Maoist activities
-
దంతెవాడ–బీజాపూర్లో ఎన్కౌంటర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, వరంగల్/ చర్ల: మావోయిస్టు కీలక నేతలే టార్గెట్గా సాయుధ పోలీసు బలగాలు తమ వేట ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పట్టు సాధిస్తూ మావోయిస్టుల కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్న బలగాలు నక్సల్స్ ఏరివేతను కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం దంతెవాడ–బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాలలో నక్సల్స్ ఉన్నట్టు సమాచారం అందడంతో దంతెవాడ డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ బృందం గాలింపు జరపగా చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో డీకేఎస్జెడ్సీ (దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ) సభ్యుడిగా పనిచేస్తున్న హనుమకొండ జిల్లా మడికొండ పీఎస్ పరి«ధిలోని తరాలపల్లికి చెందిన మావోయిస్టు కీలకనేత అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధాకర్ అలియాస్ సుదీర్ అలియాస్ మురళి మృతిచెందినట్టు దంతెవాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ అధికారికంగా వెల్లడించారు. 1991లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన సుధాకర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం జనధనసర్కార్ స్కూల్స్ ఇంచార్జిగా కొనసాగుతున్నాడు. తొలుత నర్సంపేట డివిజన్ ఇంచార్జి, తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలో కొంతకాలం... తర్వాత బస్తర్కు సుధాకర్ వెళ్లినట్టు సమాచారం. డీకేఎస్జెడ్సీలో కీలకంగా ఉన్న సుధాకర్పై రూ.25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు చేసిన పలు కీలక ఆపరేషన్లలోనూ సుధాకర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సారయ్య అంగరక్షకులు బీజాపూర్ జిల్లా బైరాంగర్కు చెందిన పండరు అటరా, మన్ను బర్సాలు కూడా ఎన్కౌంటర్లో మృతిచెందారు. వీరిపై రెండు లక్షల రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. ఘటనాస్థలి నుంచి ఇన్సాస్ రైఫిల్, పాయింట్ 303 రైఫిల్, పేలుడు పదార్థాలు, నిత్యావసరాల వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. తాజా ఎన్కౌంటర్ మృతులతో కలుపుకుని ఈ ఏడాదిలో ఇప్పటివరకు 116 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు వెల్లడించారు. 100 మందికిపైగా కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టులు 2025 సంవత్సరంలో ఇప్పటివరకు, బస్తర్ రేంజ్లో వివిధ ఎన్కౌంటర్లలో 100 మంది నక్సలైట్లు మృతిచెందారు. డిసెంబర్ 2, 2024లో ములుగు జిల్లా పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురుసం మంగు, 2024 సెపె్టంబర్ మొదటివారంలో కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, ఆయన భార్య తులసి అలియాస్ పునెం లక్కీ, పాల్వంచ మణుగూరు ఏరియా కమాండర్ కామ్రేడ్ రాము, పార్టీ సభ్యులు కోసి, సీనియర్ సభ్యులు గంగాల్, కామ్రేడ్ దుర్గేశ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. 2024 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని కాంకేరు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు సహా మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ మృతి చెందారు. ఇలా తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతల ఏరివేతలోనూ భద్రత బలగాలు రోజురోజుకూ పట్టు సాధిస్తున్నాయి. సీఆర్పీఎఫ్, డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్గార్డ్)కు సరిహద్దున తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పోలీస్ బలగాల దాడులు ముమ్మరం కావడంతో మావోయిస్టులు ఆత్మరక్షణకే పరిమితం అవుతున్నారు. -
భీకర కాల్పులు.. రక్తపు టేరులుగా గంగలూరు ఆండ్రీ అడవులు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ దండకారణ్యం భద్రతా బలగాలు-మావోయిస్టులు మధ్య భీకర కాల్పులతో గురువారం మారుమోగింది. ఉదయం నుంచి జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు మరణించగా.. ఓ డీఆర్జీ(District Reserve Guard) జవాన్ సైతం వీరమరణం చెందారు. ప్రస్తుతం రెండు చోట్లా.. పోలీస్ కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో నక్సలైట్లు దాగినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. గురువారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. ప్రతిగా జరిపిన ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మరణించారు. ఈ కాల్పుల్లో డీఆర్జీ జవాన్ రాజు మరణించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.ఇక.. కాంకేర్ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా జరిపిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉంటే.. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఈ మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులు, దాడుల్లో రక్తపు టేరులు ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజాపూర్ జిల్లాలోనే జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
ఎవరికి వారే.. వేసవి వ్యూహాలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈక్రమంలోనే బస్తర్ అడవుల్లో నెత్తురు ఏరులై పారింది. ఎదురుకాల్పుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ప్రభుత్వ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు (Maoists) ఎదురుదాడులకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవేసవి వ్యూహం..వేసవి (Summer) సమీపించడంతో ఆకులు రాలిపోయి అడవులు వెలవెలబోతాయి. దీంతో ప్రతి వేసవిని మావోయిస్టులు గడ్డుకాలంగానే పరిగణిస్తారు. అడవిలో చాటు తగ్గిపోవడంతో పాటు నీటి వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. దీంతో అడవుల్లోకి పోలీసులు, భద్రతా దళాలు చొచ్చుకురాకుండా ‘ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ పేరుతో ముందుగానే ఎదురుదాడులకు దిగే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. కానీ పెరిగిన నిర్బంధం వల్ల ప్రస్తుతం బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులకు మధ్య సంబంధాలు గతంలో పోలిస్తే తగ్గిపోయాయి. సానుభూతిపరుల నుంచి అవసరమైన మేర సాయం అందే పరిస్థితి లేదు. ఈ లోటును పూడ్చుకునేందుకు తమ సాయుధ బలగాలనే ఏకం చేసి వ్యూహాత్మక దాడులు చేయాలనే ప్లాన్లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.ఏకమవుతున్న దళాలు.. బస్తర్ అడవులు కేంద్రంగా కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలు, ఏరియా కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సాయుధులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి తోడు ప్రతి కమిటీకి సాయుధ దళాలు ఉంటాయి. వేసవి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలను ఎదుర్కోవాలంటే దళాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా దాడులు చేయాలనే వ్యూహానికి మావోలు పదును పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల్లో తమకు పట్టున్న ప్రాంతానికి వివిధ దళాలు చేరుకున్నట్టు తెలుస్తోంది.సురక్షితంగా ఎంట్రీ–ఎగ్జిట్.. ఒకప్పుడు రెడ్ కారిడార్ అంటే నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉండేది. ప్రస్తుతం బస్తర్ అడవులు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ చాలా ప్రాంతం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ దక్షిణ బస్తర్, ఏవోబీ, ఛత్తీస్గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ మావోల గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తమకు పట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న దళాలు... ఆయా ప్రాంతాల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్, రిట్రీవ్ రూట్లు సేఫ్గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ స్థావరాల సమీపంలోకి భద్రతా దళాలు వస్తే భీకరంగా ఎదురుదాడి చేయాలని మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జవాన్ల జోరు తగ్గిందా? ఈ ఏడాది ఆరంభంలో జనవరి 16, 21, ఫిబ్రవరి 9న భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 80 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన నెలరోజులుగా భారీ ఎన్కౌంటర్లు ఎక్కడా జరగలేదు. నక్సలైట్ల వేసవి వ్యూహాలను పసిగట్టడం వల్లనే గడిచిన నెల రోజులుగా గాలింపు చర్యలను భద్రతా దళాలు ఆచితూచి చేపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడుగా అడవుల్లోకి వెళ్లి మావోయిస్టుల వలలో చిక్కితే భారీగా ప్రాణనష్టం జరగడంతో పాటు జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్లే కూంబింగ్కు సమాంతరంగా బేస్ క్యాంపులను సుస్థిరం చేయడం, కొత్తగా అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి. కవ్వింపు చర్యలు తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ మార్చి 6న దంతేవాడ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో బస్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అక్కడ కొన్ని కుటుంబాలను ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. గాలింపు చర్యల్లో భద్రతా దళాల దూకుడు తగ్గడంతో వారిని రెచ్చగొట్టి అడవుల్లోకి రప్పించేందుకే మావోయిస్టులు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రి స్వాధీనందుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోమ్గూడ క్యాంపు బలగాలు ఆదివారం మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్గూడ క్యాంపు నుంచి డీఆర్జీ, కోబ్రా, 241 బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గోమ్గూడ క్యాంపు పరిధిలోని జాలేర్గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు స్పైక్(పదునైన కడ్డీలు)లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించుకుంటూ గాలిస్తుండగా.. మావోయిస్టులకు చెందిన ప్రింటింగ్ స్థావరం బయటపడింది. అక్కడ మావోయిస్టులు దాచిపెట్టిన ప్రింటర్లు, ఇన్వర్టర్ యంత్రాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమా? -
ఎరుపెక్కిన ఇంద్రావతి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. అక్కడి ఇంద్రావతి నేషనల్ పార్క్లో ఆదివారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఇంద్రావతి ఏరియా కమిటీలు ఒకేచోట సంచరిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీనితో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ఫోర్స్లకు చెందిన జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వా«దీనం చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణ నేతలు? ఛత్తీస్గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ షెల్టర్ తీసుకోగా, ఇంద్రావతి ఏరియా కమిటీ రక్షణగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీనితో వివిధ భద్రతా దళాలకు చెందిన 650 మందికిపైగా జవాన్లు వేర్వేరు దిశల నుంచి శుక్రవారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. శనివారం రాత్రికల్లా మావోయిస్టులు బస ప్రదేశాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఎన్కౌంటర్ మృతుల్లో ఎక్కువ మంది జనమిలీషియా సభ్యులే ఉన్నట్టు సమాచారం. వారితోపాటు తెలంగాణ కమిటీకి చెందిన కీలక నేత కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మొదలైతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. టార్గెట్ చేసి.. రెండో సారి.. భద్రతా దళాలు కొన్ని నెలలుగా మావోయిస్టు తెలంగాణ కమిటీ టార్గెట్గా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవులను జల్లెడపట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలినవారు తప్పించుకున్నారు. ఆ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి తెలంగాణ కమిటీ లక్ష్యంగా ఇంద్రావతి నేషనల్ పార్క్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దండకారణ్యంపై భద్రతా దళాల పట్టు మావోయిస్టులు స్థాపించిన జనతన సర్కారుకు దండకారణ్యమే కేంద్ర బిందువుగా నిలిచింది. కానీ గడిచిన ఏడాదిలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని క్రమంగా తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంటున్నాయి. గత ఏడాది చివరిలో కొండపల్లిలో భద్రతా దళాల క్యాంపు ఏర్పాటైన తర్వాత.. దండకారణ్యం తమకు సురక్షితం కాదని మావోయిస్టులు నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న వివిధ కమిటీలు, దళాలకు చెందిన కీలక నేతలు సమీపంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు తరలివెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. టైగర్ రిజర్వ్లపై ఫోకస్ ఇంద్రావతి నేషనల్ పార్క్ 2,779 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీన్ని 1983లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. మావోయిస్టుల అడ్డాలైన అబూజ్మడ్, దండకారణ్యం మధ్య ఈ అడవి వారధిగా నిలిచింది. ఇందులో సగానికిపైగా మావోయిస్టుల ఆ«దీనంలోనే ఉంది. ఫారెస్టు గార్డులు కూడా అక్కడ కాలు పెట్టలేని పరిస్థితి ఉందని అంటారు. ఇలా టైగర్ రిజర్వులలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులపై కొన్నేళ్లుగా భద్రతా దళాలు ఫోకస్ చేశాయి. ఇంతకుముందు ఉదంతి – సీతానది టైగర్ రిజర్వ్లో భాగంగా ఉన్న ఘరియాబండ్ అడవుల్లో జనవరి 24న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సహా 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు ఇంద్రావతి రిజర్వు ఫారెస్ట్లో ఏకంగా 31 మంది మృతి చెందారు. గడువు కంటే ముందే మావోయిస్టుల అంతం: అమిత్షామావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్కు ‘ఇంద్రావతి’తో భారీ విజయం దక్కిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గడువుగా పెట్టుకున్న 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నారు. ఎన్కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆ జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా దళాలకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు.40 రోజుల్లో 81 మంది మృతిఛత్తీస్గఢ్లో ఈ ఏడాది మొదలైన 40 రోజుల్లో 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. అందులో 65 మంది బస్తర్లో జరిగిన ఘటనల్లో కన్నుమూశారు. గతేడాది ఛత్తీస్గఢ్లో 217 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. -
ఎల్గార్ కేసులో విల్సన్, ధావలెకు బెయిల్
ముంబై: ఎల్గార్ పరిషత్– మావోయిస్టుల లింకు కేసులో పరిశోధకుడు రొనా విల్సన్, ఉద్యమకారుడు సుధీర్ ధావలె దాదాపు ఆరేళ్ల అనంతరం శుక్రవారం జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. వీరిద్దరికీ ఈ నెల 8వ తేదీన బాంబే హైకోర్టు బెయిలిచ్చింది. ‘వీరు 2018 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. వీరిపై ఇప్పటికీ ఆరోపణలను నమోదు చేయలేదు. ఈ కేసులో 300 మంది సాక్ష్యులను విచారించాల్సి ఉందని ఎన్ఐఏ అంటోంది. ఈ దృష్ట్యా కేసు విచారణ కనీస భవిష్యత్తులో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు’అని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విల్సన్, ధావలెలు శుక్రవారం ఎన్ఐఏ కోర్టులో బెయిల్కు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేసి తలోజా జైలు నుంచి విడుదలయ్యారు. 2017 డిసెంబర్ 31వ తేదీన పుణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే ఆ తర్వాత కోరెగావ్–భీమాలో హింసాత్మక ఘటనలకు దారి తీసినట్లు కేసు నమోదైంది. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉద్యమకారులు, విద్యావేత్తలు సహా14 మందిని అరెస్ట్ చేశారు. వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తెల్తుండే, అరుణ్ ఫెరీరా తదితర 8 మంది విడుదలయ్యారు. మహేశ్ రౌత్ పెట్టుకున్న బెయిల్కు వ్యతిరేకంగా ఎన్ఐఏ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటంతో ఆయన జైలులోనే ఉన్నారు. స్టాన్ స్వామి అనే క్రైస్తవ ప్రబోధకుడు జైలులోనే 2021లో చనిపోయారు. -
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత చలపతి మృతి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్గఢ్, ఒడిశా భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. కోబ్రా బెటాలియన్, సీఆర్పీఫ్ సిబ్బంది కూంబింగ్లో పాల్గొన్నారు. కుటరిఘాట్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.ఈ ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు జైరామ్ అలియాస్ చలపతి మృతి చెందారు. చలపతిపై రూ.కోటి రివార్డ్ ఉంది. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్తో పాటు భారీ ఎత్తున ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల 19 నుంచి రెండు రాష్ట్రాల బలగాల ఉమ్మడి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రెండు రోజులుగా ఛత్తీస్గఢ్, ఒడిశా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. నిన్న, ఇవాళ ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు.కాగా, తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్లో గత గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఘటనలో బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు.తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు.ఇదీ చదవండి: బాయ్ఫ్రెండ్ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు! -
మావోయిస్టుల బంకర్ స్వాధీనం.. కొత్త టెక్నాలజీతో బాంబుల తయారీ!
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 20 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ క్రమంలోనే తుమ్రైల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ బంకర్ను జవాన్లు గుర్తించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు సామ్రాగిని స్వాధీనం చేసుకున్నారు.బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రైల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ బంకర్ను డీఆర్జీ జవాన్లు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సైనికులకు హాని కలిగించే విధంగా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు నక్సలైట్లు గాజు సీసాలు ఉపయోగిస్తున్నట్లు భద్రత బలగాలు గుర్తించాయి. ఆయుధాలు తయారు చేసే యంత్రాలు, ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను గుర్తించారు.బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేరు, మారేడుబాక అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు తాలిపేరు నది ఒడ్డున తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో ఈ సొరంగాన్ని కనుగొన్నట్టు తెలిపారు. దీంతో, మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్గఢ్లో మావోయిస్టులే టార్గెట్గా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేతలు కూడా ఉన్నారు. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వీరిలో తెలంగాణ కేడర్కే చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటన.. బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావో యిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఘటనతెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో తొలిసారిగా కాల్పులు మొదలయ్యాయి. అప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 17 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే మృతులు ఎవరు? ఎంత మంది చనిపోయారనే అంశంపై అధికారిక సమాచారం వెలువడలేదు. ఇదీ చదవండి: సైఫ్పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్ -
మన్యంలోకి మళ్లీ మావోలు!
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్ట్ల కదలికలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. 2022లో ఏవోబీ నుంచి మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దులకు తరలివెళ్లిన మావోయిస్ట్ నేతలు ఏవోబీకి తిరిగొస్తున్నారు. ఏవోబీలో కార్యకలాపాలు విస్తరించాలన్న మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు వారు తిరిగొస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు శాఖను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. 2022లో ఏవోబీని విడిచిపెట్టి.. రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలో పోలీసు శాఖ సమర్థ పనితీరుతోపాటు గిరిజన ప్రాంతాల్లో భారీ స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టింది. ఏవోబీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగును ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా నిర్మూలించింది. మావోయిస్ట్ కార్యకలాపాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసింది. ఏవోబీలో 20 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించిన మావోయిస్ట్లు దాదాపు పూర్తిగా పట్టుకోల్పోయారు. ఒకప్పుడు 500 మంది నేతలు, 1,500 మంది మిలీషియా సభ్యులతో పోలీసులకు సవాల్ విసిరిన మావోయిస్ట్ పార్టీ బలం పూర్తిగా నీరుగారిపోయింది. కేవలం 20 మంది నేతలు, 100 మంది మిలీషియా సభ్యులకు పరిమితమైపోయింది. వారిలో కూడా క్రియాశీలంగా కేవలం 50 మంది మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమై మిగిలి ఉన్న మావోయిస్ట్ నేతలు, క్రియాశీల నేతలను మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దులకు తరలివెళ్లాలని ఆదేశించింది. ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్తోపాటు ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని సురక్షిత స్థావరాలకు 2022 చివరిలో తరలివెళ్లిపోయారు. అప్పటినుంచి రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాక్ టు ఏవోబీ ఇటీవల కాలంలో మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్లలో ఆ రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లతో విరుచుకుపడుతున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 287 మంది మావోయిస్ట్లు ఎన్కౌంటర్లలో హత మవ్వగా.. వెయ్యి మందికిపైగా అరెస్టయ్యారు. వారిలో 190 మంది ఛత్తీస్గఢ్లోనే హతమవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఇక ఏమాత్రం సురక్షిత స్థానం కాదని చెబుతూ ఏవోబీకి చెందిన 20 మంది మావోయిస్ట్ నేతలతోపాటు మొత్తం 50 మంది మావోయిస్ట్లను వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. దాంతో మావోయిస్ట్ నేతలు దశలవారీగా ఏవోబీలోకి వస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. రాష్ట్ర పోలీసు శాఖను ఈ విషయంపై అప్రమత్తం చేశాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని దాదాపు 20 మండలాల్లో మావోయిస్ట్లు, మిలీషియా సభ్యుల కదలికలు మెల్లగా ఊపందుకున్నట్టు రాష్ట్ర పోలీసు శాఖ గుర్తించింది. మావోయిస్ట్ల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నాయి. -
‘బస్తర్’లో మావోయిజం ఖాళీ!
ఒకప్పుడు పోలీసులపైకి మెరుపు దాడులు, మందుపాతరల పేలుళ్లు, తుపాకీ మోతలు, బుల్లెట్ల శబ్దాలు, వరుస ఎన్కౌంటర్లతో రక్తమోడిన ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్తర్ పేరు చెబితేనే భయపడేంతగా గజగజలాడించిన మావోయిస్టులు ఇప్పుడు అక్కడ తమ పట్టును కోల్పోయారని కేంద్రం పేర్కొంది. ప్రాభల్యం తగ్గిపోవడం, పోలీసుల ముమ్ముర ఏరివేత కార్యక్రమాలు, మరోవైపు పునరవాస కల్పనా చర్యలు, ఇంకోవైపు అభివృధ్ధి కార్యక్రమాల కారణంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో మావోయిజం పూర్తిగా కనిపించకుండా పోయిందని వెల్లడించింది. కేంద్ర చర్యలతో .. బస్తర్ డివిజన్లో బస్తర్, దంతెవాడ, బీజాపూర్, కంఖేర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా మొత్తంగా ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాగా బస్తర్ పేరొందింది. ముఖ్యంగా 2013 ఏడాది మే నెలలో కాంగ్రెస్ నేతలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 27 మందితో పాటు 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ దాడిలోనే కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి మహేంద్ర కర్మ చనిపోయారు. ఆ తర్వాత సైతం ఈ జిల్లా పేరు చెబితేనే పోలీసు బలగాల్లోనూ వణుకు పుట్టేంతస్థాయిలో మావోల మెరుపుదాడులు కొనసాగాయి. 2014 తర్వాత మావోల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దూకింది. ఈ జిల్లావ్యాప్తంగా భద్రతా బలగాల సంఖ్యను విపరీతంగా పెంచింది. లొంగుబాట్లను ప్రోత్సహించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో గడిచిన రెండేళ్లుగా పోలీసులు, మావోలకు మధ్య పరస్పర కాల్పుల ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు. పైగా జిల్లాలో ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ కాగా, మరో 13 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. ఈ ఏడాదిలో మావో సంబంధ ఘటన ఒక్కటి కూడా నమోదుకాలేదు. సమీప కొండగావ్ జిల్లాలోనూ ఒక్క ఘటన నమోదుకాలేదు. రెండు జిల్లాలకు పొరుగునే ఉన్న బీజాపూర్ జిల్లాలో 465 మంది, సుక్మా జిల్లాలో 253 మంది మావోలను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలో రెండేళ్లలో 100 మందికి పైగా మావోలు పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత ఐదు దశాబ్దాలుగా మావోల కదలికలతో నిత్యం వార్తలో ఉండే బస్తర్ జిల్లాలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మావోయిస్టు దుశ్చర్యకు సంబంధించిన ఘటనలు జరగకపోవడం విశేషం. కొండగావ్లోనూ మావోల ఉనికి లేదని ఇటీవల ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో పోలీసులు, మావోలకు మధ్య జరిగిన పరస్పర ఎదురుకాల్పుల్లో 208మంది మావోలు చనిపోయారు. బస్తర్, కొండగావ్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగకపోవడం విశేషం. 802 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. బహుముఖ వ్యూహంతో ముందుకు 2026 నాటికి పూర్తిస్థాయిలో మావోలను ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం ఈ లక్ష్యసాధన కోసం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఓపక్క భద్రతా చర్యలను పటిష్టం చేస్తూనే, మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంపై ప్రధానంగా దృష్టిసారించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టింది. చౌక ధరల దుకాణాలను పెంచడం, సమాచార వ్యవస్థల పటిష్టం, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, రహదారులకు భారీగా నిధుల కేటాయింపు, లొంగిపోయే మావోలకు తక్షణ పునరావాస కార్యక్రమాలతో వారి ఉనికిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
అడవిలో ఆఖరి పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో మావోయిస్టులను 2026 మార్చి కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇటీవల ప్రకటించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సల్వాజుడుం పేరుతో 2007లో మావోయిస్టుల ఏరివేతలో నేరు గా కేంద్రం జోక్యం చేసుకునే ప్రక్రియ.. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. యూపీఏ హయాంలో.. దేశంలోని ప్రధాన విప్లవ శక్తులైన పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్లు విలీనమై 2004 సెపె్టంబర్ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ఆయా పార్టీల నేతలు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో మావోయిస్టు పార్టీకి గెరిల్లా జోన్గా ఉన్న బస్తర్ అడవుల నుంచి యాంటీ నక్సల్స్ ఆపరేషన్ను కేంద్రం ప్రారంభించింది. మావోయిస్టులకు ఎక్కువ మద్దతిచ్చే తెగకు.. ఎదురు నిలిచే మరో తెగ సభ్యులను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించింది. వారి చేతికి ఆయుధాలిచ్చి శాంతిదళం (సల్వాజుడుం)ను 2007లో ఏర్పాటు చేసింది. సల్వాజుడుం మొదటి అడుగు నుంచి 2011లో రద్దయ్యే వరకు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. సల్వాజుడుంపై విమర్శలు ఎక్కువ రావడంతో 2009 సెప్టెంబర్లో పెద్దఎత్తున సీఆర్పీఎఫ్ బలగాలను బస్తర్ అడవుల్లోకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. దీన్నే ఆపరేషన్ గ్రీన్హంట్గా పేర్కొంటున్నారు. ఆపరేషన్ గ్రీన్హంట్ కారణంగా మావోయిస్టుల చేతిలో భద్రతా దళాలకు చెందిన జవాన్లు తీవ్రంగా నష్టపోయారు. బస్తర్ అడవులపై ప్రభుత్వ దళాలకు పట్టు చిక్కలేదు. నాగా కమాండోలు.. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన గ్రీన్హంట్కు మరింత పదును పెట్టింది. అప్పటికే పశ్చిమ బెంగాల్లో మావోయిస్టులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన నాగా బెటాలియన్ను బస్తర్ అడవులకు పంపాలని నిర్ణయించింది. వీరి చేతుల్లో అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, శాటిలైట్ ఫోన్లు పెట్టింది. అప్పటికే కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) దళాలు రంగంలో ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఆశించిన ఫలితాలు రాలేదు. ఆపరేషన్ సమాధాన్.. యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టి పదేళ్లు దాటినా బస్తర్ అడవులపై పట్టు చిక్కకపోవడానికి వ్యూహాల్లో లోపాలే కారణమనే భావనకు కేంద్రం వచ్చి0ది. దీంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్ – స్మార్ట్ లీడర్íÙప్, ఏ – అగ్రెసివ్ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ – డ్యాష్బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్ – హర్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ – యాక్షన్ ప్లాన్, ఎన్ – నో ఆక్సెస్ టు ఫైనాన్సింగ్)ను తెరపైకి తెచ్చి0ది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడటం, మావోయిస్టుల్లోకి కొత్త నియామకాలు జరగకుండా జాగ్రత్త పడటం వంటి పనులపై ఎక్కువ శ్రద్ధ చూపించారు. దీంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో వేగం పెంచారు. గగనతల దాడులు ఆపరేషన్ సమాధాన్తో పరిస్థితులు అనుకూలంగా మారాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత 2021 జూన్ 19న తొలిసారిగా వాయుమార్గంలో మావోయిస్టు శిబిరాలపై కేంద్ర బలగాలు దాడులు చేశాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే మావోయిస్టు శిబిరాలపై వాయుమార్గంలో దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం కావడం, నిరసనలు రావడంతో.. ఈ తరహా దాడులపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ 2021 జూన్ నుంచి 2022 చివరి వరకు నాలుగుసార్లు తమపై గగనతల దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. లోపాలను అధిగమిస్తూ.. మావోయిస్టుల ఏరివేతలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త వ్యూహాలను కేంద్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. లొంగిపోయిన, అరెస్టయిన మావోయిస్టుల (సాధారణంగా స్థానిక ఆదివాసీలకే అధికారం)తో డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ పేరుతో ప్రత్యేక దళాలను తయారు చేసింది. నాగా కమాండోలు ఇక్కడి అడవులపై పట్టు సాధించలేకపోవడంతో.. వారికి బదులుగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లను రంగంలోకి దించింది.సాయుధులైన పురుష కమాండోల వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేకంగా విమెన్ కమాండో దళాలను తయారు చేసింది. ఎండాకాలం, వానాకాలం అని తేడా లేకుండా ఏడాదంతా అడవుల్లో కూంబింగ్ చేపట్టేలా ఆపరేషన్ సూర్యశక్తి, ఆపరేషన్ జల్శక్తి పేర్లతో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి0ది. దీంతో ఆఖరికి వానాకాలంలో కూడా మావోయిస్టులు నిర్భయంగా సంచరించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా భద్రతా దళాలపై మావోలు జరిపే వ్యూహాత్మక ఎదురుదాడులను గణనీయంగా తగ్గించగలిగారు. విస్తృతంగా పారా మిలిటరీ క్యాంపులు సంఖ్య, శిక్షణ, ఆధునిక ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ పరంగా సంసిద్ధమైన తర్వాత బస్తర్ అడవుల్లో ప్రతీ ఆరు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా దళాలకు చెందిన క్యాంపులను ఏర్పాటు చేస్తూ.. మావోయిస్టులను కేంద్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం బస్తర్లో 370కి పైగా పారా మిలిటరీ క్యాంపులున్నాయి. సుక్మా, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలతో కూడిన దండకారణ్యంలో మావోయిస్టుల గెరిల్లా జోన్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాయి. చివరికి మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామమైన పువర్తిలోనూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాలు క్యాంపును ఏర్పాటు చేశాయి. ఆపరేషన్ కగార్ సీఆర్పీఎఫ్, డీఆర్జీ, స్పెషల్ టాస్్కఫోర్స్, కోబ్రా, పోలీసులు.. ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ జాయింట్ ఆపరేషన్లకు శ్రీకారం చుడుతూ ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను 2024 జనవరిలో ప్రారంభించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్గా ఉన్న అబూజ్మడ్ (బీజాపూర్, నారాయణ్పూర్, కాంకేర్, కొండగావ్) అడవులపై ప్రభుత్వం గురి పెట్టింది.ఈనెల 5న తుల్తులీ ఎన్కౌంటర్లో ఏకంగా 38 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 200 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరో 400 మందికి పైగా లొంగిపోవడం లేదా అరెస్టయ్యారు. ప్రభుత్వ దళాల నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు అగ్రనేతలు చెల్లాచెదురయ్యారనే ప్రచారం జరుగుతోంది. -
అడవిలో అన్నలు లేనట్లేనా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వామపక్ష తీవ్రవాద ప్రాంతాల జాబితా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కేంద్ర హోంశాఖ తొలగించింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ మావోయిస్టుల కార్యక్రమాలేవి లేకపోవడం, భద్రత బలగాలు పూర్తి పట్టు సాధించడంతో ఎల్డబ్ల్యూఈ(లెఫ్ట్ వింగ్ ఎక్స్స్ట్రిమిజం ఎఫెక్టెడ్) ప్రాంతాల నుంచి తప్పించింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం కారణంగా ప్రత్యేక పథకాల అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రత బలగాల పర్యవేక్షణ కొనసాగతున్నాయి. భవిష్యత్లో ఈ కార్యకలాపాలు క్రమంగా తగ్గనున్నాయి.ప్రత్యేక పథకాలతో నిధులుదేశంలో నక్సలిజాన్ని తగ్గించేందుకు ఆపరేషన్ ‘సమాధాన్’, రాష్ట్రంలో ‘గ్రీన్హంట్’ పేర్లతో మావోయిస్టుల ఏరివేత కొనసాగింది. 2010లో 96జిల్లాల్లో ‘మావో’ల ప్రభావం ఉండగా, 2021నాటికి 46కు పడిపోయి, తాజాగా 38జిల్లాలకు చేరింది. ఈ నెల 7న వామపక్ష ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాలను వా మపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా కొనసాగించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం లేకపోవడంతో ఎల్డబ్ల్యూఈ నుంచి తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. నక్సల్స్ కారణంగా ఎన్నికల సమయంలో ఓటింగ్ గంట ముందే నిలిపివేయడం, అధికారులు, ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర, కేంద్ర బలగాల పహారా, స్థానికులపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. దేశంలో 2026నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది.సమసమాజ స్థాపన లక్ష్యంగాపేద, ధనిక మధ్య అంతరాలను తొలగిస్తూ భూ స్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థలకు వ్యతిరేకంగా ఐదు దశాబ్దాల క్రితం నక్సలిజం పురుడు పోసుకుంది. కార్మిక, కర్షక, రైతాంగ సమస్యల పరిష్కారానికి విప్లవ పంథాలోనే సమసమాజ స్థాపన సాధ్యమని ఆ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా నుంచి యువత నక్సలిజం వైపు మళ్లారు. మూడు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీ గిరిజన, మైదాన ప్రాంతాలు, ఇటు సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) సంస్థలు విప్లవ బావుటా ఎగురవేశాయి. ప్రజల మద్దతుతో అనేక పోరాటాల్లో పోలీ సులపై పైచేయి సాధించారు. లక్సెట్టిపేట, ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఖానాపూర్, తిర్యాణి, సిర్పూర్, చెన్నూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, ఆదిలాబాద్, జ న్నారం తదితరచోట్ల భీకర పోరాటాలు జరిగాయి. దొరల ఇళ్లపై దాడులు, దోపిడీదారులు, ప్రజాకంఠకులను ప్రజాకోర్టులో శిక్షించేవారు. ఆ సమయంలోనే నిరుపేదలకు భూపంపిణీ జరిగింది. బలగాలు, నక్సల్స్కు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం ఉండగా క్రమంగా తగ్గుముఖం పట్టింది.‘కడంబా’ ఘటన చివరిదిఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతంతోపాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, ప్రాణహిత, పెన్గంగా, గోదావరి తీర గ్రామాలకు గత పదేళ్లుగా కొత్త రోడ్లు, సమాచార వ్యవస్థతో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. రూ.కోట్లు వెచ్చించి ఆసుపత్రులు, గిరిజన యువతకు పథకాలు తె చ్చారు. దీంతో నక్సలిజం తగ్గింది. తెలంగా ణ ఏర్పడ్డాక కేబీఎం(కుమురంభీం మంచి ర్యాల) కమిటీ తిరిగి కార్యకలాపాలు సాగించేందుకు ప్రయత్నించింది. గిరిజన యువతను ఉద్యమం వైపు ఆకర్షించి దళంలో చే ర్చుకునే ప్రయత్నం చేసింది. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో భద త్రా బలగాల చేతిలో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన బాదీరావు మృతిచెందారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర సభ్యుడు అడెళ్లు భాస్కర్ పట్టు పెంచే ప్రయత్నాలు చేసినా వీలు కాలేదు. రెండేళ్ల క్రితం ఆయన సహచరి కంతి లింగవ్వ చనిపోయింది. పార్టీ బలోపేతం లక్ష్యంగా మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్, మంగీ, చెన్నూరు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకాలు చేపట్టింది. ఈ కమిటీలు దండకారణ్యం కేంద్రంగానే కార్యకలా పాలు సాగించాయి. కోవిడ్ తర్వాత పలు మార్లు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రవేశించే ప్రయత్నాలు జరిగాయి. కానీ నిలదొక్కులేకపోయారు. ప్రస్తుతం కోల్బెల్ట్ కమిటీ పేరుతో సింగరేణి కార్మి కుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలు మాత్రం వెలువడుతున్నాయి. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 30 మంది నక్సల్స్ మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ-నారాయణ్పుర్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది.దంతెవాడ, నారాయణ్పుర్ పోలీసుల సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజా ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర మావోయిస్టు పార్టీ అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. ఎన్కౌంటర్ తీరుపై కేంద్ర పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: కాంగ్రెస్ యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతోంది: అమిత్ షా -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు జవాన్ల మృతి
రాయిపూర్ : ఛత్తీస్గడ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన జవాన్లు విష్ణు, శైలేంద్రగా గుర్తించారు పోలీసు అధికారులు. బీజార్ పూర్ జిల్లా సిల్గూర్ -టేకులగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
జార్ఖండ్లో ఎన్కౌంటర్: నలుగురు మావోయిస్టుల మృతి
రాంచి: జార్ఖండ్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సింగ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నాలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.టోంటో, గోయిల్కేరా ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను టార్గెట్ చేస్తూ పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారి అమోల్ వి హోమ్కర్ తెలిపారు. ‘‘ఎదురు కాల్పుల్లో నాలుగు మావోయిస్టులు మృతి చెందారు.అందులో ఒక మహిళా మావోయిస్టు ఉంది. మరో ఇద్దర మావోయిస్టులను అరెస్ట్ చేశాం. ఘటన స్థలం నుంచి రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు తెలిపారు.ఇక.. రెండు రోజుల క్రింతం ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్ మృతి చెందారు. -
చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఐదుగురి మావోయిస్టుల మృతి
చత్తీస్గఢ్: చత్తీస్గఢ్లోని నారాయణపూర్ ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఈ ఎన్కౌంటర్లో 5 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్-దంతెవాడ-కొండగావ్ అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ ఘటన జరిగింది. ఈస్ట్ బస్తర్ డివిజన్ పరిధిలోని గోబెల్ ప్రాంతంలోని ముంగేడి గ్రామంలో మావోయిస్టులుపై అంతర్ జిల్లా ఉమ్మడి ఆపరేషన్ను పోలీసులు, జవాన్లు సంయూక్తంగా నిర్వహించారు. ఆపరేషన్లో యూనిఫారం ధరించిన ఐదుగురు మావోయిస్టులు ఆయుధాలతో సహా మృతి చెందారు.పెద్ద సంఖ్యలో మావోయిస్టులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపూర్ డీఆర్జీకి చెందిన ముగ్గురు జవాన్లకు గాయాలు అయినట్లు సమాచారం. -
దద్దరిల్లిన దండకారణ్యం.. 13 మంది మావోయిస్టుల మృతి
చత్తీస్గఢ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో చత్తీస్గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా పోలీసుల, భద్రతా బలగాల కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్లో నిన్న( సోమవారం) జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. కోర్చోలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నిన్న సాయంత్రం వరకు 10 మంది మావోయిస్టులు మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ పూర్తైన అనంతరం మరో ముగ్గురు మావోయిస్టులు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సుమారు 8 గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి. కుంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్న డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్, బస్తర్ ఫైటర్స్ పాల్గొన్నారు. ఇక.. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పది రోజుల వ్యవధిలో నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి. ఇప్పటివరకు మొత్తం 25 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్గఢ్లో నక్సలైట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం పోలీసుల బలగాలు, మావోల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగులూరు పోలీస్స్టేషన్ పరిధి కొర్చోలి, లేంద్ర గ్రామాల సమీపాన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం రాత్రి జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్, కోబ్రా కమాండో , బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కొర్చేలి, లేంద్ర మధ్య అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు పది మంది మావోయిస్టుల మృతి మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 11 గంటల సమయాన మళ్లీ వారికి మావోలు తారసపడి కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మరో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా పది మంది మావోయిస్టులు మృతి చెందారని, ఇందులో ఒక మహిళ ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజు వెల్లడించారు. మృతులు మావోల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రెండో కంపెనీ సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనలో సుమారు 30 మంది మావోలు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. పలువురు గాయాల పాలై తప్పించుకున్నట్లు భావించి పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఘటనాస్థలి నుంచి పెద్ద మొత్తంలో లైట్ మెషీన్ గన్స్, ఏకే 47 తుపాకులు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు, మందుపాతరలు, పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. మధ్యప్రదేశ్లో మరో ఇద్దరు బాలాఘాట్: మధ్యప్రదేశ్లోని బాలా ఘాట్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఘటనలో ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులు మృతి చెందారు. వారిని సాజంతి అలియాస్ క్రాంతి(38), రఘు అలియాస్ షేర్ సింగ్(52)గా గుర్తించారు. ఘటనా స్థలిలో ఆయుధాలు దొరికాయి. సాజంతిపై రూ.29 లక్షలు, రఘుపై రూ.14 లక్షల రివార్డులున్నాయి. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టుల మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు సమాచారం. గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన నక్సల్స్ మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎల్ ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ బలగాలు ఇంకా ఎదురు కాల్పుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్లో బీజాపూర్తో సహా ఏడు జిల్లాలున్న బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భద్రతా బలగాలు, పోలీసుల..చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మరింత జల్లెడ పడుతున్నారు. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది. యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది. అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది. నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం. ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు. అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా? కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు. కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి. -
మావోయిస్టులపై కేంద్రం ఫోకస్.. దద్దరిల్లిన దండకారణ్యం!
సాక్షి, రాయ్పూర్: మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ పతాకస్థాయికి చేరింది. ఈ క్రమంలో బలగాల కూంబింగ్లో ఛత్తీస్గఢ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉలికిపాటు మొదలైంది. వివరాల ప్రకారం.. మావోయిస్ట్ ఏరివేత కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ తీవ్రతరం చేసింది. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ కొనసాగుతోంది. నారాయణపూర్లో కేంద్ర బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పీఎల్జీఏ స్థావరం అబూజ్మడ్ను చుట్టుముట్టేందుకు బీఎస్ఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్కు చెందిన పదివేల మందితో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, ఇటీవలే జోసెఫ్ (దర్శన్ పాల్), సంజీత్ (అర్జున్ ప్రసాద్ సింగ్)ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల మూలంగా భారత్ కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి సహకారంతో అబూజ్మడ్ను ముట్టడించే కార్యక్రమానికి కేంద్ర భద్రతా వర్గాలు రెడీ అయ్యాయి. ఇక, తాజాగా కూంబింగ్తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని తూర్పు డివిజన్ ఉలిక్కిపడింది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
ఒడిశాలో మావోయిస్టుల ఆయుధ డంప్ స్వాధీనం..
భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన సోదాల్లో మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి లభ్యమైంది. పక్క సమాచారంతో జరిపిన సోదాల్లో లభ్యమైన ఈ సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళాలు. బెజంగివడ రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో మల్కన్గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ పరిధి అమపాదర్-ఎల్కనూర్ గ్రామం, బోడిలుగూడ- బృందమామిడి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్లో జరిపిన సోదాల్లో రాకెట్ లాంచర్లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు BSF సిబ్బంది. సరిహద్దు భద్రతా దళాల వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక 303 రైఫిల్, 11 బ్యారెల్ (SBML), 303 రైఫిల్ యొక్క మ్యాగజైన్, 15 మెరుగైన హ్యాండ్ గ్రెనేడ్లు, మూడు దేశీయ తుపాకులు, రెండు 51 MM మోర్టార్ బాంబులు, ఒక గ్యాస్ వెల్డింగ్ యంత్రం, 42 లైవ్ కాట్రిడ్జ్లు, రాకెట్ లాంచర్, రెండు బ్రెన్ 303 ఎల్ఎంజీ స్పేర్ బ్యారెల్స్, 29 జెలటిన్ స్టిక్స్, ఐదు అల్యూమినియం నైట్రేట్ ప్యాకెట్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తొమ్మిది సింథటిక్ వెయిస్ట్ బెల్ట్లు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు వారి సానుభూతిపరులకు కంచుకోటగా ఉండేదని, వామపక్ష దళాలు పేలుడు ముడి పదార్థాలను ఇటువంటి రిమోట్ ప్రదేశాలలో ఉంచి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారని తెలిపింది BSF సిబ్బంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి దొరకడంతో మావోయిస్టుల ఉనికి నిర్ధారణ అయ్యిందని అనుమానిత ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్లో చిక్కుకున్న యాత్రికులు -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
దుమ్ముగూడెం(తెలంగాణ): ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేర్లపాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సిరిసెట్టి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సిమెల్, గోగుండా కొండలపై పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ బలగాలు గాలింపు చేపట్టాయి. గురువారం రాత్రి భద్రతా బలగాలు కూంబింగ్ ముగించుకుని వస్తుండగా కోడెల్పరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేశారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా, మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే పారిపోయారు. అనంతరం ఘటనాస్థలంలో ఓ మావోయిస్టు మృతదేహంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమయ్యా యని, మరో ఐదుగురు మావోయిస్టులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. -
పద్మక్క ఇచ్చిన రూ.15లక్షల కోసం వస్తాం..
సారంగాపూర్(జగిత్యాల): జిల్లాలోని బీర్పూర్ మండలం సుమారు 15ఏళ్లక్రితం వరకూ మావోయిస్టు(అప్పటి పీపుల్స్వార్)లకు పెట్టని కోటలా ఉండేది. కానీ, శుక్ర, శనివారాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల పేరిట లేఖలు రావడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్రావు ఉరఫ్ గణపతి స్వగ్రామం నిన్నటివరకూ ప్రశాంతంగా ఉంది. కానీ, నక్సల్స్ లేఖలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ పేరిట లేఖలు.. ► గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్ పేరిట స్థానిక ప్రజాప్రతినిధులకు లేఖలు అందినట్లు తెలిసింది. ► సీపీఐ – మావోయిస్టు జగదల్పూర్ జిల్లా ఏరియా కమిటీ పేరిట లెటర్హెడ్లపై ఆ లేఖలు ఉన్నాయి. ► మరికొన్నింటిపై మల్యాల ఏరియా కమిటీ ఉంది. ► వీటిని సానుభూతిపరులు పంపించారా, గతంలో నక్సల్స్తో సంబంధాలు నెరిపిన వారు పొస్టు చేశారా? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. లేఖల్లో ఏముందంటే.. ► అటవీభూములు కబ్జా చేసి, అక్రమంగా పట్టాలు చేశారని, ఈవిషయంలో రెవెన్యూ, అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులు రూ.లక్షలు పంచుకున్నారని ఆరోపించారు. అడవుల్లో చెట్లు నరికినా, భూములు కబ్జా చేసినా, అందుకు ప్రోత్సహించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ► నర్సింహులపల్లె గ్రామంలో ఓ వ్యక్తి అక్రమంగా దుకాణం నిర్మించారని, తక్షణమే తొలగించాలని లేఖల్లో హెచ్చరించారు. కొందరు ప్రజాప్రతినిధులు పోలీస్స్టేషన్కి వెళ్లి పంచాయితీలు చేస్తున్నారని, అక్కడిదాకా వెళ్లకుండా చూడాలని సూచించారు. మరికొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తారని ప్రస్తావించారు. పద్మక్క ఇచ్చిన రూ.15లక్షల కోసం వస్తాం.. ► అప్పటి నక్సల్స్ నేత పద్మక్క మార్చి 2003లో ఓ వ్యక్తికి రూ. 15 లక్షలు ఇచ్చారని, ఇందులో రూ.1,000 నోట్లు, రూ.500 నోట్లు ఉన్నాయని లేఖలో తెలిపారు. కొద్దిరోజులకే నేరెళ్ల ఎన్కౌంటర్లో పద్మక్క మృతిచెందారని, ఆమె ఇచ్చిన సొమ్ము కోసం త్వరలో వస్తామని, సిద్ధంగా ఉండాలని లేఖలో ఉంది. ► అయితే, అత్యధిక మంది ప్రజాప్రతినిధులకు అందిన లేఖలో అటవీ భూముల్లో చెట్లు నరికివేతన, భూము కబ్జా, అక్రమ పట్టాల గురించి ప్రస్తావన ఉంది. వీరు తమ పద్ధతులు మార్చుకోకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులతోపాటు నర్సింహులపల్లెలో సాధారణ వ్యక్తులకు కూడా హెచ్చరిక లేఖలు అందినట్లు తెలిసింది. అనేక అనుమానాలు.. ► మావోయిస్టుల పేరిట ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు అందిన లేఖలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడ్చిరోలిలో పోస్టు చేసినట్లు ఉన్నాయని కొందరు చెబుతుండగా, అక్కడి పార్టీ లెటర్హెడ్లపై రాసి పోస్టు చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. అంతేకాదు.. అన్నిలేఖల్లోనూ ఓ వ్యక్తి దుకాణం కూల్చి వేయాలని హెచ్చరించడం కొందరు కావాలనే చేసిన పనిగా భావిస్తున్నారు. లేఖలు అందుకున్న కొందరు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించగా, మరికొందరు స్థానిక పోలీస్స్టేషన్లోని అధికారులను కలిసి నట్లు తెలిసింది. పీపుల్స్వార్ గత ప్రాబల్యం ఇదీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పటి (సీపీఐ – ఎంఎల్) పీపుల్స్వార్లో తూర్పు, పశ్చిమ డివిజన్ కమిటీలు ఉండేవి. తూర్పు డివిజన్లో పెద్దపల్లి, గోదావరిఖని – రామగుండం, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని ప్రాంతాలు ఉండగా, పెద్దపల్లి దళం, మంథని దళం, హుస్నాబాద్ దళాలు వాటి పరిధిలో కార్యకలాపాలు నిర్వహించేవి. పశ్చిమ డివిజన్లో జగిత్యాల, మల్యాల, మానేరువాగు, సిరిసిల్ల, కామారెడ్డి, కమ్మర్పల్లి, మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాలు ఉండేవి. ఇందులో మల్యాల, జగిత్యాల, మెట్పల్లి దళాలు పనిచేస్తూ ఉండేవి. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో జనశక్తి ప్రాబల్యం ఉండేది. మల్లన్నపేట ఎన్కౌంటర్ తర్వాత పీపుల్స్వార్ మల్యాల దళాన్ని ఎత్తివేసింది. మెట్పల్లి, జగిత్యాల దళాలను కలిపి ఒకే దళం లోకల్ గెరిల్లా స్క్వాడ్(ఎల్జీఎస్)గా ఏర్పాటు చేసింది. ఇప్పుడు పంపిన లేఖల్లో మల్యాల ఏరియా కమిటీ, గోదావరి ఏరియా బెల్ట్ కమిటీ పేరుతో ఉండడం, దానికిందే గోదావరి బెల్ట్ కార్యదర్శి మల్లికార్జున్ పేరు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. -
Nalgonda: మళ్లీ ‘అన్నల’ అలికిడి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలికిడి మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దకాలంగా లేని మావోయిస్టుల రిక్రూట్మెంట్ మళ్లీ మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు మండలం కొరటికల్కు చెందిన చెన్నగోని గణేశ్ అరెస్టు కావడంతో కలకలం రేగింది. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ యువత అర్బన్ నక్సలిజం వైపు అడుగులేస్తున్నారా? అంటే అవుననే వాదన అంతర్గతంగా వినిపిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా యువత అర్బన్ నక్సలిజం పట్ల ఆకర్షితులు అవుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గణేశ్ అరెస్టే ఇందుకు ఉదాహరణ అన్న చర్చ సాగుతోంది. పదేళ్లుగా జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవు. ఒకప్పుడు జిల్లా నుంచి వందల సంఖ్యలో మావోయిస్టులు ఉండగా, వారిలో అనేక మంది ఎన్కౌంటర్లలో చనిపోవడం, అరెస్టు కావడం, లొంగిపోవడంతో ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న వారి సంఖ్య పది మందిలోపే ఉన్నట్లు పోలీసులు వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు వారందరూ బతికే ఉన్నారా? లేరా? అన్నది పోలీసులు స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో గణేశ్ అరెస్టు కలకలం రేపుతోంది. అసలేం జరిగింది? పోలీసుల కథనం ప్రకారం.. మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన చెన్నగోని గణేశ్ (22) నాలుగేళ్ల కిందట హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుకునేందుకు హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడి చైన్నె అమృత కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన గణేశ్ హైదరాబాద్ క్యాటరింగ్ బాయ్గా పనిచేస్తున్నాడు. అక్కడే ఎంఏ ఫిలాసఫీ పూర్తి చేసిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం జల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనందరావు (26) హైదరాబాద్ అద్దె గదిలో ఉంటూ తను కూడా క్యాటరింగ్ బాయ్గా పని చేస్తున్నాడు. కుల నిర్మూలన వేదికలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఆనందరావు మావోయిస్టుల రిక్రూట్మెంట్లోనూ సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాది కిందటే ఆనందరావుతో గణేశ్కు పరిచయం ఏర్పడింది. ఆనందరావు ఇచ్చిన నక్సల్స్ సాహిత్యం చదివి ఆకర్షితుడైన గణేశ్ను కూడా గత నెల 3వ తేదీన పార్టీలో చేర్పించాడు. దళం వద్దే వారం పాటు ఉన్న గణేశ్ తరువాత జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు తీసుకురావడానికి వెళ్లి ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఆగర్గూడ వద్ద ఏప్రిల్ 28వ తేదీన అనందరావుతోపాటు పోలీసులకు దొరికిపోయాడు. 29వ తేదీన పోలీసులు అరెస్టు చూపించారు. ఒకప్పుడు రాచకొండ దళానికి షెల్టర్ జోన్గా ఉన్న కొరటికల్ గ్రామానికి చెందిన గణేశ్ మావోయిస్టుల్లో చేరి దొరికిపోవడంతో కలకలం రేపింది. మావోయిస్టుల్లో చేరే వారు లేరనుకుంటున్న తరుణంలో.. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో చేరే యువత లేరనుకుంటున్న తరుణంలో 22 ఏళ్ల గణేశ్ అరెస్టు చర్చనీయాంశంగా మారింది. గణేశ్ది నిరుపేద కుటుంబం. హైదరాబాద్లో ఉండి చదువుకుంటున్న గణేశ్ ఇలా మావోయిస్టులవైపు ఆర్షితుడు కావడం వెనుక బంధువులు, గ్రామంలో ఒకప్పటి మూలాలే కారణం కావచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే అరెస్టుకు మూడు రోజుల ముందు గణేశ్ గ్రామంలోనే ఉన్నాడని, అక్కడి నుంచే పోలీసులు తీసుకెళ్లారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మిగిలింది కొద్ది మందే.. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో మావోయిస్టులు ఉండగా, పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లలో చనిపోయారు. అరెస్టు అయినవారు, లొంగిపోయిన వారు వందల సంఖ్యలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన వారు పార్టీలో ఉన్నది పది మందిలోపే. వారిలో ప్రధానంగా చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక హనుమంతు అలియాస్ రాజేష్ తివారి 1983 నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. ఒకసారి ఎన్కౌంటర్ చనిపోయారని అనుకున్నా.. తరువాత ఆయన బతికే ఉన్నారన్న సమాచారం పోలీసులకు ఉంది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హనుమంతుపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన మందుగుల భాస్కరరావు 1991 నుంచి అజ్ఞాతంలో కొనసాగుతున్నాడు. ఛత్తీస్గఢ్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. జిల్లాకు చెందిన కొద్దిమంది కూడా చత్తీస్గఢ్ దండకారణ్యంలోనే పని చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఘనంగా గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు
ఆంధ్ర-చత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ నెల 2 నుంచి 8 వరకు మావోయిస్టు అమరవీరుల పీఎల్జీఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈవారోత్సవాల్లో మావోయిస్టులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను మావోయిస్టులు రిలీజ్ చేశారు. -
సాయిబాబాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.‘‘ సాయిబాబాపై మోపిన నేరాలు చాలా తీవ్రమైనవి. సమాజ ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేవి. నేర తీవ్రత తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సాంకేతికాంశాల ఆధారంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది’’ అంటూ తప్పుబట్టింది. అంగవైకల్యం, అనారోగ్య కారణాల రీత్యా తనను కనీసం గృహ నిర్భంధంలో ఉంచాలన్న సాయిబాబా విజ్ఞప్తినీ తిరస్కరించింది. బెయిల్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దాంతో సాయిబాబా తదితరులు నాగపూర్ సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనను 2014 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును దురదృష్టకరంగా వామపక్ష కార్యకర్తలు, సానుభూతిపరులు అభివర్ణించారు. తీర్పును నిరసిస్తూ సాయిబాబా విడుదల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో ధర్నా చేసిన 40 మంది విద్యార్థులు, అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు సాయిబాబాతో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఈ నెల 14న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శనివారం సెలవు దినమైనా న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం దీనిపై అత్యవసరంగా విచారణ జరిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ‘‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణంతో నిర్దోషిగా ప్రకటించడం సరికాదు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా హైకోర్టు తీర్పు చెప్పింది. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడాన్ని ట్రయల్ కోర్టులో గానీ, ఇతర కోర్టుల్లో గానీ సాయిబాబా సవాల్ చేయలేదు. కస్టడీలోకి తీసుకున్నాక ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేస్తే కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు యూఏపీఏ సెక్షన్ 43(సీ)ని వర్తింపజేసిన దృష్ట్యా సెక్షన్ 465 ప్రకారం సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేయడం సరికాదు’’ అన్నారు. సాయిబాబా తరఫు న్యాయవాది ఆర్.బసంత్ దీనిపై అభ్యంతరం తెలిపారు. ‘‘సాయిబాబాకు 52 ఏళ్లు. 90 శాతం శారీరక వైకల్యముంది. పెళ్లి కాని 23 ఏళ్ల కూతురుంది. అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ఆయనకు నేర చరిత్ర లేదు. ఏడేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నారు. షరతులతోనైనా ఇంటి వద్దే ఉండేందుకు అనుమతివ్వాలి’’ అని కోరారు. మెదడు చాలా డేంజరస్: ధర్మాసనం ఈ వాదనలపై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఇటీవల అర్బన్ నక్సల్స్ ఎక్కువగా గృహ నిర్భంధాలు కోరుతున్నారు. వారు ఇంట్లో ఉండే మెదడు సాయంతో ప్రతిదీ చేస్తారు. ఫోన్లు కూడా వాడుకుంటారు. కాబట్టి గృహ నిర్బంధానికి అవకాశం ఇవ్వొద్దు’’ అని కోరారు. ‘‘జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమంతోనూ సాయిబాబాకు సంబంధముంది. మావోయిస్టు కమాండర్ల భేటీలను ఏర్పాటు చేయడం వంటి పనులతో దేశ ప్రజాస్వామిక వ్యవస్థపై యుద్ధానికి తోడ్పాటునందించారు. మావోయిస్టులకు ఆయన మేధో శక్తిగా ఉంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు’’ అని ఆరోపించారు. మెదడు చాలా ప్రమాదకరమైనదని జస్టిస్ షా అన్నారు. ఉగ్రవాద లేక మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినంతవరకు మెదడే సర్వస్వమని అభిప్రాయపడ్డారు. గృహ నిర్బంధం విజ్ఞప్తిని తిరస్కరించారు. సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నిందితులను దోషులుగా నిర్ధారించారన్నారు. ‘‘హైకోర్టు కూడా సాయిబాబా తదితరులపై కేసులను కొట్టేయలేదు. కింది కోర్టు నిర్ధారించిన అంశాలను తోసిపుచ్చలేదు. కేవలం వారి విడుదలకు మాత్రమే ఆదేశించింది’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. -
ఏజెన్సీలో హిడ్మాకు కరోనా చికిత్స?
ఏటూరునాగారం: ఛత్తీస్గఢ్ లోని అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్ హిడ్మాకు కరోనా సోకడంతో చికిత్స కోసం ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లో చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు అడవులబాట పట్టారు. హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికి త్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఇటీవల అగ్రనేత ఆర్కేను కోల్పోయిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో చికిత్స అందకనే తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలకు వచ్చి ఉంటాడని నిఘా వర్గాలు తెలిపాయి. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడం తో ఏజెన్సీ అంతా హైఅలర్ట్గా మారింది. -
గన్ను కాదు.. పెన్ను పట్టండి
మల్కన్గిరి: కుటుంబ సభ్యులకు శాంతియుత జీవనాన్ని అందించేందుకు మావోయిస్టులు జనజీవన శ్రవంతిలోకి రావాలని రాష్ట్ర డీజీపీ అభయ్ కోరారు. చిన్నారులకు బంగారు భవిష్యత్ కోసం గన్ను పట్టిన చేతులతో పెన్ను అందించాలని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లాలోని మత్తిలి సమితి తులసిపహడ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఎన్కౌంటార్లో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్, ఛత్తిస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు పోలీసు అధికారులతో రహస్య సమావేశం నిర్వహించారు. మావోయిస్టులను ఎలా అణచి వేయాలనే కార్యచరణపై చర్చించారు. మల్కన్గిరి జిల్లా సరిహద్దులో ముడు రాష్ట్రాల పోలీసు బృందాలతో సంయుక్తంగా కూంబింగ్ జరపాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టంచేశారు. మల్కన్గిరి జిల్లా ప్రస్తుతం అధివృద్ధి పథంలో నడుస్తోందని, స్థానిక కటాఫ్ ఏరియాలో అమాయక గిరిజనులను తప్పదోవ పట్టించవద్దని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని, కుటుంబాలకు ప్రశాంతమైన జీవనాన్ని అందించేందుకు జనంలోకి రావాలని సూచించారు. అలాగే ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న పోలీసు దళాలను డీజీపీ అభినందించారు. అనంతరం ఎన్కౌంటర్లో స్వా«దీనం చేసుకొన్న మృతదేహలు, ఇతర సామగ్రీని విలేకర్ల ముందు ప్రదర్శించారు. ముగ్గురివీ.. మూడు రాష్ట్రాలు ఎన్కౌంటర్లో పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆయుధాల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్(1), ఏకే–47(1), ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్లు(3), కిట్ బ్యాగ్లు, బుల్లెట్లు, వాకీటాకీలు, మావోయిస్టు సాహిత్యం, విద్యుత్ వైర్లు, రేడియో, కత్తులు, జిలిటెన్ స్టిక్లు, ఇతర సామగ్రీ ఉన్నాయి. మృతిచెందిన మావోయిస్టులలో... మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి సుదకొండ గ్రామానికి చెందిన అనీల్ అలియాస్ కిషోర్ అలియాస్ దాసరి అలియాస్ ముకసోడి. ఆంధ్ర–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీలో ఏసీఎంగా ఉన్నాడు. ఆయనపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సోనీపై రూ.4 లక్షలు రివార్డు ఉంది. ఆమె మావోయిస్టు అగ్రనేత అరుణక్క రక్షణ బృందంలో ఏసీఎంగా పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెదబాయిల్ గ్రామానికి చెందిన చిన్నారావు పార్టీ సభ్యుడు ఉన్నారు. అరుణక్క రక్షణ బృందంలోనే పని చేస్తున్నాడు. ఇతనిపై రూ.లక్ష రివార్డు ఉంది. పర్యటనలో ఐజీ ఆపరేషన్స్ అమితాబ్ ఠాకూర్, ఇంటిలిజెన్స్ డీఐజీ అనువృద్ధసింగ్, దక్షణాంచల్ డీఐజీ రాకేష్ పండిట్, మల్కన్గిరి ఎస్పీ ప్రహ్లాద్స్వొయి మిన్నా, ఇతర పోలీసుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
AOB: రేపటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
పాడేరు/ముంచంగిపుట్టు: ఏవోబీ వ్యాప్తంగా బుధవారం నుంచి మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈ వారోత్సవాలను భగ్నం చేసే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా, ఆంధ్రా పోలీసు యంత్రాంగమంతా ఈ వారోత్సవాలపై దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల ప్రత్యేక పోలీసు బలగాలు ఇప్పటికే కూంబింగ్ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల పోలీసు బలగాలన్నీ ఇప్పటికే ఒడిశా కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విశాఖ ఏజెన్సీకి సంబంధించి కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని అన్ని పోలీసు స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసేంత వరకు రెడ్ అలెర్ట్ అమలు చేస్తున్నారు. ఏజెన్సీలోని దారకొండ, పెదవలస, బలపం, నుర్మతి, రూడకోట అవుట్పోస్టుల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలు అధికమయ్యాయి. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఏవోబీ వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఆయా మారుమూల గ్రామాల్లో ప్రచారం చేస్తోంది. విశాఖ రూరల్ ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి, పాడేరు ఏఎస్పీ జగదీష్ ఈ రెండు సబ్ డివిజన్లలో పోలీసు యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూంబింగ్ చర్యలు, మండల కేంద్రాల్లోని వాహనాలు, ఇతర తనిఖీలను సమీక్షిస్తున్నారు. కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ముమ్మర తనిఖీలు చేస్తున్న బలగాలు డాగ్, బాంబు స్క్వాడ్ల తనిఖీలు ముంచంగిపుట్టు మండలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దులో డాగ్, బాంబు స్క్వాడ్లతో పోలీసు బలగాలు కల్వర్టులు, వంతెనలు తనిఖీలు చేస్తూ వాహన రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. గూడెంకొత్తవీధి మండలంలో మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్లపై, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారపార్టీ నేతలపై దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్త చర్యలు చేపట్టారు. జి.మాడుగుల మండలంలో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీస్, బాంబ్స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. చింతపల్లి–జీకే వీధి రహదారి మార్గంలో వాహనాలు తనిఖీ చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతగిరి మండలంలోని ములియగుడలోని జంక్షన్ వద్ద అరకు–విశాఖ ప్రధాన రహదారిలోని వాహనాలను ఆపి క్షుణంగా పరిశీలించారు. -
ఏడుగురు యువకుల కిడ్నాప్ కథ సుఖాంతం
ఛత్తీస్గఢ్: కుందేడ్ గ్రామంలో కలకలం రేపిన ఏడుగురు యువకుల కిడ్నాప్ కథ సుఖాతం అయింది. రెండు రోజుల క్రితం సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీసు స్టేషన్ పరిధిలో కుందేడ్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఆ యువకులు సురక్షితంగా ఇంటికి రావటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారన్న దానిపై యువకులు స్పష్టత ఇవ్వలేదు. -
హిడ్మాకూ కరోనా..
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్ మావోయిస్టు దళాల ను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా మరో అగ్రనేత మాడావి హిడ్మా కూడా కరో నా బారిన పడ్డాడన్న ప్రచారం కలకలం రేపుతోంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్–1కు కమాండర్గా ఉన్న హిడ్మా.. ఏప్రిల్ 3న బీజాపూర్లో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా సైతం కొనసాగుతున్న హిడ్మా.. కొంతకాలంగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని, అడవిలోనే అతనికి చికిత్స సాగుతున్నట్టు తమకు సమాచారం ఉందని ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంలో మావోయిస్టు పార్టీ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. మూడురోజుల ముందు ఉత్సాహంగానే హరిభూషణ్..! ప్రస్తుతం దండకారణ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఛత్తీస్గఢ్లో బీజాపూర్ దాడి అనంతరం మావోయిస్టులు గిరిజనులతో వరుసగా నిర్వహించిన సభలు, సమావేశాల ద్వారా కరోనా వైరస్ ఆయా దళాల సభ్యులకు సోకింది. అగ్రనేతలంతా 50 ఏళ్లు పైబడి ఉండటం.., దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతుండటం, వీటికితోడు ప్రమాదకరమైన వైరస్ కావడంతో అప్పటిదాకా చలాకీగా ఉన్న వారు కూడా ఉన్నపళంగా మరణిస్తున్నారని సమాచారం. హరిభూషణ్ మరణానికి మూ డురోజులు ముందు షేవింగ్ కూడా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనికి కంటిచూపు సమస్యలు ఉన్నాయని, అందుకే ఇటీవల కొత్త కళ్లజోడు కూడా తెచ్చుకున్నాడని వివరించారు. సారక్క కూడా ఎక్కువ కాలం అనారోగ్యానికి గురవలేదని, వైరస్ సోకిన వారం రోజుల్లోపే మరణించిందని తెలుస్తోంది. సొంతవైద్యంతోనే చేటు.. వాస్తవానికి గతేడాది మొదటి వేవ్లో వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. అప్పుడు వైరస్ సోకినప్పటికీ... మాత్రలతో తగ్గిపోయింది. కానీ, ప్రస్తుతం వైరస్ తీవ్రత పెరిగింది. దీంతో కరోనా చికిత్స క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సొంతవైద్యమే మావోయిస్టుల కొంపముంచుతోంది. కేవలం యూట్యూబ్లు, ఆన్లైన్లో చదివి ఏవో మాత్రలు తెప్పించుకుని వాటినే వాడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, డయాలసిస్, ఆక్సిమీటర్లు, వెంటిలేటర్ల వంటి సదుపాయాలు అడవిలో లభించవు. కేవలం మూడువారాల్లో మధుకర్, కత్తిమోహన్, హరిభూషణ్, సారక్క అకాలమరణం చెందారు. లొంగిపోతే చికిత్స చేయిస్తామని తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు చెపుతున్నా.. పార్టీకి మనుగడ ఉండదన్న ఆందోళనతో ముఖ్యనేతలెవరూ ముందుకు రావడం లేదు. -
జాబ్ నుంచి సాయిబాబా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నాగ్పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంలాల్ ఆనంద్ కళాశాల తొలగించింది. మార్చి 31 నుంచి సాయిబాబా సేవలను రద్దు చేస్తున్నట్లు, ప్రతిగా 3నెలల జీతాన్ని సాయిబాబా బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు సాయిబాబా భార్యకు ఇచ్చిన మెమొరాండంలో కాలేజీ ప్రిన్సిపల్ రాకేశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన సాయిబాబాను 2014లో పుప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో సహా చట్టవిరుద్ధమైన సీపీఐ(మావోయిస్ట్) అగ్ర నాయకులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం సాయిబాబాను వెంటనే సస్పెండ్ చేసింది. 2017 మార్చిలో వామపక్ష ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపా లు (నివారణ) చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేలా ప్రోత్సహించి నందుకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారందరికీ జీవిత ఖైదు విధించింది. సాయిబాబాను 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 120బీ(క్రిమినల్ కుట్ర)లోని 13, 18, 20, 38, 39 సెక్షన్ల ప్రకారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. గిలానీ సేవలను ఇలా రద్దుచేయలేదు అయితే సాయిబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి సాయిబాబా కుటుంబం సగం జీతాన్ని పొందుతోంది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సాయిబాబా భార్య ఖండించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్తానని సాయిబాబా భార్య వసంత తెలిపారు. సాయిబాబాకు వేసిన శిక్షకు వ్యతిరేకంగా తమ అప్పీల్ బొంబాయి హైకోర్టులో పెండింగ్లో ఉందని, ఈ సమయంలో తొలగిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా నిర్ధారించబడిన గిలాని, తరువాత అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా బయటికొచ్చారన్నారు. అప్పుడు అతని సేవలను ఈ విధంగా రద్దు చేయలేదని, ఇప్పుడు సాయిబాబా సేవలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. -
మన్యంలో అలజడి!
సాక్షి, భూపాలపల్లి : ప్రశాంతంగా ఉన్న అడవుల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పెద్దంపేట అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా అటవీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే అంబట్పల్లి పోలీస్స్టేషన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇక ఎదురుకాల్పుల ఘటనలో 12 నుంచి 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నారని అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరు ముఖ్యనేతలున్నట్లు విశ్వసనీయ సమాచారం. తప్పించుకున్న ముఖ్య నాయకులు! కొంతకాలంగా జిల్లాలో మావోల కదలికలు పెరిగాయని రెండ్రోజుల క్రితం ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు పలిమెల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈక్రమంలోనే మావోలు తప్పించుకుని పారి పోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం తప్పించుకున్న మావోలు మహాముత్తారం మీదుగా ములుగు అటవీప్రాంతంలోకి లేకపోతే గోదావరి తీరం దాటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోకి ప్రవేశించే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి తప్పించుకున్న వారిలో జయశంకర్–మహబూబాబాద్–వరంగల్–పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డితో పాటు ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరి యా సెక్రటరీ రీనా, ఇల్లందు–నర్సంపేట ఏరి యా సెక్రటరీ భద్రు, జమున, భూపాలపల్లి జిల్లాకు చెందిన భిక్షపతి తదితరులున్నారని గుర్తించినట్లు సమాచారం. తప్పించుకుపోయిన వీరి కోసం మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల, భూపాలపల్లి అటవీ ప్రాం తాలతో పాటు ములుగు జిల్లా అటవీ ప్రాం తాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 13 పోలీసు బృందాలతో పాటు రెండు గ్రేహౌండ్స్ బృందాలూ రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి, ఇంద్రావతి నదుల సరిహద్దుల్లో నిఘా పెంచారు. అటవీ ప్రాంతా న్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు. -
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యం
సాక్షి, ములుగు: మావోయిస్టుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేస్తోందని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ పాటిల్ తెలిపారు. జిల్లాలోని మంగపేట మండలంలోని నర్సింహసాగర్ సమీపాన ముసలమ్మగుట్టలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన విషయం విదితమే. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్చంద్ర పవార్తో కలిసి మాట్లాడారు. మావోయిస్టుల కారణంగా అమాయక గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఏజెన్సీలో జరుగుతున్న పరిమాణాలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పోలీసులు ఉమ్మడిగా సమన్వయంతో పనిచేస్తూ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లోని ఇతర రాష్ట్రాల పోలీసులతో మావోయిస్టుల ఏరివేతపై సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లోన్ని అడవుల్లో పెద్దఎత్తున కూంబింగ్ సాగుతోందని, మావోలు ఎలాంటి దుశ్చర్చలకు పాల్పకుండా చూస్తున్నామని ఎస్పీ వివరించారు. మృతులు వీరే... ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో రవ్వ రామల్ అలియాస్ సుధీర్(30) స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలోని జెల్ల గ్రామం కాగా, ఈయన మణుగూరు ఏరియా సభ్యుడే కాక ఎల్ఓఎస్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. ఇక మరో మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపూర్కి చెందిన లక్మా(26) కాగా, ఆయన ఇదే దళంలో సభ్యుడిగా ఉన్నాడు. రవ్వ రామల్పై గతంలో ఆరు కేసులు ఉండగా, ప్రభుత్వం తరపున రూ.4లక్షల రివార్డ్ ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఎస్బీబీఎల్, విప్లవ సాహిత్యం, కిట్ బ్యాగులు, రెండు ఏకే 47 మ్యాగజిన్లు 16, 7.62 ఎంఎం రౌండ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం.. ముసలమ్మగుట్ట నుంచి మృతదేహాలను ఆదివారం అర్థరాత్రి ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని బీరెల్లి మీదుగా ఏటూరునాగారం సామాజిక అస్పత్రికి ట్రాక్టర్పై తరలించారు. అక్కడి నుంచి సోమవారం తెల్లవారుజామున ములు గు ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాలను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 2007లో మావోయిస్టుల్లోకి వెళ్లిన రామల్ వెంకటాపురం(కే): మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసలమ్మ గుట్ట ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మణుగూరు ఏరియా కమిటీ సభ్యుడు, ఎల్ఓఎస్ కమాండర్ రవ్వ రామల్ అలియాస్ సుధీర్ 2007 నుండి అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకు మా జిల్లా కట్టెకళ్యాణ్ పోలీస్స్టేషన్ పరిధి దబ్బా గ్రామానికి చెందిన రామల్ వెంకటాపురం(కే) మండలం పాత్రాపురం పంచాయతీ జెల్లా గ్రామంలో నివాసముంటున్నట్లు సమాచారం. మావోయిస్టుల భావజాలం, పాటలకు ఆకర్షితుడైన ఆయన దళంలో చేరాడు. అప్పటి నుంచి వివిధ కేడర్లలో పనిచేశారు. ప్రధాన నిందితుడిగా వివిధ పోలీస్స్టేషన్లలో ఆరు కేసులు నమోదు కాగా, ప్రభుత్వం రూ.4లక్షల రివార్డు కూడా ప్రకటించింది. 2015లో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కోడిజుట్టు గుట్ట వద్ద కూంబింగ్కు వెళ్లిన పోలీసులపై ఎదురు కాల్పులు జరిపిన కేసులో ప్రధాన నిందితుడిగా వెంకటాపురం పోలీస్ స్టేషన్లో నమోదైంది. 2015లో వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారి పనుల్లో ఉన్న వాహనాలు తగలబెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా పేరూరు పోలీస్స్టేషన్లో కేసు ఉంది. ఇక 2017లో వెంకటాపురం మండలం రాచపల్లి సమీప పాలెం వాగు ప్రాజెక్టు వెళ్లే రహదారిలోని కొప్పగుట్ట వద్ద రోడ్డుపై మందుపాతర అమర్చిన కేసు, 2018 ఎదిరలో బీఎస్ఎన్ఎల్ టవర్ పేల్చిన కేసుల్లో ప్రధాన నిందితుడిగా వెంకటాపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అలాగే, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో ఆయనపై మరో రెండు కేసులు ఉన్నాయి. -
మన్యంలో మళ్లీ అలజడి
సాక్షి, ములుగు/మంగపేట: ములుగు జిల్లాలో వారం రోజుల్లో రెండోసారి అలజడి రేగింది. మంగపేట మండలం నర్సింహసాగర్ పరిధి ముసలమ్మగుట్ట సమీపంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఆదివారం జరిగిన ఎదు రు కాల్పుల్లో మావోయిస్టు మణుగూరు ఏరియా దళ కమాండర్ సుధీర్ అలియస్ రాముతో పాటు ఒక దళ సభ్యుడు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్ తెలిపారు. వారి వద్ద ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఇతర వెపన్స్ లభించినట్లు చెప్పారు. ఇటీవల వెంకటాపురం(కె) మండలం బోధాపురంలో టీఆర్ఎస్ నాయకుడు మాడూరి భీమేశ్వరావు(48)ను మావోలు హతమార్చారు. తాజా ఎన్కౌంటర్ ఘటన మన్యంలో మళ్లీ అలజడి నెలకొంది. వరుస ఘటనలు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2015 సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం మొద్దుగుట్టలో మొదటి ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో మావోయిస్టులు శృతి, విద్యాసాగర్ హతం కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుంచి ఎన్కౌంటర్లు జరగలేదు. మధ్యమధ్యలో చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా సరిహద్దులోని వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో పలు చోట్ల మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, టిఫిన్ బాంబులు లభ్యమయ్యాయి. అయినా ఆ స్థాయిలో ప్రాణనష్టం జరగలేదు. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో ఈనెల 10న జరిగిన ఘటన కలకలం రేపింది. మావోయిస్టులు వెంకటాపురం(కె) మండలంలోని బోధాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, పురుగు మందుల వ్యాపారి భీమేశ్వర్రావును కత్తులతో పొడిచి చంపారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసు యంత్రాంగం ముమ్మరంగా కూంబింగ్ చేపట్టింది. ఈక్రమంలో తిప్పాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యుడు చిన్నలక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు సోదాలు.. మావోయిస్టు మిలీషియా సభ్యుడు ఇచ్చిన పక్కా సమాచారం మేరకు కేంద్ర బలగాలు నర్సింహసాగర్, కొప్పుగుట్ట, దోమెడలోని దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున అటవీలోకి ప్రవేశించిన పోలీసు బలగాలు మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఎన్కౌంటర్లో మరికొంత మంది తప్పించుకున్నారనే సమాచారం మేరకు గాలింపు మరింత ముమ్మరం చేశారు. ఏజెన్సీలో ఉలికిపాటు.. ఎన్కౌంటర్ సంఘటనతో ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. పోలీసులు ఏటూరునాగారం, ఎస్ఎస్తాడ్వాయి, మంగపేట మండలాలతో పాటు పొరుగున ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం, పినపాక మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జల్లెడపడుతున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. -
మావోయిస్టులే ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, మావోయిస్టుల కార్యకలాపాలు, నేరాలు – నివారణ... తదితర అంశాలపై నేడు సీఎం కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం లో పరిస్థితులు అంతటా అదుపులోనే ఉన్నాయి. కానీ, కొంతకాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు మెల్లిగా ఊపందుకుంటున్నాయి. లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. ఈ సమయంలో నెట్వర్క్ పెంచుకోవడం, రిక్రూట్మెంట్, చందాల వసూలు, షెల్టర్జోన్స్ ఏర్పాటు తదితర విషయాల్లో మావోయిస్టులు కాస్త పట్టు సాధించగలిగారు. లాక్డౌన్ ఎత్తివేశాక పలుమార్లు మావోలు– పోలీసులు పరస్పరం తారసపడి కాల్పులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ తొలిరెండు వారాల్లో నాలుగు ఎన్కౌంటర్లు జరగడం, ఎనిమిది మంది మావోలు మృతిచెందడం రాష్ట్రంలో తిరిగి మావోల ఉనికిని చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం మావోయిస్టులు ఆసిఫాబాద్, ములుగు, భద్రాచలం తదితర జిల్లాల మీదుగా రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్న విషయం, వారిని నిలువరించేందుకు తీసుకున్న చర్యలు, వ్యూహాలను ముఖ్యమంత్రి కేసీఆర్కు డీజీపీ వివరించనున్నారు. సీఆర్పీఎఫ్ కోబ్రా తదితర దళాలతో కలిసి ఏజెన్సీ ఏరియాల్లో సంయుక్తంగా చేపడుతున్న ఆపరేషన్లు, వినియోగిస్తోన్న ఆధునిక సాంకేతికతలపై సీఎంకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇటీవల డీజీపీ మహేందరెడ్డితో కేంద్ర ప్రత్యేక భద్రతా సలహాదారు విజయ్కుమార్ భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశిస్తోన్న మావోయిస్టులను నిలువరించేందుకు అవసరమైతే మరిన్ని బలగాలను పంపించేందుకు కేంద్రం తరఫున ఆయన హామీ ఇచ్చారని సమాచారం. ఈ అంశాలను కూడా సీఎం వద్ద డీజీపీ ప్రస్తావించే అవకాశాలున్నాయి. మాదకద్రవ్యాలపైనా... లాక్డౌన్లో రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో మాదకద్రవ్యాల సరఫరా ఆగిపోయింది. కానీ, లాక్డౌన్ అనంతరం హైదరాబాద్లో మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా తిరిగి మొదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన.. హైదరాబాద్లో ఉత్పత్తి అయిన దాదాపు రూ.100 కోట్ల విలువైన మెఫిడ్రిన్, ఎఫిడ్రిన్.. డీఆర్ఐకు పట్టుబడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో మాదకద్రవ్యాల దందా నియంత్రణకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలపైనా చర్చించే అవకాశముంది. మరోవైపు రాష్ట్రంలో 2018 తో పోలిస్తే.. 2019లో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, మర్డర్లు, కిడ్నాపులు, ఆర్థిక, సైబర్నేరాలు పెరిగాయి. అయితే, ఈ నేరా లు సంఖ్యాపరంగా పెరిగినా.. అదుపులోనే ఉన్నాయని పోలీసుశాఖ ధీమాగా ఉంది. నేర దర్యాప్తు, ఆధారాల సేకరణలో తెలంగాణ పోలీసులు అవలంబిస్తోన్న విధానాలు, తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి డీజీపీ సమగ్రంగా వివరించనున్నారు. -
మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు
సాక్షి, ఇచ్చోడ(బోథ్): జిల్లాలో ఒకప్పుడు మావోలకు కంచుకోటగా ఉన్న బోథ్ ప్రాంతంలో నాలుగురోజుల క్రితం మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది. మావోయిస్టు నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ స్వగ్రామమైన బోథ్ మండలం పొచ్చెరతో పాటు సోనాలలో పోస్టర్లు వెలియడంతో రెండు దశాబ్దాలపాటు ఎలాంటి అలజడిలేని గ్రామాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, కంతి లింగవ్వ, వర్గీస్, సుదీరాము, మంగుల టీమ్ సభ్యులు ఎవరికి వారే వారి కోరియర్ల ద్వార ఆదివాసీ రైతులు, వ్యాపారస్తులు, కిరాణా దుకాణాదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పోస్టర్లలో ఆరోపించారు. ఆదివాసీ యువతను అడ్డం పెట్టుకుని మైలరాపు అడెల్లు, కంతి లింగవ్వ, వర్గీస్లు వారికి అనుకూలమైన ప్రాంతంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ యువతను బలవంతంగా పార్టీలో చేర్చుకుని స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీ యువత చైతన్యవంతులై మావోయిస్టుల ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాగా మారుమూల గ్రామాల్లో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆడిట్ భయం! ఆదిలాబాద్: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఆడిట్ భయం పట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు విడుదల చేసిన నిధులు, ఆదాయ, వ్యయ, జమ వివరాలతో పాటు జీపీల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు అధికారులు సిద్ధం కానుండడంతో వణుకు మొదలైంది. చిన్నా పెద్ద పంచాయతీలనే తేడా లేకుండా అన్నీ జీపీల్లో పకడ్బందీగా ఆడిట్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఏ పంచాయతీ అవినీతి బాగోతం బయటకు వస్తుందోనని పలువురిలో ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను ఏడాదికి రెండుసార్లు అన్ని జీపీలకు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ప్రారం«భం నుంచి ప్రత్యేక, ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేస్తోంది. జీపీల్లో ఈ నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడత ఆగస్టులో నిర్వహించగా, రెండో విడత మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. వంద జీపీల్లో పూర్తి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడిట్ నిర్వహించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో (25 శాతం)100 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా నేరుగా జీపీలకు వెళ్లి ఆడిట్ చేయడం అప్పట్లో కష్టంగా మారిన నేపథ్యంలో ఆన్లైన్లో ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పంచాయతీల్లో తొలిసారిగా ఆన్లైన్ ద్వారా ఆడిట్ నిర్వహించారు. ఇందుకు రెండు నెలల సమయం పట్టింది. మిగతా జీపీల్లో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలోని వంద జీపీల్లో నిర్వహించిన ఆడిట్లో చాలా విషయాలు వెలుగుచూశాయి. 2019–20 సంవత్సరంలో కొన్ని జీపీలు ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించలేదని, ఐటీ కట్టడం లేదని, జీఎస్టీ బకాయిలు ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం లేదని ఆడిట్లో తేలింది. అయితే ప్రభుత్వ ఖజానాలో నిధులు జమచేయడం లేదనే అంశాలు వెలుగుచూశాయి. అయితే ఆడిట్ సమయంలో రికార్డులు చూపించని జీపీలు 40 రోజుల్లోగా సరైన రికార్డులతో పాటు హార్డ్ కాపీలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. గడువులోగా వివరాలు సమర్పించకపోతే ఆడిట్లో తేలిన విషయాలనే ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందని ఆడిట్ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు మిగతా పంచాయతీల్లో ఆడిట్ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రేపటి నుంచి షురూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు జిల్లాలోని అధికారులు గ్రామ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించనున్నారు. మొదటి విడత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు వంద పంచాయతీల్లో నిర్వహించగా, రెండోవిడత మిగతా 367 పంచాయతీల్లో మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. రేపటి నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు వెళ్లి ఆడిట్ చేస్తారు. టీం సభ్యులంతా ఒకే దగ్గర ఆడిట్ చేయాల్సి వస్తే మండల పంచాయతీ అధికారుల కార్యాలయాల్లో ఆడిట్ చేస్తారు. ఇందుకు ఆయా జీపీలకు సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాల రికార్డులు, పనులకు సంబంధించి ఎంబీ రికార్డులను ఎంపీవో అఫీసుకు జీపీ అధికారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చేపట్టేందుకు జిల్లాలో ఏడుగురు ఆడిట్ అధికారులతో రెండు టీంలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐదుగురు సీనియర్ ఆడిట్ అధికారులుండగా, ఇద్దరు జూనియర్, ఇద్దరు అసిస్టెంట్ ఆడిట్ అధికారులున్నారు. ఆడిట్ చేస్తారిలా.. జీపీల్లో నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను పరిశీలిస్తారు. ఏ నిధులతో ఏ పనులు చేశారు? అందుకు సంబంధించిన ఎంబీ రికార్డులు పరిశీలిస్తారు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, వాటికి సంబంధించిన ఖర్చుల రికార్డులు, మిగిలి ఉన్న నిధులు వివరాలు పరిశీలిస్తారు. ఏఏ పనులు చేశారో క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను పరిశీలించి అన్నీ సక్రమంగా చేశారా? లేదా అన్నది చూసి గ్రామాల వారీగా రిపోర్టు తయారు చేస్తారు. రికార్డులు లేని వాటిని రిమార్క్ రాసి ఉంచుతారు. పంచాయతీ అధికారులు చూసి ఆడిట్ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం ఇస్తారు. వివరాలు ఆడిట్ చేసిన అధికారి నుంచి టీం లీడర్కు, ఆ తర్వాత జిల్లా ఆడిట్ అధికారికి చేరుతాయి. ఆ తర్వాత డీఏవో సరైన వివరాలు లేని వాటికి సమాధానం ఇవ్వాలని కోరుతారు. గడువులోగా హార్డ్ కాపీలతో పాటు వివరాలు అందజేయాలి. లేదంటే జీపీల్లో చేసిన ఆడిట్ వివరాలనే ప్రభుత్వానికి, కలెక్టర్కు పంపిస్తారు. ఆ తర్వాత డీఏవో పంపిన నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 6 నుంచి ఆడిట్ ప్రారంభిస్తాం ఈ నెల 6 నుంచి పంచాయతీల ఆడిట్ను ప్రారంభించనున్నాం. ఇది వరకే పైలెట్ ప్రాజెక్టు కింద వంద జీపీలను ఆన్లైన్లో ఆడిట్ చేశాం. ఇప్పుడు నేరుగా పంచాయతీలకు లేదా ఎంపీవో కార్యాలయాలకు వెళ్లి ఆడిట్ చేయనున్నాం. ఈ నెలాఖరులోగా జిల్లాలోని అన్ని జీపీల్లో ఆఫ్లైన్ ద్వారా ఆడిట్ పూర్తి చేస్తాం. – కె.రాజ్కుమార్, జిల్లా ఆడిట్ అధికారి -
తుపాకుల మోత.. అట్టుడికిన అడవి
చర్ల : మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు ఈసారి ఏజెన్సీ ఆదివాసీల్లో వణుకు పుట్టించాయి. తుపాకుల మోతలు ఓవైపు, బాంబు పేలుళ్ల శబ్దాలు మరోవైపు భయాందోళనలు కలిగించాయి. ఇక సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలైతే ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే తీవ్రంగా భయపడ్డారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతం కావడం, మరో వైపు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ సభ్యులు మృత్యువాత పడడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు వణికిపోయారు. ఈనెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ 16వ ఆవిర్భావ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చర్ల–శబరి ఏరియా కమిటీ, భదాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి జిల్లా కమిటీలు, తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాయి. అయితే వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వరుస ఘటనలతో బెంబేలు.. చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో ఈనెల 23న రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అంతకు ముందు 19న చర్ల మండలం తేగడ – కలివేరు గ్రామాల మధ్య రాష్ట్రీయ రహదారి పక్కన మావో యిస్టులు ఏర్పాటు చేసిన 3 శక్తివంతమైన మందుపాతర్లను గుర్తించిన పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈనెల 6న పెదమిడిసిలేరు–తిప్పాపురం మార్గంలో గల ప్రధాన రహదారి పై మావోయిస్టులు మందుపాతరలు పేల్చారు. ఆ తెల్లవారి వద్దిపేట – పూసుగుప్ప అడవుల్లో ఎదురుకాల్పులు జరగగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల వివిధ గ్రామాలకు చెందిన పలువురు ఆదివాసీలను ఇన్ఫార్మర్లుగా భావిస్తూ మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ప్రజాకోర్టులు నిర్వహించి వారం రోజుల వ్యవధిలో 16 మందిని హతమార్చారు. ఇలా ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల చర్యలతో ఆదివాసీ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాల నిర్వహణలో గతం కంటే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఆదివాసీ గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ సామాన్య ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా భయాందోళన చెందారు. -
పదేళ్ల తర్వాత ఎన్కౌంటర్
-
మోస్ట్ వాంటెడ్!
-
మావోయిస్టుల కోసం పోలీసుల వేట
-
ఆసిఫాబాద్లో మావోల కదలికలు
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. దళ సభ్యుల సంచారం అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే వారికి దళ సభ్యులు కంటపడకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీలు చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతోపాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై పోలీసుల గస్తీ కొనసాగింది. దీంతో సమీప గ్రామాల ప్రజల్లో తెలియని ఆందోళన మొదలైంది. పోలీసుల బందోబస్తుతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ నెలకొంది. పోలీసులు అన్ని వైపులా నిఘా మరింత పెంచారు. ఆర్నెల్లుగా అలర్ట్ కేబీఎం (కుమురం భీం మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని ఐదుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్నట్లు పోలీసులవర్గాలు గుర్తించండం తెలిసిందే. ఆర్నెళ్లుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట రాత్రింబవళ్లు కూంబింగ్, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్, తిర్యాణి, గుండాల, జన్నారం, ఊట్నూరు సమీప అటవీప్రాంతాలతోపాటు అనుమానిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తిర్యాణి మండలం టొక్కిగూడ అడవుల్లో కాల్పులు జరగగా.. తృటిలో మావోలు తప్పించుకున్నారు. అంతేకాక దళ సభ్యుల సంచరిస్తున్నారనే సమాచారం ఉన్న ప్రతిచోటా గస్తీని విస్తృతం చేస్తున్నారు. ఇటీవల దళ సభ్యుల నియంత్రణలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఆసిఫాబాద్లో నాలుగు రోజులు మకాం వేశారు. క్షేత్రస్థాయిలో పలు విషయాలు తెలుసుకుని మావోల సంచారం నేపథ్యంలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాకు ఇన్చార్జి ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మావోల సంచారంపై ప్రధానంగా దృష్టి సారించారు. నిత్యం పోలీసు అధికారులకు ఆదేశాలు ఇస్తూ.. దళ సభ్యుల సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సమీప అటవీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
మావోయిస్టుల కదలికలు: అడవిలో అలర్ట్ !
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు వేగవంతమయ్యాయనే సమాచారంతో ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలోని ఏజెన్సీ జిల్లాల అటవీ ప్రాంతాల్లోనూ పక్కా ప్రణాళికలతో సెర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల సమాంతర ప్రభుత్వం ఉండడంతో అక్కడ నిరంతరం పోరు నడుస్తుండగా, తెలంగాణలో గత ఎనిమిది నెలలుగా ఆ పార్టీ కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఏఓబీ (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు)లో మావోయిస్టుల అలజడి మరింత పెరగడంతో సరిహద్దు రాష్ట్రాల బలగాలు అలర్ట్ అయ్యాయి. ఏఓబీ పరిధిలోని కొంథమాల్–కలహండి జిల్లాలోని భండరంగి సిర్కి అటవీ ప్రాంతంలో ఈనెల 10న జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. దీంతో ఉన్నతాధికారులు ఏఓబీ పరిధిలోని ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ఠాణా పరిధిలోని అల్లూరికోట, పప్పులూరు, కప్పతొట్టి, కుర్మనూరు, ఆంధ్రప్రదేశ్లోని గుమ్మిరేవుల, పాతకోట, సీలేరు, గూడెంకొత్తవీధి ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో ఈ నెల 11న హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. మరోవైపు విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల ఏజెన్సీలో మావోయిస్టుల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. తెలంగాణలోని సరిహద్దు ఏజెన్సీ జిల్లాల్లో డీజీపీ మహేందర్రెడ్డి గత రెండు నెలల్లో పలుమార్లు ఏరియల్ సర్వే చేపట్టారు. భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వరుసగా రెండు మూడు విడతలు పర్యటించారు. ఆసిఫాబాద్లో ఐదు రోజుల పాటు మకాం వేశారు. ఈ క్రమంలో ఈనెల 3న గుండాల మండలం దేవళ్లగూడెం వద్ద ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇక్కడ ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఈనెల 6న మావోయిస్టులు తలపెట్టిన బంద్ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఈనెల 7న చర్ల మండలం పూసుగుప్ప వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇదిలా ఉండగా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రామానికి సమీపంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలో గల పాలోడి అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు వాగు దాటుతుండగా పోలీసుల డ్రోన్ కెమెరాలు వీడియోలు, ఫొటోలు తీశాయి. ఒకేసారి ఇంతమంది మావోయిస్టులు రాష్ట్రం వైపు కదులుతున్నారనే అంశం సంచలనంగా మారింది. ఏఓబీ నుంచి గడ్చిరోలి సరిహద్దు దాకా.. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని అబూజ్మడ్ కేంద్రంగా బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, బస్తర్ జిల్లాల్లో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టు పార్టీ.. ఇతర రాష్ట్రాలకూ విస్తరించాలని ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ కేంద్ర కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అగ్రనేతలుగా ఉన్నారు. దీంతో ఈ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. -
ఏజెన్సీలో ఎన్కౌంటర్.. టెన్షన్ టెన్షన్
సాక్షి, కొత్తగూడెం : తెలంగాణలో మరోసారి మావోయిస్టుల ఎన్కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా మావోల ఏరివేతపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసుశాఖ అటవీ ప్రాంతాల్లో వరుస కూంబింగులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే చర్ల-చత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఎన్కౌంటర్ జరపడం గమనార్హం. చర్ల మండలంలోని వడ్డిపేట, పుస్సుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. మృతుల్లో ఒకరు శ్రీనివాస్గా గుర్తించారు. ఘటనా స్థలంలో బ్యారెల్ గన్, ఒక పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. తాజా ఎన్కౌంటర్తో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. (సమీక్షలతో డీజీపీ హల్ చల్) మరోవైపు కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ దూది దేవాలు అలియాస్ శంకర్ను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రీకరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. మావోయిస్టు బంద్ దృష్ట్యా ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను మోహరింపజేసి కూంబింగ్ చేపట్టారు. స్పెషల్ పార్టీ బలగాలతో పాటు ఈ దఫా గ్రేహౌండ్స్ దళాలతో సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే చర్ల మండలంలో తాజా ఎన్కౌంటర్ జరిపారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి వరుస పర్యటనల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఛత్తీస్గడ్, మహారాష్ట్రల నుంచి తెలంగాణ లోకి మావోయిస్టుల కట్టడి విషయంలో పోలీసులకు డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. -
మావోయిస్ట్ ఏరియాలో మరోసారి డీజీపీ పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆపరేషన్ మావోయిస్టు రెండో రోజు కొనసాగుతోంది. గురువారం డీజీపీ మహేందర్రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు. మావోయిస్టులసంచారం, పోలీసుల చర్యలపై గురువారం విస్తృతంగా సమీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం ఆసిఫాబాద్ మొదలుకొని కొమరంభీమ్, ఉట్నూర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో గంటన్నర పాటు డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీసులో సుదీర్ఘంగా సమీక్షించారు. మావోయిస్టుల ఏరివేత, కట్టడి చర్యలపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు. మరో రెండ్రోజులపాటు ఆసిఫాబాద్లోనే డీజీపీ మహేందర్రెడ్డి మకాం వేయనున్నారు. క్షేత్ర స్థాయిలో ఏరియల్ సర్వే, సమీక్షలతో స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగారు. 45 రోజుల్లో ఆసిఫాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డి రెండోసారి పర్యటించారు. తిర్యాని మండలం మంగి అడవుల్లో మంచిర్యాల కమిటీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ అడెల్లు, ఐదుగురు సభ్యులు రెండు సార్లు తప్పించుకున్నారు. పోలీసుల కూంబింగ్లో మావోయిస్టుల డైరీ లభ్యమయ్యింది. మావోయిస్టు రిక్రూట్మెంట్కు సంబంధించిన కీలక సమాచారం అందులో లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా కూంబింగ్ ఆపరేషన్పై కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు గ్రే హౌండ్స్ ఏ ఆర్ సివిల్ పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. చదవండి: మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే -
మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే
సాక్షి, అసిఫాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీస్తున్నారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు విషయమై కూడా చర్చ కొనసాగుతోంది. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?) -
‘కాళేశ్వరం’పై పోలీసుల నజర్!
సాక్షి, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో రాత్రీపగలు గోదావరి తీర ప్రాంతాలు, అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. పల్లెలతో పాటు ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులు విచారించి వదిలేస్తున్నారు. వాహనాల తనిఖీలు కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాళేశ్వరం, మహాదేవపూర్, పలిమెల ఎస్సైలు అభినవ్, అనిల్, శ్యాంరాజ్ ఆధ్వర్యాన తనిఖీలు సాగుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు మహదేవపూర్, పలిమెల మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్, పలిమెల మండలంలోని రేవులపై ప్రత్యేక దృష్టిని సారించారు. గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రోడ్డు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇక మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద నిఘా తీవ్రం చేశారు. జిల్లా ఇన్చార్జి ఎస్సీ సంగ్రామ్సింగ్ పాటిల్, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ గార్డులు, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కాల్పుల మోత
-
తృటిలో తప్పిన భారీ ఎన్కౌంటర్
సాక్షి, విజయనగరం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ) మరోసారి తుపాకుల మోతమోగింది. ముంచంగిపుట్టు, పెదబయలు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే తప్పించుకోగా, ఏవోబీ కార్యదర్శి చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులు అనంతరం పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా.. సంఘటనా స్థలంలో రక్తపు మరకలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చారు. మరోవైపు భారీ వర్షాలతో పోలీసుల కూంబింగ్కు అంతరాయం ఏర్పడింది. కాగా నెలాఖరున అమరవీరుల వారోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నద్ధం అయ్యారు. ఇందుకోసం కార్యక్రమాల రూపకల్పనకు వారంతా కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారంతో పోలీసులు కూంబింగ్ జరిపారు. అయితే గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే చికిత్స చేయిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పెదబయలు అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగిన పరిసరాల్లో రక్తపు మరకలు గుర్తించడంతో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన పరిసర ప్రాంతాల్లో సీనియర్ మావోయిస్టు నేతల సమావేశం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెదబయలు, రూడకోట, ముంచంగిపుట్లు పరిసర ప్రాంతాలను పోలీసుల బలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారిలో సీనియర్ మావోయిస్టు నాయకులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అదుపులో అమాయక గిరిజనులు ఉన్నారంటూ ఆంధ్రప్రదేశ్ హక్కుల సంఘం పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే మా అదుపులో అమాయకపు గిరిజనులు ఎవరూ లేరని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. (అడవిలో అలజడి) -
అడవిలో అలజడి
పాడేరు: ఏవోబీలో యుద్ధవాతావరణం నెలకొంది. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనల్లో మావోయిస్టులు తప్పించుకోవడంతో వారి కోసం పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఏక్షణంలో ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పెదబయలు మండలంలోని గిన్నెలకోట పంచాయతీ లండులు, మెట్టగుడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారాన్ని గుర్తించిన పోలీసు పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు తప్పించుకున్నారు. తుపాకీలు, కిట్ బ్యాగులను వదిలి తప్పించుకున్నట్టు తెలిసింది.ఈ ఎదురు కాల్పుల్లో ఇరు వర్గాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. తప్పించుకున్న వారికోసం ఏవోబీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ నెల 16న ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా బలిమెల కటాఫ్ ఏరియాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో ఒడిశా డీవీఎఫ్, ఎస్వోజీ బలగాలు, విశాఖ జిల్లా పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో తారసపడిన మావోయిస్టు దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇరు పారీ్టల మధ్య 15 నిమిషాల పాటు కాల్పులు జరిగినప్పటికీ ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఎప్పటికప్పుడు సమీక్ష ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో సమీక్షిస్తున్నారు. విశాఖ ఏజెన్సీతో పాటు సరిహద్దులోని ఒడిశా అటవీ ప్రాంతాల్లో ఇరురాష్ట్రాల పోలీసులు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని పోలీసులు, మావోయిస్టులు గతంలో ప్రకటించారు. అయితే ఇటీవల మావోయిస్టు పార్టీ ఏవోబీలో తమ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు ఎక్కడికక్కడ గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తూ కొత్త రిక్రూట్మెంట్ను చేపడుతోందనే నిఘా వర్గాల సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏవోబీ వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. విశాఖ ఏజెన్సీకి సరిహద్దులో ఉన్న మల్కన్గిరి, కోరాపుట్టు జిల్లాలకు చెందిన పోలీసు పార్టీలు అటువైపు నుంచి కూంబింగ్ నిర్వహిస్తుండగా.. విశాఖ ఏజెన్సీ పోలీసుపారీ్టలు జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్ను విస్తృతం చేశాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. -
సంస్మ‘రణం’
సాక్షి, హైదరాబాద్ : రెండువారాలుగా మన్నెంలో అలజడి మొదలైంది. మావోల రాక, పోలీసుల వేటతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ పేరుతో కొత్త దళం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రాష్ట్రంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా గ్రీన్ టైగర్స్, కోబ్రా తదితర పేర్లతో కొన్ని దళాలు ఉండేవి. నక్సలైట్ల సానుభూతి పరులు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు లక్ష్యంగా పనిచేసేవి. ఇపుడు దాదాపు రెండు దశాబ్దాల తరువాత రాష్ట్రంలో తిరిగి అలాంటి పరిస్థితులే పునరావృతమవుతుండటం గమనార్హం. దీంతో ఏజెన్సీలోని గిరిజనులు, ఆదివాసీలు భయాందోళనలో గడుపుతున్నారు. నిత్యం మావోయిస్టులు, వారి వెనక కూంబింగ్ దళాల బూట్ల చప్పుళ్లతో భయభయంగా గడుపుతున్నారు. అప్పుడలా..ఇప్పుడిలా..! దండకారణ్యంలో జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మావోయిస్టులు ఈసారి మునుపెన్నడూ లేని స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల మావో అగ్రనేతలు, మిలీషియా సభ్యులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి తాజాగా విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. దండకారణ్య ప్రత్యేక మండల కమిటీ కార్యదర్శి రామన్న అనారోగ్యకారణాలతో గతేడాది మరణించారు. ఈయన స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయలేదు. ఈసారి వార్షికోత్సవాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో రామన్న స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టు సభ్యుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు. అందుకే కీలకమైన ఈ సమావేశాలను విజయవంతం చేసేందుకు కావాల్సిన నిధులు, కొత్తవారి రిక్రూట్మెంట్ కోసం ఈసారి తెలంగాణలోకి మావోయిస్టులు అడుగుపెట్టారు. లాక్డౌన్ కాలంలో పోలీసులు కోవిడ్ విధుల్లో ఉండగా.. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు జనారణ్యంలోకి వచ్చారు. అందులో భాగంగానే బెదరింపులు, వసూళ్లు, రిక్రూట్మెంట్ యత్నాలు చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆటలు సాగనివ్వం.. తెలంగాణలో పదేళ్లుగా పెద్దగా మావోయిస్టుల కదలికలు లేవు. అలాంటిది లాక్డౌన్ కాలంలో పుంజుకోవడంపై హోంశాఖ సీరియస్గా పరిగణిస్తోంది. ఆసిఫాబాద్లో భాస్కర్ దళం సంచారంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి అరాచకాలు ఇక్కడ సాగనిచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండటం మంగ్లి, ములుగు జిల్లాల అటవీ ప్రాంతాల్లో స్వయంగా ఆయనే కూంబింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మరో కారణం కూడా చెప్పుకోవాలి. పదేళ్ల నుంచి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మావోల కార్యకలాపాలు లేవు. అదే సమయంలో స్పెషల్పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసుల్లో కొత్తగా చేరిన అధికారుల్లో మెజారిటీ మంది సుశిక్షితులేగానీ... వారికి ఎన్కౌంటర్లు ఎదుర్కొన్న అనుభవం లేదు. అందుకే, వారిలో ఉత్సాహం నింపి, మావోయిస్టులను తరిమికొట్టాలన్న వ్యూహంతో పోలీసు బాసు పర్యటనలు చేస్తున్నారని సమాచారం. -
విశాఖ ఏజెన్సీలో కాల్పులు కలకలం
సాక్షి, విశాఖపట్నం : ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తుపాకులు మోతలు మోగుతున్నాయి. తాజాగా విశాఖ ఏజెన్సీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న బలగాలు.. ఆదివారం సాయంత్రం రెక్కీ నిర్వహించాయి. ఆ సమయంలోనే లండులు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారస పడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత సమయం పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. (మావోయిస్టు భాస్కర్ దశాబ్దాల అజ్ఞాతం) ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వర్గాలు ప్రకటించాయి. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన సామాగ్రీ లభించినట్లు సమాచారం. కాగా గతకొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలను మావోయిస్టు పార్టీ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఆదిలాబాద్, అసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలపాలపై పోలీసులు బలగాలు నిఘా పెట్టాయి. -
అసిఫాబాద్లో డీజీపీ పర్యటన
సాక్షి, అసిఫాబాద్: జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం అసిఫాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏఆర్ హెడ్క్వార్టర్ట్స్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐజీ నాగిరెడ్డి, అదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్, ఏఎస్పీ సుధీంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసు బలగాల నుంచి మావోయిస్టు దళ సభ్యులు తప్పించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ , మెడం భాస్కర్ , వర్గీస్ తెలంగాణలో ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ తేల్చిన క్రమంలో మూడు రోజులుగా గ్రే హౌండ్స్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చత్తీస్గఢ్ వైపు నుంచి తెలంగాణలోని కొమురం భీమ్ అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి వస్తున్న మావోయిస్టుల కదలికలపై సమీక్షా సమావేశంలో లోతుగా చర్చించారు. మరోవైపు రెండు జిల్లాల అడవుల్లో గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.(తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్) -
మావోయిస్టులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్!
సాక్షి, అసిఫాబాద్: కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసు బలగాల నుంచి మావోయిస్టు దళ సభ్యులు తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. దీంతో తప్పించుకున్న మావోయిస్టుల గురించి 25 స్పెషల్ పార్టీ పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేస్తూ అడవి మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. 15 పోలీస్ పార్టీలతో గ్రామాలను తనిఖీ చేస్తూ గ్రామాల్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారిపై నిఘా ఉంచి పరిశీలిస్తున్నారు. మరో 20 పోలీస్ పార్టీలతో ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని ప్రదేశాల్లో విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నార్త్ జోన్ ఐజీ ఈ కూంబింగ్ ఆపరేషన్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. (మన్యంలో అలజడి..) మావోయిస్టులకు సహకరించిన కోవ అనంతరావు నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని గురువారం జైలుకు పంపించారు. ఈ క్రమంలో మావోయిస్టులకు సహాయం చేసిన వారిని గుర్తించి వారిపై నిఘా పెట్టారు. మావోల గురించి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి తగిన బహుమతులు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టుల గురించి నార్త్ జోన్ ఐజీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఉత్తరాన ఉలికిపాటు..!) -
ఉత్తరాన ఉలికిపాటు..!
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ... మావోయిస్టు ఉద్యమానికి పుట్టినిల్లుగా చెప్పుకునే ఈ ప్రాంతంలో తిరిగి మావోల సంచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విజృంభణ, మరోవైపు పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు మద్దతు వంటి అంశాలను తమ కేడర్ రిక్రూట్మెంట్కు అనుకూలంగా మలుచుకునే య త్నాలు చేస్తున్నారు. తాజాగా పోలీసుల కూంబింగ్ లో ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి పలువురు కీలక మావోయిస్టులు త్రుటిలో తప్పించుకోవడం, రెండు చోట్ల ఎదురుకాల్పులు చోటుచేసుకోవ డమే ఇందుకు నిదర్శనం. లాక్డౌన్ సమయం నుంచే ఉమ్మడి కరీంనగర్లోని జగిత్యాల, మెట్పల్లి, సిరిసిల్ల, ఉమ్మడి ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం మొదలైంది. ఇదే సమయంలో రిక్రూట్మెంట్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఛత్తీస్గడ్, ఒడిశాల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలంతా ఉత్తర తెలంగాణవారే అయినా.. వారి సొంత ప్రాంతాల్లో పార్టీ పటిష్టంగా లేదన్న వి మర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకే, ఈ విమర్శలను పోగొట్టుకునేందుకే ఈ సంక్షోభ సమయంలో ఉత్తర తెలంగాణపై దృష్టి సారించారని సమాచారం. ఇపుడే ఎందుకు? ప్రస్తుతం కోవిడ్ వైరస్ విజృంభణకు వేలాది మందికి ఉపాధి కరువైంది. ముఖ్యంగా అసంఘటి త రంగంలో ఉండే కార్మికులు, విద్యావంతులు సైతం ఉపాధి కోల్పోతున్నారు. దేశంలో ప్రస్తు తం నెలకొన్న ఆర్థిక మందగ మనం కారణంగా క్రమంగా నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయి. అంటే తిరిగి 1990ల నాటి పరిస్థితులు కనిపిస్తున్నా యి. అందుకే, కేడర్ రిక్రూట్మెంట్ ఇదే సరైన సమయమని భావించిన మావో అగ్రనేతలు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్లపై దృష్టి కేంద్రీకరించారు. ప్రజాసమస్యలపై పోరాటం పేరిట గిరిజన, అటవీ ప్రాంతాల ఆదివాసీల్లోని అనాథలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతను తమతో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కోసం పలు ప్రాంతాల్లో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో ఇటీవల సిరిసిల్లలో పోలీ సులు కొందరు మావోయిస్టులను, కొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో ప్రధాన కారణం పోడు వ్యవసాయం... ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోడు వ్యవసాయం పోకడలు అధికం. దాంతో ఇక్కడ ఫా రెస్టు ఆఫీసర్లకు పోడు వ్యవసా యం చేసుకునేవారికి ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా తిప్పుకోవాలని మావో నేతలు నిర్ణ యించినట్లు కనిపిస్తోంది. పోడు రైతుల్లో యువకులను తమవైపు తీసుకెళ్లేందుకు పలు రకాల వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఆ 15 మంది ఎక్కడ? ఆసిఫాబాద్లో తిర్యాణి మండలంలో మైలరేపు అడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని వీరి స్థావరం నుంచి ఆసిఫాబాద్ పోలీసులు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆసిఫాబాద్కు చెందిన 15 మంది యువకుల పేర్లు ఉన్నాయి. వీరిలో చాలామంది స్థానికంగా లేరని, మిస్సయ్యారని సమాచారం. వీరు ఎక్కడికెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి పేర్లు డైరీ లో ఎందుకున్నాయి? వీరిని ఇప్ప టికే రిక్రూట్ చేసుకున్నారా? శిక్షణ కోసం ఛత్తీస్గడ్ పంపారా? లేక మరేదైనా కారణం కోసం డైరీలో రాసుకున్నారా? అన్న అంశాలను ధ్రువీకరించుకునే పనిలో పడ్డారు. 24 గంటల్లో రెండు చోట్ల ఎదురుకాల్పులు.. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు మావోయిస్టులకు మధ్య రెండు చోట్ల ఎదురుకాల్పులు జరగడం తెలంగాణ ఏర్పడ్డాక ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈవారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పరిధిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని దళం సంచరిస్తోందన్న సమాచారంతో స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగారు. అతనితోపాటు బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, ఛత్తీస్గడ్కు చెందిన వర్గీస్ కోయ మగ్లు, కంతి లింగవ్వ అలియాస్ అనిత, పాండు అలియాస్ మంగులు, మీనా, రాములతో కూడిన దళం పోలీసులకు ఎదురుపడగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఇందులో భాస్కర్, ప్రభాత్ తలలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా మిగిలిన దళ సభ్యులపై రూ.4 నుంచి 5 లక్షల రివార్డు ఉంది. వీరి ఫొటోలను ఇప్పటికే విడుదల చేసిన పోలీసులు..తిర్యాణి అడవుల్లో జల్లెడ పడుతున్నారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోని మల్లెపల్లితోగు సమీపంలో కూంబింగ్ చేస్తోన్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సామగ్రి వదిలేసిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
దాడులు ఆపకపోతే..మినఫా తరహా ఘటనలే!
చర్ల: దండకారణ్యంలో పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి.. అమాయక ఆదివాసీలపై చేస్తున్న దాడులను ఆపకపోతే మినఫా తరహా ఘటనలకు పాల్పడక తప్పదని సీపీఐ మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో హెచ్చరించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ పేరిట ఒక లేఖను విడుదల చేశారు. అలాగే.. ఈ నెల 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని చింతుప్ప పోలీస్స్టేషన్ పరిధిలో గల మినఫా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు, ఆ సందర్భంలో మృతి చెందిన పోలీసు బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు సంబంధించి వివరాలు, పార్టీ వివరాలను వెల్లడించింది. సరిహద్దుల్లో ఉన్న సంపదను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో మినఫాలో ఆదివాసీలతో మాట్లాడుతున్న పార్టీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు కాల్పులకు దిగడంతో సరైన రీతిలో బుద్ధి చెప్పి 19 మందిని మట్టుబెట్టడంతోపాటు 20 మందిని గాయపరిచి వెళ్లగొట్టామని తెలిపారు. ఈ క్రమంలో తమ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు కూడా మృతి చెందారని పార్టీ పేర్కొంది. మృతి చెందిన వారిలో బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి ఏరియాలోని గోండుమెట్టకు చెందిన పార్టీ ప్లాటూన్ కమిటీ సభ్యుడు సక్రు, గంగులూరు ఏరియాలోని బుర్కేల్గ్రామానికి చెందిన పార్టీ సభ్యుడు రాజేష్, బైరంఘడ్ ఏరియాలోని గానార్ గ్రామానికి చెందిన సుక్కు మృతి చెందారని, వీరందరికి పార్టీ ఘనంగా నివాళులర్పించి అంత్యక్రియలు నిర్వహించిందని పార్టీ పేర్కొంది. ఈ దాడిలో చనిపోయిన జవాన్ల నుంచి 11 ఏకే 47 తుపాకులు, 2 ఇన్శాస్ తుపాకులు, ఒక ఎస్ఎల్ఆర్ అండ్ ఎల్ఎంజీ, 2 యూబీజీఎల్తోపాటు 1,550 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు లేఖలో వివరించింది. దండకారణ్యంలోని బస్తర్, రాజ్నందిగావ్, గడ్చిరోలి తదితర జిల్లాల్లో ఉన్న పోలీస్స్టేషన్లు, క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే మినఫా తరహా దాడులకు దిగుతామంటూ పార్టీ ఈ లేఖలో హెచ్చరించింది. -
మావో దంపతుల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విప్లవ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు నార్ల రవి శర్మ, అతని భార్య అనురాధలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ వెంకటరమణ కాలనీలోని వీరి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. వారి నుంచి మావో యిస్టు సాహిత్యంతో పాటు మూడు ల్యాప్టాప్లు, పెన్డ్రైవ్లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి రాష్ట్రంలో జరిగిన మావోయిస్టు కార్యకలాపాలతో వీరికి సంబంధం ఉందని 2012 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 8(1)2, 1967 చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన రవి శర్మ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సీపీఐ (ఎంఎల్) పీడబ్ల్యూజీలో పనిచేసే మేకల దామోదర్రెడ్డితో పరిచయం ఏర్పడటంతో జంట నగరాల్లో ఆ సంస్థల్లో సీవోగా పనిచేశారు. 1988లో ఆర్టీసీ బస్సుపై దాడి కేసులో సైఫాబాద్ ఠాణాలో వీరిపై కేసు నమోదైంది. మీర్చౌట్ ఠాణాలోనూ మరో కేసులో అరెస్టయి 1988 సెప్టెంబర్ 9న బెయిల్పై బయటకు వచ్చాడు. 1992–93లో హైదరాబాద్లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో పనిచేశాడు. ఆ తర్వాత అజ్ఞాత కార్యకలాపాలు నిర్వహించాడు. 1998లో బిహార్, జార్ఖండ్లకు వెళ్లి పీపుల్స్ వార్ గ్రూప్ను అక్కడి పీయూతో విలీనం చేశాడు. 1999లో జార్ఖండ్ రాష్ట్రంలోని పాలమూ, లతేహర్లో జోనల్ కమిటీ మెంబర్గా, 2001లో బిహార్, జార్ఖండ్ స్టేట్ యాక్షన్ కమిటీ మెంబర్గా, 2003 నుంచి 2006 వరకు బిహార్ జార్ఖండ్ స్టేట్ యాక్షన్ కమిటీ మిలటరీ కార్యకలాపాలను చూసుకున్నాడు. బిహార్లోని బీమ్బంద్ అడవిలో జరిగిన తొమ్మిదో కాంగ్రెస్కు హజరై భద్రతా చర్యలను పర్యవేక్షించాడు. ఆ తర్వాత నుంచి మావోయిస్టు పార్టీలోని సభ్యులకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తూ వచ్చాడు. ఇలా ఒకసారి పోలీసులకు చిక్కిన రవి శర్మ 2016 ఏప్రిల్ 4న బెయిల్పై బయటకు వచ్చాడు. తరచూ ఛత్తీస్గఢ్లో అగ్రనేతల సమావేశాలకు హజరవుతూ వస్తున్నాడు. రవి శర్మపై 16 కేసులు.. 2018 జూలై 21 నుంచి ఆగస్టు 6 వరకు రవి శర్మ దండకారుణ్యానికి వెళ్లాడు. 2018 నవంబర్లో కోల్కత్తాలో సెంట్రల్ కమిటీ మాజీ సభ్యులను, 2019 మార్చిలో హైదరాబాద్లో వారణాసి సుబ్రహ్మణ్యంను కలిశాడు. ఢిల్లీలో 2019 ఫిబ్రవరిలో జరిగిన హిందుత్వ ఫాసిస్టు అఫెన్సివ్కు వ్యతిరేకంగా ఆలిండియా ఫోరమ్ ఏర్పాటులో చురుగ్గా పాల్గొన్నాడు. రవి శర్మ పోలీసులకు లొంగిపోయినప్పటి నుంచి కూకట్పల్లిలో నివసించే అతని సోదరుడు ప్రకాశ్ శర్మ ఇంటి వద్ద ఉండేవాడు. రవి శర్మ తల్లిదండ్రులు సుధాకర శర్మ, సులోచనతోపాటు సోదరి శ్రీదేవి కూడా ఉండేవారు. మన్సూరాబాద్లోని వెంకటరమణ కాలనీలో సుధాకర శర్మ సోదరుడి కుమారుడు రాజేష్ కుమార్కు రెండంతస్థుల భవనం ఉంది. సుధాకర శర్మకు విశాలాంధ్ర కాలనీలో 230 గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటులో ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఆరు నెలల క్రితం రవి శర్మ రాజేష్ కుమార్ ఇంట్లోకి దిగాడు. విషయం తెలుసుకున్న ప్రత్యేక పోలీసులు.. ఎల్బీ నగర్ పోలీసుల సహకారంతో రవి శర్మ ఇంటిపై దాడి చేశారు. దంపతులిద్దరినీ అరెస్టు చేశారు. రవి శర్మపై జార్ఖండ్లో 11, హైదరాబాద్లో 4, విశాఖపట్నం రూరల్ చింత పల్లిలో ఒక కేసు.. మొత్తం 16 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో జార్ఖండ్ బోకారా జిల్లా తెనుఘాట్లో ఒక కేసు పెండింగ్లో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం రవి శర్మ పక్క పోర్షన్లోకి హిందీ భాష మాట్లాడే దంపతులు అద్దెకు దిగారని తెలుస్తోంది. వారు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
మంచిర్యాలలో ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు
సాక్షి, మంచిర్యాల : ఒక మహిళ మావోయిస్టుకు చికిత్స కోసం వస్తే.. స్పందించి వైద్యం చేయడంతో సదరు డాక్టర్ ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. మంచిర్యాల బస్టాండ్కు సమీపంలోని రిటైర్డు ప్రభుత్వ డాక్టర్ చంద్రశేఖర్ ఇంట్లో శుక్రవారం ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు చేపట్టింది. నిన్న మధ్యాహ్నం దాదాపుగా 7 గంటలు పాటు సోదాలు నిర్వహించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో భాగంగా రిటైర్డ్ డాక్టర్ చంద్రశేఖర్ ఇంట్లో నుంచి రెండు ఫోన్లు, హార్డ్ డిస్క్, విప్లవ సాహిత్యం పుస్తకాన్ని సీజ్ చేసి ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ మావోయిస్టుకు వైద్యం అందించినట్లు ఆధారాలు ఉన్న కారణంగానే సోదాలు చేసినట్లు సదరు వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... 'కొద్దిరోజుల క్రితం తన వద్దకు నిర్మల అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కు వస్తే వైద్యం చేశాను. ఆమె ఇటీవల పోలీసులకు లొంగిపోవడంతో.. ఆమె పేరు నర్మద అలియాస్ నిర్మల అని తెలిసింది. ఆమె నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు ఇంట్లో సోదాలు చేసి.. నా నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వ వైద్యుడిగా గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో విధులు నిర్వర్తించి, మంచి పేరు తెచ్చుకున్నందుకే మావోయిస్టు సానుభూతిపరుడిగా భావించి సోదాలు చేశారు. గతంలో ఎప్పుడో బుక్ ఎగ్జిబిషన్లో కొనుగోలు చేసిన ఒక పుస్తకం, సీడీ, ఓ పాత న్యూస్ పేపర్లోని వార్తల కారణంగా అనుమానించి ప్రశ్నించారు. అంతేకాక వాటితో పాటు రెండు ఫోన్లు, హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారు' అని అన్నారు. -
సరిహద్దుల్లో అప్రమత్తంగా వరంగల్ పోలీసులు
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. గత ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు జిల్లాలోని పలిమెల మండల సర్వాయిపేట, మహాముత్తారం మండలం కనుకునూర్ గ్రామాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీంతో జిల్లా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు ప్రాజెక్టుల వద్ద భధ్రతను మరింతగా పెంచారు. రాత్రి, పగలు కూంబింగ్, చెకింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ మావోయిస్టులు, రాజకీయ నాయకుల కదలికలపై కూడా పోలీసులు నజర్ వేసినట్లు తెలిసింది. ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే విచారించి వివరాలు ఆరా తీస్తున్నారు. వాహనాల తనిఖీలు పోలీసులు కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీ వంతెనల పైనుండి మçహారాష్ట్ర – తెలంగాణకు వస్తున్న వాహనాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాల రిజిస్ట్రేషన్, ధుృవీకరణ పత్రాలు, చిరునామాలు తెలుసుకునేందుకు మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లోని అడవుల్లో నిరంతరం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపున ఉన్న మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్ మండలంలోని ఓడ రేవులపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలిసింది. మరోపక్క వర్షాకాలం గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండనుండడంతో రోడ్డు మార్గాలపైన పోలీసులు నజర్ వేశారు. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్, గ్రావిటీ కాల్వ వద్ద ప్రత్యేక బలగాలు, సివిల్ పోలీసులు పహారా కాస్తున్నారు. పల్లెల్లో గుబులు! మంథని మాజీ ఎమ్మెల్యే పట్ట మధు, మాజీ ఏఎంసీ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, గతంలో పనిచేసిన డీఎస్పీ కేఆర్కే. ప్రసాదరావుతో పాటు పలువురు రాజకీయనాయకులపైన మావోయిస్టులు మహదేవపూర్–ఏటూరునాగారం కమిటీల పేరిట కరపత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పల్లెల్లో ఆందోళన చోటు చేసుకుంటుంది. ఆయా గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పట్టుకుని విచారించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఈనెల 21న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండడంతో మావోలు ఇటుగా గోదావరి దాటినట్లు ప్రచారం జరుగుతోంది. మారుమూల మండలం పలిమెల, మహాముత్తారం గ్రామాల్లో మాత్రం అటవీ ప్రాంతం కావడంతో జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో మావోలు అటుగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లోని చోటమోట నాయకులతో పాటు మాజీ మావోయిస్టులు మండల కేంద్రంతో పాటు పట్టణాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు కరపత్రాల విషయంలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. మావోల కరపత్రాలు అసలా, నకిలివా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. భద్రత కట్టుదిట్టం.. జిల్లా ఇచ్చార్జి ఎస్పీ సంగ్రామ్సింగ్, కాటారం ఏఎస్పీ సాయిచైతన్య, సీఐలు నర్సయ్య, హతిరాం ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్పిఎఫ్, డిస్ట్రీక్ గార్డ్స్, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోలు తెలంగాణ వైపు రాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా నిఘా తీవ్రతరం చేసి చర్యలు చేపడుతున్నారు. -
‘అమాయక విద్యార్థులను రెచ్చగొట్టవద్దు’
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులను మవోయిస్టులుగా మార్చే సంస్థలపై దర్యాప్తు కోసం డిటెక్టివ్ వింగ్లో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిషేధిత మావోయిస్టు సంస్థలతో కొందరు విద్యార్థులు కలుస్తున్నారని.. తుపాకీ పట్టి హింస సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీపీఐ మావోయిస్టు సంస్థతో పాటు, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే కుట్ర జరగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యార్థి వేదిక ప్రెసిడెంట్ మద్దిలేటి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయన ఇంట్లో అనేక పత్రాలు, మెమొరీ కార్డులు, డీవీడీలు, సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా సీపీఐ మావోయిస్టు పార్టీ 50 వ వార్షికోత్సవానికి సంబందించిన కరపత్రాలు కూడా లభించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ విద్యార్థి వేదికకు చెందిన మద్దిలేటి, అనుదీప్, భరత్, సందీప్, కిషోర్లపై వరంగల్, కొత్తగూడెం, గద్వాల్, కాజీపేట ప్రాంతాల్లో పలు కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. మేధావుల పేరుతో కొంతమంది అమాయకపు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. అలాంటి వారిపై నిఘా పెంచామని.. నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మావోయిస్టుల లేఖ
-
మా మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు : సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి ద్వారానే సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చని చెప్పారు. విద్య, వైద్యం, రహదారుల విస్తరణ, గిరిజనులకు భూములపై హక్కులు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ఉదారంగా సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడి విజ్ఞాన్ భవన్లో సాగింది. ఈ సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా దృష్టికి పలు విషయాలు తీసుకెళ్లారు. మూడు నెలల్లోనే గణనీయమైన కార్యక్రమాలు మానవ అభివృద్ధిని ఎజెండాగా చేసుకుని తమ పార్టీ వైఎస్సార్సీపీ రూపొందించిన మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారని, తమ పార్టీకి ఘన విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాల్లో గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అంకిత భావంతో ముందుకు సాగుతోందని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే అమలు చేసిన ముఖ్య కార్యక్రమాలను ఆయన వివరించారు. విభజన చట్టంలో భాగంగా కేంద్రం గిరిజన వర్శిటీని కేటాయించిందని, అయితే దాని ఏర్పాటులో జాప్యం జరుగుతోందని ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏ ఒక్కరూ ఆలోచించని రీతిలో తాము ఒక వైద్య కళాశాలను గిరిజన ప్రాంతమైన పాడేరులో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీంతోపాటు ఒక ఇంజినీరింగ్ కళాశాల కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతి ఐటీడీఏకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నందున మెరుగైన వైద్యం అందక గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగా ప్రతి ఐటీడీఏకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తప్పకుండా ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ కోరారు. దీని కోసం ఏపీలో ప్రయత్నాలు ప్రారంభించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇవన్నీ అదనమని పేర్కొన్నారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి ద్వారా శాంతిభద్రతలు వర్దిల్లుతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలు వేగంగా సాగాలంటే కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కళాశాల, వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని వివరించారు. మారుమూల ప్రాంతాలకు రహదారుల విస్తరణ, మొబైల్ టవర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. రహదారుల విస్తరణకు సంబంధించి రావాల్సిన అనుమతుల గురించి నివేదించారు. గిరిజనులకు భూములు ఇవ్వాలి అటవీ ప్రాంతాల్లో భూ పట్టాల కోసం సుదీర్ఘ కాలంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకొచ్చారు. గిరిజనులకు వారి ఆవాస ప్రాంతాల్లోనే భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. దీని కోసం తాజాగా దరఖాస్తులు ఆహ్వానించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో దాదాపు 1.41 లక్షల ఎకరాల అటవీ భూముల పట్టాలకు సంబంధించి 66 వేల దరఖాస్తులను నిరాకరించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత నాలుగు బెటాలియన్లను కేటాయించారని, వీటి ఏర్పాటుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే భరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మొదటి ఏడాదికి సంబంధించి మాత్రమే కేంద్రం నిధులు మంజూరు చేసిందని వివరించారు. కేంద్ర హోం శాఖ సమీక్ష అనంతరం అమిత్షాతో సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నితీష్కుమార్, ఆదిత్యనాథ్, కమల్నాథ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ తదితరులు కేంద్ర స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీ! మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు జాతీయ స్థాయిలో ఒక కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేసేందుకు ఈ కమిటీ పని చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని పలు రాష్ట్రాలు కోరాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలు అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు సూచించాయి. రూ.50 లక్షల లోపు పనులను గిరిజనులకు నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని, ప్రతి గ్రామంలో పోస్టల్, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించినట్టు సమాచారం. మొబైల్ టవర్ల ఏర్పాటుకు గల నిబంధనలను సరళీకరించాలని కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్దాస్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ గౌతం సవాంగ్లతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు పాల్గొన్నారు. అందరి ప్రయోజనాలకు అనుగుణంగా పోలవరంపై నిర్ణయం పోలవరంపై కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఇక్కడి శ్రమశక్తి భవన్లోని మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం రాత్రి 8.30 నుంచి రాత్రి 9.15 వరకు ఆయనతో సమావేశమయ్యారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం చెల్లించాల్సిన రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, పునరావాసానికి సంబంధించిన నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగినట్టు నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడంతో రివర్స్ టెండరింగ్కు వెళ్లామని, ఈ ప్రక్రియ పూర్తవ్వగానే గడువును అనుసరించి చేపట్టే పనులకు నిధులను వెంటవెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు సమాచారం. సమావేశం అనంతరం జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరంపై చర్చించాం. మేం ఏ నిర్ణయమైనా కేంద్ర, రాష్ట్ర, ప్రాజెక్టు ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకుంటాం’ అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటారా అని మీడియా ప్రశ్నించగా విషయ సంపూర్ణత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కేంద్ర హోం మంత్రితో వైఎస్ జగన్ సమావేశం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆయన అధికారిక నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం కలిశారు. సాయంత్రం 6.40 నుంచి 7.30 వరకు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక పెండింగ్ అంశాలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హోం మంత్రికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఇంటింటికీ తాగు నీరు, తదితర పథకాలకు కేంద్ర సాయం ఆవశ్యకతను విశదీకరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 13లో పొందుపరిచిన నిబంధనల మేరకు మౌలిక వసతుల ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్పీపీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. మానవ అభివృద్ధిని అజెండాగా చేసుకుని వైఎస్సార్సీపీ రూపొందించిన మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు. అందుకే ఘన విజయం అందించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాల్లో గిరిజనుల అభివృద్ధికి మా ప్రభుత్వం అంకిత భావంతో ముందుకు సాగుతోంది. – సీఎం వైఎస్ జగన్ -
కేంద్ర హోంశాఖ భేటీలో సీఎం జగన్
-
సమావేశం ఫలప్రదం; కేంద్రానికి ఏపీ సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి జాతీయ స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సోమవారం నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. కాంట్రాక్టర్లు ముందుకురాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలకు అప్పగించడం, కమ్యూనికేషన్ టవర్ల ఏర్పాటుకు నిబంధనల సరళీకరణపై చర్చించారు. రూ. 50 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గిరిజనులకు ఇచ్చే దానిపై దృష్టి సారించారు. నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు ప్రతి గ్రామంలో పోస్టాఫీసు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశం ఫలప్రదంగా ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల్లోని శాంతిభద్రతలు, అభివృద్ధి గురించి కీలకాంశాలు చర్చించినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, డీజీపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచనలు యువత మావోయిజం వైపు ఆకర్షితులు కాకుండా చేపట్టాల్సిన తక్షణ చర్యల గురించి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ మెడికల్ కాలేజీ, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ నెలకొల్పాలని కోరారు. గిరిజన ప్రాంతమైన సాలూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస) -
తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్ట్ సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్గా నిలిచాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో భద్రత, అభివృద్ధి, గిరిజన హక్కులపై చర్చిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల గురించి హోంశాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. మధ్యాహ్నం సెషన్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్గఢ్ సీఎం భాఘెల్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. (చదవండి: మావోయిస్టు ప్రాంతాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష) -
మావోయిస్టు ప్రాంతాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తోంది. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్గఢ్ సీఎం భాఘెల్, బిహార్ సీఎం నితీష్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నారు. మావోయిస్టు ప్రాంతాల్లో భద్రత, అభివృద్ధి, గిరిజనుల హక్కుల పరిరక్షణ, మావోయిస్టు ప్రాబల్యం కలిగిన 105 జిల్లాల్లో అత్యంత ప్రభావితం కలిగిన 35 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇక తూర్పు తెలంగాణలోని భూపాలపల్లి, మహబూబ్బాబ్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో కొంతకాలంగా మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 22 రోజుల్లో ఇద్దరు మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో ఎదురుకాల్పులు
-
విశాఖ మన్యంలో హైఅలర్ట్
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి దాడులు జరగకుండా విశాఖ మన్యంలో ముందస్తు హైఅలర్ట్ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తూ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మావోలకు వ్యతిరేకంగా సంతల్లో శాంతి స్థూపాలు నెలకొల్పినట్లు తెలిపారు. -
క్షణ క్షణం.. భయం భయం
భామిని, పాతపట్నం: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు కూంబిం గ్ ముమ్మరం చేశారు. నిషేధిత మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్న తరుణంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అటవీ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. ఎస్పీఎఫ్ పోలీసులు శనివారం పాతపట్నం పోలీస్స్టేషన్కు చేరుకుని పాతపట్నం–మెళియాపుట్టి రహదారికి ఇరువైపుల తనిఖీలు నిర్వహించారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో వాహనాలను సోదా చేస్తున్నారు. లాడ్జీలను తనిఖీ చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని దోనుబాయి పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ లభ్యం కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. వారోత్సవాల సమయంలో ప్రతీకార చర్యలు తీసుకొని సంచలనాలు సృష్టించడం మావోయిస్టులకు ఆనవాయితీ. ఏవోబీ అంతా విస్తృత కూంబింగ్ జరపడంతో ఏజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఏ క్షణానికి ఏమవుతుందోన్న ఆందోళనతో గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోపక్క ఎమ్మెల్యేలు, ఎంపీలకు పోలీసు యంత్రాంగం భద్రత పెంచింది. అప్రమత్తంగా ఉండమని వారిని అధికారులు హెచ్చరించారు. ముందస్తు చర్యలు జిల్లా సరిహద్దులో కీలకమైన పోలీస్ స్టేషన్లను జిల్లా కొత్త ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి ఇప్పటికే చుట్టివచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్ పేరున తివ్వా కొండల్లోని ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యే చర్యలు చేపట్టారు. కొన్ని గిరిజన గ్రామాల్లో కార్డన్–సెర్చ్ పేరుతో ఆదివాసీల గృహాలను ముమ్మరంగా తనిఖీలు చేశారు. అనుమానితుల వివరాలపై ఆరా తీశారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నిఘా చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఆర్వోపీలు చేపడుతున్నారు. గిరిజన గ్రామాల్లో గల ఎస్పీవోలకు జీతాలు పెంచి గుర్తింపు కార్డులు ఇస్తూ స్నేహ చర్యలను పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే నిషేధిత మావోయిస్టుల ఫొటోలతోపాటు రివార్డుల వివరాలు తెలియజేసి అప్రమత్తం చేసి ఉన్నారు. సరిహద్దులో ముందస్తుగా భారీ కూం బింగ్లకు సాయుధ పోలీస్ బలగాలు తివ్వాకొండల్లో మోహరింపచేశారు. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సానుభూతిపరులపై దృష్టి సారించి నిఘా పెంచారు. ఒడిశా పోలీసులతో సత్సంబంధాల కొనసాగింపుపై వివరాలు సేకరించారు. -
రక్తపాతంతో ‘డ్యామ్’ కట్టాలా ?
సాక్షి, న్యూఢిల్లీ: ‘వాళ్లు అరాచకులు, ఆటవికులు, అభివద్ధి నిరోధకులు, నెత్తిన ఈకలు, మెడలో పూసలేసుకొని తిరిగే అనాగరికులు, ఆ రూపంలో సంచరించే మావోయిస్టులు, చైనాకు అనుబంధంగా పనిచేస్తున్న పలు అంతర్జాతీయ సంస్థల నిధులు పుచ్చుకొని ఆందోళన చేస్తున్న ఆదివాసులు’ ఇది ప్రభుత్వ భాష. ఈ భాషణంతోని అమాయక ఆదివాస ప్రజలపై పలు సార్లు తుపాకీ గుండ్లను కురిపించి, రక్తపాతం సష్టించింది ప్రభుత్వం. అందులో దాదాపు 50 మంది తిరుగుబాటుదారులు అశువులు బాసారు. ఇంతకు ఆ తిరుగుబాటుదారులు ఎవరు ? వారు దేనిపై తిరుగుబాటు చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు ? అసలు ఈ గొడవ ఇప్పుడెందుకు ? అరుణాచల్ ప్రదేశ్లో 1,600 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ‘దిబాంగ్ డ్యామ్ ప్రాజెక్ట్’ వ్యతిరేకిస్తున్న వారంతా కేంద్రం దృష్టిలో తిరుగుబాటుదారులే. బహుళార్థక సాధక ప్రాజెక్ట్లో భాగంగా సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున దిబాంగ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తయిన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ను కేంద్రం ఎప్పటి నుంచో నిర్మించాలనుకుంటోంది. ఇక్కడే జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2,880 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడం ప్రాజెక్ట్లో అంతర్భాగం. బ్రహ్మపుత్రకు ఉపనదిగా వ్యవహరించే దిబాంగ్ నది భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో పుట్టి అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశిస్తోంది. మిష్మీ హిల్స్ మీదుగా నిజాంఘాట్ వద్ద దిబాంగ్ లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతమంతా జీవ రాసుల ఖజానా. ఉష్ణ మండలం, ఉప ఉష్ణ మండల, సమశీతోష్ణ మండలాల్లో కనిపించే ప్రతి వక్షరాసి ఇక్కడ ఉంది. హిమాలయ పర్వత సానువుల్లో కనిపించే అరుదైన చిరుతపులి (క్లౌడెడ్ లియోపార్డ్), మకాకు కోతి జాతులు, జింకలు, ఎలుగుబంట్లతోపాటు అంతరించిపోతున్న పలు అరుదైన పక్షులకు నెలవు ఈ ప్రాంతం. భూ భౌతిక సంపదతోపాటు జీవరాసులతో కళకళలాడుతున్న ఈ ప్రాంతం ఒక్క భారత్లోనే కాకుండా పరిసర దేశాల పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడ భూ ప్రకంపనలు కూడా ఎక్కువే. ఇందుకు కారణాలేమిటో శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటికీ అంచనాలు అందడం లేదు. 2000లోనే ప్రాజెక్ట్కు నాంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, 2000 సంవత్సరంలో ఈ దిబాంగ్ ప్రాజెక్ట్కు సంబంధించి ‘నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ), సమగ్ర నివేదికను రూపొందించింది. అప్పటి బీజేపీ ప్రభుత్వం దీన్ని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లింది. దిబాంగ్ దిగువ ప్రాంతానికి చెందిన అప్పటి ముఖ్యమంత్రి ముకుత్ మీటీ. తన ప్రాంతం అభివద్ధి చెందుతున్నదన్న ఆశతో అంగీకరించారు. 2010 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉండింది. స్థానిక ప్రజల నుంచి అనూహ్యంగా తిరుగుబాటు రావడంతో అది సాధ్యం కాలేదు. 2007లో ప్రజాభిప్రాయ సేకరణ ‘ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్’ ప్రకారం ఇలాంటి ప్రాజెక్ట్లకు పర్యావరణ అనుమతి తప్పనిసరి. అందుకు ప్రజామోదం కూడా తప్పనిసరి. 2007, మే నెలలో మొదటి సారి ప్రజాభిప్రాయ సేకరణకు మొదటిసారి పిలుపునిచ్చారు. అప్పటికి అస్సాం–అరుణాచ్ సరిహద్దులో నిర్మిస్తున్న ‘సుభాన్సిరి హైడ్రో పవర్ డ్యామ్ ప్రాజెక్ట్’కు వ్యతిరేకంగా ప్రజాందోళన చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి డ్యామ్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉందో వివరించడంతోపాటు ప్రస్తుత దిబాంగ్ ప్రాజెక్ట్ విషయంలో ఎన్ని లోపాలున్నాయో తెలియజేస్తూ స్థానిక పత్రికలు లెక్కలేనన్ని వార్తా కథనాలను రాశాయి. అనేక ఆదివాసీ గ్రామాలతోపాటు దాదాపు 5000 హెక్టార్ల అటవి భూమి మునిగిపోతుందని వెల్లడించాయి. 700 కుబుంబాలు భూములు కోల్పోతారని పేర్కొన్నాయి. 2008లో తొలి సమావేశం ప్రజలు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో 2007, మే నెలలో ఏర్పాటు చేయాలుకున్న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం వాయిదా పడింది. 2008, ఫిబ్రవరి నెలలో సమావేశం ఏర్పాటు చేయగా ఇదు–మిష్మీకి చెందిన 1200 మందితోపాటు మొత్తం 12 వేల మంది హాజరయ్యారు. వారిలో 99 శాతం మంది ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాను వెల్లడించారు. అయినప్పటికీ అదే సంవత్సరం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రాజెక్ట్ సైట్కు 400 కిలోమీటర్ల దూరంలోని రాష్ట్ర రాజధాని ఇటానగర్లో ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. అప్పుడు ‘ఆల్ ఇదూ మిష్మీ విద్యార్థుల సంఘం, ఇదూ మిష్మీ కల్చరల్ అండ్ లిటరర్ సొసైటీ’ సభ్యులు నిరసన తెలిపారు. విచక్షణా రహితంగా కాల్పులు 2008 నుంచి మౌనం వహిస్తూ వస్తోన్న కేంద్రం ప్రభుత్వం 2011లో ప్రాజెక్ట్ నిర్మాణానికి మళ్లీ పనులు చేపట్టింది. దానికి వ్యతిరేకంగా ప్రజాందోళనలు రాజుకోవడంతో వారి వెనక మావోయిస్టులు ఉన్నారంటూ కేంద్రం బలగాలను రంగంలోకి దించింది. 2011, అక్టోబర్ ఐదవ తేదీన ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ దళాలు ఓ దుర్గాపూజా మండపంలోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరపగా కనీసం పది మంది గాయపడ్డారు. అప్పటి నుంచి ఆందోళనలు జరిపినప్పుడల్లా కాల్పులు అనివార్యమయ్యాయి. మావోలు లేకపోయినప్పటికీ వారున్నారంటూ కేంద్రం ‘సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం’ను ప్రయోగించిందంటూ నాటి ఉద్యమకారులు పలు సందర్భాల్లో వెల్లడించారు. చైనా అనుబంధ సంస్థలు ఆందోళన నిర్వహిస్తున్నాయని కూడా కాంగ్రెస్ నేతలు పలు ప్రకటనలు చేశారు. 2013, మార్చి నాటికి ప్రజల వైఖరిలో మార్పు 2013, మార్చిలో జరిగిన తుది ప్రజా సదస్సు నాటికి ప్రజల్లో మార్పు వచ్చింది. ఆందోళనల కారణంగా అప్పటికే తమ కొడుకులు, బంధువులు కొన్నేళ్లపాటు జైల్లో ఉండాల్సి రావడంతో వారు ప్రాజెక్ట్ నిర్మాణానికి అంగీకరించారు. తగినంత నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశారు. అది తేలకుండానే 2014లో లోక్సభ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అదే ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ పాసిఘాట్లో మాట్లాడుతూ జల సంరక్షణ, పర్యాటకం, పూల తోటల పెంపకం, చేతి వత్తులను ప్రోత్సహించడం ద్వారా అరుణాచల్ ప్రజలకు ఉపాధి కల్పిస్తానని చెప్పారు. అదేమి జరగలేదు. 1600 కోట్ల రూపాయల ప్రకటన తమ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ అభివద్ధికి కట్టుబడి ఉందని, దిబాంగ్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి ఆ రాష్ట్రానికి 1600 కోట్ల రూపాయలను కేంద్రం అందజేస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇటీవల పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేసిన మూడోరోజే ముందస్తు హెచ్చరికగా ప్రాజెక్ట్ ప్రాంతంలో ఓ మోస్తారు భూప్రకంపనలు వచ్చాయి. -
మావోలకు వెరవని గిరిజన యువతి
రాయ్పూర్ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పైగా అక్కడి ప్రభుత్వానికి కూడా అధికారాలు తక్కువ. మావోల ప్రభావం కలిగిన ఛత్తీస్గఢ్లోని అబూజాబాద్ ప్రాంతంలో కీర్టా డోప్రా అనే గిరిజన యువతి మెడికల్ స్టోర్ను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. వీరికి ప్రాథమిక సదుపాయాలు, రోడ్డు మార్గాలు లేవు. రోజు మొత్తమ్మీద నాలుగు బస్సులు మాత్రమే ఇక్కడికి వస్తాయి. ప్రతి బుధవారం ఇక్కడ కూరగాయల సంత జరుగుతుంది. మావోయిస్టుల తిరుగుబాటు నేపథ్యంలో జన్ ఔషధీ కేంద్రం మాత్రమే ఔషధాలను అందజేస్తోంది. ఇక్కడ ఈ వెసులుబాటు లేకపోతే ఔషధాలకోసం 70 కిలో మీటర్లు వెళ్లక తప్పదు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా మరియా తెగకు చెందిన కీర్టా చదువు ఇంటర్తోనే ఆగిపోయింది. ఒక రోజు ఈ గ్రామంలో యూనిసెఫ్ సంస్థ పోషకాహారలోపంపై కార్యక్రమం నిర్వహించగా కీర్టా అందులో పాల్గొని అందరికీ అవగాహన కల్పించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంత సమస్యలను యూనిసెఫ్ సంస్థ దృష్టికి తీసుకుపోయింది. వారి సహకారంతో మలేరియా, డయేరియాతోపాటు అన్నిరకాల మందులను గ్రామస్థులకు అందుబాటులో ఉంచుతోంది. అలా ఆమె రోజుకు 12 గంటలు పనిచేసి నెలకు రూ.2,000పైగా సంపాదిస్తోంది. కీర్టా తెగువను గుర్తించిన యూనిసెఫ్ సంస్థ 2014లో సాహసి అవార్డుతో సన్మానించింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ‘‘ మావోయిస్టులు ఏ క్షణంలోనైనా ఆ షాపుపై దాడి చేయవచ్చు. ధ్వంసం కూడా చేయొచ్చు. అయితే కీర్టా అవేవీ పట్టించుకోలేదు. ఆమె ధైర్యం అందరికీ ఆదర్శం. ఇటువంటివారి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది’’ అని అన్నారు. -
మావోల కదలికలపై నిఘా
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : మావోల కదలికలపై నిఘా పెట్టినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలియజేశారు. స్థానిక పోలీస్స్టేషన్ను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా గతంలో మావోలతో సంబంధాలు ఉన్న గిరిజన గ్రామాల్లో కొత్త వ్యక్తుల చేరికపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో విజబుల్ పోలీస్లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఉన్నట్లయితే ప్రజల కదలికలు గుర్తించవచ్చు అన్నారు. అలాగే హైవేలపై వాహనాలు నడిపే వారికి రోడ్డు నిబంధనలు గురించి ఎస్ఐ స్థాయిలో కౌన్సిలిం గ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ వాహనానికి వెనుక భాగంగా రేడియం స్టిక్కర్ అతికించి ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదుల నుంచి అక్రమ ఇసుక రవాణ చేస్తే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇసుక అక్రమ నిల్వలు ఉన్నట్లయితే ఇసుక నిల్వ ఉంచిన జిరాయితీ భూమి యజమానిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమవ్వడంతో కాలేజీల్లో ర్యాంగిగ్ జరగకుండా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ఎస్పీతో పాటు సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ ప్రవల్లికలు ఉన్నారు. -
ఏజెన్సీలో నిఘా..
సాక్షి, కొత్తగూడెం: సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధవాతారణం నెలకొంది. పోడు భూముల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మావోయిస్టులు క్షేత్రస్థాయిలో ప్రచార పర్వానికి దిగారు. దీంతో ప్రతిగా పోలీసు బలగాలు గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల్లో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని భద్రాచలం, పినపాక, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల్లో వేలాది మంది సాయుధ బలగాలతో జల్లెడ పడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆదివాసీలు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ భూముల నుంచి వారిని వెళ్లగొట్టేందుకు కోర్టులు, చట్టాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మావోయిస్టులు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు గత మూడు రోజులుగా భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని పూజారిగూడెం, లెనిన్కాలనీ, గోగుబాక, ఆర్.కొత్తగూడెం, చింతగుప్ప, దుమ్ముగూడెం మండలం బండిరేవు, సీతానగరం ప్రాంతాల్లో చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో వెంకటాపురం–వాజేడు కమిటీ పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. ఆదివాసీలను అడవుల నుంచి పంపించేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనికి తోడు కొన్ని రోజుల క్రితం మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ అలియాస్ లక్ష్మ ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఉద్యమాల ద్వారానే తెలంగాణలో పునర్ వైభవం సాధించాలని ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గిరిజనుల పోడు భూముల అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 40 మంది సభ్యుల ప్రచారం..! గత 20 రోజులుగా భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం, పినపాక, మణుగూరు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో హరిభూషణ్, దామోదర్, లచ్చన్న, రీనా, రాజిరెడ్డి అలియాస్ వెంకన్న, భద్రు, మంగు, మంగ్లు ఆధ్వర్యంలో సుమారు 40 మంది మావోయిస్టులు పోడు భూముల అంశంపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం అందజేశాయి. దీంతో ఈ మండలాల్లో ఎస్పీ సునీల్దత్ ఆధ్వర్యంలో సుమారు 3 వేల మంది సాయుధ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అణువణువూ జల్లెడ పడుతున్నారు. గత వారం రోజులుగా ఏజెన్సీ పరిధిలోని మారుమూల గ్రామాల్లో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు శోధిస్తున్నాయి. మరోవైపు ఆయా మారుమూల ప్రాంతాల్లో సైతం మావోయిస్టు నాయకుల ఫొటోలతో కూడిన పోస్టర్లు వేస్తున్నారు. వారి గురించి ఖచ్చితమైన సమాచారం ఇస్తే రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. సమాచారం ఇచ్చినవారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కార్యకలాపాలు పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తుండగా, తాజాగా పోడు భూముల అంశంపై ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతుండడంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కూంబింగ్ ద్వారా భద్రతా బలగాలు ఏజెన్సీ జల్లెడ పడుతుండడంతో గిరిజన పల్లెల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
చదువులమ్మ ఒడిలో మావోల కలకలం..!
-
బరిలోకి ‘దంతేశ్వరి లఢకే’..
రాయ్పూర్ : హింసాత్మక ఘటనలతో పేట్రేగిపోతున్న మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఛత్తీస్గఢ్ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. 30 మంది మహిళలతో యాంటీ నక్సల్స్ కమాండో యూనిట్ను ఏర్పాటు చేసింది. నక్సల్స్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టే చర్యల్లో భాగంగా ఏర్పాటైన ఈ బృందానికి ‘దంతేశ్వరి లఢకే’ అని నామకరణం చేశారు. మావో ప్రభావిత ప్రాంతాలైన బస్తర్, దంతేవాడ ప్రాంతాల్లో ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందించనుంది. ఇక ఈ ప్రత్యేక బృందంలో 10 మంది మాజీ నక్సలైట్లు ఉండటం విశేషం. గతంలో నక్సలైట్లుగా పనిచేసి లొంగిపోయిన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. దంతేశ్వరి బృందంలోకి తీసుకున్నారు. మహిళా సాధికారతకు మరో ఉదాహరణ పురుషులతో కూడిన కమాండోల బృందానికి అనుబంధంగా ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందిస్తుందని బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు. వీరంతా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దంతేశ్వరి లఢకే ఏర్పాటు మహిళా సాధికారితకు మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అంతకంతకూ తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. పలు హింసాత్మక ఘటనలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మందుపాతరల పేలుళ్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల కిందట పోలీస్ వ్యాన్ను పేల్చేసిన ఘటనలో 16 మంది పోలీసులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్న మావోల వ్యవహారంలో భద్రతా బలగాలు మరింత పకడ్బందీగా వ్యూహాలు అమలు చేయడంలో నిమగ్నమయ్యాయి. -
క్షణ క్షణం.. భయం భయం
బరంపురం: అభం శుభం ఎరుగని గిరిపుత్రులు పత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఆదివాసీ గ్రామాల్లో హయిగా బతికే అవకాశం రోజు రోజుకూ సన్నగిల్లుతుంది. ప్రతిక్షణం ఆందోళన, అనుక్షణం ఆవేదనతో గంజాం, గజపతి, కొందమాల్ జిల్లాల సరిహద్ధు అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన గ్రామాలు అట్టుడుకుతున్నాయి. పోలీసులు, మావోయిస్టులు తమకు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ‘ఏ జన్మలో ఏ పాపం చేసామో.. ఇప్పుడిలా నరకం అనుభవిస్తున్నా’మని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కొందమాల్ జిల్లాను ఆనుకొని మావోయిస్టుల బృందం నయగడా జిల్లా అటవీశాఖ కార్యలయంలో చొరబడి.. ఆయుధాలు దోచుకున్నారు. అలాగే 18న కొందమాల్ జిల్లాలో జరిగిన రెండో విడత ఎన్నికల పోలింగ్కి కొద్ది గంటల ముందు పిరింగియాలో అధికారుల వాహనాలను పేల్చివేశారు. ఈ ఘటన నుంచి కోలుకునే లోపే అదే రోజు సాయంత్రం గచ్చపడా పోలీసు స్టేషన్ పరిధిలోని బోరలా గ్రామంలో పోలింగ్ సూపర్ వైజర్గా ఉన్న సంజుక్త దిగల్ను తుపాకీతో కాల్చిచంపారు. పక్కా సమాచారంతో! మావోయిస్టుల వరుస ఘటనలతో రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కొందమాల్, గజపతి, గంజాం జిల్లాల సరిహద్ధులు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సాయంతో సీఆర్పీఎఫ్ జవాన్లు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక గిరిజనులు భయంతో తల్లడిల్లి పోతున్నారు. కొందమాల్ జిల్లా దరింగబడి బ్లాక్ బమ్మునిగాం పోలీస్ స్టేషన్ పరిధి తిరుబడి అటవీ ప్రాంతం, గంజాం జిల్లా సరిహద్ధు మోహన, గుమ్మ, గంజాం–కొందమాల్ జిల్లా సరిహద్ధులైన ముజగర్ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతమైన గస్మా అరణ్య ప్రాంతాల్లో ఛతీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో బీహార్కు చెందిన మావోయిస్టు అగ్ర నాయకులు తిష్ట వేసి, ప్లీనరీలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కొద్ది రోజుల క్రితం దక్షణాంచల్ ఐజీ జితేంద్రకోయల్ ఆదేశాలతో గంజాం ఎస్పీ బ్రాజేష్కుమార్ రాయ్, కొందమాల్ ఎస్పీ ప్రతీక్సింగ్ సంయుక్తంగా నిర్వసిస్తున్న ఈ కూంబింగ్లో సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ, కోబ్రా కమాండర్లు మావోయిస్టులను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందమాల్ జిల్లా గిరిజనులను సాక్షి ప్రతినిధి కలిశారు. వారి కన్నీటి వెతలకు అక్షర రూపమే ఈ ప్రత్యేక ‘సాక్షి’ కథనం... గంజాం, కొందమాల్ జిల్లాల్లో తిరుబడి, గస్మా, ముజగర్ పానిగొండా అటవీ ప్రాంతం గంజాం, కొందమాల్ జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం 4 ఫారెస్ట్ అరణ్య ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. నక్సలైట్లు అరణ్య ప్రాంతాల్లో ప్లినరీలు నిర్వహిస్తున్న సమాచారంతో గతవారం నుంచి పోలీసులు, సీఆర్పీ బలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో దరింగబడి, తిరుబడి, కిటింగియా, రైకియా, దసింగియా, పనిగొండా, మోహన, గుమ్మా, ముజగర్, గస్మా ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులు భయంతో వణుకుతున్నారు. కొనసాగుతున్న కూంబింగ్ వల్ల ఈ భయం మరింత పెరిగిపోయింది. ఇలా సరిహద్ధుల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కొందమాల్ జిల్లాలో దట్టమైన ప్రాంతాలైన దరింగబడి బ్లాక్ తిరుబడి, గస్మా, ముజగర్కు మెల్లమెల్లగా బలగాలు చేరుతూ... మావోయిస్టులను జల్లెడ పడుతున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో పోలీసులు ఏజెన్సీ కేంద్రాల్లో కట్టుదిట్టంగా కూంబింగ్ చేయాలని ఉన్నతాధికార్లు అదేశించినట్లు తెలిస్తుంది. మావోయిస్టులపై పోలీస్లు ముప్పేట దాడులు జరిపే సమయం లేదన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లాని దుర్గంగా మార్చుకున్న విధంగా గత 2 ఏళ్లుగా కొందమాల్ జిల్లాని కూడా మావోయిస్టులు అక్రమించుకొని, దాడులు జరిపి.. తమ ఉనికిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఒకవైపు కొనసాగుతున్న కూంబింగ్తో మరోవైపు రక్షిత జోన్లలో తలదాచుకుంటున్న మావోయిస్టుల అగ్రనాయకులు పోలీసు వ్యూహాలను తిప్పికొట్టే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఇరువర్గాల మధ్య యుద్ధ పాతిపదక వాతావరణంలో మార్పులు తీసుకు రావల్సి వచ్చింది. అల్లాడుతున్న గరిపుత్రులు గంజాం, కొందమాల్ జిల్లా పరిధిలోని కటింగియా, పాణిగొండా, తిరుబడి, దాసింగి, మోనా, అడవా గిరిజన ప్రాంతాల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే గరిపుత్రులు బతుకే నరకంగా భావిస్తున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనని భయపడుతూ జీవిస్తున్నారు. గ్రామాలు దాటి బయటికి వస్తే తరిగి క్షేమంగా ఇంటికి వేళ్లలేమనే భయంతో ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. వారం రోజులుగా ఇక్కడ గిరిజన గ్రామాల్లో గిరిపుత్రుల పరిస్థతి దయానీయంగా ఉంది. పోలీసులు ఇప్పటికే తిరుబడి గిరిజనుల ఇళ్లకు వచ్చి మావోయిస్టుల ఆచూకీ కోసం పదే పదే వేధిస్తున్నారని చెబుతున్నారు. తమకు ఏమీ తెలియదన్నా వినడం లేదని, తమ గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆదివాసీలు తమ అవేదని వ్యక్తం చేస్తున్నారు. దాడులు ఎక్కువయ్యాయి కొందమాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. వారికి పటున్న ప్రాంతాల్లో విజయం సాధించడం కష్టమే. ఏ సమయంలోనూ ఉద్యమాన్ని తక్కువగా అంచనా వేయలేం. మరోవైపు మావోస్టుల దాడులు, పోలీసుల కూంబింగ్ వల్ల గిరిజనులు ఎక్కువగా నష్టపోతున్నారు. శాంతి చర్చలు ఏర్పాటు చేసి, అమాయక గిరిపుత్రులకు ప్రాణభయం లేకుండా చర్యలు చేపట్టాలి. – లంబొదర్ కార్, కుయి సమాజ్ అధ్యక్షుడు క్షణ క్షణం.. భయం భయం పోలీసులు రక్షిస్తారని భావించడం ఎప్పుడో మానేశాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడి గూడేల సమీపంలోనే ఉన్నారంటూ పోలీసులు మమ్మల్ని వేధించడం నిత్య కృత్యమైంది. మేమంతా ఇక్కడ ఉండటమే నేరంలా చూస్తున్నారు. రెండువైపులా ఇబ్బందులతో ప్రత్యక్ష నకరం చూస్తున్నాం. – మరియా ధిగల్, గిరిజనురాలు, తిరుబడి ప్రభుత్వ తీరే కారణం మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడానికి కారణం ప్రభుత్వం పనితీరే. వారికి, పోలీసులకు పరస్పర కాల్పుల వల్ల గిరిజనులు నలిగి పోతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. పాలకుల నిర్లక్ష్యం వల్లే పోలీసులు, నక్సలైట్ల లోనూ పోరుబాట పెరిగింది. ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్ పరిణామాలు మరింత వ్యధను మిగిల్చేవిగా ఉంటుందని ఆందోళనగా ఉంది. ప్రపుల్ల సమంతరాయ్, లోక్శక్తి అభియాన్ అధ్యక్షుడు -
‘బస్తర్’ మే సవాల్
మహారాష్ట్రలోని గడ్చిరోలి.. ఛత్తీస్గఢ్లోని బస్తర్.. గిరిజన నియోజకవర్గాలు. అటవీ హక్కుల చట్టంపైనే అన్ని కళ్లూ పెట్టుకున్నారు ఇక్కడి ఆదివాసీలు. భూమి హక్కులు కాపాడే వారికే ఓటేస్తామంటున్నారు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడ ఎన్నికల్ని అడ్డుకునేందుకు బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మంగళవారం బస్తర్లోని దంతేవాడకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు భీమా మాండవి కాన్వాయ్పై దాడి జరిపి, ఆయనతో సహా నలుగురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం బస్తర్లో 80 వేల భద్రతా బలగాలను, డ్రోన్లను మోహరించింది. భారీ ఏర్పాట్ల మధ్య నేడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గడ్చిరోలిలో అటవీ హక్కుల చట్టం ప్రభావం మహారాష్ట్రలోని గడ్చిరోలి చిముర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఢీకొంటున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అశోక్ నేతే, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నామ్దేవ్ ఉసెంది మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే. మోదీకి వున్న జనాకర్షణ తమ అవకాశాలను మెరుగుపరుస్తుందని బీజేపీ భావిస్తుండగా, ఎన్సీపీ, సీపీఐ పొత్తుతో తాము గట్టెక్కగలమని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎటపల్లి – భమ్రాగర్ మైనింగ్ బెల్ట్లో పెసా, అటవీ హక్కుల చట్టాలు అమలు చేయకపోవడంపై ఇక్కడ ఆదివాసీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అంశం ఎన్నికల్లో కీలకం కానున్నదని గడ్చిరోలి మారుమూల ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. గిరిజనుల అటవీ హక్కులు పరిరక్షించకపోవడమనేది బీజేపీకి నష్టదాయకంగా పరిణమించగలదన్న అభిప్రాయం వినపడుతోంది. గడ్చిరోలిలో 90.85 శాతం మంది గ్రామీణులు. 30.50 శాతం మంది ఆదివాసీలు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిన గడ్చిరోలి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీటిపై నేతే 2014లో ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోవడం, దీనికి తోడు ఆయన ఓ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకోవడం అనే అంశాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 42 శాతం ఓబీసీల ఓట్లు ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. తమ రిజర్వేషన్ కోటాను 19 నుంచి 6 శాతానికి తగ్గించడంపై వీరు ఆగ్రహంతో వున్నారు. కోటాను పునరుద్ధరింపచేస్తామని రెండు ప్రధాన పార్టీల నేతలూ హామీలిచ్చారు. భూమి హక్కులే ‘బస్తర్’ ఎజెండా ఛత్తీస్గఢ్లోని బస్తర్లో భూమి హక్కే ప్రధాన ఎజెండా. అటవీ హక్కుల చట్టం కింద అడవులపై ఆధారపడి జీవించే హక్కు తమకు ఉందంటున్న ఆదివాసీలు.. తమ భూముల జోలికి రాబోమని ప్రకటించే వారికే ఓటు వేస్తామంటున్నారు. ‘జాతీయవాదం ఇక్కడ ఓట్లు రాల్చదు. జీవనాధారమైన భూమే మాకు అతి ముఖ్యం’ అంటున్నారు స్థానికులు. అడవుల్లో నివసించేందుకు అనర్హులైన ఆదివాసీలను దురాక్రమణదారులుగా గుర్తించి జూలై లోపు ఖాళీ చేయించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇక్కడి ఆదివాసీలు మండిపడుతున్నారు. ఇటీవల నిరసన ప్రదర్శనలు జరిపి, కరపత్రాలు పంచారు. ఏ ఒక్కరినీ అడవుల నుంచి ఖాళీ చేయించబోమని ముఖ్యమంత్రి భాగెల్ హామీ ఇచ్చిన తర్వాతే వారు శాంతించారు. మోదీ ప్రభుత్వం కోర్టులో ఆదివాసీల తరఫున తన వాదన సరిగా వినిపించలేకపోయిందని, వారి హక్కులకు రక్షణ కల్పించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కొంటా, బస్తర్, చిత్రకూట్, కొండగావ్, జగదల్పూర్, దంతేవాడ, బీజీపూర్, నారాయణపూర్ అనే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో ఎస్టీ జనాభా 70 శాతం. బీజేపీ తరఫున ఆ పార్టీ బస్తర్ జిల్లా నేత బైదురామ్ కశ్యప్.. కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ లీడర్ దీపక్ బైజ్తో తలపడుతున్నారు. 1998 నుంచి బీజేపీ ఖాతాలో వున్న బస్తర్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్.. ఈసారి చిత్రకూట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దీపక్కు టికెట్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి కంటే ఈ యువకుడికే ప్రజాదరణ ఎక్కువ వున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో టాటా గ్రూప్ కోసం బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగిచ్చేయడమనేది ఆదివాసీల్లో కాంగ్రెస్ ఆదరణకు దోహదపడగలదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బస్తర్ సిట్టింగ్ ఎంపీ దినేశ్ కశ్యప్పై స్థానికుల్లో చోటుచేసుకున్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్కు అనుకూలంగా మారనుంది. పలు సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గాన్ని ఎంపీ ఏనాడూ సందర్శించలేదని ఆదివాసీలు విమర్శిస్తున్నారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకతకు తోడు గత మూడు మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరచడం, ప్రత్యేకించి రుణమాఫీ అమలు చేయడం, బీజేపీ సర్కారు స్వాధీనం చేసుకున్న గిరిజనుల భూములను తిరిగివ్వడం వంటి చర్యలు తమకు లాభిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ నేత కవసి లక్మా. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్ లోక్సభ స్థానంలో దంతేవాడ మినహా మిగిలిన సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు దంతేవాడలో మావోయిస్టులు పేల్చిన మందు పాతరలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. బీఎస్పీకి చెందిన ఆయుతు రామ్ మండవి, సీపీఐకి చెందిన రాము రామ్ మౌర్య సహా మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఇక్కడ బరిలో వున్నారు. మొబైల్ ఫోన్లు వాడుకోగల పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో అంతగా లేదు. రహదారులకు దగ్గరగా వుండే కొన్ని ఇళ్లలోనే ఇక్కడ టీవీలుంటాయి. బీజేపీ, కాంగ్రెస్లంటే ఇక్కడ పువ్వు, చేతి గుర్తులే. మావోయిస్టుల ఆదేశాల ప్రభావమే ఎక్కువ. మావోల బెదిరింపులు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు కొన్ని ప్రాంతాల్లో తొలగించి, దగ్ధం చేశారు. మరోవైపు మావోల భయంతో అభ్యర్థులు భమ్రాగర్, సిరోంచ, అహేరి, ధనోరా, ఎటపల్లి సహా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి దూరంగా వున్నారు. బెదిరింపుల నేపథ్యంలో జనం ఎన్నికల సభలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు నేతే. ఉసెంది మారుమూల ప్రాంతాల్లో కొద్ది మేర ప్రచారం జరిపారు. మావోయిస్టుల హింసకు సంబంధించి ఇక్కడ 2014లో 15 కేసులు, 2009లో 18 కేసులు నమోదయ్యాయి. 2004లో ఎదురు కాల్పుల ఘటనలు సహా మొత్తం 23 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మందు పాతర పేలుళ్లలో ఇద్దరు పోలీసులు మరణించారు. గత ఏప్రిల్లో భద్రతా దళాలు కస్నాసుర్ గ్రామం వద్ద 40 మంది అనుమానిత మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకారంగా మావోలు ఇన్ఫార్మర్లుగా ముద్ర వేసి, అరడజను మంది గ్రామస్తులను చంపేశారు. -
ఎన్ఐఏలో ‘మావో’ సెల్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల కేసుల దర్యాప్తునకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గతేడాది వరకు కేవలం దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపైనే ఎన్ఐఏ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేది. ఇందులో కశ్మీరీ చొరబాటుదారులు, ఈశాన్య భారతదేశంలోని తిరుగుబాటుదారులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, దేశంలో పాక్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ) కార్యకలాపాలు, ఉగ్రవాదులకు ఆర్థికసాయం, దొంగనోట్ల చలామణి తదితర కేసులుండేవి. ఇక నుంచి మావోయిస్టు కేసులను కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఈ విభాగం ఏం చేస్తుందంటే..? వాస్తవానికి ఇటీవల 75 కొత్త పోస్టులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర హోంశాఖ మంజూరు చేసింది. ఇందులో 22 మంది అధికారులతో కూడిన ప్రత్యేక విభాగం ఎల్డబ్ల్యూఈ (వామపక్ష తీవ్రవాదం) కేసులను విచారించనుంది. దేశవ్యాప్తంగా ఇకపై మావోయిస్టులు పాల్పడే దాడుల కేసుల సంగతి ఎన్ఐఏ చూసుకుంటుంది. ఎందుకంటే భారీగా నగదు తరలింపు, అక్రమంగా ఆయుధాలు నిల్వచేయడం, పేలుడు పదార్థాలు కలిగి ఉండటం, ప్రజాప్రతినిధులను హత్యలు చేయడం తదితరాలన్నీ దేశ వ్యతిరేక చర్యల కిందకే వస్తాయి. అందుకే, కేవలం ఉగ్రకేసులనే దర్యాప్తు చేసే ఎన్ఐఏకు మావోయిస్టులకు సంబంధించిన కేసులను కూడా అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరో కారణం ఏంటంటే.. మావోయిస్టు కార్యకలాపాలన్నీ వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో జరు గుతుంటాయి. ఒక రాష్ట్రంలో దాడికి పాల్పడి మరో రాష్ట్రంలోకి దండకారణ్యాల ద్వారా వెళుతుంటారు. ఆయా రాష్ట్రాల పరిధుల సమస్యలు తలెత్తడంతో ఇలాంటి కేసుల దర్యాప్తు స్థానిక పోలీసులకు ఇబ్బందిగా మారుతోంది. అందుకే, జాతీయస్థాయిలో ఉన్న ఎన్ఐఏ అయితే ఇలాంటి చిక్కులు, పరిమితులు ఉండవు. అన్ని రాష్ట్రాల పోలీసులతో టచ్లో ఉంటూ కేసులను ఎలాంటి అడ్డుంకులు లేకుండా దర్యాప్తు చేసుకునే వీలుంటుంది. ఏమేం కేసులు డీల్ చేస్తోంది? గతంలో హైదరాబాద్లో చోటు చేసుకున్న మక్కామసీదు, గోకుల్చాట్, లుంబినీపార్క్, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. 2012లో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ మావోయిస్టు దళానికి చేరవేస్తున్న రూ.50 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు. 2017 ఆగస్టు లో రాంచి రైల్వేస్టేషన్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ సత్వాజీ తమ్ముడు నారాయణ తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఏపీలోని అరకులో గతేడాది సెప్టెంబర్ 23న ఎమ్మెల్యే కిలారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన కేసు కూడా ఎన్ఐఏకు బదిలీ అయింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న నగదు అక్రమ రవాణా, చెలరేగే హింసలను బట్టి, కేసుల తీవ్రత ఆధారంగా వీటిని స్థానిక పోలీసులు లోతైన దర్యాప్తు కోసం ఎన్.ఐ.ఏకి బదిలీ చేయనున్నారు. -
ఎన్నికల వేళ... ‘మావో’ల అలజడి!
సాక్షి, కొత్తగూడెం: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్య ప్రాంతం నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని ప్రధాన పట్టణాల వరకు కార్యకలాపాలు విస్తరించేందుకు మావోయిస్టులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గత ఏడాది కాలంగా తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎడతెగని పోరు నడుస్తోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు పేల్చిన మందుపాతరల కారణంగా పలువురు భద్రతా బలగాల సిబ్బంది మరణించారు. కొందరు ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను మావోలు హత్య చేశారు. ఈ క్రమంలో గత డిసెంబర్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలోనూ అనేక విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడ్డారు. సరిహద్దుకు అవతల వైపు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాల్లో నిరంతరం పోలీసులు మావోయలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దండకారణ్యం దద్దరిల్లుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి తెలంగాణలోని భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్), ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాల వరకు మావోలు విధ్వంస కార్యకలాపాలకు మావోలు పాల్పడుతున్నారు. మూడు నెలల క్రితం విశాఖపట్టణం జిల్లా అరకు సమీపంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హత్య చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఐదు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మావోయిస్టులు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసేందుకు, సరిహద్దు అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ నుంచి దాటి వివిధ జిల్లాల్లోని మైదాన ప్రాంతాలకు చొచ్చుకుని వచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు... లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందు నుంచే మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలంటూ తమ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్రా–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో వరుసగా ప్రకటనలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను మంగళవారం వదిలారు. బూర్గంపాడు మండలంలోని పారిశ్రామిక పట్టణమైన సారపాకలోని గాంధీనగర్, సినిమాహాల్ సెంటర్లోని బల్లలపై పోస్టర్లు వదిలారు. ములకలపల్లి మండలంలోని సీతారాంపురంలో కరపత్రాలు, పోస్టర్లు కనిపించాయి. పాల్వంచ మండలంలోని జగన్నాధపురం, కేశవాపురం గ్రామాల వద్ద పోస్టర్లు వేశారు. చర్ల మండలంలోని ఆంజనేయపురం, ఆర్.కొత్తగూడెం, లక్ష్మి కాలనీ గ్రామాల్లో కరపత్రాలు వేశారు. ములుగు జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం–వాజేడు ప్రధాన రహదారిపై మావోయిస్టు పార్టీ వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ పేరుతో బ్యానర్ వదిలారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నాయి. కొత్తగా వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ పేరుతో బ్యానర్ వేయడం గమనార్హం. మావోయిస్టులు కొరియర్ వ్యవస్థను పెంచుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ నెల 19వ తేదీన సుదీర్ఘ లేఖ విడుదలైంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి జగబంధు పేరుతో మరో లేఖ విడుదలైంది. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి వికాస్ పేరుతో ఈ నెల మొదటి వారంలో ప్రకటన వెలువడింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ప్రకటన వెలువడింది. మావోయిస్టు పార్టీ పేరుతో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పద్మగూడెం, కమలాపురం గ్రామాల వద్ద పోస్టర్లు పడ్డాయి. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో విడుదలైన ప్రకటనలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య ప్రస్తావన ఉంది. ఎన్కౌంటర్ తాజాగా, మంగళవారం భద్రాచలం ఏజెన్సీ సరిహద్దులోని సుక్మా జిల్లా చింతల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమవుతూ సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. దండకారణ్యంలో నిరంతరం కూంబింగ్ సాగిస్తున్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. -
ఆపరేషన్ అర్బన్ మావోయిజం
సాక్షి, హైదరాబాద్: అడవుల్లో పట్టుకోల్పోతున్నాం.. కంచుకోటలనుకున్న ప్రాంతాలపై పట్టు సడలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధాంతాన్ని బతికించుకోవాలంటే ఏం చేయాలి? ఇదీ 14 ఏళ్లకు ముందే మావోయిస్టులు, వారి సిద్ధాంతకర్తల మధ్య జరిగిన మేధోమథనం. ఇందులో నుంచి పుట్టిందే ‘అర్బన్ మావోయిజం’. నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న సంఘటిత, అసంఘటిత వర్గాలను ఏకంచేసి ఉద్యమాలు నిర్వహించడమే ఈ వ్యూహం. 14 ఏళ్ల క్రితం మావో యిస్టులు రచించిన ఈ వ్యూహం.. గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయం మాత్రం పోలీసుల రాడార్లోకి వచ్చింది ఈ ఏడాది జనవరిలోనే. భీమా–కోరేగావ్ ఘటన తర్వాత మహారాష్ట్ర పోలీసుల విచారణలో వెల్లడైన ఈ ‘గోల్డెన్ కారిడార్’వ్యవహారం.. ఏపీ, తెలంగాణ పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. మావోయిస్టులంటే అడువుల్లోనే ఉండాలి.. పోలీసులు, ప్రజాప్రతినిధులపై దాడులు చేయాలన్న ఆలోచననుంచి కాస్త విభిన్నంగా.. నగరాలు, పట్టణాల్లో సైతం ఉద్యమాల నిర్వహణకు కార్యరూపం దాలుస్తున్నట్టు వరుసగా అర్బన్ మావోయిస్టుల అరెస్టులతో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈ వ్యవహారంలో జరిగిన వరుస అరెస్టులతో.. పోలీస్ శాఖకు స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అర్బన్ మావోయిజం మావోయిస్టు పార్టీ 2004లో తీసుకున్న కీలక నిర్ణయం అర్బన్ నక్సలిజం. నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర వర్గాలను ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం రూపంలో తమకు అనుకూలంగా మార్చుకోవలన్నది ఈ వ్యూహం వెనక ఉద్దేశమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పద్నాలుగేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయం 2018 వరకు బయటకు రాకపోవడం యావద్భారత పోలీసు వ్యవస్థను ఆందోళనకు గురిచేసింది. ఇటీవల గుజరాత్లో ప్రధాని మోదీ అ«ధ్యక్షతన జరిగిన అఖిలభారత డీజీపీల సదస్సులో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. భీమా–కోరేగావ్ వ్యవ హారంలో మావోయిస్టు పార్టీకి పౌర హక్కుల నేతలు సహకరిస్తున్నారని.. వీరి ద్వారా నగరాలు, పట్టణాల్లో విద్యార్థులు, కార్మికులు, దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపిస్తున్నారని పుణే (మహారాష్ట్ర) పోలీసులు ఆధారాలు సేకరిం చారు. అందులో భాగంగా మోదీ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలతో పౌరహక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా, అరుణ ఫెరీరాలపై వివిధ అభియోగాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, చత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్ తదితర రాష్ట్రాల పోలీసులను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. చాపకింద నీరులా అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు నిధుల సమీకరణ, విప్లవ సాహిత్యం ప్రచురణ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని హెచ్చరించింది. ‘గోల్డెన్ కారిడార్’వ్యూహంతో.. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్చేసింది. వీరంతా నల్గొండ జిల్లాకు చెందిన వారు. వీరు ముంబైలోని పారిశ్రామిక ప్రాంతమైన కామ్రాజ్నగర్, విక్రోలి, రాంబాయి అంబేద్కర్నగర్లో నివాసం ఉంటూ అక్కడ వలస కార్మికులుగా ఉన్న తెలంగాణ వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపించినట్టు గుర్తించారు. ఈ ఏడుగురికి.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సత్సంబంధాలున్నట్లు వెల్లడైంది. వీరి నుంచి భారీగా మావోయిస్టు పార్టీ విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. అయితే వీరంతా అర్బన్ మావోయిజం వ్యూహంలో భాగంగా ఏర్పడిన గోల్డెన్ కారిడార్ కమిటీలో పనిచేస్తున్నారని, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులను మావోయిస్టు పార్టీలో చేర్పించి.. ఉద్యమాలు, విధ్వంసకాండ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. తాజాగా.. నక్కా వెంకట్రావ్! అర్బన్ మావోయిజం వ్యవహారం ఏమాత్రం బయటకు పొక్కకుండా వ్యూహాత్మకంగా సాగుతోందని గుర్తించిన నిఘా వర్గాలు.. తాజాగా మరో తెలుగు వ్యక్తి, ఎన్జీఆర్ఐ(జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ)లో టెక్నికల్ ఉద్యోగి నక్కా వెంకట్రావ్ను అరెస్టు చేశాయి. ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో ఈ అరెస్టు జరిగింది. ఈ ఘటన తెలంగాణ, ఆంధప్రదేశ్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. వెంకట్రావ్ నుంచి డిటోనేటర్లు, మావోయిస్టు సాహిత్యం, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈయన రాడికల్ స్టూడెంట్ యానియన్లో 80వ దశకం నుంచే క్రియాశీలకంగా ఉన్నారని.. ఇటీవల అరెస్టయిన మావోయిస్టు కీలక నేత కుమార్ సాయి అలియాస్ పహీద్ సింగ్తో వెంకట్రావ్కు సంబంధాలున్నట్టు గుర్తించామని దుర్గ్ ఐజీ జీపీ సింగ్ స్పష్టంచేశారు. అయితే వెంకట్రావ్ జార్ఖండ్, చత్తీస్గఢ్ల్లో అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టు నెట్వర్క్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు గుర్తించారు. వరుసగా అర్బన్ మావోయిజం దేశవ్యాప్త లింకులు వెల్లడవడం.. దీనికితోడు అరెస్టయిన వారంతా తెలుగువారే కావడం ఈ రెండు రాష్ట్రాల పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. మన సంగతేంటి? ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు, మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టవడంపై చర్చ జరుగుతుండగా, తెలంగాణలో పరిస్థితి ఏంటన్న దానిపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల వేళ అలజడులకు అవకాశం ఇవ్వకుండా పనిచేసిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు పూర్తిస్థాయిలో అర్బన్ మావోయిజం వ్యవహారంపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్, జీఆర్డీ (గ్రామ రక్షక దళాలు), మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న పలు కమిటీల కీలక సభ్యులపై దృష్టి సారించినట్టు తెలిసింది. యూనివర్సిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, దళిత సంఘాలు, కుల సంఘాల్లో ఉన్న కొంత మందిని ఉద్యమం వైపు ప్రేరేపించి నియామకాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పీడిత, బాధిత వర్గాలను అర్బన్ మావోయిజం వైపు ఆకర్శించేదిశగా పలువురు అర్బన్ మావోయిస్టు మేధావులు పనిచేస్తున్నారని.. వారిపైనా నిఘా పెట్టామని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో పేర్కొన్నారు. చాపకింద నీరులా కొనసాగుతున్న ఈ వ్యవహారం కొంత ఆందోళన పెడుతున్నప్పటికీ.. కట్టడి చేసేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నామని ఆయన సోమవారం వెల్లడించారు. -
టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా.. మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్?
సాక్షి, వరంగల్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ములుగు, మంథని, మణుగూరు ఏరియాల్లో నేతలే టార్గెట్గా మావోయిస్ట్ యాక్షన్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ములుగులో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ మెంబర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమపై జరిపిన దాడి తరహాలో మరో దాడికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి, రెక్కీకి టీమ్ వచ్చినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి చందూలాల్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, ఇతర టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా మూడు యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఒకరు పోలీసులకు చిక్కడంతో మిగతా వారికోసం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యాక్షన్ టీమ్ సభ్యుడు చిక్కడంతో నేతలకు ప్రమాదం తప్పింది. మావోయిస్టుల టార్గెట్స్ని పోలీసులు అప్రమత్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో గులాబీ నేతలకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు. -
శాసనసభ్యులకు మరణదండన
బరంపురం : ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేగిన ఆంధ్ర రాష్ట్రంలోని అరకు ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏలను మావోయిస్టులు హత్య చేసిన హింసాత్మకమైన సంఘటన అనంతరం ఇక ఒడిశా రాష్ట్ర ప్రజా ప్రతినిధులపై మావోయిస్టుల కన్ను పడినట్లు తెలుస్తోంది. గంజాం, కొందమాల్ జిల్లా సరిహద్దుల్లో వెలిసిన మావోయిస్టుల బ్యానర్ల ద్వారా రాష్ట్రంలో గల ముగ్గురు ఎంఎల్ఏలను హత్య చేస్తామని హెచ్చరించిన విధానం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన అవిభక్త గంజాం, కొందమాల్ జిల్లాల సరిహద్దు బంజనగర్లో సోమవారం వెలిసిన మావోయిస్టు పోస్టర్లు, బ్యానర్ల ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు ఈ హెచ్చరికలను గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టు బ్యానర్లలో హెచ్చరించి రాసిన విధానం చూస్తే ఒడిశాకు చెందిన ముగ్గురు ఎంఎల్ఏల్లో గంజాం జిల్లాకు గల ఇద్దరు ఎంఎల్ఏలు, కొందమాల్ జిల్లాలో గల ఒక ఎంఎల్ఏగా గుర్తించినట్లు గంజాం ఎస్పీ బ్రజేష్ కుమార్ రాయ్ తెలియజేస్తున్నారు. ఈ ముగ్గురు ఎంఎల్ఏలు ఎవరనేది తెలియజేసేందుకు ఎస్పీ నిరాకరిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు ఎంఎల్ఏలు ఎవరనేది నిఘా విభాగం దగ్గర సమాచారం ఉందని కూడా ఎస్పీ మీడియాకు తెలియజేస్తున్నారు. గంజాం, కొందమాల్ జిల్లా బంజనగర్ పోలీస్ స్టేషన్ పరిధి దాదారలుండా జంక్షన్లో మావోయిస్టుల బ్యానర్లు దర్శనమిచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి స్వాధీనం చేసుకున్న మావోయిస్టు బ్యానర్లలో గంజాం జిల్లాకు చెందిన ఇద్దరు, కొందమాల్ జిల్లాకు చెందిన ఒక ఎంఎల్ఏను హత్య చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసు ఇన్ఫార్మర్లను, పోలీస్స్టేషన్ ఐఐసీ అధికారులను కూడా హత్య చేస్తామని బ్యానర్లలో సీపీఐ మావోయిస్టు పేరుతో స్పష్టంగా ఉంది. గంజాం జిల్లాలోని బంజనగర్ నుంచి కొందమాల్ జిల్లా పుల్బణి మధ్య జాతీయ రహదారిలోను, దరింగబడి, కనబంద రహదారి మధ్య వరుసగా వెలిసిన సీపీఐ మావోయిస్టు పోస్టర్లలో గల మొదటి లైన్లో పోలీసు ఇనఫార్మర్లకు మరణ దండన, రెండో లైన్లో గంజాం జిల్లాలో గల ఇద్దరు ఎంఎల్ఏలు, మూడో లైన్లో కొందమాల్ జిల్లాకు చేందిన ఒక ఎంఎల్ఏకు మరణ దండన విధిస్తున్నట్లు స్పష్టంగా ఉంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇటువంటి మావోయిస్టుల హెచ్చరిక పోస్టర్లతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారగా మరోవైపు స్థానికంగా భయానక వాతావరణం అలుముకుంది. మావోయిస్టుల బ్యానర్లతో స్థానికులు నోరు విప్పేందుకు కూడా నిరాకరిస్తు భయం భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. మరోవైపు మావోయిస్టు బ్యానర్లను స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పట్టు సాధించేందుకు: ఒకప్పుడు మావోయిస్టుల దుర్గంగా ఉన్న గంజాం, కొందమాల్ జిల్లా సరిహద్దు గుముసర అటవీ ప్రాంతం మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పండా అరెస్టు అనంతరం మూడేల్ల పాటు పట్టు కోల్పోయిన మావోయిస్టులు తిరిగి ఇప్పుడు మళ్లి కొందమాల్లో కార్యకలాపాలను కొనసాగించడానికి వ్యూహ రచనలు చేస్తున్నారా? చాపకింద నీరులా కొత్త దళాలను ఏర్పాటు చేస్తున్నారా? అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకున్నారా? గంజాం, గజపతి, నయాగడ, రాయగడ జిల్లా సరిహద్దులను కారిడార్గా చేసుకుని కొందమాల్ జిల్లాలో తిష్ఠ వేశారా? పోలీసులు, భద్రత దళాలను లక్ష్యంగా ఎంచుకున్నారా..? ఈ ప్రశ్నలకు సమాధానం గంజాం, కొందమాల్ జిల్లాల మధ్య రహదారిలో వెలసిన మావోయిస్టు బ్యానర్లే నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కొద్ది రోజులుగా కొందమాల్ జిల్లాలో తరచూ జరుగుతున్న మావోయిస్టుల సంఘటనలే ఇందుకు రుజువుగా నిలుస్తున్నాయి. బల్లిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొమనకుల పంచాయతీ, కొంబలోడు గ్రామం దగ్గర పోడుకొట్ట ఘాటీ దట్టమైన ఆటవీ ప్రాంతంలో అదివారం అర్ధరాత్రి కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లి తిరిగి వస్తున్న ఎస్ఓజీ జవాన్లపై ఛత్తీస్గఢ్ మావోయిస్టులు తెగబడి విరోచితంగా కాల్పులు జరిపిన దాడిలో ఒక ఎస్ఓజీ జవాన్ మరణించగా మరో 7గురు ఎస్ఓజీ జవాన్లు తీవ్ర గాయాలపాలైన సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు నిజమనే స్పష్టం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ మావోయిస్టు నాయకులు కొన్ని మావోయిస్టు అనుసంధాన సంస్థలతో కలిసి కొందమాల్, గంజాం, గజపతి, బౌధ్, కలహండి జిల్లాలను కలుపుకుని ఒక కొత్త దళంగా ఏర్పడి కొందమాల్ జిల్లాను దుర్గంగా మలుచుకుని ఛత్తీస్గఢ్ మావోయిస్టులు తిష్ఠ వేసినట్లు పోలీసుల్లో అనుమానాలు రేగుతున్నాయి. కొనసాగుతున్న కూంబింగ్ గంజాం, కొందమాల్ జిల్లా బంజనగర్ పోలీస్ స్టేషన్ పరిధి దాదారలుండా జంక్షన్లో ఒడిశాకు చెందిన ముగ్గురు ఎంఎల్ఏలను హత్య చేస్తామని హెచ్చరిస్తూ వెలసిన మావోయిస్టుల బ్యానర్లతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఉల్కిపడ్డారు. ఈ నేపథ్యంలో గజపతి, కొందమాల్, గంజాం జిల్లాల సరిహద్దుల్లో, బల్లిగుడ, రైకియా, బమ్ముణిగామ్, దరింగబడి, గజలబడి, కటింగియా, పాణిగొండా అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహాయంతో సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. -
టీడీపీ నేతలను మన్యం నుంచి తరిమికొట్టాలి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జిత్తులమారి చంద్రబాబునాయుడు, అతని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుని అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటున్నట్టుగా రాష్ట్రం వెలిగిపోవడం లేదన్నారు. బుధవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో.. క్వారీల ముసుగులో మన్యాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ నాయకులను మన్యం నుంచి తరమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు 2019లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల జీవన పరిస్థితి దిగజారిందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. విశాఖ డివిజన్లో అత్యధికంగా అనధికారిక క్వారీలు నడుస్తున్నాయన్నారు. అనకాపల్లి మండలం సీతానగరం రెవెన్యూ పరిధిలో వెంకుపాలెం పంచాయతీ సర్వే నెంబర్ 193లో 2.7 ఎకరాలు, సర్వే నెంబర్ 251లో 7.5 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో నిబంధనలు ఉల్లంఘించి దర్జాగా క్వారీ పనులు చేస్తున్నారన్నారు. టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు పీలా గోవింద, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, కిడారి సర్వేశ్వరరావు, అతని బంధువు బుక్కా రాజేంద్ర, కిమిడి రాంబాబు ఇష్టారాజ్యంగా క్వారీల్లో బ్లాస్టింగ్లు చేస్తున్నారన్నారు. దీని వల్ల వందల ఎకరాల్లో భూములు సాగుకు దూరమయ్యాయన్నారు. గూడెం మండలం గుమ్మిరేవుల సమీపంలో నల్ల మెటల్ క్వారీలో పేలుళ్లకు వాడే మూడు రకాల రసాయనాల కారణంగా అక్కడ చెరువు కలుషితమై 2,050 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. క్వారీల మూలంగా అనకాపల్లి డివిజన్లో పదిమంది, మన్యంలో ఆరుగురు మరణించారన్నారు. గాలిలో దీపం గిరిజనుల ఆరోగ్యం జిల్లాలో ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 290 మలేరియా, 1100 టైఫాయిడ్, 21,800 డయేరియా, 1,660 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. మన్యంలో వైద్యులు అందుబాటులో లేక గిరిజనుల పరిస్థితి గాలిలో దీపంలా మారిందన్నారు. కడుపు నింపే పౌష్టికాహారం లేక పిట్టాల్లా రాలిపోతున్నారన్నారు. అధికారాన్ని, పదవులను, ధనబలాన్ని అడ్డంపెట్టుని 1/70 చట్టం, పెసాలో 5, 6 షెడ్యూల్, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ ద్రోహులుగా మారిన పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి, మణికుమారి, ఎం.వి.వి.ప్రసాద్, నాగరాజు, అయ్యన్నపాత్రుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను బాక్సైట్, ఈవో 97, ఏపీఎప్డీసీ కాఫీ తోటల పంపకం లాంటి అంశాలపై నిలదీయాలని గిరిజనులను కోరారు. బీజేపీ, టీడీపీ నాయకుల ఇళ్లను ముట్టడించాలని, మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యేలు ఈశ్వరి, పీలా గోవిందతోపాటు రాంబాబు, రాజేంద్ర, నాగరాజు, ప్రసాద్, మణికుమారిలను తరమికొట్టాలని కోరారు. దున్నేవాడిదే భూమి, ఆదివాసీలకే అటవీ హక్కు, గ్రామరాజ్య కమిటీలకే సర్వాధికారం అనే నినాదాలతో మావోయిస్టుల ఆధ్వర్యంలో భూస్వామ్య, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారి వర్గంపై మూడు రకాల పోరాటం ఉధృతం చేయాలన్నారు. -
మాజీ మావోయిస్టు ఆత్మహత్య
లింగాల (అచ్చంపేట): కుటుంబ కలహాల వల్ల మాజీ మావోయిస్టు గుండూరు రమాకాంత్ అలియాస్ శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం హజిలాపూర్కు చెందిన రమాకాంత్ కొన్నేళ్ల క్రితం పీపుల్స్వార్ గ్రూపు (ప్రస్తుత మావోయిస్టు)లో దళ కమాండర్గా, మహబూబ్నగర్ జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశాడు. అప్పట్లోనే బల్మూర్ మండలం కొండనాగులకు చెందిన మావోయిస్టు దేవేందరమ్మ అలియాస్ రజితను ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత దంపతులిద్దరూ 2007లో జనజీవన స్రవంతిలో కలిశారు. అప్పటి నుంచి కల్వకుర్తిలో చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఇటీవల కాలంలో కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కలహాలు చోటుచేసుకోవడంతో 5 రోజుల క్రితం అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం తన భార్య అక్క ఈశ్వరమ్మ ఉంటున్న అంబట్పల్లికి సోమవారం వెళ్లగా రజిత అక్కడ కనిపించలేదు. దీంతో మనస్తాపానికి గురైన రమాకాంత్ పురుగుల మందు తాగగా స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు’అని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం హజిలాపూర్కు తరలించి పోలీస్ బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్నో ఘటనలు.. పీపుల్స్వార్లో కొనసాగిన సమయంలో రమాకాంత్ అనేక ఘటనల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీసు స్టేషన్ల ధ్వంసం, రాజకీయ నాయకులు, ఎస్పీ హత్య ఘటనలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. 1993లో అప్పటి ఎస్పీ పరదేశీనాయుడు, 2004లో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి హత్యతో ఆయనకు సంబంధాలున్నాయని తెలిపారు. అచ్చంపేట, అమ్రాబాద్ పోలీసు స్టేషన్ల పేల్చివేతలో పాలుపంచుకున్నాడని వెల్లడించారు. -
ఛత్తీస్గఢ్: సుకుమా జిల్లాలో ఎన్కౌంటర్
-
ఛత్తీస్లో ముగ్గురు మావోల ఎన్కౌంటర్
పర్ణశాల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుక్మా ఎస్పీ అభిషేక్మీనా కథనం ప్రకారం.. మావోలు సంచరిస్తున్నారనే సమాచారంతో ఫుల్బగ్డీ పోలీస్స్టేషన్కు చెందిన డీఆర్జీ బలగాలు మల్కగూడ– ముల్లూరు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. మావోలు, పోలీసులు ఒకరికొకరు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య గంటసేపు కాల్పులు జరిగాయి. ఘటనాస్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు, నాలుగు తుపాకులు, పైప్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోలను ముల్లేర్కు చెందిన మడివి హిడ్మా, కర్తాటి మల్లా, హర్ది హరియాలుగా గుర్తించారు. పట్టుబడిన మావోయిస్టును రవ్వా భీమాగా గుర్తించారు. విద్యార్థి కిడ్నాప్?: సుక్మా జిల్లాలో మంగళవారం మావోయిస్టులు కళాశాల విద్యార్థిని అపహరించినట్లు తెలిసింది. కుంట సబ్ డివిజన్ పరిధిలోని ముర్లిగూడకు చెందిన పొడియం ముకేష్ స్థానిక ఆశ్రమ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. కుంటకు సమీపంలోని భెజ్జిలో ఉన్న బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలోని అటవీ ప్రాంతంలో కిడ్నాప్ చేసినట్టు సమాచారం. -
మావోయిస్టుల కుట్ర భగ్నం..!
రాయ్పూర్ : అరకు టీడీపీ నేతలపై కాల్పులు జరిగిన 24 గంటలు గడవకముందే మావోయిస్టులు మరో భారీ పేలుళ్లకు సిద్దపడ్డారు. ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేసిన మందుపాతర్లను పోలీసులు భగ్నం చేశారు. అరకు ఘటన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కూంబింగ్ చేపట్టిన బలగాలు మందుపాతర్లను గుర్తించారు. నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురు మవోయిస్టులను పొలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా టీడీపీ నేతల హత్య అనంతరం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మవోయిస్టులు ప్రాబల్య ప్రాంతాల్లో అదనపు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాల ఆధ్వర్యంలో పోలీసులు జల్లడపడుతున్నారు. చదవండి : తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం -
ఛత్తీస్లో నలుగురు మావోల ఎన్కౌంటర్
పర్ణశాల(భద్రాచలం): తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మహిళా దళ కమాండర్తో పాటు ముగ్గురు సభ్యులు మృతి చెందారు. జిల్లా ఎస్పీ జితేంద్ర శుక్లా కథనం ప్రకారం.. కుకడాంజోర్ పోలీస్స్టేషన్ పరిధి గుమియాబెడా ఆడవుల్లో కూంబింగ్ జరుపుతున్న జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు సమీపంలోని దట్టమైన అడవిలోకి పారిపోయారు. అనంతరం ఘటన స్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు నాలుగు తుపాకులు, డిటొనేటర్లు, విద్యుత్ తీగలు, బ్యాటరీలు, నిత్యావసర వస్తువులు, పేలుడు పదార్థాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దళ కమాండర్ రత్త జార, దళ సభ్యుడు సోములను గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వీరిద్దరి తలలపై రూ.5లక్షల వరకు రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. కాంకేర్ జిల్లాలో ఇద్దరిని చంపిన మావోయిస్టులు: కాంకేర్ జిల్లా బందె పోలీస్స్టేషన్ పరిధిలో తాడంవెలి గ్రామం నుంచి మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతంలోని తాడ్గూడ రోడ్డులో కనిపించాయి. ఆగస్టు 26వ తేదీన సోను పధా(35), సోమ్జీ పధా(40)తోపాటు పాండురాం అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. పాండురాం తప్పించుకోగా సోను, సోమ్జీలను మావోయిస్టులు గొంతుకోసి చంపారు. ఇన్ఫార్మర్ల నెపంతోనే వారిని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
అరెస్టుల పర్వం!
దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు, దాడులు నిర్వహించి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అయిదుగురు నాయకులు–హైదరాబాద్లో విప్లవ రచయిత వరవరరావు, ముంబైలో హైకోర్టు న్యాయవాదులు వెర్నాన్ గోన్సాల్వెస్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్లో కార్మిక సంఘం నాయకురాలు సుధా భరద్వాజ్, న్యూఢిల్లీలో పౌరహక్కుల నాయకుడు గౌతం నవల ఖాలను మహారాష్ట్రకు చెందిన పూణె పోలీసులు అరెస్టు చేశారు. పుణెకు సమీపంలోని భీమా– కొరెగావ్లో గత ఏడాది డిసెంబర్ 31న దళిత వీరుల సంస్మరణ సభకు ముందూ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఉదంతాలకు సంబంధించి సాగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్టులు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఆ ఉదంతాలతో మావోయిస్టు పార్టీకి సంబంధం ఉన్నదని, ఇప్పుడు అరెస్టయినవారంతా ఆ పార్టీతో సంబంధాల్లో ఉన్నవారేనని వారి అభియోగం. అంతే కాదు... భీమా–కొరెగావ్ తదనంతర పరిణామాల గురించి దర్యాప్తు చేస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టు పార్టీ పన్నిన కుట్ర వెల్లడైందంటున్నారు. ఈ అయిదుగురి అరెస్టుతో పాటు న్యాయవాది సుసాన్ అబ్రహాం(ముంబై), ఫాదర్ స్టాన్ స్వామి(రాంచీ), ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే(గోవా), జర్నలిస్టు క్రాంతి టేకుల(హైదరాబాద్) ఇళ్లలోనూ, వరవరరావు ఇద్దరు కుమా ర్తెల ఇళ్లలోనూ కూడా సోదాలు చేశారు. ఇప్పుడు అరెస్టయిన అయిదుగురూ రహస్య జీవితం గడుపుతున్నవారు కాదు. వారి వారి రంగాల్లో లబ్ధప్రతిష్టులుగా కొనసాగుతూ, హక్కుల ఉల్లంఘనలపై నిలదీస్తున్నవారు. ఆ విష యంలో తప్ప వీరిలో చాలామందికి సంస్థాగతంగా కావొచ్చు...విశ్వాసాలరీత్యా కావొచ్చు ఏకాభి ప్రాయం లేదు. వరవరరావు విప్లవ సాహిత్యోద్యమంలో దాదాపు అర్ధ శతాబ్ది నుంచి పని చేస్తు న్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) సంస్థాపక సభ్యుడాయన. మావోయిస్టు పార్టీతో సంబం ధాలున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వం నిషేధించిన సంస్థల్లో విరసం లేదు. గోన్సాల్వెస్, అరుణ్ ఫెరీ రాలు న్యాయవాద వృత్తిలో ఉంటూ పౌరహక్కులకు సంబంధించి బలమైన గొంతు వినిపిస్తున్న వారు. మొన్న జూన్లో ఈ ఉదంతానికి సంబంధించే అరెస్టయిన అయిదుగురు సభ్యుల తరఫున న్యాయస్థానాల్లో వాదిస్తున్నారు. కార్మిక సంఘం నాయకురాలు సుధా భరద్వాజ్ వృత్తి రీత్యా న్యాయ వాది. సోషలిస్టు నాయకుడు స్వర్గీయ శంకర్ గుహ నియోగి స్థాపించిన ఛత్తీస్గఢ్ ముక్తి మోర్చాలో చురుగ్గా పనిచేసి ప్రస్తుతం భిలాయ్ గని కార్మిక సంస్థ నాయకురాలిగా, పీయూ సీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. ఢిల్లీలో అరెస్టయిన గౌతం నవలఖా పౌరహక్కుల రంగంలో పనిచేస్తు న్నారు. చరిత్రలో భీమా–కొరెగావ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 200 ఏళ్లక్రితం ఆధిపత్య కులాలపై పోరాడి విజయం సాధించిన దళిత వీరుల స్మారక చిహ్నం అక్కడుంది. భీమా–కొరెగావ్ పోరాట ద్విశత జయంతి కావడంతో నిరుడు డిసెంబర్లో జరిగిన సదస్సుకు భారీ యెత్తున దళితులు హాజ రయ్యారు. సదస్సు జరిగిన రోజే ఘర్షణలు చెలరేగి దళిత యువకుడు చనిపోయాడు. మరికొందరు గాయపడ్డారు. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఉదంతాలకు సంబంధించి గత మార్చిలో సమతా హిందూ అఘాదీ అధ్యక్షుడు మిలింద్ ఎక్బోటేను అరెస్టుచేశారు. ఆయన బెయిల్పై విడుదల య్యారు. ఈ కేసు అతీగతీ ఏమైందో తెలియదుగానీ... ఆ సదస్సులో ప్రసంగించిన వక్తలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయటం వల్లే హింస చెలరేగిందని పోలీసులు ఆరోపించారు. అనంతరం మొన్న జూన్లో దళిత కార్యకర్త సుధీర్ ధవాలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, హక్కుల కార్యకర్త మహేష్ రౌత్, ప్రొఫెసర్ షోమా సేన్, రాజకీయ ఖైదీల హక్కుల కమిటీ నాయకుడు రోనా విల్సన్లను అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టయిన వారుగానీ, ఇంతక్రితం అరెస్ట యినవారుగానీ భీమా–కొరెగావ్ సదస్సుకు వెళ్లలేదు. ఆ సదస్సును రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబే డ్కర్తోబాటు ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పీబీ సావంత్, జస్టిస్ కోల్సే పాటిల్ నిర్వహించారు. ఆ ముగ్గురినీ ఇంతవరకూ పోలీసులు ప్రశ్నించనే లేదు! ప్రధాని హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణ అసాధారణమైనది. దాన్ని తేలిగ్గా తీసుకోవాలని ఎవరూ అనరు. కానీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మొదలుకొని పలువురు మాజీ న్యాయమూర్తులు, కొందరు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారుల వరకూ ఆరోపణకు ఆధారంగా చూపుతున్న లేఖను కొట్టిపారేశారు. అది నమ్మశక్యంగా లేదన్నారు. వారి అభిప్రాయాల సంగతలా ఉంచి ఆరోపణలొచ్చినప్పుడు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా పిలిపించి ప్రశ్నించే అధి కారం పోలీసులకుంటుంది. ఆ తర్వాత వారిని అరెస్టు కూడా చేయొచ్చు. ఆరోపణల్లోని నిజా నిజాలు కోర్టులు తేలుస్తాయి. అయితే ఆ ప్రక్రియకు కూడా ఒక విధానమంటూ ఉంటుంది. ఈ అయిదుగురి అరెస్టులోనూ పోలీసులు అది పాటించినట్టు కనబడదు. అరెస్టు చేసినప్పుడు వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలతో రాసే పంచనామా రిపోర్టు నిందితులకు తెలిసిన భాషలోనే ఇవ్వాలి. ఇద్దరు స్థానికులు సాక్షులుగా ఉండాలి. లేఖ బయటపడ్డాక ఏడు నెలలపాటు దర్యాప్తు సాగించిన పోలీసులు ఇలాంటి నిబంధనలు పాటించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కారణాలు చూపే ఢిల్లీ హైకోర్టు గౌతం నవలఖానూ, పంజాబ్ హర్యానా హైకోర్టు సుధా భర ద్వాజ్నూ పుణెకు తీసుకెళ్లేందుకు పోలీసులను అనుమతించలేదు. వరవరరావు విషయంలో సైతం ఈ నిబంధన బేఖాతరైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మొదలుకొని చరిత్రకారుడు రామ చంద్ర గుహ వరకూ అనేకమంది ప్రముఖులు ఈ అరెస్టుల్ని ఖండించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వర్తమాన పరిస్థితులను ఎమర్జెన్సీ కాలంతో పోల్చింది. తీసుకునే చర్యలేమైనా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని... విమర్శలకూ, ఆరోపణలకూ అతీతంగా ఉండాలని ప్రభు త్వాలు గుర్తించటం అవసరం. -
దద్దరిల్లిన దండకారణ్యం
సాక్షి, కొత్తగూడెం/చర్ల/పర్ణశాల: సరిహద్దు దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుంట పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోలు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడి భద్రతా సిబ్బందికి చిక్కారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మరికొందరు పారిపోయినట్లు సుక్మా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. తెలంగాణ, ఏపీ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో 200 మంది సీఆర్పీఎ‹ఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కుంట పోలీసుస్టేషన్కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో నులకతుంగ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్కు వెళ్లగా మావోయిస్టులు బలగాలను గమనించి కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. సుమారు గంటకు పైగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా, దళ కమాండర్ సహా 15 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో దళ కమాండర్ వంజం హుంగ, సభ్యులు ముచకి హిడ్మ, మడకం గంగు, హుంగా, ముచకి ముక్క, దాబో, మడకం టెంకో, ముచకి హిడిమా, మడకం సోసా, మడకం హుంగా, ముచకి నందా, సీత ఉన్నారు. మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. ఓ మహిళ సహా నలుగురు మావోలు గాయపడి బలగాలకు చిక్కారు. ఘటనా స్థలంలో మొత్తం 16 ఆయుధాలు పోలీసులకు లభించాయి. వీటిలో 12 నాటు తుపాకులు, ఒక 305, ఒక 12–బోర్, 315–బోర్, పిస్టల్, కత్తి ఉన్నాయి. మృతదేహాలను కుంట పోలీస్స్టేషన్కు తరలించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ముగిసిన రెండు రోజుల్లోనే మావోయిస్టులకు భారీ స్థాయిలో నష్టం జరగడం గమనార్హం. ‘ఛత్తీస్’లో ఇదే భారీ నష్టం.. మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది కోలుకోలేని నష్టం జరిగింది. గత మార్చి 2న బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భద్రతా బలగాలు, మావోయిస్టుల దాడులు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తంగా మారింది. గత ఏప్రిల్ చివరి వారంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏకంగా 40 మంది మావోయిస్టులు మృతి చెందారు. తరువాత ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 8 మంది, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోలు మరణించారు. ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి వద్ద జరిగిన ఘటనలో చర్ల ఏరియా కమాండర్ అరుణ్ మృతి చెందాడు. తాజాగా ప్రస్తుత ఎన్కౌంటర్లో మరో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. తడపలగుట్ట ఎన్కౌంటర్ తరువాత నుంచి ఇప్పటివరకు మావోయిస్టులు ప్రతీకారంగా భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఇతరులను సుమారు 30 మందిని హతమార్చారు. గత 5 నెలల కాలంలో దండకారణ్యంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన పోరులో సుమారు 120 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. వీరిలో 90 మంది మావోయిస్టులు ఉండగా, 30 మంది భద్రతా సిబ్బంది, ఇతరులు ఉన్నారు. పట్టున్న చోటే మావోలకు ఎదురుదెబ్బ మావోయిస్టులకు గట్టి పట్టున్న (లిబరేటెడ్జోన్) ప్రాంతంలోకి దూసుకెళ్లిన జవాన్లు కోలుకోలేని దెబ్బతీశారు. ఈ ప్రాంతానికి జవాన్లు తొలిసారిగా వెళ్లి భారీ ఆపరేషన్ చేపట్టారని నక్సల్స్ ఆపరేషన్ డీజీడీఎం అవస్థి తెలిపారు. సుమారు 20 కిలోమీటర్ల మేర కాలినడకన మూడు కొండలు దాటి మావోయిస్టుల ఆచూకీ కనుగొన్నారని అన్నారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించిన ప్రాంతంలో మావోయిస్టులు 15 మందిని కోల్పోయినట్లుగా తెలుస్తోంది. గోంపాడ్, బాలా తోంగ్, మిన్చా ఏరియాలకు చెందిన మిలిషియా కమిటీలు సంయుక్తంగా క్యాంపు నిర్వహిస్తున్న క్రమంలో జవాన్లు ఒక్కసారిగా చుట్టుముట్టడంతోనే ఈ భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్లు సమాచారం. -
ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల మోత
-
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
చర్ల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కాల్పులు జరిగిన సమయంలో ఒకరిద్దరు నక్సలైట్లు పారిపోయినట్టు తెలుస్తోంది. వారికోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. బైలాడిల్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో దండకారణ్య సబ్ జోనల్ హెడ్ గణేష్ ఉయికే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే సమాచారం మేరకు సుమారు 200 మంది డీఆర్జీ, ఎస్టీఎఫ్, డీఎఫ్ బలగాలకు చెందిన జవాన్లు రెండ్రోజుల క్రితం కూంబింగ్కు వెళ్లారు. ఈ క్రమంలో ఎనిమిది బృందాలుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిన జవాన్లకు దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని తీమ్నార్ ప్రాంతంలో గురువారం ఉదయం 6 గంటలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (యాంటీ నక్సల్స్ ఆపరేషన్) పి.సుందర్రాజ్ తెలిపారు. ఘటనాస్థలం నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు .303 రైఫిళ్లతో సహా 12 బోర్ గన్స్, మరికొన్ని మజిల్ లోడింగ్ గన్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా ఈ సంఘటన నుంచి సబ్ జోనల్ హెడ్ గణేశ్ వుయికే తప్పించుకున్నట్లుగా తెలుస్తోందని బస్తర్ ఐజీ వివేకానంద్ సిన్హా తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలను జిల్లా కేంద్రానికి తరలించి గుర్తించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. -
ఛత్తీస్లో ముగ్గురు నక్సల్స్ ఎన్కౌంటర్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. గత రాత్రి చింతగుఫా పోలీస్స్టేషన్ పరిధి గట్టపాడ్, టోకన్పల్లి గ్రామాల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్ఫోర్స్ సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మూడు తుపాకులు లభ్యమయ్యాయి. మృతులను గుర్తించాల్సి ఉందని ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. -
టార్గెట్ ఆర్కే
ఒకవైపు మావోయిస్టుల కదలికలు.. వారి జాడలు తెలుసుకునేందుకు పోలీసు బూట్ల చప్పుళ్లు.. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యంలో మళ్లీ అలజడి రేపుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన, అలజడి ఒక్క విశాఖ మన్యంలోనే కాదు.. మొత్తం ఏవోబీలోనే ఉద్రిక్తతలు రేపుతోంది. 2016 అక్టోబర్లో రామగుడ ఎన్కౌంటర్ తర్వాత కాస్త తగ్గిన ‘ఎదురు కాల్పుల’ శబ్ధాలు మళ్లీ మోత మోగిస్తున్నాయి. గత రెండు రోజుల్లో చోటు చేసుకున్న రెండు ఎదురుకాల్పుల ఘటనలు.. భద్రతా బలగాల విస్తృత గాలింపు చర్యలు ఏవోబీని గడగడలాడిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) లక్ష్యంగానే ఈ గాలింపు జరుగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులే ఆఫ్ ది రికార్డుగా చెబుతుండటంతో ఈ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కన్పిస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వాస్తవానికి అవిభక్త రాష్ట్రంలో ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటల్లా ఉన్న నల్లమల, తెలంగాణ ప్రాంతాల్లో చాలా ఏళ్ల కితమే పార్టీ దెబ్బతింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర–ఒడిశా బోర్డర్లో మాత్రమే పార్టీ కీలకంగా మారింది. ఇందుకు కేవలం ఆర్కే నాయకత్వమే ప్రధానమనేది వాస్తవం. పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను క్యాడర్లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆర్కేను పోలీసులు టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక్క ఆర్కేను దెబ్బతీస్తే ఏవోబీలో మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టేయొచ్చన్న భావనలోనే పోలీసులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు రామ్గూడ ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మున్నాతో సహా 39మంది మావోయిస్టులను కాల్చి చంపారు. ఆ ఘటనలో త్రుటిలో తప్పించుకున్న ఆర్కే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పట్లో ఆయన్ను దండకారుణ్యానికి తీసుకువెళ్లారన్న ప్రచారం సాగింది. ఆర్కే తప్పించుకున్నా... ఆయన వయస్సు, అనారోగ్యం రీత్యా ఇక ఏవోబీలో పార్టీ కోలుకోవడం కష్టమేనని పోలీసు వర్గాలు అంచనాకొచ్చాయి. అయితే పోలీసుల లెక్కలను తారుమారు చేస్తూ.. మావోలు తొందరగానే కోలుకున్నారు. ఇటీవల మావో దళ సభ్యుడిగా పనిచేసిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ లొంగుబాటు సందర్భంగా చెప్పిన మాటలతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. మళ్లీ ఆర్కే నాయకత్వంలోనే పార్టీ పుంజుకుంటోందని పోలీసులకు ఉప్పందింది. రామ్గూడ ఎన్కౌంటర్ దెబ్బకు దిశానిర్దేశం కోల్పోయిన పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు ఆర్కే జనవరిలో ఏవోబీలోకి వచ్చాడని పోలీసులకు పక్కాగా సమాచారం అందిందింది. ఆర్కే రాకతోనే మళ్లీ మావోలు బలం పుంజుకున్నారు. క్యాడర్ రిక్రూట్మెంట్, వరుస సభలు నిర్వహించడం ద్వారా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఆర్కే లక్ష్యంగా.. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆర్కే పేరిట పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా డీజీపీలు మాలకొండయ్య, రాజేంద్రకుమార్ నాలుగురోజుల కిందట విశాఖలో సమావేశమై ఇరు రాష్ట్రాల పోలీసులకు, ప్రత్యేకించి ఏవోబీ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్కే జాడ కోసం కొద్దిరోజులుగా జాయింట్ ఆపరేషన్గా ఒడిశా, ఏపీ పోలీసు బలగాలు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఆర్కేను సజీవంగా పట్టుకోవడానికి లేదా కూంబింగ్ సమయంలో ఎదురుపడితే ఎన్కౌంటర్ చేసేందుకైనా వెనుకాడకుండా పోలీసులు వ్యూహత్మకంగానే పావులు కదుపుతున్నారు. ఏవోబీలో పోలీసులకు కూడా ఇన్ఫార్మర్ వ్యవస్థ గతం కంటే మెరుగవడంతో మారుమూల అటవీ ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్ కటాఫ్ ఏరియా మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆర్కే ఇక్కడే ఉంటాడనే ఆలోచనతో పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టాయి. పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నా ఆర్కే జాడ తెలుసుకోవడం కష్టసాధ్యమేనని అంటున్నారు.పక్కాగా మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్న ఆర్కేను పట్టుకోవడం పోలీసులకు అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో మూడు రోజులు విస్తృత గాలింపు.. జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ఏవోబీ పరిధిలో కూంబింగ్ నిరంతర ప్రక్రియే అయినప్పటికీ మరో మూడురోజులపాటు విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ వెల్లడించారు. శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ.. 21వ తేదీన మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బంద్ను భగ్నం చేసేందుకు యత్నిస్తామని తెలిపారు. -
తృటిలో తప్పించుకున్న ఆర్కే!
మల్కన్గిరి/సీలేరు (విశాఖ ఏజెన్సీ): ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి జోడాంబు పంచాయతీ పరిధిలోని సిమిలిపోదర్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తృటిలో తప్పించుకు న్నారు. ఉదయం 9 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పరారయ్యారని చెప్పారు. పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఒడిశా డీజీపీ ఆర్పీ శర్మ మాట్లాడుతూ మావోయిస్టుల అణచివేతకు ఛత్తీస్ గఢ్, ఆంధ్ర పోలీసులతో కలిసి ఒడిశా పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. 2016లో రాయగఢ్ ప్రాంతంలో 34 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారని తెలిపారు. ఇటీవల ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దు ల్లో భారీ ఎన్కౌంటర్లు జరిపి 38 మంది మావోయిస్టులను హతమార్చా మని తెలిపారు. మావోయి జాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం నవీన్ పట్నాయక్ మావోయిస్టులకు పిలుపునిచ్చారని తెలిపారు. అందుకోసమే ఆపరేషన్ ఆలౌట్ను మల్కన్గిరి జిల్లా నుంచి ప్రారంభించామని స్పష్టం చేశారు. దీనికోసం గురువారం హెలికాప్టర్లతో సర్వే కూడా చేయించామన్నారు. మల్కన్గిరిలో క్యాంప్లను నిర్వహిస్తామని చెప్పారు. కాగా ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 303 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే..??
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. బలిమెల రిజర్వాయర్ పరిధిలోని జొడాంబో ఏరియా - సిమిలి పొదరల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు నాయకుడు ఆర్కేతో పాటు మరో ఇద్దరు ప్రముఖ నేతలు కూడా ఎదురుకాల్పుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో ఒడిశా పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ బలగాలు ఉన్నాయి. గత నెలలో మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవులు, చత్తీస్గఢ్లోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి ప్రాంతంలో 38 ఏళ్ల క్రితం ప్రారంభమైన గడ్చిరోలి తిరుగుబాటు ఉద్యమం చరిత్రంలో ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్. చదవండి : ముప్పేట దాడిలో 37 మంది మృతి -
ఒడిశాలో ఎన్కౌంటర్ ; ఆరుగురు మావోలు హతం
-
ఒడిశాలో ఎన్కౌంటర్లు.. ఆరుగురు మావోలు హతం
మల్కన్గిరి: ఒడిశాలోని బలంగీర్ జిల్లా కోప్రకోల్ సమితి డుడ్కమాల్ గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు అందిన సమాచారంతో బలంగీర్ ఎస్పీ శివసుబ్రహ్మణ్యం ఆదేశాలతో సీఆర్పీఎఫ్, డీబీఎఫ్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఓ ఇంటి వద్ద రాకేశ్, సంజీవ్ అనే ఇద్దరు మావో కమాండర్లు కనిపించి పోలీసులపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో వారిద్దరూ మృతిచెందారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగించారు. అర్థరాత్రి సమయంలో మరోసారి జరిగిన ఎదురు కాల్పుల్లో మరో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. కాగా, మావోయిస్టు సంజీవ్పై ఒడిశా ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. -
మహారాష్ట్ర , చత్తీస్గడ్ రాష్ట్రాల్లో మారణహోమం
-
ఛత్తీస్ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సల్స్ మృతి
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దున ఉన్న ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్రలో ఇటీవల అతి పెద్ద ఎన్కౌంటర్ సమయంలో తప్పించుకున్న మావోలు కొందరు ఛత్తీస్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఉన్నారనే అనుమానంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో సుకుమా జిల్లాలోని చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల నడుమ గంట పాటు ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన పోలీసులు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గుర్తించారు. ఆయుధాలు, కిట్బ్యాగులు, విప్లవ సాహిత్యం దొరికాయి. మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
మావోలకు మరో ఎదురు దెబ్బ
చర్ల/మల్కన్గిరి: మావోయిస్టులు వరుస నష్టాలు చవిచూస్తున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన సందర్భంగా పలువురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసు యంత్రాంగం.. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం బిజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం పోలీస్స్టేషన్ పరిధిలోని మరిమల అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు పోలీస్ బలగాలపైకి కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో .. ఇద్దరు పురుషులు, ఆరుగురు మహిళా మావోయిస్టులు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. ఘటన స్థలం నుంచి ఒక ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, రివాల్వర్తోపాటు నాలుగు ఎస్బీబీఎస్ తుపాకులు, ఆరు రాకెట్ లాంచర్లు, ఆరు గ్రనేడ్లు, పది కిట్ బ్యాగులు, నాలుగు జతల ఆలివ్ గ్రీన్ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను హెలికాప్టర్లో బిజాపూర్ ఆస్పత్రికి తరలించారు. గాలింపు చర్యల్లో తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. -
కొనసాగుతున్న కూంబింగ్: ప్రాజెక్టుల వద్ద నిఘా
గడ్చిరోలి: మహారాష్ట్ర - చత్తీస్గడ్ సరిహద్దులోని ఇంద్రావతి నది పరిసరాల్లో భద్రతాదళాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతమైన కాళేశ్వరం, మహదేవ్పూర్లలో పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. ప్రాజెక్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కాగా వరుస ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి నదిలో లభ్యమైన మృతదేహాలను మొసళ్లు పీక్కుతిన్నాయి. దీంతో మృతదేహాల గుర్తింపు కష్టమని అధికారులు అంటున్నారు. మృతుల్లో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. తాజాగా ఎన్కౌంటర్లో ఆహెరి, పెరిమిళ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. -
55 రోజుల్లో.. 68 ప్రాణాలు
జిల్లా సరిహద్దులో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. అనుక్షణం యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. పోలీస్ కాల్పులు, మావోయిస్టు దాడులతో గిరిజనం ఆందోళనకు గురవుతోంది. గత 55 రోజుల్లో తడపలగుట్టల్లో 10మంది, గడ్చిరోలిలో 38 మంది మావోయిస్టులు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు. 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఇన్ఫార్మర్లు సహా మొత్తం 20 మందిని మావోయిస్టులు హతమార్చారు. సాక్షి, కొత్తగూడెం : తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, నారాయణపూర్, గడ్చిరోలి జిల్లాల్లో రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిత్యం పేలుళ్ల మోత, తుపాకీ తూటాల చప్పుళ్లతో సరిహద్దు గ్రామాల్లో దడ నెలకొంది. ఆయా రాష్ట్రాల్లోని అధికార బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన 55 రోజుల్లో ఏకంగా 68 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత మార్చి 2వ తేదీన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా, తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం 48 మంది మావోయిస్టులు మృతి చెందారు. తడపలగుట్ట ఎన్కౌంటర్ తరువాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన మావోయిస్టులు అప్పటినుంచి సరిహద్దుల్లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, నారాయణపూర్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో పలు విధ్వంస కార్యకలాపాలు, హత్యలకు పాల్పడుతున్నారు. భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, మొత్తం 20 మందిని హతమార్చారు. మావోయిస్టుల దాడి మృతుల్లో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు బీజాపూర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఒక సర్పంచ్, ఒక కాంట్రాక్టర్, ఒక ఇంజినీర్, ఒక మాజీ కానిస్టేబుల్, ఇద్దరు మాజీ మావోయిస్టులు ఉన్నారు. తాజాగా బుధవారం దంతెవాడ జిల్లా కొవ్వకొండ పరిధిలోని గర్మిరి గ్రామంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్తుడిని హత్య చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఈనెల 25న నిరసనదినంగా చేపట్టాలని మావోయిస్టులు ఈ నెల 24న భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఆంజనేయపురం – చినముసిలేరు గ్రామాల మధ్య పోస్టర్లు, కరపత్రాలను వదిలిపెట్టారు. చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో ఈ పోస్టర్లను విడుదల చేశారు. తాజాగా బుధవారం చర్ల మండలంలోని పెదమిడిసీలేరు వద్ద రోటింతవాగుపై ఉన్న వంతెనను మావోయిస్టులు పేల్చివేశారు. దండకారణ్యం దాటి వచ్చి మరీ ఈ విధ్వంసానికి మావోయిస్టులు పాల్పడ్డారు. భద్రాద్రి, జయశంకర్ జిల్లాల్లో కార్యకలాపాలు.. నోట్ల రద్దు కారణంగా దెబ్బతిన్న మావోయిస్టులు ఆర్థిక వనరులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రాంతం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండు జిల్లాల్లోని గుండాల, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, మహాముత్తారం మండలాల్లో గతంలో తమకు డెన్లుగా ఉన్న గ్రామాల్లో రిక్రూట్మెంట్ల ద్వారా పూర్వవైభవం సాధించేందుకు మావోలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వలస గొత్తికోయల గ్రామాలను సైతం ఇందుకోసం ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. చాపకింద నీరులా తెలంగాణ జిల్లాల్లో విస్తరించేందుకు ఇటీవలే కమిటీలు సైతం వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మావోయిస్టులు పేలుడు పదార్థాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇక్కడి పోలీసుల తనిఖీల్లో పేలుడు పదార్థాలు పట్టుబడడం ఇందుకు నిదర్శనం. మరోవైపు 6 నెలలుగా ఛత్తీస్గఢ్ నుంచి భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల ద్వారా గోదావరి దాటి ఇతర జిలాల్లోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గత నెల 2న తడపలగుట్ట ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దీంతో అప్పటినుంచి సరిహద్దుల్లో నిత్యం యుద్ధ వాతావరణం నెలకొంది. సాధారణంగా భారీగా ఆకురాలే ఎండాకాలంలో మావోయిస్టులు తాము సమాంతర ప్రభుత్వం నడుపుతున్న బస్తర్ దండకారణ్యంలోని అబూజ్మడ్(షెల్టర్జోన్)కు వెళతారు. ఈసారి మాత్రం అనుకున్న సమయానికి మావోలు దండకారణ్యానికి చేరుకోలేకపోయారు. ఇప్పటికే సంఖ్యాబలం పరంగా, నోట్ల రద్దుతో ఆర్థికంగా బలహీనపడ్డారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కార్యకలాపాలు పెంచేందుకు ఐదు నెలలుగా రిక్రూట్మెంట్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొత్తగా తెలంగాణలోని ఏరియా, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్థిక వనరులు, పేలుడు సామగ్రి సమీకరించుకునేందుకు గోదావరి దాటి తెలంగాణలోని ఇతర జిల్లాల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎడతెగని పోరు సాగుతోంది. మావోయిస్టు దాడులు ఈనెల 20వ తేదీన సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మృతి చెందాడు. 16న ఫైదగూడ రోడ్డు నిర్మాణ పనుల ఇంజనీర్ను హత్యచేశారు. 15న సుక్మా జిల్లా చింతగుప్ప వద్ద ఐఈడీ పేల్చడంతో డీఆర్జీ జవాన్ గాయపడ్డాడు. 14న సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలోని ఫైదగూడ వద్ద రోడ్డు నిర్మాణంలో ఉన్న వాహనాన్ని తగులబెట్టారు. కార్మికులను కొట్టారు. అదే సీఆర్ఫీఎఫ్ క్యాంపులోని మూడు ఖాళీ బ్యారక్లను పేల్చివేశారు. 9న బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ పరిధిలోని కుట్రు మార్గంలో బస్సును పేల్చివేయడంతో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 8న సుకుమా జిల్లా బడేసుట్టి గ్రామ సర్పంచ్ను మావోయిస్టులు గొంతుకోసి హత్యచేశారు. రెండు మిక్సర్లను, నాలుగు వాహనాలను ధ్వంసం చేశారు. 7న బీజాపూర్ జిల్లా ఖేరామ్గఢ్ అటవీ శాఖ సిబ్బందిని చితకబాదారు. 5న చర్ల ఏరియా తిప్పాపురం–పామేడు గ్రామాల మధ్య పోలీసులే లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చడంతో స్థానిక గిరిజనుల పశువులు మృతిచెందాయి. మార్చి 28వ తేదీన పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పకు చెందిన ఇర్ప లక్ష్మణ్ అలియాస్ భరత్ అనే మాజీ మావోయిస్టును హతమార్చారు. మార్చి 28న బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న ఊట్లపల్లి గ్రామానికి చెందిన సోడి అండాలు అనే మాజీ మావోయిస్టును హతమార్చారు. గత మార్చి 27న బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీష్ కొండెరను హత్య చేశారు. మార్చి 19న బీజాపూర్ జిల్లా నూకన్పాల్వద్ద రోడ్డుపనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ విశాల్కుమార్ను హతమార్చారు. మార్చి 13న సుకుమా జిల్లా కిష్టారం వద్ద శక్తిమంతమైన ఐఈడీ పేల్చడం ద్వారా 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. తెలంగాణలోకి మరింతగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించే మావోయిస్టులు పూజారి కాంకేర్ ఎన్కౌంటర్కు ముందు జనవరి 24న చర్ల మండలం క్రాంతిపురంలో ఒకరిని హత్యచేశారు. జనవరి 26వ తేదీన పినపాక మండలం జానంపేట సమీపంలోని ఉమేష్చంద్రనగర్లో మరొకరిని హత్యచేశారు. పోలీస్ కాల్పులు, అరెస్ట్లు : ఈ నెల 1న సుకుమాజిల్లా కిష్టారం వద్ద ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ దళాలు 12 మంది మావోయిస్టులను అరెస్టు చేశాయి. మార్చి 2న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
39కి చేరిన మృతుల సంఖ్య
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నాలుగు రోజులుగా భయానక వాతావరణం నెలకొంది. దేశ చరిత్రలోనే ఒకేసారి రెండు ఎన్కౌంటర్లలో 37 మంది మావోయిస్టులు నేలకొరిగారు. తాజాగా బుధవారం ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యమైనట్లు తెలిసింది. దీంతో గడ్చిరోలి ఎన్కౌంటర్ల మృతుల సంఖ్య 39కి చేరింది. ఈ నెల 22న ఆదివారం ఉదయం గడ్చిరోలి జిల్లాలోని బామ్రాగఢ్ తాలూకా కస్నాగూడ అటవీ ప్రాంతంలోని బోరియా ప్రదేశంలో మావోయిస్టులపై పక్కా సమాచారంతో సీ–60 పోలీసులతోపాటు మరో ఐదు కంపెనీల పోలీసు బలగాలు ముప్పేట దాడికి దిగాయి. ఈ దాడిలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మృతదేహాలు మరుసటిరోజు ఇంద్రావతినదిలో తేలియాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. ఈ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని గడ్చిరోలి జిల్లా ఆస్పత్రికి హెలికాప్టర్లో తరలించారు. ఈ నెల 23న గడ్చిరోలి జిల్లాలోని అహేరి తాలూ కాలోని రాజారాంఖాండ్ల పరిధిలోని జిమ్మటగట్టుపై జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మృతుల సంఖ్య మొత్తం 37గా పోలీసులు ప్రకటించారు. ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మృ తుల సంఖ్య 39కి చేరింది. మృతుల్లో ఇప్పటి వరకు 20 మంది మహిళలు, 19 మంది పురుషులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గడ్చిరోలిలో పోలీసుల సంబురాలు దేశ చరిత్రలోనే భారీ ఎన్కౌంటర్ చేసిన సీ–60 పోలీసులు, ఇతర పోలీసులు పోలీస్ హెడ్క్వార్టర్స్లో సంబురాలు చేసుకుంటున్నాయి. పేట్రేగుతున్న రాజ్యహింస: వరవరరావు చిట్యాల(భూపాలపల్లి): దేశంలో రాజ్యహింస పేట్రేగిపోతోందని విరసం నేత వరవరరావు అన్నారు. గడ్చిరోలిలో ఈ నెల 22న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడు రౌతు విజేందర్ అలియాస్ శ్రీకాంత్ మృతదేహం మంగళవారం అర్ధరా త్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తనస్వగ్రామం చల్లగరిగెకు తరలించారు. బుధవారం విరసం నేత వరవరరావు అక్కడికి చేరుకుని విజేందర్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. గడ్చిరోలి ఎన్కౌంటర్ బూటకమని, ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఏకపక్షంగా కాల్పులు జరిపి నలుగురు డివిజన్ కార్యదర్శులుసహా 37 మందిని పొట్టనబెట్టుకున్న రాక్షస ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్కౌంటర్లో తెలంగాణ గ్రేహౌండ్స్ హస్తం ఉందన్నారు. -
గడ్చిరోలిలో మరో ఎన్కౌంటర్
నాగ్పూర్/చర్ల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన తాజా ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది నక్సల్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్గట్ట ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్ షెలార్ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం నలుగురు మరణించారని చెప్పారు. కాగా ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మరికొన్ని నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే కూంబింగ్ ఆపరేషన్కు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయని ఐజీ తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఐదుగురు మావోల మృతి సరిహద్దు చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. సుకుమా జిల్లాలోని పూసుపాల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. -
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్
ముంబై/ కాళేశ్వరం /చింతలమానెపల్లి(సిర్పూర్)/పట్నా: మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లాలో ఆదివారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోలు మరణించారు. గడ్చిరోలి పోలీసులకు చెందిన సీ–60 కమాండోలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారని మహారాష్ట్ర ఐజీ శరద్ షెలార్ వెల్లడించారు. ‘భమ్రాగడ్లోని తాడ్గావ్ అడవుల్లో పెరిమిలి దళం కదలికలపై పక్కా సమాచారంతో గడ్చిరోలి ఎస్పీ అభినవ్ దేశ్ముఖ్ నేతృత్వంలో సి–60 కమాండోలు శనివారం కూంబింగ్ను ప్రారంభించారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వారికి మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు గంటలపాటు కొనసాగిన ఈ కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో తప్పించుకున్న వారికోసం గాలింపు చేపట్టాం. ఘటన స్థలంలో తుపాకులు, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నాం’ అని శరద్ తెలిపారు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. కాగా, ఈ ఎన్కౌంటర్లో డివిజనల్ కమిటీ సభ్యులు సాయినాథ్, శీను అలియాస్ శ్రీకాంత్లు మరణించినట్లు భావిస్తున్నామని మహారాష్ట్ర డీజీపీ సతీష్ మాథుర్ తెలిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఎవరూ గాయపడలేదన్నారు. 2017లో గడ్చిరోలి జిల్లాలో 19 మంది సభ్యుల మరణం అనంతరం మావోయిస్టులకు తగిలిన గట్టి ఎదురుదెబ్బ ఇదే. మరోవైపు గడ్చిరోలిలో ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు కూడా కూంబింగ్ను ముమ్మరం చేశారు. కనుమరుగవుతున్న నక్సలిజం: రాజ్నాథ్ దేశం నుంచి నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకు పోతోందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పట్నాలో మాట్లాడుతూ.. పేదలు ఇంకా పేదరికంలోనే మగ్గాలని నక్సల్స్ కోరుకుంటున్నారని, వారి పిల్లలు మాత్రం ప్రముఖ కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారని, కొందరు విదేశాల్లో ఉన్నారని రాజ్నాథ్ పేర్కొన్నారు. మృతుల్లో తెలుగు వ్యక్తి! చిట్యాల(భూపాలపల్లి): గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో పెరిమిలి దళ కమాండర్ సాయినాథ్ అలియాస్ దోమేశ్ ఆత్రం(34), జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన రౌతు విజేందర్ అలియాస్ శ్రీను అలియాస్ శ్రీకాంత్(41) ఉన్నట్లు తెలుస్తోంది. రౌతు అహల్య, నర్సింహారాములు దంపతుల ముగ్గురు కుమారుల్లో శ్రీకాంత్ రెండోవాడు. స్థానిక పాఠశాలలో 10వ తరగతి వరకూ చదువుకున్న శ్రీకాంత్ 1990లో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, శెట్టి రాజపాపయ్య నేతృత్వంలోని పీపుల్స్వార్ అనుబంధ బాలల సంఘంలో చేరాడు. 1996లో రాడికల్ యువజన సంఘం ఏరియా కమిటీలో పనిచేశాడు. జైల్లో పరిచయమైన మావో అగ్రనేత శాఖమూరి అప్పారావు సహచర్యంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2000లో పీపుల్స్వార్లో చేరిన శ్రీకాంత్ ప్రస్తుతం గడ్చిరోలి జిల్లా డివిజినల్ కమిటీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. సాయినాథ్పై 72 , శ్రీకాంత్పై 82 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
దండకారణ్యంలో యుద్ధ మేఘాలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల : దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు దీనిని సీరియస్గా తీసుకున్నాయి. సరిహద్దుకు పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలను తరలిస్తున్నాయి. రెండు రాష్ట్రాల బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ సాగిస్తున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా, డీఆర్జీ, ఎస్టీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు కలిసి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆరంభమైన మావోయిస్టుల కార్యాకలాపాలు అడపాదడపా కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో కాలంలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. దీంతో, ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాదికారులు పలుమార్లు సమావేశమయ్యారు. మావోయిస్టులపై పట్టు సాధించే దిశగా సమాలోచనలు సాగించారు. ఆ తరువాత నుంచి జాయింట్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. అటు ఛత్తీస్గఢ్లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో, ఇటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భష్త్రపాలపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ సాగుతోంది. సరిహద్దులోని ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. సరిహద్దులో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్కు తోడు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున తనిఖీలు సాగుతున్నాయి. సరిహద్దు ఛత్తీస్గఢ్కు వెళ్లే వచ్చే ప్రధాన రహదారులలో మోహరిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు అణువణువునా తనిఖీలు సాగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతానికి వెళ్లి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘాను ఉంచారు. మరో రెండు నెలల పాటు సరిహద్దులో ఇదే పరిస్థితి ఉండవచ్చని సమాచారం. -
జార్ఖండ్లో ఐదుగురు మావోల ఎన్కౌంటర్
లతేహార్: జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో బుధవారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. హేరంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్గావ్, కేడు గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు బుధవారం ఉదయం ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని హెచ్చరించగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఇద్దరిని మావోయిస్టు సబ్ జోనల్ కమాండర్లు శివలాల్ యాదవ్, శ్రవణ్ యాదవ్లుగా గుర్తించారు. వీరి తలలపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది. -
గడ్చిరోలిలో ఎన్కౌంటర్
సాక్షి, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని సిరికొండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఉన్నారు. -
చత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
-
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోల మృతి
మల్కన్గిరి: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా డోగ్రీఘాట్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు ఐజీ ఎస్ షైనీ తెలిపారు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఆ ప్రాంతంలో కిట్ బ్యాగులు, తుపాకులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. కొరాపుట్ జిల్లాలో 24 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. -
‘మావో’ల సమస్య పెరుగుతోంది.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య పెరుగుతోందని, దీని కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. మావోయిస్టుల చర్యల మీద దృష్టి సారించాలన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్పై సాధారణ చర్చను ప్రారంభించిన అక్బరుద్దీన్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. మావోయిస్టులు విస్తరిస్తే కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఇటీవల తాము ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సందర్భంలో మావోయిస్టుల ప్రాబల్యం దృష్ట్యా తమ వాహనాలను మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారని గుర్తుచేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్కు ఆర్థిక సాయం పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. -
జనజీవన స్రవంతిలోకి రావాలి
కాకినాడ రూరల్: మావోయిస్టులు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఇష్టపడుతున్నారని, అటువంటి వారికి ప్రభుత్వపరంగా సాయం చేసి, స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవసరయ్యే చర్యలను తీసుకుంటామని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. మంగళవారం సాయంత్రం ఏటపాక పోలీస్స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయగా, మరో మావోయిస్టు బుధవారం ఎస్పీ గున్నీ ఎదుట లొంగి పోయాడు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఒడిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా, మోటు పోలీస్స్టేషన్ పరిధిలోని తొగరుకోట గ్రామానికి చెందిన ఆంధ్రా ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని పప్పలూరు ఏరియా కమిటీ దళంలో ఏసీఎంగా పని చేసిన మడకం ఎర్రయ్య అలియాస్ రుషి (33) బుధవారం ఎస్పీ విశాల్ గున్ని ఎదుట లొంగిపోయాడు. ఇతనికి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ. 20 వేలు, పునరావాసం కోసం జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా ఇతని తలపై ఉన్న రివార్డు మొత్తం కోసం మల్కాన్గిరి జిల్లా ఎస్పీకి లేఖ రాస్తున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. అలాగే చింతూరు ఏఎస్డీ, ఎస్డీపీవోల ఆదేశాలపై ఏటపాక పోలీస్స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో డీఏకేఎంఎస్కు చెందిన ఒక దళ సభ్యుడు, ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. చత్తీస్ఘఢ్ సుకుమా జిల్లా పాలోడ్కు చెందిన మడివి రామ అనే డీఏకేఎంఎస్ దళానికి చెందిన వ్యక్తి, అతనితో పాటు భద్రాది కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబిల్లి గ్రామానికి చెందిన మోలుమురి శ్రీనివాసరావు, అదే మండలం పెద్ద నల్లబిల్లి గ్రామానికి చెందిన పాయం జోగారావు కొరియర్లను అరెస్టు చేసి రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) వై.రవిశంకర్రెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ అజిత్ వేజెండ్ల పాల్గొన్నారు. -
13 మంది మావోయిస్టుల లొంగుబాటు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని సుకుమ జిల్లా ఎస్పీ అభిషేక్మిన్నా ఎదుట సోమవారం మధ్యాహ్నం 13మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. దళంలో చిన్న చూపు చూస్తున్నారు. గిరిజనుల కోసమే పోరాటం అంటూనే వారి కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డుపనులను అడ్డుకుంటున్నారు. అగ్రనేతలు ప్రాణాలు కాపాడడం కోసం చిన్న కేడర్ నేతలను ముందు ఉంచి బలి చేస్తూ వారు తప్పించుకుంటున్నారు. మహిళా మావోయిస్టులకు దళంలో రక్షణ కరువైంది. వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందుచేతనే తాము మనస్తాపం చెందిన లొంగిపోతున్నమని మావోయిస్టులు ఎస్పీకి తెలిపారు. అలాగే తమ గిరిజనులపై ఇన్ఫార్మర్ల నెపం మోపి తమ చేతనే హత్యలు చేయిస్తున్నారని ఆవేదన చెందారు. మాకు ఇవి నచ్చడం లేదు..ప్రజాసేవ చేయాలంటే జనజీవనంలోకి వచ్చి చేస్తామన్నారు. అనంతరం ఎస్పీ అభిషేక్మిన్నా మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను త్వరలోనే వారికి అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులంతా దర్భ డివిజన్కు చెందినవారని తెలిపారు. -
ఎన్కౌంటర్లో నలుగురు మావోలు హతం
రాంచీ: జార్ఖండ్లోని పలాము జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోలు ఉన్నారు. మావోయిస్టుల ఏరివేత చర్యల్లో భాగంగా సోమవారం లాలాఘటీ–నదిహా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ దళాలు, పోలీసులు ఉమ్మడిగా కూంబింగ్ చేస్తున్నపుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది. మృతుల్లో స్థానిక నక్సల్ గ్రూప్కు సబ్ జోన్ కమాండర్ భూహియాన్, లల్లు యాదవ్, రింకీ, రూబీ ఉన్నారు. ఘటన ప్రాంతం నుంచి 2 ఎస్ఎల్ఆర్లు,5 మ్యాగజైన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
33 ఏళ్ల తర్వాత అమ్మ చెంతకు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముప్పై మూడేళ్ల కింద అడవి బాట పట్టిన కొడుకు జంపన్న.. ఎవరూ లేక వృద్ధాశ్రమంలో ఉన్న తల్లి యశోదమ్మ.. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నవారు తీవ్ర ఉద్వేగంలో మునిగిపోయారు. ఇన్నేళ్ల తర్వాత తన తల్లిని చూసిన జంపన్నకు మాటలు పెగలలేదు. తొంభై ఏళ్ల వయోభారంతో ఉన్న యశోదమ్మ కన్నీరుపెడుతూ ‘బాగున్నవా కొడుకా..’అంటుంటే.. ఆయన కూడా కన్నీరు ఆపుకోలేకపోయారు. అన్నం తినిపించిన జంపన్నసోమవారం హైదరాబాద్లో డీజీపీ సమక్షంలో లొంగిపోయిన జంపన్న, రజిత.. రాత్రి 8.30 గంటల సమయంలో కాజీపేటలో ఉన్న సహృదయ అనాథాశ్రమానికి వచ్చి యశోదమ్మను కలిశారు. జంపన్నను చూసిన ఆమె.. ‘నా కొడుకా జంపయ్య.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ నా కొడుకా.. ఈడనే ఉంటాన్న కొడుకా..’అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆగకుండా ఏడుస్తూనే కొడుకు, కోడలు యోగక్షేమాలు అడిగింది. ఇన్నాళ్లుగా తాను అనుభవించిన పరిస్థితులను చెప్పుకొంది. తల్లిని చూసి మాటలుపెగలక నాలుగైదు నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయిన జంపన్న కూడా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ‘అమ్మా.. నేను మంచిగనే ఉన్నా. ఇదిగో నీ కోడలు..’అంటూ భార్య రజితను చూపించారు. ఇప్పుడైనా వారసుడిని కనివ్వాలని యశోదమ్మ వారిని కోరింది. అనంతరం జంపన్న తల్లికి అన్నం కలిపి తినిపించారు. మా అమ్మలాంటి వారు ఎందరో..: జంపన్న తల్లి యశోదమ్మను కలసిన అనంతరం జంపన్న మీడియాతో మాట్లాడారు. ‘‘సమాజంలో అందరిలానే మా అమ్మపై నాకు ప్రేమ ఎక్కువ. మా అమ్మలాంటివారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. వారికోసమే మావోయిస్టు పార్టీలో పనిచేశాను. వేలాది మంది కామ్రేడ్లు కుటుంబాలను త్యాగం చేసి పోరాటం చేస్తున్నారు. వారి కుటుంబాలు, తల్లిదండ్రులు కనీస సౌకర్యాలు లేని దుస్థితిలో ఉండిపోతున్నారు. వారితో పోల్చితే మా అమ్మకు ఈ ఆశ్రమంలో కనీస సౌకర్యాలైనా ఉన్నాయి. నేను కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి.. మా అమ్మకు సంబంధించి విషయాలు మీడియాలో వస్తున్నాయి, నాకు తెలుస్తున్నాయి. అమ్మ ఆశ్రమంలో ఉన్న విషయం నాకు నాలుగు నెలల క్రితం తెలిసింది. ఆమె పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను. మావోయిస్టు పార్టీ, ప్రజలే నా తల్లిగా భావించి ఒక లక్ష్యం కోసం పనిచేశాను..’’అని చెప్పారు. -
అజ్ఞాతంలో 135 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన 135 మంది, ఏపీకి చెందిన 80 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నట్టు డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఇతర కేడర్లో పనిచేస్తున్న వారంతా జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. సోమవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న లొంగుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. జంపన్నపై దేశవ్యాప్తంగా 100కుపైగా కేసులున్నాయని, అందులో తెలంగాణలో 51 కేసులున్నాయని చెప్పారు. జంపన్న ఆధ్వర్యంలో 1991 ఫిబ్రవరి 22న వాజేడు పోలీస్స్టేషన్పై దాడిచేసి 14 ఆయుధాలు అపహరించిన ఘటనలో కొందరు పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. 1991 జూన్ 15న ఏటూరు నాగారం పరిధిలోని చెల్పాకాలో పోలీస్ జీపును పేల్చేశారని, ఆ ఘటనలో సీఐ సంతోష్కుమార్, ఎస్సై కిషోర్కుమార్, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారని చెప్పారు. భద్రాద్రి కొత్త గూడెం పరిధిలోని కరకగూడెం పోలీస్ స్టేషన్పై దాడి చేసి 17 మంది పోలీసులను హతమార్చారని, ఆయుధాలను ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. ఇక మావోయిస్టు పార్టీలో 13 ఏళ్లుగా పనిచేస్తున్న అనిత అలియాస్ రజిత భర్త జంపన్నతో కలసి లొంగిపోయినట్టు డీజీపీ వెల్లడించారు. జంపన్నపై ఉన్న రూ.25 లక్షలు, రజితపై ఉన్న రూ.5 లక్షల రివార్డును ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామన్నారు. అజ్ఞాతంలోనే వివాహం.. జంపన్న భార్య హింగె అనిత అలియాస్ రజిత స్వస్థలం వరంగల్ జిల్లా దామెర. ఆమె హన్మకొండలోని ఆదర్శ కాలేజీలో ఇంటర్, వడ్డెపల్లిలోని డిగ్రీ కాలేజీలో బీఎస్సీ, ఉస్మానియా దూరవిద్యా కేంద్రం ద్వారా ఎమ్మెస్సీ చేశారు. 2004లో చిట్యాల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ కమాండర్ రమాకాంత్ పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. జంపన్న నేతృత్వంలో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలోని ప్రెస్ టీమ్లో పనిచేశారు. 2006లో సెంట్రల్ రీజియన్ బ్యూరో ప్రెస్ టీమ్కు.. 2007లో ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమి తులయ్యారు. 2009లో పార్టీ అనుమతి పొంది జంపన్న, రజిత వివాహం చేసుకున్నారు. 2012లో రజితను ఒడిశా రాష్ట్ర కమిటీకి బదిలీ చేశారు. 2014లో డివిజనల్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు.. జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం. 1979–80లో హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీఐలో చదువుతుండగా పీపుల్స్వార్కు చెందిన శాఖమూరి అప్పారావు, పులి అంజయ్య అలియాస్ సాగర్ల స్ఫూర్తితో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1984లో పీపుల్స్వార్లో దళ సభ్యుడిగా చేరి.. ఏడాదిలోనే ఏటూరు నాగారం దళానికి కమాండర్గా నియమితులయ్యారు. 1991లో ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజన్ (ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్)లో సభ్యుడిగా నియమించారు. ఏడాది తిరిగేలోగా అదే కమిటీకి కార్యదర్శిగా ఎదిగారు. పార్టీ కేంద్ర నాయకత్వం 2000 సంవత్సరంలో జంపన్నకు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. 2003లో ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్లో జరిగిన 9వ ప్లీనరీలో స్పెషల్ జోనల్ కమిటీ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. భారీ స్థాయిలో మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించిన నేపథ్యంలో. జంపన్నను కేంద్ర మిలటరీ కమిషన్ సభ్యుడిగా నియమించారు. 2004లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం సెంట్రల్ రీజియన్ బ్యూరో సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్చార్జిగా, ఛత్తీస్గఢ్–ఆంధ్రా కమిటీ లీడ్ మెంబర్గా కొనసాగారు. కేంద్ర కమిటీలో 18 మంది మావోయిస్టు పార్టీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కేంద్ర కమిటీలో ఇప్పటివరకు 19 మంది సభ్యులుండగా.. జంపన్న లొంగుబాటుతో వారి సంఖ్య 18కి తగ్గింది. వయోభారం, అనారోగ్య కారణాలు, సైద్ధాంతిక విభేదాలు, వ్యక్తిగత కారణాలతో నేతలు లొంగిపోతుండటం.. కాలక్రమేణా మావోయిస్టు పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యులుగా ప్రశాంత్ బోస్, నంబాల కేశవరావు, మిసర్ బెస్రా, మల్లోజుల వేణుగోపాల్రావు, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, దేవ్కుమార్సింగ్, అక్కిరాజు హరగోపాల్, కడారి సత్యనారాయణరెడ్డి, వివేచ్ చందర్యాదవ్, రంజిత్ బోస్, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాద్రావు, రావుల శ్రీనివాస్, ఒగ్గు బురల్సత్యాజీ, మిలింద్ తేల్ముండే ఉన్నారు. -
సైద్ధాంతిక విభేదాలతోనే బయటకొచ్చా
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీతో సైద్ధాంతికపరమైన విభేదాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి తెలిపారు. 33 ఏళ్లుగా పార్టీలో నిబద్ధత, నిజాయితీతో పనిచేసిన తాను భార్య అనిత అలియాస్ రజితతో సహా స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సోమవారం డీజీపీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. చర్చించే అవకాశం లేదు.. దేశంలో గత పదిహేనేళ్లలో విపరీతమైన మార్పులు వచ్చాయని, గతంలో ఉన్న ట్లుగా భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు లేదని జంపన్న అభిప్రాయపడ్డారు. కానీ కార్మిక, ఉద్యోగ, యువత, ప్రజల సమస్యలపై మావోయిస్టు పార్టీ పోరాట పం థాలో మార్పు రాలేదని, దీనిపై తాను కేంద్ర కమిటీ సభ్యుడిగా చర్చించే అవ కాశం లేకుండాపోయిందని జంపన్న తెలిపారు. అయితే ఈ అంశంపై తనను పార్టీలోనే ఉండి పార్టీ పనితీరు, పద్ధతిలో మార్పు తెచ్చేలాగా పోరాడాలని సహ చరులు చెప్పినా తాను వినలేదని, తన వల్ల ఆ మార్పు సాధ్యం కాదన్న అభి ప్రాయంతో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని బయటకు వచ్చానని వెల్లడించారు. పార్టీకి ద్రోహం చేసినట్లు కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం బయటకు వచ్చానని చెబుతూనే మావోయిస్టు పార్టీపై ఆరోపణలు చేయడంపై ప్రశ్నించగా తాను పార్టీని దూషించడంలేదని జంపన్న పేర్కొన్నారు. ఎప్పుడో ఏళ్ల కింద ఉన్న సిద్ధాంతాలు, పనితీరు ప్రక్రియే నేటికీ కొనసాగుతోందని, అది పార్టీ పునర్నిర్మాణానికి ఉపయోగపడదని తాను చెప్పానన్నారు. దీంతో పార్టీ సభ్యులు తనకు మధ్య విభేదాలు ఏర్పడినట్లుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. అంతే కానీ తాను పార్టీకి ద్రోహం చేసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీలో మార్పులు జరిగితే మళ్లీ వెళ్తారా అనే ప్రశ్నపై జంపన్న స్పందిస్తూ తనకు ఇక అంత ఓపిక లేదన్నారు. ఇప్పుడే చెప్పలేను... పోలీసులకు లొంగిపోయే వ్యవహారంలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సాయం చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా అలాంటిదేమి లేదని, తానే స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు వచ్చానని జంపన్న తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తారా అని అడగ్గా ప్రస్తుతం అలాంటిదేమీ లేదని, ఆ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జంపన్న వెల్లడించారు. -
జంపన్న లొంగుబాటు!
తొర్రూరు/మహదేవపూర్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామానికి చెందిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న హైదరాబాద్లో శుక్రవారం రాత్రి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. చెర్లపాలెంకు చెందిన జినుగు యశోదమ్మ, మల్లారెడ్డిల కుమారుడైన నర్సింహారెడ్డి 1977–78 వరకు చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్లోని మల్లెపల్లి వద్దనున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 1978–79లో టర్నర్ కోర్సు పూర్తి చేసి రెండేళ్లపాటు ప్రైవేటు కంపెనీలో అప్రెంటీస్ చేశాడు. 1984లో తన నాన్నమ్మ, స్నేహితుడు గోపాల్రెడ్డి మరణించినçప్పుడు పరామర్శ కోసం గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లిన నర్సింçహారెడ్డి 1985లో అప్పటి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్లో చేరాడు. పార్టీలో జంపన్నగా దళసభ్యుడి స్థాయి నుంచి ఏరియా కమిటీ, జిల్లా, రాష్ట్ర కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణ్రావు అలియాస్ గణపతికి ముఖ్యఅనుచరుడిగా పేరున్న జంపన్న ఛత్తీస్గఢ్–ఒడిశా బార్డర్ కమిటీ కార్యదర్శిగా చాలా కాలం పనిచేశారు. అనేక ఎన్కౌంటర్లలో ప్రత్యక్షంగా పాల్గొని మృ త్యుంజయుడిగా బయటపడ్డాడు. 1999లో మహదేవపూర్ మండలంలోని అన్నారం అడవుల్లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యలో కీలకపాత్ర పోషించాడు. ఎంసీసీ– పీపుల్స్వార్ విలీనం సందర్భంగా జరిగిన చర్చల్లో కీలకపాత్ర పోషించిన జంపన్న.. ఆధిపత్య పోరులో అలసిపోయి వరంగల్ జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ నాయకుడి ద్వారా జంపన్న దంపతులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. జంపన్న తలపై రూ.24 లక్షల రివార్డు ఉండగా, వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన ఆయన భార్య హింగే రజితపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కొడుకును చూసి మరణించాలనే.. ఉద్వేగానికిలోనైన జంపన్న తల్లి యశోదమ్మ కాజీపేట: ఎన్నో ఏళ్లుగా కొడుకును చూసి మరణించాలనే తన ఆకాంక్షను భగవంతుడు ఇన్నాళ్లకు కరుణించడం ఆనందంగా ఉందంటూ మావోయిస్టు అగ్రనేత జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న తల్లి యశోదమ్మ ఉద్వేగానికి గురయ్యారు. ఆయన హైదరాబాద్లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలియడంతో వరంగల్ నగరం కాజీపేటలోని సహృదయ వృద్ధాశ్రమంలో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందుతున్న జంపన్న తల్లి యశోదమ్మను శనివారం ‘సాక్షి’పలకరించింది. జంపన్న లొంగుబాటు విషయాన్ని ప్రస్తావించడంతో ఆనందభాష్పాలు రాల్చారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి వస్తాడని ఆశిస్తే ఉద్యమబాట పట్టిన నర్సన్నను చూడాలని ఎంతోకాలంగా కంటిపై రెప్ప వేయకుండా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలానికి అడవితల్లి కరుణించి నా కొడుకును చూసే భాగ్యం కల్పించిందంటూ కనిపించిన వారికందరికీ దండాలు పెడుతున్నారు. మావోయిస్ట్ అగ్రనేత జంపన్న లొంగుబాటు -
మావోయిస్ట్ అగ్రనేత జంపన్న లొంగుబాటు
-
'రెడ్ కారిడార్' టెర్రర్
న్యూఢిల్లీ: 2016లో భారతదేశంలో జరిగిన దాడుల్లో సగం మరణాలు మావోయిస్టుల హింస వల్లే చోటుచేసుకున్నాయని సిడ్నీకి చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ హత్యలన్నీ రెడ్ కారిడార్గా పిలిచే ఈశాన్య, మధ్య, దక్షిణ భారతదేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే జరిగాయని పేర్కొంది. 2016లో భారత్లో మొత్తం 929 దాడులు జరిగాయని, 340 మంది ప్రాణాలు కోల్పోయారని సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఐదో గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్(జీటీఐ) నివేదికలో తెలిపింది. గత కొన్నేళ్లుగా భారత్లో ఉగ్ర హింస తగ్గుముఖం పడుతున్నా 2016లో 18 శాతం పెరుగుదల నమోదైందని, మృతుల సంఖ్య పెరిగిందని స్పష్టం చేసింది. గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్ నివేదిక ఉగ్ర హింసలో ఇరాక్, అఫ్గానిస్తాన్, నైజీరియా, సిరియా, పాకిస్తాన్, యెమెన్, సోమాలియా, భారత్లు మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. 2002 నుంచి భారత్లో హింస తగ్గుముఖం పట్టినా 2015తో పోలిస్తే మాత్రం 2016లో దాడులు 16 శాతం పెరగడం గమనార్హం. 2015లో మొత్తం 800 దాడులు చోటుచేసుకోగా 2016లో ఆ సంఖ్య 929కి పెరిగింది. 2015తో పోలిస్తే భారతదేశంలో ఈ దాడుల్లో మరణించినవారి సంఖ్య 18 శాతం పెరిగి 340కి చేరింది. ఇందులో సగం మంది మావోల హింసలో ప్రాణాలు కోల్పోగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హింసలో 30 మంది మరణించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఐదుగురిని బలితీసుకుంది. జాబితాలోని మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలతో పోలిస్తే ఒక్కో దాడిలో మరణాల రేటు భారత్లోనే తక్కువగా ఉంది. భారత్లో సగటున ఒక్కో దాడిలో 0.4 మరణాలు చోటుచేసుకోగా మిగతా తొమ్మిది దేశాల్లో అది 2.7గా ఉంది. భారత్లో సగానికి పైగా దాడులు పోలీసులు, ప్రైవేటు వ్యక్తులే లక్ష్యంగా జరిగాయి. భారత్లో జరిగిన ఉగ్రవాద దాడులు ఎక్కువ శాతం ప్రమాదకరం కానివని నివేదిక వెల్లడించింది. ప్రజలు, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు కొన్ని గ్రూపులు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయిని, ఇలాంటి దాడులు ఎక్కువగా మావోయిస్టులే చేస్తున్నారని పేర్కొంది. భారత్లో హింసకు పాల్పడుతున్న గ్రూపుల్లో ఎక్కువ శాతం రాజకీయ గుర్తింపు కోరుకుంటున్నాయని, అందువల్లే ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా అవి దాడులకు పాల్పడున్నట్లు నిర్ధారించారు. నిజానికి 2016లో భారత్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మూడొంతుల ప్రమాదకరంగా కానివే.. కేవలం 2 శాతం దాడుల్లో మాత్రమే రెండు కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. దేశంలోని మొత్తం 56 గ్రూపుల్లో 20 మాత్రమే ప్రాణహానికి పాల్పడ్డాయని జీటీఐ నివేదిక పేర్కొంది. ఇక ఈశాన్య భారతదేశంలోని తీవ్రవాద గ్రూపుల్లో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ప్రమాదకరమని, 2016లో ఆ ఉగ్రసంస్థ 15 మందిని పొట్టనపెట్టుకుందని, అల్ఫా ఏడుగురుని హత్య చేసిందని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ వెల్లడించింది. ఇక జమ్మూ కశ్మీర్పై పాకిస్తాన్తో ఉన్న వివాదమే భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. జమ్మూ కశ్మీర్లోని ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయంగా నిషేధం ఉన్నా అవి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించింది. ప్రమాదకర ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని నివేదికలో వెల్లడించారు. -
‘తెలంగాణకు తొలి డీజీపీని కావడం సంతోషం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి తొలి డీజీపీగా బాధ్యతలు నిర్వహించడం సంతోషకరమైన విషయమని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ మూడున్నరేళ్ల పనితీరు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆదివారం (12వ తేదీ) పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందనే వాదన తెరమీదకు వచ్చిందని, అయితే సీఎం కేసీఆర్ సహకారంతో ఆ సమస్యను అధిగమించామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని, టెక్నాలజీ సాయంతో ఉగ్రవాదాన్ని అణిచివేశామన్నారు. పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో చాలామంది సమర్థులైన పోలీస్ అధికారులు ఉన్నారన్నారు. రిటైర్డ్ అయ్యాక ప్రభుత్వం కోరితే తన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనురాగ్ శర్మ తెలిపారు. -
ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు మరోసారి మావోయిస్టులపై పై చేయి సాధించాయి. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సలైట్లను మట్టుపెట్టాయి. సోమవారం సాయంత్రం ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లా వద్ద అబుజ్మార్గ్ ప్రహార్ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఒక్కసారిగా దాడులు నిర్వహించాయి. ప్రహార్ 2 పేరిట నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. 9 ఆయుధాలను స్వాధీనపరుచుకున్నామని, సుక్మా దగ్గర క్యాంపులను ధ్వంసం చేశామని భద్రతా దళాలు వెల్లడించాయి. కాగా, నారాయణపూర్ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంత జాబితాలో ఉంది. గత నెలలో ఏడుగురు ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయారు. కాగా, సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. -
మావోల హెచ్చరికలున్నా భద్రత ఇదేనా?
నర్సీపట్నం: మంత్రి అయ్యన్న సోదరుడి కారులో నాలుగు నెలల క్రితం వాయిస్ రికార్డర్ అమర్చినట్లు తేలడం ఇంటెలిజన్స్, పోలీసు వర్గాలకు సవాల్ విసిరినట్లైంది. ఈ విషయమై ‘సాక్షి’లో ప్రముఖంగా వచ్చిన కథనం పట్టణంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వాస్తవానికి మంత్రి అయ్యన్న తనయుడు విజయ్ లేటరైట్ దందాలకు పాల్పడుతున్నారని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆరు నెలలు క్రితం మావోయిస్టులు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికల దృష్ట్యా మంత్రి అయ్యన్న నివాసంతో పాటు సందర్శించే వారిని నిశితంగా పరిశీలించాల్సి ఉంది. కారులో వాయిస్ రికార్డర్ అమర్చడాన్ని బట్టి, ఇంటి భద్రతను పోలీసులు పూర్తిగా గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడీ విషయం పట్టణంలో చర్చనీయాశంగా మారింది. రికార్డయిన వాయిస్ ఎప్పటికప్పుడు బయటికి పొక్కిందా..? అన్నది తేలాల్సి ఉంది. మంత్రి నివాసంలో వాహనం పార్కు చేసి ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం నిత్యం ఏదో ప్రాంతానికి సోదరుడి దంపతులతో పాటు ముఖ్య అనుచరులతో ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ సమయంలో వారు అంతర్గతంగా చర్చించుకున్న అంశాలు ఈ రికార్డర్ ద్వారా ఏమేరకు అమర్చిన వ్యక్తులకు చేరి ఉంటాయో పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా బలమైన అంశాలపై జరిగిన చర్చలకు సంబంధించి వాయిస్ రికార్డర్లో నమోదై ఉంటే భవిష్యత్తులో ఎటువంటి పరిణామానాలకు దారి తీస్తుందో.. రికార్డయిన అంశాలు మంత్రిపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్లి అందరి నోళ్లలో తలలో నాలుకుగా ఉండే సన్యాసిపాత్రుడి కారులో వాయిస్ రికార్డర్ పెట్టడాన్ని పట్టణ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు ఈ కేసును ఛేదించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. -
విశాఖలో మళ్లీ అన్నల అలజడి
-
రహదారిపై మావోల వాల్పోస్టర్లు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవరపల్లి ప్రధాన రహదారిపై గురువారం ఉదయం మావోయిస్టుల వాల్ పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ పేరిట ఈ పోస్టర్లు ఉన్నాయి. ఈనెల 21 నుంచి 27 వరకు సీపీఐ(మావోయిస్టు) పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలను ప్రజలు గ్రామగ్రామాన నిర్వహించాలని మావోయిస్టులు ఈ పోస్టర్లలో కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. -
యాదాద్రిలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో మావోయిస్టు పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంతో పాటు వావిళ్లపల్లి, జనాగం గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ నియంత పాలన నశించాలి, లంచగొండి ఎమ్మెల్యే ఖబడ్దార్ అంటూ పోస్లర్లపై రాసి ఉంది. రాచకొండ ప్రకృతి సంపద కాపాడుకుందాం అంటూ సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు రాచకొండ దళం పేరిట పోస్టర్లు దర్శనమివ్వడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
గన్పార్క్ వద్ద నక్సల్స్ బాధిత కుటుంబాల ధర్నా
-
8 మంది మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
మల్కన్గిరి: మల్కన్గిరి పోలీసులు ఎనిమిది మంది మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు. వీరంతా మైథిలి పోలీసు స్టేషన్ పరిధిలోని బార్స్ గ్రామానికి చెందినవారు. మావోయిస్టుల కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ బోర్డర్, మల్కన్గిరి ప్రాంతాల్లో వీరు అనేక మావోయిస్టు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
చర్ల: మావోయిస్టుల పోస్టర్లు అంటిస్తున్న ఇద్దరు మావో సానుభూతిపరులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వెకటాద్రిపాలెంలో ఇద్దరు వ్యక్తులు మావోయిస్టుల పోస్టర్లు అంటిస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మండలంలోని బూరుగుపాడుకు చెందిన మడలి జోగయ్య, మడలి జోగ అనే ఇద్దరు ఏరియ కమిటీకి సానుభూతిపరులుగా పని చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
ఐదుగురు మావోయిస్టులు అరెస్ట్
చర్ల: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని వూసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సరిహద్దులో కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మల్కన్గిరిలో మావోయిస్టు లొంగుబాటు
ఒడిశా: మల్కన్గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రా ఎదుట జిల్లా పోలీసు కార్యాయలంలో దేబా మధి(34) అనే మావోయిస్టు మంగళవారం లొంగిపోయాడు. మల్కన్గిరి డివిజన్ పరిధిలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీలో కలిమెల ఏరియా కమిటీ సభ్యుడిగా దేబ మధి పని చేశాడు. మొత్తం పది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రూ. లక్ష రివార్డు ఉంది. -
ఇద్దరు మహిళా మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్: ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మల్కన్గిరిలో గురువారం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సుమిత్ర మాద్వి అలియాస్ మనీల, మల్కన్గిరి కలిమెల ప్రాంతానికి చెందిన జాగి మద్కమి అలియాస్ నమిత అనే ఇద్దరు మహిళ మావోయిస్టులు ఈరోజు మల్కన్గిరి పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరిద్దరు ఏసీఎమ్ కేడర్లో పని చేసినట్లు.. వీరిపై తలా రూ. 4 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
తూర్పు ఏజెన్సీలో మావోల కదలికలు
రంపచోడవరం : ఆంధ్రా ఒడిశా బోర్డర్ సరిహద్దులో ఇటీవల జరిగిన భారీ ఎ¯ŒSకౌంటర్ లో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇప్పటికే ఇ¯ŒSఫార్మర్ల నెపంతో గిరిజనులను హత్య చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా ఏఓబీలోని విశాఖ అటవీ ప్రాంతానికే పరిమితమైన మావోయిస్టులు తూర్పు ఏజెన్సీలో తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా చేపడుతున్న చర్యలను పోలీసు నిఘా వర్గాలు గుర్తించాయి. తూర్పు ఏజెన్సీలోని లోతట్టు గ్రామాల్లో సంచరిస్తూ రాత్రి సమయంలో గ్రామాల్లో గిరిజనులతో సమావేశమవుతున్నారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని గుర్తేడు అటవీ ప్రాంతంలో, పాతకోట, జంగాలతోట, తూర్పు సరిహద్దులోని మంపా వంటి లోతట్టు గిరిజన గ్రామాల్లో మావోలు కదలికలు ఉన్నట్లు పోలీస్లకు సమాచారం ఉంది. గుర్తేడు సమీపంలోని బందమామిడి గ్రామంలో సమావేశం నిర్వహించి పోలీసులకు సహకరిస్తున్నరంటూ కొంత మందిని హెచ్చరించారు. గతంలో మిలీషియా సభ్యులుగా పనిచేసి మావోలకు సహకరించిన వారిని తిరిగి బలోపేతం చేయడం ద్వారా పోలీ సు కదలికలపై సమాచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏజెన్సీలో కొంత మం దిని వచ్చి కలవాల్సిందిగా కబురు పంపినట్లు సమాచారం. వీరిలో ఒక సర్పంచ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మావోలకు ఎదురులేని గ్రామాల్లో కూడా పూర్తిగా పట్టుకోల్పోవడం, ఎ¯ŒSకౌంటర్లు, లొంగుబాట్ల ద్వారా ఉద్యమ తీవ్రత తగ్గిపోయింది. అయితే గతంలో దళాలుగా సంచరించిన మావోలు ప్రస్తుతం యాక్ష¯ŒS ప్లాటూన్లుగా సంచరిస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన మావోయిస్టు నాయకులు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది. వీరి నాయకత్వంలో స్థానిక క్యాడర్ పనిస్తున్నట్లు తెలుస్తున్నది. పట్టుకోల్పోయిన తూర్పు ఏజెన్సీలో తిరిగి ఉద్యమానికి జవసత్వాలు నింపేం దుకు వ్యూహరచన చేసే పనిలో మావోలు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఉద్యమంలో ఉన్న స్థానిక నాయకుల సూచనల మేరకు కార్యాచరణ రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మావోయిస్టుల ఉనికే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు పక్కా సమాచార వ్యవస్థ ద్వారా ఎప్పుడో మావోల నిధుల సమీకరణకు అడ్డుకట్ట వేశారు. వారి కదలికపై ఎప్పకప్పుడు పక్కా సమాచారాన్ని రాబట్టి కూంబింగ్ ముమ్మరం చేస్తున్నారు. మావోలు నిధుల సమీకరణపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. నోట్ల రద్దు వంటి కారణాల వల్ల మావోలకు నిధుల కొరత ఏర్పడిందనే అనుమానాలు లేకపోలేదు. మావోల కదలిలపై మారేడుమిల్లి సీఐను వివరణ కోరగా లోతట్టు ప్రాంతంలో కదలికలు ఉన్నట్లు వెల్లడించారు. మావోలకు వ్యతిరేకంగా ర్యాలీ రంపచోడవరం : మావోయిస్టులకు వ్యతిరేకంగా గురువారం రంపచోడవరంలో మోటార్ యూనియ¯ŒS ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆటో, లారీ, కార్లు యూనియా¯ŒS నాయకులు, సభ్యులు ర్యాలీ చేసి అమాయకులైన గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేయడం దారుణమన్నారు. ఇలాంటి దుశ్చర్యల వల్ల వారి కుటుంబాలు దిక్కులేని వారై రోడ్డున పడతాయని వాపోయారు. ఉద్యమం, హత్యల ద్వారా ఇప్పటి వరకు వారు సాధించి ఏమీ లేదన్నారు. -
భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి?
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా వారికి మావోయిస్టులు ఎదురు పడినట్లు ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. అయితే, అకాబీడా ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతున్న విషయం తెలిసి పక్కా సమాచారంతోనే పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. సమావేశంలో 50 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నారంటున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు వెళ్లి కాల్పులు జరిపారని, ఇందులో 12 మంది అక్కడికక్కడే మరణించారని చెబుతున్నారు. మరికొంతమంది కూడా గాయపడ్డారని, వారి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియలేదని చెబుతున్నారు. ఇటీవల ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 8 మంది జవాన్లు మరణించడంతో.. దానికి ప్రతీకారంగానే తాజా ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో మందుపాతర ఘటన ఈనెల రెండో తేదీన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ జవాన్లతో వస్తున్న బస్సును లక్ష్యంగా ఎంచుకొని ముందాభూమి వద్ద కల్వర్ట్ను పేల్చివేయడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా, మరో 25మంది వరకు గాయపడినట్లు సమాచారం. -
భారీ ఎన్కౌంటర్:12 మంది మావోయిస్టుల మృతి?
-
బస్తర్ అడవుల్లో మహిళా డైనమైట్
బస్తర్ అడవులు.. ఈ పేరు చెబితేనే తుపాకుల మోతలు, మందుపాతరల పేలుళ్లు, ఆదివాసీల తిరుగుబాట్లు ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతమైన ఇక్కడ పనిచేయాలంటే భద్రతాదళాలకు కత్తిమీద సామే. మావోయిస్టుల దాడులతో పాటు దోమకాటు వల్ల మలేరియా వచ్చి కూడా సీఆర్పీఎఫ్ తదితర బలగాల్లోని కొంతమంది సిబ్బంది మరణిస్తారు. అలాంటి చోట పనిచేయడానికి తొలిసారిగా సీఆర్పీఎఫ్లో ఒక మహిళా అధికారి ముందుకొచ్చారు. ఆమె పేరు ఉషా కిరణ్ (27). గిరిజన ప్రాంతాల్లో పనిచేసే సీఆర్పీఎఫ్ బలగాలు, సైన్యం పదేపదే అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కీలకమైన పీఆర్ బాధ్యతలలో ఆమెను నియమించారు. 2015 అక్టోబర్ నెలలో నిర్వహించిన ఓ ఆపరేషన్ సందర్భంగా 16 మంది గిరిజన మహిళలపై భద్రతా దళాలు అత్యాచారం చేశాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఒకవైపు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తేల్చిచెప్పిన సరిగ్గా రెండు రోజుల తర్వాత ఉషాకిరణ్ నియామకం జరిగింది. సీఆర్పీఎఫ్కు చెందిన 80వ బెటాలియన్లో అసిస్టెంట్ కమాండెంట్గా ఆమె పనిచేస్తున్నారు. ఆమె రాకముందు అసలు భద్రతాదళాలంటేనే గిరిజన మహిళలు వణికిపోయేవారు. కానీ, ఆమె వచ్చిన తర్వాత పరిస్థితి బాగా మారిందని బస్తర్ ప్రాంత సీఆర్పీఎఫ్ డీఐజీ సంజయ్ యాదవ్ చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి భద్రతాదళాలకు సులువుగా ఉంటోందన్నారు. ట్రిపుల్ జంప్ విభాగంలో జాతీయ స్థాయి క్రీడాకారణి అయిన ఉషాకిరణ్.. సీఆర్పీఎఫ్లో బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరు. మరో మహిళ అర్చనా గౌరా మాత్రం కొండగావ్ వద్ద పనిచేస్తున్నారు. అక్కడ మావోయిస్టుల ప్రభావం మరీ అంత ఎక్కువ ఉండదు. ఉషాకిరణ్ తండ్రి, తాత కూడా సీఆర్పీఎఫ్లో పనిచేసినవారే. దాంతో ఆమె సైతం ఈ బలగాల్లోకి రావడానికి ఆసక్తి చూపారు. ఆమె రావడం వల్ల బస్తర్ ప్రాంతంలో తమ పని చాలా సులువైందని దర్భా పోలీసు స్టేషన్ ఇన్చార్జి వివేక్ ఉయికె చెప్పారు. -
పోస్టర్లు తొలగిస్తుండగా పేలిన బాంబు
భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు వేసిన పోస్టర్లు తొలగించేందుకు వెళ్లిన ఓ మాజీ సర్పంచ్ మందు పాతర పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పోలంపల్లి వద్ద మావోస్టుల పోస్టర్లు వెలిశాయి. వాటిని తొలగించేకు మాజీ సర్పంచ్ ఒకరు వెళ్లారు. ఈ క్రమంలో మందుపాతర పేలి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని దోర్నాపాల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం, నల్లబెల్లి గ్రామాల్లో కూడా మావోయిస్టు వాల్పోస్టర్లు కనిపించాయి. వాటిని పోలీసులు తొలగించినట్లు సమాచారం. కానీ పోలీసులు ధ్రువీకరించలేదు. , -
మావోయిస్టుల డబ్బు మార్చడానికి వెళ్లి..
-
మావోయిస్టుల డబ్బు మార్చడానికి వెళ్లి..
మహబూబ్నగర్: పాతనోట్లు మార్చుకోవడానికి యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 12లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు మావోయిస్టులకు చెందిందిగా గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఖమ్మం జిల్లా చర్లకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు, మక్తల్ మండలం మథన్గోడ్కు చెందిన ఓ పోస్టుమాస్టర్ సాయంతో డబ్బులు మార్చుకోవడానికి యత్నిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా మావోయిస్టులే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల సమాచారం ప్రకారం వారి వద్ద మొత్తం పాత డబ్బే ఉందట. ఆ కారణంగానే వారి నిత్యవసరాలు కూడా తీరని పరిస్థితి నెలకొందని, దాంతోనే వారిలో చాలామంది లొంగిపోతున్నారని కూడా ఇప్పటికే కేంద్రం కూడా తెలిపింది. -
సంతల్లో మావోయిస్టుల నోట్ల మార్పిడి
- ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు - రూ.70 వేల నగదు స్వాధీనం చర్ల: పెద్ద నోట్ల రద్దు కష్టాలు మావోయిస్టులకు కూడా తప్పడం లేదు. వారు నగదు మార్పిడి కోసం ఆదివాసీలు, గిరిజనులను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఇద్దరు మావోయిస్టుల సానుభూతిపరులు అరెస్టు అవడంతో ఈ విషయం బయటపడింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణతో ఇద్దరు సానుభూతిపరులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద చర్ల పోలీసులు తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తున్న చర్లకు చెందిన గాదంశెట్టి రాజేష్, అజిత్ అనే ఇద్దరు సానుభూతిపరులను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి నిత్యావసర వస్తువులు, ప్రభుత్వం రద్దు చేసిన రూ.500 నోట్లు రూ. 70 వేల రూపాయల నగదును, ఏకే 47 విజిల్ కార్డులు 20 స్వాధీనం చేసుకున్నారు. పామేడు, బిజాపూర్, సుకుమా నుండి వారపు సంతలలో అధిక మొత్తంలో ఆదివాసీల ద్వారా మావోయిస్టులు తమ వద్ద ఉన్న డబ్బును మార్పిడి చేసుకుంటున్నారని చర్ల సీఐ సాయిరామన్ తెలిపారు. వారికి సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
మల్కాన్గిరికి వెళ్లనున్న ఓయూ జేఏసీ
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల విద్యార్థులు మల్కాన్గిరి ఎన్కౌంటర్ ప్రాంతానికి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఓయూ జాక్ ఫర్ సోషల్ జస్టిస్ గురువారం ప్రకటించింది. ఏవోబీ జరిగిన ఎన్కౌంటర్ను బూటకమైనదిగా జేఏసీ అభివర్ణించింది. అన్ని యూనివర్సిటీల పరిశోధన విద్యార్థులు ఈ నెల 6వ తేదీన అక్కడికి వెళ్లి ఘటనపై నిజనిర్ధారణ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు చనిపోయిన మావోయిస్టులు మరియు పోలీసు కుటుంబాల వారితో మాట్లాడనున్నట్లు తెలిపింది. భూటకపు ఎన్కౌంటర్పై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. త్వరలోనే హైదరాబాద్లో మానవహక్కుల సంఘాలతోపాటు ప్రజా సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు జాక్ తెలిపింది. -
ఇంతకీ ఆర్కే ఎక్కడ ?
-
ఏవోబీ ఎన్కౌంటర్ బూటకం
ఒంగోలు: మావోయిస్టు అగ్రనేత ఆర్కే (అక్కిరాజు హరగోపాల్) కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా అంత్యక్రియలకు విరసం నేత కల్యాణ్ రావ్ హాజరయ్యారు. ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని కల్యాణ్ రావు మండిపడ్డారు. ఎన్కౌంటర్ చేసిన వారిపై హత్య కేసు నమోదు చేయాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఎన్కౌంటర్ చేసిన వారిపై హత్య కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. ఏవోబీ ఎన్కౌంటర్ బూటకమని ఆర్కే భార్య శిరీష ఆరోపించారు. ఎన్కౌంటర్ పేరుతో ఎంతో మంది తల్లులు కడుపు కోతకు గురయ్యారన్నారు. -
ఈసారి బాబు తప్పించుకోలేరు: మావోయిస్టులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేనెపూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ అన్నారు. ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్కౌంటర్ జరిగిందని అన్నారు. కోవర్టుల ద్వారా అన్నంలో విషం కలిపించి, పడిపోయిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపారని ఈ విషయమై బుధవారం విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. కోవర్టు హత్యల సృష్టికర్త చంద్రబాబు, అతని హంతక పోలీసు ముఠా ద్వారానే ఏఓబీ దారుణ హత్యాకాండ కూడా జరిగిందన్నారు. చడీప్పుడు లేకుండా చంద్రబాబు జరిపించిన దారుణ మారణకాండ అని అభివర్ణించారు. నయీంను మనిషిరూపంలో ఉన్న రాక్షసుడిగా తయారుచేసి, 15 ఏళ్ల పాటు వందలాది హత్యలు చేయించిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు రక్తం వాసనకు దూరంగా ఉన్న చంద్రబాబు గద్దె ఎక్కిన మర్నాడే 21 మంది ఎర్రచందనం కూలీలను దుర్మార్గంగా తన పోలీసులతో హత్య చేయించారని ఆరోపించారు. కోవర్టు పేరుతో పోలీసులతో వేలాదిమందిని బలితీసుకుని నిత్యం హత్యలతో రక్తం పారిస్తున్నారని అన్నారు. అలిపిరిలో తప్పించుకున్నావు గానీ.. ఈసారి నీవు, నీ కొడుకు తప్పించుకోలేరని ఆ లేఖలో హెచ్చరించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తామని, పోలీసులు - మిలటరీ ఎల్లకాలం ఆయనను కాపాడలేవని అన్నారు. అయితే, మావోయిస్టుల పేరుతో విడుదలైన ఈ లేఖలో ఉపయోగించిన భాష మాత్రం మావోయిస్టులు తరచుగా ఉపయోగించే భాషలా లేదు. దానికి పూర్తి భిన్నంగా ఉంది. దాంతో అసలు ఈ లేఖ నిజమైన మావోయిస్టులు విడుదల చేసిందేనా, లేదా ఏదైనా ఫేక్ లేఖనా అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. -
ఆ సమయంలో ఆర్కే అక్కడ లేరు...
మల్కన్గిరి : ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కానీ, అరుణ కానీ లేరని, ఆర్కే కుమారుడు మున్నా మాత్రం ఎన్కౌంటర్లో మరణించినట్లు మల్కన్గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ తెలిపారు. కూంబింగ్కు వెళ్లిన పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ వారు వినకుండా కాల్పులు ప్రారంభించారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు జరపడం వల్ల ఇంతమంది చనిపోయారని చెప్పారు. మల్కన్గిరి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఎన్కౌంటర్లో కొందరు తీవ్రంగా గాయపడి తప్పించుకు పారిపోయారన్నారు. ఒక్కరు కూడా తమకు లొంగిపోలేదని పేర్కొన్నారు. బూటకపు ఎన్కౌంటర్ ఎంతమాత్రం కాదన్నారు. చట్టప్రకారం, ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం మృతదేహాలను 72 గంటల పాటు భద్రపరుస్తామని, మృతుల సంబంధీకులు వస్తే అప్పగిస్తామని చెప్పారు. విజయనగరంలో ఉంటున్న మురళి కుటుంబసభ్యులు మాత్రమే ఇప్పటికవరకు తమను ఫోన్లో సంప్రదించారని, మృతదేహాన్ని తీసుకువెళతామని చెప్పారని తెలిపారు. కాగా ఏవోబీ ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం 28మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
15 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 15 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. బస్తర్ అటవీ ప్రాంతంలోని జగదల్పూర్ పోలీసులు ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిపై ఉన్న రివార్డును వారికి అందజేస్తామని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
హైదరాబాద్: ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో మంగళవారం వేకువజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఎస్పీ ఎలిసెల కల్యాణ్ తెలిపిన వివరాలివీ.. కుంట పట్టణ శివారులో ఉన్న పోటా క్యాబిన్ స్కూల్ సమీపంలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు ఆయుధాలతో సంచరిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పరస్పరం కాల్పులు జరిగాయి. అనంతరం వేకువజామున 4 గంటల ప్రాంతంలో అటవీప్రాంతంలోకి కొందరు పారిపోయారు. ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టగా ఒక మావోయిస్టు మృతదేహం కనిపించింది. ఒక తుపాకీ, ఒక పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన నక్సల్ను గుర్తించాల్సి ఉంది.