియాంటెప్ భూకంపానికి గురైన అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ కుప్పకూలిన భవనాలు, గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ 25వేల మందికి పైగా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. 2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితం భారీ భూకంపం కారణంగా దాదాపు 2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ప్రభావిత ప్రాంతాల్లో 77 జాతీయ, 13 అంతర్జాతీయ అత్యవసర వైద్య బృందాలను మోహరించినట్లు పేర్కొంది. భారత్ సైతం, టర్కీ, సిరియాకు సహాయ సామాగ్రిని అందించింది. -
టర్కీ, సిరియాలో భారీ భూకంపం
టర్కీ, సిరియాలో భారీ భూకంపం -
Turkey Earthquake: విషాదం.. గోల్కీపర్ కన్నుమూత
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం దాటికి వేలాది మంది మృత్యువాత పడ్డారు. సోమవారం సంభవించిన భూప్రకంపనల్లో వందలాది భవనాలు కుప్పకూలగా.. వాటి శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. ఇప్పటికి రెస్క్యూ బృందం శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీస్తున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, రోదనలే. ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే దాటోచ్చని డబ్ల్యూహెచ్వో అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే టర్కీకి చెందిన 28 ఏళ్ల ఫుట్బాలర్.. గోల్కీపర్ అహ్మత్ ఎయుప్ తుర్క్స్లాన్ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న ఎయుప్ కన్నుమూసినట్లు యేని మాలత్యస్పోర్ ఫుట్బాల్ క్లబ్ తన ట్విటర్లో ధృవీకరించింది. మాకు ఇది విషాదకర వార్త. గోల్ కీపర్ ఎయుప్ తుర్క్స్లాన్ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న అతన్ని రక్షించలేకపోయాం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ ట్వీట్ చేసింది. 2011లో కెరీర్ ప్రారంభించిన ఎయుప్ తుర్క్స్లాన్ అన్ని క్లబ్లకు కలిపి 80 మ్యాచ్ల్లో గోల్కీపర్గా వ్యవహరించాడు. ఇక ఘనాకు చెందిన మరో ఫుట్బాలర్ క్రిస్టియన్ అట్సూ మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు టర్కిష్ ఫుటబాల్ సూపర్ లీగ్ క్లబ్ పేర్కొంది. Başımız sağ olsun! Kalecimiz Ahmet Eyüp Türkaslan, meydana gelen depremde göçük altında kalarak, hayatını kaybetmiştir. Allah rahmet eylesin, mekanı cennet olsun. Seni unutmayacağız güzel insan.😢 pic.twitter.com/15yjH9Sa1H — Yeni Malatyaspor (@YMSkulubu) February 7, 2023 చదవండి: టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్బాలర్ LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు -
ఘోర విపత్తు.. 20 వేలమంది దాకా మృతి??
నాన్న.. లేరా: భూకంపం సృష్టించిన విలయంలో కళ్లెదుటే కన్నకూతురు శాశ్వతనిద్రలోకి జారుకుంది. శిథిలాల్లో ఆమె మృతదేహం చిక్కుకుపోయింది. ఆమె చేతిని పట్టుకుని అక్కడే స్థాణువై కూర్చుండిపోయాడా తండ్రి. టర్కీలోని ఖరామన్మరస్ ప్రాంతంలోనిదీ హృదయవిదారక దృశ్యం ఎటు చూసినా శిథిలాలే. వాటికింద చితికిన బతుకులే. కుప్పలుగా శవాలే. వరుస భూకంపాలు తుర్కియే, సిరియాల్లో అంతులేని విధ్వంసం సృష్టించాయి. వేలాది భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాలను తొలగించడం తలకుమించిన పనిగా మారింది. వాటికింద చిక్కుకున్న వారు కాపాడాలంటూ చేస్తున్న ఆక్రందనలు కలచివేస్తున్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 8 వేలకు చేరువైంది. శిథిలాలన్నింటినీ తొలగిస్తే అది మరింత భారీగా పెరిగేలా కన్పిస్తోంది. తుర్కియే (టర్కీ), సిరియాల్లో సంభవించిన ఘోర భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేటమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద భారీగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటిదాకా మృతుల సంఖ్య 7,800 దాటింది. ఒక్క తుర్కియేలోనే దాదాపు 6,000 పై చిలుకు భవనాలు కూలిపోయినట్లు నిర్ధారించారు. విపరీతమైన చలి వణికిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాలను తొలగించడం, వాటి కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. సోమవారం మూడు భారీ భూకంపాలు ఇరు దేశాలను కుదిపేయడం తెలిసిందే. అనంతరం ఇప్పటిదాకా కనీసం 200కు పైగా చిన్నా పెద్దా ప్రకంపనలు వణికించాయి. వాటి భయానికి భారీగా జనం ఇళ్లూ వాకిలీ వీడి వలస బాట పడుతున్నారు. సహాయక చర్యలకు చలి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. పిల్లలు, వృద్ధులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అధికార యంత్రాగంతో అంచనా వేయించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్.. పది ప్రావిన్స్లో మూడు నెలలపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇది మహా విపత్తుగా అభివర్ణించింది ఐరాసకు చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ఓ సెక్రటరీ జనరల్ థెడ్రోస్ అధోనం గెబ్రెయేసస్ స్పందిస్తూ.. టర్కీ, సిరియాలో రెండున్నర కోట్ల మంది.. భూకంపంతో ప్రభావితం అయ్యి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాల రీజియన్ను డిజాస్టర్ జోన్గా ప్రకటిస్తూ.. ఆయా దేశాలకు వీలైనంత సాయం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే దాటోచ్చని డబ్ల్యూహెచ్వో అంచనా వేస్తోంది. ఇప్పటికే అత్యవసర వైద్య బృందాలను ఆ దేశాలకు పంపినట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తుర్కియే (టర్కీ), సిరియా భూకంపంలో గుండెపగిలే దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరియాలోని అలెప్పో గ్రామీణ ప్రాంతంలో శిథిలాల మధ్య నెలలు నిండిన మహిళ ప్రసవించింది. కొత్తగా లోకాన్ని చూసిన ఆ పసిబాలుడ్ని సహాయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. శిథిలాల కింద తల్లిపేగు తెంచి బాలుడి ప్రాణాన్ని కాపాడగలిగారు. కానీ కన్న తల్లికి మాత్రం అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. సహాయ సిబ్బంది ఒకరు ఆ పసిబాలుడ్ని బయటకు తీసుకువస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఒక విపత్తుని ఎదిరించి పురుడు పోసుకున్న ఆ బాలుడు సిరియన్లకు ఆశాకిరణంగా మారాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతటా ఆర్తనాదాలే శిథిలాల కింది నుంచి బాధితుల ఆక్రందనలు హృదయవిదారకంగా వినిపిస్తున్నాయని భూకంపం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు. ‘‘కానీ వారిని కాపాడుకొనే మార్గం కనిపించడం లేదు. కాంక్రీట్ స్లాబ్లను తొలగించే పరికరాలు మా దగ్గర లేవు. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా జాప్యం జరిగితే బాధితులు చనిపోయే ప్రమాదముందంటున్నారు. తుర్కియేలోని హతాయ్ ప్రావిన్స్లో వేలాది మంది క్రీడా ప్రాంగణాలు, ఫంక్షన్ హాళ్లలో తలదాచుకున్నారు. సైన్యం రంగంలోకి దిగి టెంట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. షాపింగ్ మాల్స్, స్టేడియాలు, మసీదులు, కమ్యూనిటీ సెంటర్లలోనూ నిరాశ్రయులకు వసతి కల్పిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీరు అందజేస్తున్నాయి. భూకంప కేంద్రమైన గాజియాన్టెప్ నగరంలో పరిస్థితి భీతావహంగా మారింది. ఎటు చూసినా బాధితుల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. సహాయక చర్యలు పూర్తయితేనే స్పష్టత తుర్కియేలో ఇప్పటిదాకా 3,400 మందికి పైగా మరణించారని, 21,000 మందికి పైగా గాయపడ్డారని ఉపాధ్యక్షుడు ఫౌత్ ఒక్తాయ్ ప్రకటించారు. 10 ప్రావిన్స్ల్లో 7,800 మందిని రక్షించారు. సిరియాలో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతంలో 800 మంది మృతిచెందారని, 1,400 మంది క్షతగాత్రులయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. తిరుగుబాటుదారుల ఆక్రమణలోని వాయవ్య ప్రాంతంలో 790 మంది మరణించారని, 2,200 మందికి పైగా గాయాల పాలయ్యారని సహాయక చర్యల్లో నిమగ్నమైన వైట్ హెల్మెట్స్ అనే వైద్య సంస్థ తెలిపింది. రెండు దేశాల్లోనూ మృతుల సంఖ్య భారీగా పెరగనుందని, సహాయక చర్యలు పూర్తయ్యాకే దీనిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. దేశాల ఆపన్న హస్తం తుర్కియే, సిరియాకు అండగా నిలిచేందుకు ఐక్యరాజ్యసమితితోపాలు పలు దేశాలు ముందుకొచ్చాయి. సహాయక సిబ్బంది, నిత్యావసరాలు, వైద్య సామగ్రి పంపుతున్నాయి. భారత్ ఎక్స్–రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లను అందజేసింది. నిత్యావసరాలు, వైద్య పరికరాలతో రెండు విమానాలను పంపనుంది. ఇప్పటికే రెండు సైనిక రవాణా విమానాల్లో రెస్యూ్య టీమ్లను తుర్కియేకు పంపినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తుర్కియే అధ్యక్షుడు తయ్యీప్ ఎర్డోగాన్తో ఫోన్లో మాట్లా3డారు. భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బుధవారం తుర్కియేలో పర్యటించనున్నారు. పలు దేశాల అంతరిక్ష సంస్థలు అందించిన భూకంపం, అనంతర పరిణామాల శాటిలైట్లు చిత్రాలు సహాయక చర్యల్లో ఉపయోగపడుతున్నాయి. సిరియా జైలు నుంచి 20 మంది ఉగ్రవాదుల పరారీ సిరియాలో భూకంపంలో ధ్వంసమైన జైలు నుంచి 20 మంది ఉగ్రవాదులు పరారయ్యారు. వీరిలో చాలామంది అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్కు చెందినవారేనని అధికారులు తెలిపారు. తుర్కియే సరిహద్దులో రాజో పట్టణంలోని ఈ మిలటరీ పోలీసు జైలులో 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రవాదులే. భూకంపంతో జైలు గోడలు, ద్వారాలు ధ్వంసమయ్యాయి. దాంతో 20 మంది సులభంగా తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. అమ్మ ఎక్కడ..? ప్రకృతి ఉగ్రరూపానికి తల్లిడిల్లుతున్న తుర్కియే (టర్కీ) సిరియాల్లో తల్లీ బిడ్డల్ని వేరు చేసిన ఘటనలు హృదయాన్ని కదిలిస్తున్నాయి. కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొని అనాథగా మారిన ఏడాదిన్నర బిడ్డ మా అమ్మ ఏది, ఎక్కడుంది ? అని అడుగుతూ ఉండడం అందరి హృదయాలన్ని పిండేస్తోంది. సిరియాలోని అజాజ్లో ఏడాదిన్నద వయసున్న ఒక పాప శిథిలాల కింద నుంచి మృత్యుంజయురాలై బయటకు వచ్చింది. గర్భిణిగా ఉన్న ఆమె తల్లి, సోదరుడు, సోదరి ఇలా కుటుంబమంతా శిథిలాల కింద పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే, వెన్ను విరిగిపోయిన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇలా కుటుంబాన్ని కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న చిన్నారుల్ని చూస్తుంటే అందరి గుండెలు పగిలిపోతున్నాయి. ఆస్పత్రుల్లో జీవచ్ఛవాలు తుర్కియే, సిరియాల్లోని ఆస్పత్రుల్లో ఒక వైపు శవాల గుట్టలు, మరోవైపు చావు బతుకుల మధ్య జీవచ్ఛవాలుగా మారిన వారితో నిండిపోయాయి. భూకంపం ధాటికి సర్వస్వం కోల్పోయిన వారు, కుటుంబాల్ని కోల్పోయి అనాథలుగా మిగిలిన పసివారి రోదనలతో హృదయవిదారకంగా మారింది. ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున వైద్యం అందించడానికి బ్రిటన్ వైద్యుడు పరిస్థితుల్ని చూసి తల్లడిల్లిపోతున్నారు. వెంటిలేటర్లు సరిపడా లేకపోవడంతో ఒక రోగి నుంచి వెంటిలేటర్ తీసేసి మరో రోగికి అమరుస్తున్నారు. మరోవైపు, బతికే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వారికే వైద్యం చేస్తున్నామని, ఇలా చేయడం చాలా దుర్భరంగా అనిపిస్తోందని ఆ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు!. గూడు వీడిన పక్షులు తుర్కియేలో భూకంపం సంభవించడానికి ముందే పక్షులు గుంపులు గుంపులుగా తమ గూళ్లని వదిలి వెళ్లిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. పక్షులన్నీ రొద చేసుకుంటూ గుంపులుగా హడావుడిగా గూడి వదిలి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. సాధారణంగా భూకంపాన్ని పక్షులు, జంతువులు ముందే పసిగడతాయని అంటారు. ఈ వీడియోని పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర కూడా షేర్ చేశారు. ‘‘ప్రకృతి మనకు ఇచ్చిన హెచ్చరికల వ్యవస్థ. కానీ మనకే వాటిని అర్థం చేసుకోవడం తెలీడం లేదు’ అని కామెంట్ చేశారు. 2004లో సునామీకి ముందు కూడా ఇలాగే జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. క్రీస్తుపూర్వం 373లో గ్రీస్లో భూకంపం సంభవించడానికి చాలా రోజుల ముందే ఎలుకలు, పాములు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన పోయిన విషయాన్ని ఈ సందర్భంగా అమెరికా జియోలాజికల్ సర్వే ఒక నివేదికలో గుర్తు చేసింది. -
భూప్రళయం.. జన విలయం
పేకమేడల్లా కూలిన అపార్ట్మెంట్లు.. నేలకొరిగిన ఎత్తైన స్తంభాలు.. నిలువునా చీలిన విమానా శ్రయ రన్వేలు.. ధ్వంసమైన ఆసుపత్రులు.. వేలకొద్దీ మృతులు, క్షతగాత్రులు.. లక్షల్లో నిరాశ్ర యులు.. ఇది కనివిని ఎరుగని భూప్రళయం. కన్నీరాగని జన విలయం. సిరియా సరిహద్దులకు సమీపంలో టర్కీ (నూతన నామం తుర్కియా) ఆగ్నేయ ప్రాంతంలో, ఆ పొరుగునే వాయవ్య సిరియాలో సోమవారం తెల్లవారుజామున తీవ్రస్థాయిలో వచ్చిన భూకంపం, ఆపైన ఆగని ప్రకంప నల దృశ్యాలు కదిలించేస్తాయి. 2021 ఆగస్ట్లో దక్షిణ అట్లాంటిక్లో వచ్చిన ప్రకంపన తర్వాత అమె రికా భూగర్భ సర్వేక్షణ సంస్థ రికార్డ్ చేసిన ప్రపంచంలోని అతి పెద్ద భూకంపం ఇదే. ఇప్పటికి కనీసం 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 6 వేల భవనాలు కుప్పకూలాయి. మరో 11 వేల భవనాల పరిస్థితీ అనధికారికంగా అలానే ఉంది. అంకెలు శరవేగంతో మారుతుండడంతో మృతుల సంఖ్య 10 వేలు దాటినా ఆశ్చర్యం లేదు. బాధితుల సంఖ్య 2.3 కోట్ల దాకా ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్క. ఇది 21వ శతాబ్దిలోకెల్లా అతి పెద్ద ప్రకృతి వైపరీత్యం అంటున్నది అందుకే. భూఉపరితలానికి దిగువన భూఫలకాల మధ్య ఘర్షణతో భూకంపాలు వస్తాయని లెక్క. ప్రపంచంలో ప్రధానంగా అరేబియన్, యురేషియన్, ఇండియన్, ఆఫ్రికన్, మరో చిన్నదైన అనటోలియన్ భూఫలకాలున్నాయి. మధ్యప్రాచ్యంలో భూకంపాలకు ఇవే కారణం. తాజాగా అనటోలియన్, అరేబి యన్ భూఫలకాల మధ్య 100 కిలోమీటర్ల పైగా దూరం పగులు, ఒరిపిడితో 7.8 రిక్టర్ స్కేల్ స్థాయి భూకంపం టర్కీ, సిరియాలను తాకింది. టర్కీలో చారిత్రక గాజియన్టెప్ సమీపంలో జన సమ్మర్ద ప్రాంతంలో భూకంప కేంద్రం నెలకొంది. సోమవారమే 12 గంటల్లో 3 సార్లు భూమి కంపించింది. రెండోరోజూ 2 తీవ్ర కంపనలొచ్చి, సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్లలో ప్రభావం చూపాయి. భూకంప అనుబంధ అనంతర ప్రకంపనలైతే డజన్లలో వస్తున్నాయి. వారసత్వ కట్టడాలూ దెబ్బతిన్నాయి. హృదయవిదారక జగత్ప్రళయ దృశ్యాలతో, వేలాది మరణాలు సంభవించిన భూకంప బాధిత ఆగ్నేయ ప్రావిన్సులు పదింటిలో మూడు నెలలు ఎమర్జెన్సీ విధించారు టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్. ఒక పక్క వాన, మరోపక్క చలికాలపు మైనస్ డిగ్రీల అతి శీతల గాలుల్లో సహాయక చర్యలూ కష్టమే. శిథిలాల కింద నుంచి ఆర్తనాదాలు, మూలుగులు వినిపిస్తున్నా వారిని కాపాడే వ్యక్తులు, వసతులు కరవయ్యాయి. కొనవూపిరితో కొట్టుకుంటున్నవారూ చలిలో గడ్డకట్టుకు పోతున్న పరిస్థితుల్లో... వట్టి చేతులతోనైనా శిథిలాలను తవ్వి అయినవాళ్ళను కాపాడుకోవాలన్న విఫల ప్రయత్నాలు సాగుతున్న వేళ... భారత్ సహా 45 దేశాలు మానవతా దృక్పథంతో అత్యవసర సామగ్రితో సాయానికి దిగాయి. అసలే యుద్ధంతో, భౌగోళిక రాజకీయాలతో, ఆపైన కరోనాతో, తర్వాత కలరాతో కన్నీట మునిగిన సిరియాకు తాజా భూకంపం దెబ్బ మీద దెబ్బ. యుద్ధంతో ఆ దేశం వదిలి దక్షిణ టర్కీలో క్రిక్కిరిసిన పరిస్థితుల్లో బతుకీడుస్తున్న వారికీ, సిరియాలోనే తిరుగుబాటుదారుల చేతిలోని ఇడ్లిబ్ నగరంలో చమురు కొరత, ఆకాశాన్నంటే ధరల మధ్య అంతర్జాతీయ మానవతా సాయంతో ప్రాణాలు నిలబెట్టుకుంటున్నవారికీ ఇప్పుడు కాలి కింద భూమినీ ప్రకృతి లాగేసింది. వైట్ హెల్మెట్స్ లాంటి çసంస్థలు సేవలందించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నా, సామగ్రి కొరతతో కష్టమవుతోంది. ఈ అత్యవసర సమయంలోనూ శరణార్థుల సాయానికి దోవలన్నీ సిరియా మూతబెడితే, బాధితులకు కనీసం తిండి, మంచినీళ్ళు, మందులు అందేదెలా? దౌత్య, రవాణా వసతుల పరంగా పెను సవాలైన దీన్ని అంతర్జాతీయ సమాజం పరిష్కరించకుంటే ఇది మరో పెను మానవవిషాదం. నిజానికి, భౌగోళికంగా భూకంప ప్రేరక ప్రాంతంలో టర్కీ ఉంది. టర్కీ, సిరియా, జోర్డాన్లున్న తూర్పు మధ్యధరా ప్రాంతాన ఆఫ్రికన్, అరేబియన్, యురేషియన్ భూఫలకాల మధ్య సంక్లిష్ట సంబంధాలున్నాయి. అనటోలియన్ బ్లాక్ సరేసరి. అందుకే, టర్కీలో శతాబ్దాలుగా భూవిలయాలు పరిపాటి. అక్కడ 1939 నాటి భూకంపంలో 33 వేల మంది చనిపోయారు. ఈసారి ఈ శతాబ్దిలో కెల్లా బలమైన భూకంప తాకిడితో ఆ దేశం చిగురుటాకులా వణికింది. లోతైన భూకంపాలు సంభ విస్తే వాటి తాకిడి భూ ఉపరితలానికి తాకేసరికి చాలావరకు శక్తి కోల్పోయి, కొంత తక్కువ నష్టం కలిగి స్తాయి. కానీ, లోతు లేని భూకంపాలు శక్తిమంతంగా పైకి తాకి, పెను విధ్వంసం రేపుతాయి. తాజా భూకంపం అలాంటిదే. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే ఊహించి, హెచ్చరించే వ్యవస్థలు నేటికీ లేవు. కాంతి వేగం కన్నా చాలా నిదానంగా, సెకనుకు 5 నుంచి 13 కి.మీ.ల దూరం ప్రయాణించే భూకంప తరంగాలు ఉపరితలం చేరడానికి సెకన్ల ముందే తెలుసుకోగలుగుతున్నాం. టర్కీతో పోలిస్తే హిమాలయ ప్రాంతానికి భూకంపాల ముప్పు ఎక్కువ. ఉపరితలం కింద ఒత్తిడి అనూహ్యంగా పేరుకున్న హిమాలయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. భారత్లో 59 శాతం ప్రాంతానికి అలా ప్రమాదం పొంచివుంది. టర్కీ ఘటన మనకు మేలుకొలుపు. దీన్నుంచి తక్షణం పాఠాలు నేర్చుకోవాలి. రెండు వారాల క్రితం నేపాల్లో భూకంపం తాలూకు ప్రకంపనాలు ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కనిపించాయని మర్చిపోరాదు. ఏటా జనవరి 16న జాతీయ భూకంప దినం జరుపుతూ నేపాల్ లాంటివి జనచైతన్యం పెంచుతుంటాయి. అలాంటి ఆలోచనల్ని మనమూ ఆచరణలో పెట్టాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకొనే కన్నా తెలివిగా, ముందుజాగ్రత్తతో ఉండాలి. ముందస్తుగా కార్యాచరణకు సిద్ధమవ్వాలి. బాధిత దేశాల పునరుజ్జీవనానికి చేయూత నిస్తూనే ఈ పనిలోకీ దిగాలి. హృదయ విదారక ప్రళయసదృశ దృశ్యాలు గుర్తుచేస్తున్నదదే. -
టర్కీ, సిరియా భూకంపం: క్షణాల్లో అంతా తారుమారు! హృదయం ద్రవించే ఫోటోలు
-
భూకంపంతో జైలు గోడలు ధ్వంసం.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు జంప్..!
టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించి వేల భవనాలు నేలమట్టం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా కొందరు ఖైదీలకు జైలు నుంచి తప్పించుకునేందుకు అవకాశం లభించింది. టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతం రాజోలోని జైలు భూప్రకంపనల కారణంగా పాక్షికంగా దెబ్బతింది. గోడలకు పగుళ్లు వచ్చి కులిపోయాయి. దీన్నే అదునుగా భావించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఖైదీలు జైలులో తిరుగుబాటు చేశారు. జైలులోని ఓ భాగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం 20 మంది జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరంతా ఐసిస్ సంస్థకు చెందిన వారేరని అధికారులు తెలిపారు. ఈ జైలును టర్కీ అనుకూల గ్రూప్లే నియంత్రిస్తాయి. మొత్తం 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రసంస్థకు చెందినవారే. వీరితో పాటు సిరియా అనుకూల ఖుర్షీద్ దళాలకు చెందిన ఫైటర్లు ఉన్నారు. అయితే జైలులో తిరుగుబాటు జరిగిన విషయం నిజమేనని, కానీ 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ధ్రువీకరించలేమని బ్రిటన్కు చెందిన సిరియన్ అబసర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. ఐసిస్ ఖైదీలను తప్పించేందుకు గతేడాది డిసెంబర్లో సెక్యూరిటీ కాంప్లెక్స్పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఖుర్దీష్ దళాలకు చెందిన ఆరుగురు చనిపోయరు. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్..
ఇస్తాన్బుల్: టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ భయానక విపత్తులో 5,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 24 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. టర్కీలో భూకంపం తర్వాత దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, శిథిలాలను చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా ఉంది. భూకంపం తర్వాత టర్కీ హతాయ్ ప్రాంతంలో పరిస్థితిని కళ్లగట్టేలా ఓ హుమానిటేరియన్ రిలీఫ్ ఫౌండేషన్ డ్రోన్ దృశ్యాలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. A drone video released by Humanitarian Relief Foundation shows the extent of destruction in Hatay province in Turkey, which was rocked by a 7.8 magnitude earthquake pic.twitter.com/L6mbqIkJZp — Reuters Asia (@ReutersAsia) February 7, 2023 చదవండి: భూకంపం వస్తుందని మూడు రోజుల ముందే చెప్పాడు.. కానీ ఎవరూ నమ్మలే -
టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్బాలర్
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పావుగంట వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. తాజా సమాచారం ప్రకారం.. 4800కు పైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ టీంలు వెలికి తీశాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్లు కూలిపోవడం, అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది. వేలాది మంది ఇంకా శిథిలాలే కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.టర్కీ, సిరియాలో ఎంతెంత మంది మరణించారనే సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఘనా స్టార్ ఫుట్బాల్ క్రిస్టియన్ అట్సు ప్రాణాలతో భయటపడ్డాడు. ప్రస్తుతం అతను టర్కీష్ సూపర్ క్లబ్ హట్సేపోర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్ అట్సు సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటే ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్నాడు. అయితే దేవుని దయవల్ల అతనికి ఏం జరగలేదు. రెస్క్యూ టీమ్ వచ్చి అట్సూను శిథిలాల నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఘనాకు చెందిన రేడియో కమ్యూనికేషన్ స్టేషన్ మార్నింగ్ బులెటిన్లో వెల్లడించింది. ''మీకొక గుడ్న్యూస్. మాకు అందిన సమాచారం ప్రకారం ఘనా స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియన్ అట్సూ ప్రాణాలతో బయటపడ్డాడు. భూకంపం సంభవించిన టర్కీలోని సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటేలో అతను ఉంటున్న బిల్డింగ్ కూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది అతన్ని రక్షించారు.'' అంటూ పోస్ట్ చేసింది. ఇక అట్సు చెల్సియా ఫుట్బాల్ క్లబ్కు కూడా గతంలో ప్రాతినిధ్యం వహించాడు. న్యూక్యాసిల్కు ఐదేళ్ల పాటు ఆడిన క్రిస్టియన్ అట్సు 2021లో సౌదీ అరేబియా క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే టర్కీష్ ఫుట్బాల్ క్లబ్కు మారాడు. ఇక ఘనా తరపున 65 మ్యాచ్లాడిన అట్సూ 9 గోల్స్ చేశాడు. Update: We've received some positive news that Christian Atsu has been successfully rescued from the rubble of the collapsed building and is receiving treatment. Let’s continue to pray for Christian🙏🏽 — Ghana Football Association (@ghanafaofficial) February 7, 2023 చదవండి: ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు