ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి | Three Mao killed in encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి

Published Mon, Mar 26 2018 4:38 AM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM

Three Mao killed in encounter - Sakshi

మల్కన్‌గిరి: ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా డోగ్రీఘాట్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు ఐజీ ఎస్‌ షైనీ తెలిపారు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్‌ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఆ ప్రాంతంలో కిట్‌ బ్యాగులు, తుపాకులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. కొరాపుట్‌ జిల్లాలో 24 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement