ఒడిశా: మల్కన్గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రా ఎదుట జిల్లా పోలీసు కార్యాయలంలో దేబా మధి(34) అనే మావోయిస్టు మంగళవారం లొంగిపోయాడు. మల్కన్గిరి డివిజన్ పరిధిలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీలో కలిమెల ఏరియా కమిటీ సభ్యుడిగా దేబ మధి పని చేశాడు. మొత్తం పది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రూ. లక్ష రివార్డు ఉంది.
మల్కన్గిరిలో మావోయిస్టు లొంగుబాటు
Published Tue, Mar 14 2017 2:56 PM
# Tag
Related News by category
-
Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
బన్గావ్. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పారీ్టల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దాంతో బీజేపీ, తృణమూల్ రెండూ మథువా సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో ఉన్నారు...బన్గావ్ లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో హిందూ శరణార్థులు భారీగా బన్గావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు మథువాలే. బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నేపథ్యంలో వీరు సహజంగానే బీజేపీకి మద్దతిస్తున్నారు. బన్గావ్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ బన్గావ్ నుంచి బెంగాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారి ఓట్లు అత్యధికంగా బీజేపీకే పడ్డాయి. అలా ఇక్కడ తొలిసారి బీజేపీ విజయం సాధించింది. శంతను లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బన్గావ్లో సీఏఏ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఎన్నికల ముందు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. అయితే ఆన్లైన్ దరఖాస్తుల్లో బంగ్లాదేశ్లో ఉన్నప్పటి చిరునామా, నివాస పత్రాల వివరాలను చాలామంది సమర్పించలేదు. ఇది సమస్యలకు దారి తీయడంపై ఇక్కడి మథువాలు అసంతృప్తితో ఉన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు: టీఎంసీ సీఏఏను తృణమూల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా అభివరి్ణస్తోంది. మథువాలు ఇప్పటికే భారతీయులని, వారికి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నాయని తృణమూల్ అధినేత్రి మమత అంటున్నారు. ‘‘ఈ దేశ పౌరులు కాకుంటే ఇన్నేళ్లు వారు ఓటెలా వేశారు? ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు, బెంగాల్ అసెంబ్లీకి ఎలా వెళ్లారు?’’ అని ప్రశి్నస్తున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బన్గావ్లో ఘోర పరాజయం తర్వాత గతేడాది పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ దుమ్ము రేపింది. బోరో కుటుంబానిదే ఆధిపత్యం... బన్గావ్ రాజకీయాలను బోరో మా (బీనాపాణి దేవి) కుటుంబమే శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్లో స్థిరపడ్డారు. ప్రమథ్ నామశూద్ర (ఎస్సీ) కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. తమలా వలస వచి్చన వారికి ఆశ్రయం కోసం స్థానిక ఠాకూర్నగర్లో భూమి కొనుగోలు చేశారు. ‘ఠాకూర్బరీ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీస్’ పేరుతో కొన్న ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యరి్థగా హన్స్ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థి శంతను ఆయన రెండో కుమారుడే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పట్టభద్రుల ఎన్నిక ప్రతిష్టాత్మకం
సాక్షి, హైదరాబాద్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుమార్లు పార్టీ అభ్యర్థులే విజయం సాధించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముమ్మర ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రచారానికి కేవలం పది రోజులే ఉన్నందున సర్వశక్తులొడ్డి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి వరకు ప్రచారం జరిగేలా సంబంధిత నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు బాధ్యత తీసుకోవాలన్నారు. బూత్ల వారీగా ఇన్చార్జీలను నియమించి ప్రచారం సమన్వయం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సింగరేణి–ఆర్టీసీ సంస్థల కార్మికులు, మహిళలు, యువత తదితర వర్గాలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అవసరమైన చోట తనతోపాటు హరీశ్రావు, ఇతర ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు. ముఖ్య నేతల ప్రచారానికి వీలుగా షెడ్యూల్ సిద్ధం చేయాలని, పార్టీ యంత్రాంగాన్ని ప్రచారంలో నిమగ్నమయ్యే లా చూడాలని కేటీఆర్ ఆదేశించారు.అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి!ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీఆర్ఎస్కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్లో చేరగా, నల్లగొండ నుంచి జగదీశ్రెడ్డి, వరంగల్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సుమారు 130 మంది నేతలకు ఆహ్వానం పంపగా, 60 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం.ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బసవరాజు సారయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి తదితరులు ఈ భేటీకి హాజరు కాలేదు. ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఉపేందర్రెడ్డి తదితరులు కూడా రాలేదు. అభ్యర్థి ఎంపికపై ఉన్న అసంతృప్తి వల్లే పలువురు సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.కేటీఆర్తో ఎంపీ అభ్యర్థుల భేటీరెండు రోజులుగా పార్టీ అధినేత కేసీఆర్ను కలిసిన పలువురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా లోక్సభ నియోజక వర్గాల వారీగా పోలింగ్ సరళిపై చర్చించారు. మెజారిటీ స్థానాల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్ కు అనుకూలిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నా యని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఫలితాల తర్వాత జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలపైనా చర్చించారు. కేటీఆర్ను కలిసిన వారిలో నామా నాగేశ్వర్ రావు, మాలోత్ కవిత, డాక్టర్ సుధీర్కుమార్, క్యామ మల్లేశ్, కంచర్ల కృష్ణారెడ్డి, పద్మారావు గౌడ్, కొప్పుల ఈశ్వర్, గడ్డం శ్రీనివాస్ యాద వ్, గాలి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. -
రైతు సమస్యలుపక్కనపెట్టి రాజకీయాలా?
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో రైతులు పడుతు న్న ఇబ్బందులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను నెల రోజులుగా పట్టించుకోవడం లేదన్నారు. రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పారు. తెలంగాణభవన్లో బుధవారం కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై పర్యవేక్షణ లేదని, హమాలీలు, ధాన్యం సంచుల కొరత, తరు గు పేరిట క్వింటాల్కు మూడున్నర కిలోల చొప్పున కోత విధించడం వంటి సమస్యలు ఉన్నాయన్నారు. వీటిపై కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేలా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతులకు అండగా రోడ్డెక్కి ఆందోళన చేస్తామన్నారు. రైతాంగం ఆందోళన, ధైర్యం చెడొ ద్దని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కేటీఆర్ పిలుపుని చ్చారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి తోనే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందన్నారు. రుణ మాఫీ, ధాన్యం కొనుగోలు, బోనస్ వంటి హామీలు అమలయ్యేంత వరకు రైతుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.అప్పులపై రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలిగత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ శ్వేతపత్రాల పేరిట చిల్లర రాజకీయం చేసిన సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ.3.89లక్షల కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక వెల్లడించిందన్నారు. అప్పులు చేయడం తప్పు అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎందుకు అప్పులు చేస్తుందని ప్రశ్నించారు. కొత్తగా చేస్తున్న అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు చేయడానికి అప్పులు చేయడం దివాలాకోరు విధానం అని, దీనిపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ విద్యుత్ ఉద్యోగులను పల్లెత్తు మాట అనలేదని, ఉద్యోగులతో తమది పేగుబంధం అని కేటీఆర్ పేర్కొన్నారు. నయీం లాంటి వ్యక్తికి కాంగ్రెస్ టికెట్వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మె ల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిలర్, ఎన్నో పార్టీలు మారిన నయీం తరహా వ్యక్తికి టికెట్ ఇచ్చిందన్నారు. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఐదున్నర నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వపాలన చూసి బీఆర్ఎస్కు మద్దతు పలకాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 30 వేల మంది ఉద్యోగులు భర్తీ కాగా, సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలతో తన ఖాతాలో వేసుకుంటున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. నల్లగొండపైనే కాంగ్రెస్ ఆశలుఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలిచే అవకాశముందని కేటీఆర్ అన్నారు. కేవలం నల్లగొండ ఎంపీ స్థానంపైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుందన్నారు. తెలంగాణభవన్లో కేటీఆర్ మీడి యాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ‘పార్లమెంటు ఎన్నికలు ఆశావ హంగా జరిగినట్టు ఈ రోజు మా ఎంపీ అభ్యర్థులతో జరిగిన భేటీలో చెప్పారు. నేను ప్రత్యేకంగా చేయించిన సర్వేలోనూ బీఆర్ఎస్ కు అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ పడినట్టు తేలింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు సరిగ్గా లేరు. సునీతా మహేందర్రెడ్డికి మల్కాజిగిరితో ఏమైనా సంబంధం ఉందా. బండి సంజయ్ను గెలిపించేందుకు వెలిచాల రాజేందర్రావు లాంటి అడ్రస్ లేని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూల్లో మా అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్కు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. నాగర్కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కాగా గెలుస్తున్నాం. పెద్ద పల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్లో బీజేపీతో బీఆర్ఎస్కు ప్రధానంగా పోటీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు లాభం జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మళ్లీ గెలుస్తారని మాకు సమాచారం ఉంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
Lok Sabha Election 2024: సెన్స్క్స్ డౌట్!
మళ్లీ వచ్చేది మోదీయే... ఈసారి ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు సీట్లు పక్కా... బీజేపీకి కనీసం 370 సీట్లు ఖాయం... కమలనాథుల అంచనాలివి! తీరా ఎన్నికలు మొదలై ఒక్కో విడత పోలింగ్ ముగుస్తున్నకొద్దీ ఈ ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారుతోంది. నాలుగు విడతల్లోనూ పోలింగ్ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గడంతో అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. ఇదే మూడ్ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓటింగ్ తగ్గడంతో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ను అందుకుంటుందో లేదోనన్న అనుమానాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బతింది. రోజుకో కొత్త రికార్డులతో రంకెలేసిన బుల్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. ఎన్నికల ‘వేడి’కి తికమకపడుతోంది. నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల వరద పారించిన విదేశీ ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు తెగబడుతున్నారు. అయి తే ఫలితాలపై అనిశ్చితి వల్లే సెంటిమెంట్పై ప్రభావం పడుతోందని, బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్వెస్టర్లు తరలివస్తారని నిపుణులు పేర్కొంటున్నారు... స్టాక్ మార్కెట్లో ఈసారి ఎన్నికల ముందస్తు ర్యాలీతో రికార్డుల మోత మోగింది. మోదీ 3.0పై నమ్మకానికి తోడు ఎన్డీయే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే, ఎన్నికల ‘వేడి’ జోరందుకుని, పోలింగ్ మొదలయ్యాక ఇన్వెస్టర్లలో నెమ్మదిగా నమ్మకం సడలుతూ వస్తోంది. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన నాలుగు విడతల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం దీనికి ఆజ్యం పోసింది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటి కారణాలు ఎన్నున్నా ... ఓటింగ్ పడిపోవడంతో ఫలితాల్లో బీజేపీ బంపర్ విక్టరీపై అనుమానాలు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలే సెన్సెక్స్ (75,111 పాయింట్లు), నిఫ్టీ (22,795 పాయింట్లు) కొత్త ఆల్టైం గరిష్టాలను తాకిన తర్వాత భారీగానే క్షీణించాయి. గడచిన నెల రోజుల్లో సూచీలు దాదాపు 3 శాతం పైగానే పడటం దీనికి అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో తొలి విడతల్లో పోలింగ్ తగ్గినా, క్రమంగా పుంజుకుంది. దాంతో మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 67.4 శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ సొంత బలం కూడా 282 నుంచి 303 లోక్సభ స్థానాలకు ఎగబాకింది. ఈసారి మాత్రం తొలి విడత నుంచే ఓటింగ్ క్రమంగా తగ్గముఖం పడుతూ వస్తోంది. మిగతా 3 విడతల్లోనూ ఇలాగే మందకొడిగా జరిగితే మొత్తం ఓటింగ్ గతం కంటే 2 నుంచి 3 శాతం తగ్గేలా కని్పస్తోంది.విదేశీ ఇన్వెస్టర్లు పీఛే ముడ్... ఓటింగ్ శాతం తగ్గుతుండటం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ)లో కూడా ఆందోళన మొదలైంది. మన ఈక్విటీ మార్కెట్లలో గత నెలన్నరలో రూ.30 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేయడం దీనికి నిదర్శనం. మార్కెట్లు భారీగా పడటానికి ఎఫ్పీఐల విక్రయాలే కీలకంగా నిలుస్తున్నాయి. 2023లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఏకంగా రూ.1.77 లక్షల కోట్లను దేశీ మార్కెట్లో కుమ్మరించి రికార్డులు బద్దలుకొట్టారు. అంతేకాదు, ఇందులో దాదాపు మూడో వంతు (రూ.58 వేల కోట్లు) ఒక్క డిసెంబర్లోనే ఇన్వెస్ట్ చేయడం విశేషం. దీనికి తోడు దేశీ ఇన్వెస్టర్లు, ఫండ్స్ జోరుతో బుల్ రంకెలేసింది. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం రాబడులు అందించాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలు పుంజుకోవడం, ప్రభుత్వ పెట్టుబడుల జోరు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు పుంజుకోవడం, సుస్థిర ప్రభుత్వం, స్థిరమైన పాలసీలు తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే, 2014లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్–మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.23,607 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. 2019 ఇదే కాలంలో రూ.29,113 కోట్లు దేశీ మార్కెట్లో కుమ్మరించారు. దీంతో 2019లో నాలుగో దశ పోలింగ్ ముగిసే నాటికి నెల రోజుల్లో సెన్సెక్స్ 3.7 శాతం, నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగబాకాయి. ఈసారి మాత్రం ట్రెండ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తిరోగమన బాట పట్టగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్కు ప్రతికూలంగా మారింది.విదేశీ మార్కెట్లు రయ్ రయ్ ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం కంటే, ఎన్నికల ప్రభావమే మన మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లు గత నెల రోజుల్లో భారీగా పెరిగినప్పటికీ.. మన సూచీలు ఆ స్థాయిలో పెరగకపోగా, 3 శాతం మేర పడిపోవడం దీనికి నిదర్శనం. గత నెల రోజుల వ్యవధిలో హాంకాంగ్ హాంగ్సెంగ్ ఇండెక్స్ ఏకంగా 15.2 శాతం జంప్ చేసింది. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ సూచీ 6 శాతం, యూఎస్ డోజోన్స్ 4.7 శాతం, జర్మనీ డాక్స్ సూచీ 4.1 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 3 శాతం చొప్పున ఎగబాకాయి. ‘‘ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. ఓటింగ్ శాతం భారీగా తగ్గితే, బీజేపీ అంచనాలు తారుమారు కావచ్చు. ఆ పార్టీ సాధించే సీట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది. మిగతా విడతల ఓటింగ్పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. తదనుగుణంగానే మార్కెట్ల గమనం ఉంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఆందోళన...బీజేపీకి గనుక సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏ పక్షాలపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గడం, బుజ్జగింపులు తదితరాలతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇప్పుడున్న స్వేచ్ఛ లేకపోవడం కూడా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు మార్కెట్లకు ప్రతికూలాంశం. చివరి మూడు విడతల్లో భారీగా ఓటర్లు పోటెత్తితే తప్ప ప్రస్తుత ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 పై చిలుకు సీట్ల లక్ష్యం నెరవేరే అవకాశాలు లేనట్టే. అంతేగాక గతంలో మాదిరిగానైనా రాకుండా బీజేపీ ఏ 260 సీట్ల దగ్గరో ఆగిపోతే మళ్లీ సంకీర్ణ లుకలుకలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇవన్నీ మార్కెట్లకు రుచించని విషయాలే. విదేశీ ఇన్వెస్టర్లలో ఇలాంటి భయాలే నెలకొన్నాయిప్పుడు! అందుకే ప్రస్తుతానికి కొన్ని పొజిషన్లను తగ్గించుకుని, ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ ఇన్వెస్ట్ చేయొచ్చనే భావన వారిలో కనబడుతోందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. సూచీల తాజా పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారంటే, ఇన్వెస్టర్లలో ఆందోళన అధికార పక్షాన్ని కూడా బాగానే కలవరపెడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ‘గతంలో కూడా మార్కెట్లు గట్టిగా పడిన సందర్భాలున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలకు ముడిపెట్టకూడదు. తాజా ఒడిదుడుకులకు ‘కొన్ని వదంతులు’ ఆజ్యం పోసి ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం జూన్ 4కు ముందే షేర్లు కొనుక్కోండి. ఫలితాల తర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది’ అని అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు.2004లో 20% క్రాష్ఎన్నికల ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా గత నాలుగు ఎన్నికల్లోనూ ఫలితాల తర్వాత సెస్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలనే అందించాయి. అయితే 2004 ఎన్నికల్లో వాజ్పేయి సర్కారు అనూహ్య ఓటమి చవిచూడటం, హంగ్ కారణంగా ఫలితాల తర్వాత 20 శాతం మార్కెట్ క్రాష్ అయింది! కానీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం కొలువుదీరాక మార్కెట్ విశ్వాసం పుంజుకుంది. మిగతా ఏడాది కాలంలో రాబడులు దండిగానే వచ్చాయి. 2009 ఫలితాల తర్వాత మే 18 నుంచి డిసెంబర్ వరకు 31 వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం విశేషం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరుకు తోడు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాలో సహాయక ప్యాకేజీలు కూడా దోహదం చేశాయి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం మార్కెట్లు ఏమంత పెద్దగా పెరగలేదు. ప్రపంచ మార్కెట్లలో అనిశి్చతి, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, బలహీన వృద్ధి రేటు వంటి ప్రభావాలతో 4 నుంచి 5 శాతం మాత్రమే రాబడులొచ్చాయి. అధికార పక్షం గెలుపు అంచనాలు తప్పొచ్చనే ఆందోళనల వల్లే దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీట్లు భారీగా తగ్గినా, సొంతంగా మెజారిటీ రాకపోయినా, ఫలితాల రోజున మార్కెట్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉండొచ్చు. ఫలితా లొచ్చేదాకా∙ఇదే అలజడి ఉంటుంది– మాధవీ అరోరా, ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ ముఖ్య ఆర్థికవేత్త– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ఉద్దేశిస్తూ.. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే తాను తిరిగి జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అందుకే ఇండియా కూటమి అభ్యర్ధులను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ చాందినీ చౌక్ లోక్సభ అభ్యర్థి జేపీ అగర్వాల్కు మద్దతుగా మోడల్ టౌన్లో కేజ్రీవాల్ రోడ్షో నిర్వహించారు.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానుఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేను మీ మధ్య ఉండటానికి జైలు నుండి నేరుగా వచ్చాను. ఈ వ్యక్తులు (బీజేపీ) నన్ను కటకటాల వెనక్కి నెట్టారు. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని నాకు బాగా తెలుసు. నేను చిన్న వ్యక్తిని. మాది ఢిల్లీ, పంజాబ్లలో ప్రభుత్వాలున్న చిన్న పార్టీ అని కేజ్రీవాల్ అన్నారు.ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి? నన్ను ఎందుకు జైలులో పెట్టారని నేను ఆలోచిస్తున్నాను. ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. పిల్లలకు మంచి విద్యను అందించడం, వారికి మంచి పాఠశాలలు నిర్మించడం, మొహల్లా క్లినిక్లు ప్రారంభించడం, ప్రజలకు ఉచితంగా మందులు అందేలా చేయడం నేను చేసిన తప్పా అని అన్నారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. నేను జైలుకు వెళ్లాలా వద్దా అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు కమలం (బీజేపీ గుర్తు) ఎంచుకుంటే నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇండియా కూటమి అభ్యర్థిని ఎంచుకుంటే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటు వేసేముందు ఆలోచించండిఓటు వేయడానికి వెళ్లినప్పుడు కేజ్రీవాల్ జైలుకు వెళ్లాలా అని మీరు ఆలోచించాలి అని ఆయన అన్నారు. నేను జైలులో ఉన్నప్పుడు తనను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కానీ హనుమంతుడి ఆశీర్వాదం వల్ల నేను బలంగా ఉన్నాను అని ఆరోపించారు.
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
- సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
- రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
- USCIS: హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
- Amit Shah: కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ !
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
- గ్లోబల్ వార్మింగ్పై ఫైటర్.. ది మమ్మోత్
- Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
- Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
- Lok Sabha Election 2024: సెన్స్క్స్ డౌట్!
Advertisement