Encounter
-
తెలంగాణ సరిహద్దులో ఎన్కౌంటర్..కానిస్టేబుల్ మృతి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారం(ఫిబ్రవరి11)జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ మహేష్ నాగుల్వార్ మృతి చెందారు. మహేష్ను ఘటనాస్థలం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మహేష్ మృతిచెందారు.కాగా,ఇటీవలే గడ్చిరోలి ప్రాంతానికి చెందిన పలువురు మావోయిస్టు అగ్రనేతలు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే.అయినా గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గలేదనడానికి ఈ ఎన్కౌంటరే నిదర్శనమన్న వాదన వినిస్తోంది.మరోవైపు రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 30 మంది దాకా మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్కు సంబంధించిందిగా చెప్తున్న హెలికాప్టర్లో నుంచి తీసిన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. -
ఎరుపెక్కిన ఇంద్రావతి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. అక్కడి ఇంద్రావతి నేషనల్ పార్క్లో ఆదివారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఇంద్రావతి ఏరియా కమిటీలు ఒకేచోట సంచరిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీనితో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ఫోర్స్లకు చెందిన జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వా«దీనం చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణ నేతలు? ఛత్తీస్గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ షెల్టర్ తీసుకోగా, ఇంద్రావతి ఏరియా కమిటీ రక్షణగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీనితో వివిధ భద్రతా దళాలకు చెందిన 650 మందికిపైగా జవాన్లు వేర్వేరు దిశల నుంచి శుక్రవారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. శనివారం రాత్రికల్లా మావోయిస్టులు బస ప్రదేశాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఎన్కౌంటర్ మృతుల్లో ఎక్కువ మంది జనమిలీషియా సభ్యులే ఉన్నట్టు సమాచారం. వారితోపాటు తెలంగాణ కమిటీకి చెందిన కీలక నేత కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మొదలైతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. టార్గెట్ చేసి.. రెండో సారి.. భద్రతా దళాలు కొన్ని నెలలుగా మావోయిస్టు తెలంగాణ కమిటీ టార్గెట్గా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవులను జల్లెడపట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలినవారు తప్పించుకున్నారు. ఆ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి తెలంగాణ కమిటీ లక్ష్యంగా ఇంద్రావతి నేషనల్ పార్క్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దండకారణ్యంపై భద్రతా దళాల పట్టు మావోయిస్టులు స్థాపించిన జనతన సర్కారుకు దండకారణ్యమే కేంద్ర బిందువుగా నిలిచింది. కానీ గడిచిన ఏడాదిలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని క్రమంగా తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంటున్నాయి. గత ఏడాది చివరిలో కొండపల్లిలో భద్రతా దళాల క్యాంపు ఏర్పాటైన తర్వాత.. దండకారణ్యం తమకు సురక్షితం కాదని మావోయిస్టులు నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న వివిధ కమిటీలు, దళాలకు చెందిన కీలక నేతలు సమీపంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు తరలివెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. టైగర్ రిజర్వ్లపై ఫోకస్ ఇంద్రావతి నేషనల్ పార్క్ 2,779 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీన్ని 1983లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. మావోయిస్టుల అడ్డాలైన అబూజ్మడ్, దండకారణ్యం మధ్య ఈ అడవి వారధిగా నిలిచింది. ఇందులో సగానికిపైగా మావోయిస్టుల ఆ«దీనంలోనే ఉంది. ఫారెస్టు గార్డులు కూడా అక్కడ కాలు పెట్టలేని పరిస్థితి ఉందని అంటారు. ఇలా టైగర్ రిజర్వులలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులపై కొన్నేళ్లుగా భద్రతా దళాలు ఫోకస్ చేశాయి. ఇంతకుముందు ఉదంతి – సీతానది టైగర్ రిజర్వ్లో భాగంగా ఉన్న ఘరియాబండ్ అడవుల్లో జనవరి 24న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సహా 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు ఇంద్రావతి రిజర్వు ఫారెస్ట్లో ఏకంగా 31 మంది మృతి చెందారు. గడువు కంటే ముందే మావోయిస్టుల అంతం: అమిత్షామావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్కు ‘ఇంద్రావతి’తో భారీ విజయం దక్కిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గడువుగా పెట్టుకున్న 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నారు. ఎన్కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆ జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా దళాలకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు.40 రోజుల్లో 81 మంది మృతిఛత్తీస్గఢ్లో ఈ ఏడాది మొదలైన 40 రోజుల్లో 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. అందులో 65 మంది బస్తర్లో జరిగిన ఘటనల్లో కన్నుమూశారు. గతేడాది ఛత్తీస్గఢ్లో 217 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. -
భారీ ఎన్కౌంటర్పై అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ:ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో ఆదివారం(ఫిబ్రవరి 9) జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు.ఈ ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే క్రమంలో భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని తెలిపారు.‘ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్లోనే పెద్దఎత్తున ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. నక్సలిజాన్ని అంతం చేసే క్రమంలో ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లనూ కోల్పోయాం.ఆ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
ఛత్తీస్ ఘడ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్
-
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అడవుల్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన జవాన్లను హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజాపూర్ జిల్లా కేంద్రంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నెలరోజుల్లో 100 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతిచెందారు. మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, నారాయణ్పూర్, బస్తర్ సహా పలు మావోయిస్టులు హవా ఉన్న జిల్లాల్లో భద్రతా బలగాలు, పోలీసుల ఆపరేషన్లు వేగవంతం చేశాయి. భద్రతా బలగాలు.. నక్సల్స్ ఎదురుపడగానే కాల్పులు జరుపుతున్నాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు.ఈ ఎన్కౌంటర్లలో భారీగా నక్సల్స్ మృతి చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు, నక్సల్స్కు జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మందికిపైగా మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో మరో మావోయిస్టు అగ్రనేత కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. -
జమ్ముకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్..ఏడుగురు ఉగ్రవాదులు హతం
పూంచ్:జమ్ముకశ్మీర్లోని సరిహద్దు(ఎల్వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగింది. పూంచ్ జిల్లాలోని క్రిష్ణఘాటి సెక్టార్లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు దాకా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లే కావడం గమనార్హం.పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి సరిహద్దు ద్వారా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవడానికి సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు మృతి చెందారు. ఫిబ్రవరి5వ తేదీని కాశ్మీర్ లిబరేషన్ డేగా పాకిస్తాన్ జరుపుకుంది. ఈ నేపథ్యంలో అదే రోజు పాక్ ఆర్మీకి చెందిన జవాన్లు భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం పట్ల సైన్యం అప్రమత్తమై వారి ప్రయత్నాన్ని అడ్డుకుంది.ఇటీవల జమ్ముకశ్మీర్లో వరుస ఘటనల్లో పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ ఎన్కౌంటర్లలో పలువురు జవాన్లు కూడా గాయపడ్డారు. డిసెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమైన విషయం తెలిసిందే. -
ఎన్కౌంటర్లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు
కోట: రాజస్థాన్లోని కోటలో జరిగిన ఎన్కౌంటర్ ఊహించని మలుపుతిరిగింది. ఎన్కౌంటర్లో మృతిచెందాడని భావిస్తున్న 24 ఏళ్ల నేరస్తుడు బతికే ఉన్నాడని, ఇప్పటికీ పరారీలో ఉన్నాడని తేలిడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆదివారం నాడు పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టినప్పుడు అతను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు భావించారు. అయితే ఈ ఉదంతంలో చోటుచేసుకున్న మలుపును పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరస్తుడు రుద్రేష్ అలియాస్ ఆర్డీఎక్స్ ఆదివారం నాడు కోట పరిధిలోని నయా నోహ్రాలోని ఒక ఇంట్లో దాక్కున్నప్పుడు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో రుద్రేష్ తనను తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నడని పోలీసులు భావించారు. కాగా ఆ సమయంలో రుద్రేష్ సహచరుడు కూడా అదే ఇంట్లో ఉన్నాడు.ఈ ఘటన అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే సోమవారం రుద్రేష్ కుటుంబ సభ్యులు మృతుడిని ప్రీతమ్ గోస్వామి అలియాస్ టీటీగా గుర్తించారు. అతను కూడా పేరుమోసిన నేరస్తుడేనని డిఎస్పీ లోకేంద్ర పలివాల్ తెలిపారు. ఇంతలో రుద్రేష్ తన స్నేహితుల్లో ఒకరికి పోన్ చేసి, తాను బతికే ఉన్నానని తెలియజేశాడు. ఈ విషయాన్ని ఆ మిత్రుడు రుద్రేష్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.సీసీటీవీ ఫుటేజ్లోని ఫీడ్ ప్రకారం పోలీసు బృందం రాకముందే రుద్రేష్ అక్కడి నుంచి పారిపోయాడని డీఎస్పీ తెలిపారు. అతని ముఖం ఛిద్రమై ఉండటం, గదిలో అతని వస్తువులు కొన్ని కనిపించడంతో, ఆ మృతదేహాన్ని పోలీసులు రుద్రేష్గా గుర్తించారు. పోలీసులు రుద్రేష్ ఇంటి నుంచి మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రుద్రేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు -
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్
చత్తీస్గఢ్: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. గంగలూర్ పీఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.కాగా, గత నెల ఛత్తీస్గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్లో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. -
అక్కడ ఎన్కౌంటర్.. ఇక్కడ కలకలం
ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఆరు రోజుల కిందట జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించగా.. మృతుల్లో కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గంగానది పేరిట వెలువడిన ప్రకటనతో గందరగోళం ఏర్పడింది. ఈ విషయమై దామోదర్ కుటుంబసభ్యులకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారమూ లేకపోగా, మూడు రోజుల ఆందోళన తర్వాత దామోదర్ క్షేమంగానే ఉన్నాడన్న వార్త కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ఊరట కలిగించింది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు నౌపాడ, గరియాబాద్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఛత్తీస్గఢ్ ఇన్చార్జ్ రాంచంద్రారెడ్డి అలియాస్ చలపతితోపాటు 20 మంది వరకు మృతి చెందినట్టు పోలీసులు మంగళవారం ప్రకటించారు. వరంగల్, కాజీపేట ప్రాంతాలకు చెందిన మోడెం బాలకృష్ణ, ఎం.సాంబయ్యలు కూడా మృతుల్లో ఉన్నట్టు మీడియా ద్వారా ప్రచారం జరిగింది. ఆ ఇద్దరి కుటుంబసభ్యులు, బంధువులు ఫోన్ల ద్వారా పలువురిని ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదించి చివరకు లేరని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్ : ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు.. అబూజ్మడ్ దండకారణ్యం.. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తెలంగాణ పల్లెల్లో కలకలం రేపుతున్నాయి. సీపీఐ (మావోయిస్టు) పార్టీ దండకారణ్య కమిటీల్లో ఇప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన వారే కీలకంగా వ్యవహరిస్తుండగా, ప్రతీ ఎదురుకాల్పుల సంఘటనలో ఒక్కరిద్దరు ఉంటున్నారు. దీంతో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఎదురుకాల్పుల సంఘటనలు మావోయిస్టుల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో పోలీసులు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబాలను కలిసి జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని కౌన్సెలింగ్ చేస్తుండగా, మావోయిస్టులు మాత్రం పోరుబాటలోనే సాగుతున్నారు. మోస్ట్ వాంటెడ్ల్లో వరంగల్ వారే 23 మంది తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ తదితర 11 రాష్ట్రాల్లో పని చేస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతల వివరాలపై కేంద్ర హోంశాఖ గతేడాది మార్చిలో ఆరా తీసింది. తెలంగాణలోని పాత 10 జిల్లాల నుంచి 64 మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలలో పనిచేస్తున్నట్టు తేలిందని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 23 మంది అజ్ఞాతంలో ఉన్నట్టు ప్రకటించింది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల నేతల వివరాలను జిల్లాలు, పోలీస్స్టేషన్ల వారీగా ఇటీవల ఎన్ఐఏ కూడా ఆరా తీసింది. హనుమకొండ, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి అజ్ఞాతంలో ఉన్న నేతల వివరాలను మోస్ట్వాంటెడ్ జాబితాలో చేర్చారు. ఇందులో కేంద్ర కమిటీతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, దండకారణ్యం కమిటీల్లో కీలకంగా ఉన్న మోడం బాలకృష్ణ అలియాస్ మహేశ్, బాబన్న, గాజర్ల రవి అలియాస్ గణేష్, బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, గాదె రాజు, సుంకరి రాజ్, గీరెడ్డి పవనానందరెడ్డి అలియాస్ అర్జున్, ఉల్లెంగుల యాకయ్య అలియాస్ అంజన్న, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ముప్పిడి సాంబయ్య అలియాస్ బాబన్న, అంకేశ్వరపు సారయ్య అలియాస్ ఎల్లన్నలతోపాటు మొత్తం 23 మంది పేర్లను వెల్లడించారు. కేంద్ర కమిటీల్లో కీలకంగా తెలంగాణ నేతలు సీపీఐ (మావోయిస్టు) పారీ్టలో కేంద్ర కమిటీ సభ్యులతోపాటు వివిధ బాధ్యతల్లో తెలంగాణకు చెందిన పలువురు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) విలీనం సమయంలో 32 మందితో ఉన్న కేంద్ర కమిటీ ఆ తర్వాత అనేక కారణాల వల్ల 24 మందికి చేరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. సెంట్రల్ రీజినల్ బ్యూరోగా ఉన్న కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరణం తర్వాత కమిటీ పునరుద్ధరణ జరిగినట్టు చెబుతున్నారు. కాగా, ఈ 24 మందిలో తొమ్మిది మంది జార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందినవారు కాగా, 15 మందిలో 12 మంది తెలంగాణ వారే. కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు నియామకం తర్వాత, అప్పటివరకు కేంద్రకమిటీ కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి.. ప్రస్తుతం సీసీ మెంబర్గా, అంతర్జాతీయ విప్లవపార్టీల సమాఖ్యకు ఇన్చార్జ్గా ఉన్నట్టు సమాచారం. -
భారీ ఎన్ కౌంటర్.. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు
-
ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్.. 16 మంది మావోయిస్టులు మృతి
-
గెరిల్లా సేనాని చలపతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చిత్తూరు అర్బన్/ మల్కన్గిరి: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్రెడ్డి అలియాస్ అప్పారావు మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఇలా ఎన్కౌంటర్లో మృతిచెందడం మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. చలపతిపై రూ.కోటి రివార్డు ఉన్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించి... ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పైపల్లెకు చెందిన శివలింగారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు చలపతి. ఆయన తండ్రి సాధారణ రైతు. వారికి మత్యం పైపల్లెలో ఇప్పటికీ సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో చలపతి అన్న కుమారుడి కుటుంబం నివసిస్తోంది. ప్రాథమిక విద్యను మత్యంలోనే అభ్యసించిన చలపతి.. పదో తరగతి వరకు బంగారుపాళెం, డిగ్రీ ఒకేషనల్ కోర్సును చిత్తూరులో పూర్తిచేశారు. పీపుల్స్వార్ పార్టీకి ఆకర్షితుడై 1990–91లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసు రికార్డుల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మావోయిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారు. శ్రీకాకుళం– కోరాపుట్ డివిజన్ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన.. గెరిల్లా వార్ఫేర్లో చూపిన ప్రతిభతో అనతి కాలంలోనే డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 2000 నాటికి ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ, ఏవోబీ స్టేట్ మిలిటరీ కమిషన్లలో సభ్యుడి హోదా పొందారు. 2010లో తోటి మావోయిస్టు అరుణ అలియాస్ చైతన్యను వివాహం చేసుకున్నారు. 2012లో జరిగిన ఒక దాడిలో చలపతి పొరపాటు కారణంగా ఒక కామ్రేడ్ చనిపోవడంతో పార్టీ ఆయనను కొంతకాలం డీమోట్ చేసింది. చలపతి భార్య అరుణ 2019 మార్చిలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతి చెందారు. మహేంద్ర కర్మపై దాడితో మళ్లీ తెరపైకి... సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై 2015లో చేసిన దాడితో చలపతి మరోసారి వెలుగులోకి వచ్చారు. తరా>్వత మావోయిస్టు రీజనల్ కమిటీ చీఫ్ కుడుముల వెంకట రమణ అలియాస్ రవి ఎదురుకాల్పుల్లో మృతి చెందడం, గెమ్మెలి నారాయణరావు అలియాస్ జాంబ్రి 2017లో చనిపోవడంతో.. చలపతికి ప్రాధాన్యత దక్కింది. తర్వాతి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. 2003లో దమాన్జోడి మైన్స్ కంపెనీపై దాడి, మాచ్ఖండ్ పోలీసుస్టేషన్పై దాడి, చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత, 2009లో ఏపీ గ్రేహౌండ్స్పై చిత్రకొండ జలాశయంలో దాడి, 2018లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యను ప్లాన్ చేసినది చలపతేనని చెబుతారు. 2011లో చలపతి ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కలెక్టర్ వినీల్కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆర్కే సన్నిహితుడిగా.. హిడ్మాకు గురువుగా.. మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్స్లో ఒకరిగా చలపతికి గుర్తింపు ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు అత్యంత సన్నిహితంగా చలపతి మెలిగారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్గా ఉన్న మడావి హిడ్మాకు చలపతిని గురువుగా పేర్కొంటారు. ఆయన ఎలా ఉంటారనేది చాలా కాలం పాటు పోలీసులకు తెలియలేదు. 2016లో ఓ మావోయిస్టు చనిపోగా.. అతడి ల్యాప్టాప్లో చలపతి, ఆయన సహచరి అరుణ సెల్ఫీ వీడియో లభించింది. -
'దండకారణ్యం' నెత్తురోడింది
చర్ల/ మల్కన్గిరి/ సాక్షి, పాడేరు: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మృతి చెంది వారం తిరగకముందే.. ఛత్తీస్గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్లో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య 25 నుంచి 30 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తర్వాత కూడా ఎదురుకాల్పులు, కూంబింగ్ కొనసాగుతూ ఉండటంతో బుధవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 19వ తేదీ నుంచే కూంబింగ్.. దండకారణ్యంలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు సమావేశం అయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. ఛత్తీస్గఢ్కు చెందిన సీఆర్పీఎఫ్, కోబ్రా, డి్రస్టిక్ట్ ఫోర్స్, ఒడిశాకు చెందిన ఎస్ఓజీ (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్) బలగాలు ఈ నెల 19 నుంచి సరిహద్దుల్లో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 20వ తేదీన ఉదయం పోలీసు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ మొదలైంది. తొలిరోజు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను రంగంలోకి దింపి.. సోమవారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. మంగళవారం తెల్లవారుజామున మళ్లీ మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ ఎన్కౌంటర్లో 14 మంది మృతి చెందారు. రెండు రోజుల్లో కలిపి మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 16కు పెరిగింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా మృతుల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చలపతి మృతిపై స్పష్టత ఇచ్చిన పోలీసులు మిగతా వారి వివరాలను వెల్లడించలేదు. మృతుల సంఖ్య 25 – 30 మంది వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. 1,500 మంది.. 15 కిలోమీటర్ల సర్కిల్గా.. ఛత్తీస్గఢ్, ఒడిశాలకు చెందిన సుమారు 1,500 మంది పోలీసు బలగాలు కులారీఘాట్ అడవిని చుట్టుముట్టాయి. సుమారు 15–20 కిలోమీటర్ల సర్కిల్గా ఏర్పడి... కూంబింగ్ చేపడుతూ దగ్గరికి వచ్చాయి. సుమారు ఐదు కిలోమీటర్ల సర్కిల్లోకి రాగానే మావోయిస్టులు తారసపడినట్టు తెలిసింది. ఎన్కౌంటర్లో మరణించిన చలపతి సెంట్రల్ కమిటీ సభ్యుడు కావడంతో ఆయనకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ముందు వరుసలో సెంట్రీలు కాపలాగా ఉంటే చివరి వరుసలో ఫీల్డ్ పెట్రోలింగ్ టీమ్ రక్షణగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాంబులు అమర్చి ఉంటాయి. అయితే అగ్రనేతలు ఉన్నారనే పక్కా సమాచారంతోనే భద్రతా వలయాన్ని ఛేదించుకుని బలగాలు దాడి చేసినట్టు తెలిసింది. ఘటనాస్థలంలో ఇప్పటివరకు పది వరకు ఐఈడీలను గుర్తించి తొలగించినట్టు సమాచారం. సరిహద్దుల్లో హైఅలర్ట్! కులారీఘాట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటన జరిగిన ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీస్ స్టేషన్లు, ఔట్పోస్టుల పరిధిలో రెడ్ అలర్ట్ అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపి కూంబింగ్ చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతోనూ నిఘా పెట్టారు. -
మావోయిజం చివరి దశలో ఉంది: అమిత్ షా
-
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై అమిత్ షా ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సలిజం చివరి దశలో ఉందన్న అమిత్.. మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్లో పేర్కొన్నారు.మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్న అమిత్షా.. నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగని.. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కీలక నేతలు కూడా మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్ ఉన్నారు. గతంలో వారిపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డ్ ప్రకటించింది. ఇదీ చదవండి: భారీ ఎన్కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత చలపతి మృతిమావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఇవాళ మధ్యాహ్నానికి 19కి పెరిగింది. భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…— Amit Shah (@AmitShah) January 21, 2025 -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్
-
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత చలపతి మృతి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్గఢ్, ఒడిశా భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. కోబ్రా బెటాలియన్, సీఆర్పీఫ్ సిబ్బంది కూంబింగ్లో పాల్గొన్నారు. కుటరిఘాట్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.ఈ ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు జైరామ్ అలియాస్ చలపతి మృతి చెందారు. చలపతిపై రూ.కోటి రివార్డ్ ఉంది. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్తో పాటు భారీ ఎత్తున ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల 19 నుంచి రెండు రాష్ట్రాల బలగాల ఉమ్మడి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రెండు రోజులుగా ఛత్తీస్గఢ్, ఒడిశా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. నిన్న, ఇవాళ ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు.కాగా, తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్లో గత గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఘటనలో బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు.తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు.ఇదీ చదవండి: బాయ్ఫ్రెండ్ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు! -
పానమంతా నీ మీదనే ఉన్నది.. ఓసారి కనపడు బిడ్డా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలు.. అజ్ఞాతంలోకి వెళ్లిన తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ మావోయిస్టుల జాడ నేటికీ తెలియలేదు. ఉడుకురక్తం.. విప్లవ భావాలతో 80, 90వ దశకంలో అడవిబాట పట్టిన ఆనాటి పట్టభద్రులు దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి దశ, దిశలా మారారు. కేంద్ర కమిటీ సభ్యులుగా.. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీల్లో నూ కీలకంగా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల వేట తీవ్రం కావడంతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా దండకారణ్యాల్లోకి వలస వెళ్లారు. అక్కడ నుంచే ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయితే కరోనా అనంతరం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు కీలక నేతలు అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్యం కారణంగా అడవిలోనే తనువు చాలిస్తుంటే.. మరికొందరు ఎదురుకాల్పుల్లో మరణిస్తున్నారు. దీంతో మిగిలిన వారు ఎలా ఉన్నారో? అనే ఆందోళన ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్లో నెలకొంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ మరణించారన్న వార్తల నేపథ్యంలో కీలక నేతలందరి బంధువులు వారి క్షేమం గురించి ఆందోళన చెందుతున్నా రు. తాము చనిపోయేలోగా వారిని ఒక్కసారైనా కళ్లారా చూసుకోవాలని తాపత్రయపడుతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే అధికంఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీకి మాస్టర్మైండ్గా వ్యవహరిస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పోతుల కల్పన అలియాస్ సుజాత (65) అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. ఆమె మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ రాంజీ భార్య. పెద్దపల్లి జిల్లాకు చెందిన కంకణాల రాజిరెడ్డి, మల్లోజుల వేణుగోపాల్రావు, మల్లా రాజిరెడ్డి, పూల్లూరి ప్రసాదరావు, జగిత్యాలకు చెందిన తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణరెడ్డి (సిరిసిల్ల) వంటి నేతలు కేంద్ర కమిటీ సభ్యులుగా ఛత్తీస్గఢ్, ఒడిశా, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే అధికంగా ఉన్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గాజర్ల రవి (జయశంకర్ భూపాలపల్లి), మోడెం బాలకృష్ణ (హనుమకొండ) సెంట్రల్ కమిటీ మెంబర్, కందగట్ల యాదగిరి (హనుమకొండ) స్టేట్ కమిటీ మెంబర్, ముప్పిడి సాంబయ్య (హనుమకొండ) స్టేట్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు.భర్త జాడ చెప్పండినా భర్త బెజ్జారపు కిషన్ 38 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆయన ఆచూకీ దొరకలేదు. దీనిపై ఎన్నోసార్లు మావోయిస్టు వర్గాలకు, పోలీసులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. ఇప్పటికైనా నా భర్త ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో చెప్పాలి. ఆయన కోసమే ఇంకా బతికున్నా. – బెజ్జారపు పుష్పబడే దామోదర్కు ఏమైంది?» సంఘటనా స్థలంలో మావోయిస్టు అగ్రనేత గాయపడినట్టుగాసమాచారం» చనిపోయాడని అధికారికంగానిర్ధారించని పోలీస్ యంత్రాంగం» ఫేక్ లేఖ అంటున్న దామోదర్ అనుచర వర్గాలుములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్కు ఏమైందంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లోని పూజారి కాంకేర్– మారేడుపాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో దా మోదర్ మృతి చెందాడని శనివారం మావోయిస్టుపార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట విడుదలైన లేఖ ఫేక్ అంటూ దామోదర్ అనుచరులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో దామోదర్ అక్క డే ఉన్నారని, ఆ సమయంలో గాయాలపాలైన ఆయన్ను అనుచరులు భద్రంగా మరోచోటకు తరలించినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం దామోదర్ ఆరో గ్యం నిలకడగా ఉందని, ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదని సమాచారం. సాధారణంగా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కుటుంబాలకు పోలీస్శాఖ తరఫున మరణవార్త తెలపడంతోపాటు మృతదేహాన్ని అప్పగిస్తారు. దామోదర్ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా పోలీస్శాఖ తరఫున కాల్వపల్లిలోని దామోదర్ తల్లి బతుకమ్మ, కుటుంబ సభ్యులకు, ములుగు జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో దామోదర్కు ఎలాంటి హాని జరగలేదని, కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాల్వపల్లివాసులు వాపోతున్నారు. -
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..ఎన్కౌంటర్లో అగ్రనేత మృతి
సాక్షి,హైదరాబాద్:మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు.ఛత్తీస్గఢ్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ శనివారం(జనవరి18) ఓ లేఖను విడుదల చేసింది.దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. దాదాపు 30 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆయన పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. ఆయనపై ఛత్తీస్గఢ్లో50 లక్షల రివార్డు కూడా ఉంది. తెలంగాణలోనూ 25లక్షల రివార్డు ఉంది.ఆరు నెలల క్రితమే ఆయన తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.మావోయిస్టు యాక్షన్ టీమ్లకు ఆయన ఇన్చార్జిగానూ ఉన్నారు.తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఘటన.. బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావో యిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పడుతుండగా మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల్లో దామోదర్ కూడా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ తాజాగా ప్రకటించింది. -
సైఫ్ ఇంటికి ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్పై (Saif Ali Khan) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబయలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే దర్యాప్తులో భాగంగా ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సైఫ్ ఇంటిని పరిశీలించారు. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ఇప్పటికే ఈ దాడిలో ఇద్దదు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సైఫ్ ఇంటిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ (Daya Nayak) కూడా ఉన్నారు. బాంద్రాలోని సైఫ్ ఉంటున్న అపార్ట్మెంట్కు వచ్చిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కాగా.. ముంబయి అండర్వరల్డ్ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా దయా నాయక్కు పేరుంది.అసలు ఎవరీ దయా నాయక్..కర్ణాటకలోని ఉడిపి దయా నాయక్ స్వస్థలం. 1979లో ఆయన ఫ్యామిలీ ముంబయి షిఫ్ట్ అయింది. అక్కడే అంధేరిలోని కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1995లో పోలీస్ పరీక్షల్లో విజయం సాధించారు. మొదటిసారి ముంబయిలోని జుహు పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధుల్లో చేరారు.దయా నాయక్ ఉద్యోగంలో చేరేసరికి అండర్వరల్డ్ పేరుతో ముంబయిలో హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే చోటా రాజన్ గ్యాంగ్లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. డిపార్ట్మెంట్లోనూ ఆయన పేరు ఓ రేంజ్లో వినిపించింది. అండర్ వరల్డ్ నెట్వర్క్కు పనిచేస్తున్న దాదాపు 80 మందిని దయా నాయక్ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం.सैफ अली खान पर हमले पर मुंबई पुलिस अधिकारी दया नायक ने कहा...#SaifAliKhan #KareenaKapoorKhan #SaraAliKhan #IbrahimAliKhan #MumbaiPolice #mumbaiattack #DayaNayak pic.twitter.com/RVCEl7qzxJ— CNBC-AWAAZ (@CNBC_Awaaz) January 16, 2025 -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..నలుగురు మావోయిస్టుల మృతి
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు,ఒక జవాను మృతి చెందారు. నారాయణపూర్,దంతేవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అబూజ్మడ్ అడవుల్లో శనివారం సాయంత్రం భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.దీంతో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఏకే 47,ఎస్ఎల్ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కానిస్టేబుల్ను దంతెవాడ డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్గా గుర్తించారు.ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల వైపు నుంచి ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోంది. భద్రతాబలగాలు కూడా తమ జవాన్లను కోల్పోతున్నాయి. ఇదీ చదవండి: లోయలో పడ్డ ఆర్మీ వాహనం..నలుగురు సైనికులు దుర్మరణం -
సీటీ రవిని ఎన్కౌంటర్ చేస్తారేమో ?
హుబ్లీ: ఎమ్మెల్సీ సీటీ రవిని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారేమోనని అనుమానం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బాగల్కోటెలో మీడియాతో మాట్లాడారు. సీటీ రవిని అరెస్ట్ చేయడం, నిబంధనలు పాటించకుండా దారుణంగా వ్యవహరించడంపై కోర్టులో ప్రశి్నస్తామన్నారు. ప్రభుత్వ కీలుబొమ్మలుగా మారిన పోలీసు అధికారులకు తగిన గుణపాఠం చెప్పడానికి కోర్టుకు వెళ్తామన్నారు. రవి ఎటువంటి వ్యాఖ్యలు చేశారన్నదే స్పీకర్ నిర్ణయిస్తారన్నారు. స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. ముఖ్యంగా ఇలాంటి కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడానికి వీలు లేదన్నారు. ఆయన్ను గుర్తు తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. -
యూపీలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతం
పిలిభిత్: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా రచించిన వ్యూహంలో ఘనవిజయం సాధించారు.ఈ ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు ఖలిస్తానీ కమాండో ఫోర్స్కు చెందినవారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు ఏకే 47, మరో రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు గతంలో గురుదాస్పూర్ పోస్ట్పై గ్రెనేడ్ విసిరారు. పురాన్పూర్ ప్రాంతంలోని హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో సోమవారం ఉదయం 5 గంటలకు ఈ ఎన్కౌంటర్ జరిగింది.హతమైన ఉగ్రవాదులను ప్రతాప్ సింగ్ (23), వీరేంద్ర సింగ్ (23), గుర్విందర్ సింగ్ (20)గా పోలీసులు గుర్తించారు. పంజాబ్లోని గురుదాస్పూర్లో పోలీసు పోస్ట్పై దాడి చేసిన కేసులో ముగ్గురినీ వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా పంజాబ్ పోలీసులు వీరి ఆచూకీని పిలిభిత్లోని పురాన్పూర్లో గుర్తించారు. అనంతరం వారు పిలిభిత్ పోలీసుల సహాయంతో, సోమవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితులను చుట్టుముట్టారు. హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో పోలీసుల ఎన్ కౌంటర్ జరిగింది.బుల్లెట్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు వ్యాపించాయి. ఏం జరిగిందో స్థానికులకు వెంటనే అర్థం కాలేదు. తొలుత ఎన్కౌంటర్లో గాయపడిన నిందితులతో పోలీసులు పురాన్పూర్ సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి వారు మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.ఇది కూడా చదవండి: ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి! -
జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
-
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో గురువారం కద్దర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.Kulgam, Jammu and Kashmir: Encounter started between Security forces and militants in Kadder village of Behibagh, under the jurisdiction of Kulgam District, J&K. Heavy exchange of gunfire going on. Two terrorists are believed to be trapped pic.twitter.com/Etwtwlless— IANS (@ians_india) December 19, 2024‘ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన సమాచారం మేరకు కుల్గాం జిల్లా ఖాదర్లో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఐదురుగు టెర్రరిస్ట్లు మృతి చెందగా.. ఇద్దరు భారత సైనికులకు గాయాలయ్యాయి’అని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ విభాగం ఎక్స్ వేదికగా ధృవీకరించింది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైన్యంమరోవైపు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని ఏరివేత చేయడంలో భద్రతా బలగాలు కీలక ఆపరేషన్లు చేపట్టాయి. ఈ నెల ప్రారంభంలో, జమ్మూ కాశ్మీర్లోని గగాంగీర్, గందర్బల్, ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెర్రరిస్ట్ను శ్రీనగర్ జిల్లాలో కాల్చి చంపారు.గత నెలలో జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్, ఖన్యార్ ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులను, అక్టోబర్ నెలలో కాశ్మీర్లో గందేర్బల్ జిల్లాలోని గగన్గిర్ వద్ద గగన్గీర్ నుంచి సోనామార్గ్ వరకు చేపడుతున్న జడ్-మోర్హ్ సొరంగ నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిపై మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ బృందం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో డాక్టర్, ఆరుగురు కార్మికులు మృతి చెందారు. టెర్రరిస్ట్ల కాల్పులతో అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు దాడి చేసింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ను మట్టుబెట్టింది. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తాజాగా పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 12 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడుగురి మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ ఎన్కౌంటర్పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే, దంతెవాడ-నారాయణ్పుర్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
ములుగు ఎన్కౌంటర్: మధు మృతదేహం అప్పగింతకు ఆదేశం
హైదరాబాద్, సాక్షి: ములుగు జిల్లా ఏటూరు నాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. మల్లయ్య అలియాస్ మధు మృతదేహాన్ని కూడా భార్య ఐలమ్మకు అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం(నవంబర్ 6) మధ్యాహ్నాంలోగా అప్పగింత పూర్తి చేయాలని.. మృతదేహంపై గాయాలుంటే గనుక ఫొటోలు, వీడియోలు తీయాలని స్పష్టం చేసింది. ఏటూరునాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. గత విచారణలో.. ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల్లో ఈగోలాపు మల్లయ్య అలియాస్ మధు తప్ప మిగిలిన ఆరుగురి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. మల్లయ్య మృతదేహం అప్పగించకపోవడంతో.. భార్య ఐలమ్మ అలియాస్ మీనా హైకోర్టును ఆశ్రయించారు.గత విచారణలో.. ‘‘ఈ ఎన్కౌంటర్ బూటకమని, మావోయిస్టులు తినే ఆహారంలో మత్తుపదార్థాలు కలిపి చిత్రహింసలు పెట్టి చంపారు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్ కుమార్. అలాగే.. శవ పంచనామాలో కుటుంబసభ్యులను అనుమతించలేదని, పోస్ట్మార్టం ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో జరగలేదని పేర్కొన్నారు. మల్లయ్య మృతదేహాన్ని చూడటానికి ఐలమ్మను కేవలం 10 నిమిషాలే అనుమతించారని, ఈ కొద్ది సమయంలోనే ఆమె తన భర్త మృతదేహంపై దాదాపు 11 గాయాలను గుర్తించారని తెలిపారు. శవ పంచనామాకు పిటిషనర్ను అనుమతించలేదన్నారు. ఎన్హెచ్చార్సీ మార్గదర్శకాల ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో శవ పంచనామా జరిపించేలా ఆదేశించాలని కోరారు. ఇది ఎన్కౌంటర్ కాదని.. కస్టోడియల్ డెత్ అని ఆరోపించారు. వాదనలు నమోదు చేసుకున్న విజయ్సేన్రెడ్డి ధర్మాసనం.. పిటిషనర్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమె భర్త మల్లయ్య మృతదేహం తప్ప మిగితావాళ్లవి వారి బంధువులు అడిగితే అప్పగించాలని స్పష్టం చేసింది. పోస్ట్మార్టం ఎగ్జామినేషన్, శవపంచనామా నిర్వహణలో అనుసరించిన విధానంపై సంక్షిప్త వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఇవాళ.. మృతదేహం అప్పగింతపై ఆదేశాలిచ్చింది.చల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు మరణించిన ఘటనపై కలెక్టర్ దివాకర ఇదివరకే విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ములుగు ఆర్డీవో వెంకటేశ్ను నియమించారు. -
‘ఆపరేషన్ కగార్’ పై సర్వత్రా చర్చ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవుల జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అనేక మంది వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమబాట పట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు, ఛత్తీస్గఢ్కు సమీపంలో ఉండే ఈ ప్రాంతం మావోలకు ఇలాఖాగా మారింది. అప్పట్లో పోలీసు బలగాలకు మావోయిస్టులు కంటికి మీద కునుకు లేకుండా చేశారు. కాలక్రమంగా వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. 2026 నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కీలక స్థానాల్లో తెలుగువారునిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లికి చెందిన ఇర్రి మోహన్రెడ్డి, సెంట్రల్ పొలిట్బ్యూరో కేంద్ర కమిటీ సాంకేతిక విభాగంలో పనిచేస్తున్నారు. » మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా సింగరేణి కోల్ కమిటీలో కీలకంగా ఉన్నారు. ఇటీవల ఆయన్ను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్టు సమాచారం. » ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరకు చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, రాష్ట్ర కమిటీ మెంబర్, కేబీఎం (కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల) కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. » బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ పార్టీ నిర్వహిస్తున్న ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్నట్టుగా చెబుతారు. ఇదే మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటి, అతని సహచరి పుష్ప దండకారణ్యంలోనే ఉన్నారు. » కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం అగర్గూడకు చెందిన చౌదరి అంకుబాయి అలియాస్ అనితక్క దండకారణ్యంలోనే ఉన్నారు. ఒక్కొక్కరి తలపై రూ.20 లక్షలకు పైనే రివార్డులు ఉన్నాయి. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లుగత కొంతకాలంగా మావోయిస్టులు చనిపోవడమో, లొంగిపోవడమో జరుగుతోంది. ఐదు దశాబ్దాలకుపైగా పార్టీ కేంద్ర కమిటీలో పనిచేసిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్(69) గతేడు జూన్లో మరణించారు. బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడు, పార్టీ పత్రికలకు ఎడిటర్గా పని చేశారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. » దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గడ్చిరోలి జిల్లా ఇన్చార్జ్గా పనిచేసిన కాసర్ల రవి అలియాస్ అశోక్ ఎన్కౌంటర్లో మరణించారు. వీరే కాకుండా కంతి లింగవ్వతోపాటు సీనియర్లను పార్టీ కోల్పోయింది. మూడేళ్ల క్రితం ఉమ్మ డి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్, మంగీ, చెన్నూ రు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకా లు చేపట్టింది. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో భదత్రా బలగాల చేతిలో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన బాదీరావు చనిపోయారు. ప్రస్తుతం కోల్బెల్ట్ కమిటీ సింగరేణి కారి్మకుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలకే పరిమితమైంది.అడవి వీడి బయటకు రావాలి మా చెల్లి నా కోసం వచ్చి అక్కడే ఉండిపోయింది. నేను లొంగిపోయి సాధారణ జీవితం గడు పుతున్నా. మా చెల్లి 36 ఏళ్లుగా పార్టీలోనే ఉంది. అడవి వీడి తిరిగి వస్తే అందరికీ సంతోషం. - చౌదరి చిన్నన్న, చౌదరి అంకుబాయి అన్నయ్య, ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం అగర్గూడఆశయాన్ని చంపలేరు వ్యక్తులను చంపగలరు గానీ ఆశయాన్ని చంపలేరు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను బలి తీసుకున్నా అంతిమ విజయం ప్రజలదే. నా స్వార్థం కోసం మా నాన్నను అజ్ఞాతం వీడమని చెప్పలేను. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే శాంతి చర్చలు జరిపి పరిష్కారాన్ని వెతకాలి. అంతేకాని ఉద్యమాన్ని అణచడం కాదు. – బండి కిరణ్, మావోయిస్టు నాయకుడు బండి ప్రకాశ్ కొడుకుజీవించే హక్కును కాపాడాలి ఆదివాసీలు నేరం చేసినట్టు లక్షల కొద్దీ బలగాలతో అడవుల్లో క్యాంపులను ఏర్పా టు చేసి అమాయకులను చంపేస్తున్నా రు. అడవి, సహజ వనరులను నాశనం చేసి సాధించేదేమిటి? 2005 నుంచి అనేక పేర్లతో ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఆర్థిక, సామాజిక, అసమానతల కోణంలో చూస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో జరుపు తున్న మరణహోమాన్ని వెంటనే ఆపేయాలి. చర్చలకు పిలవాలి. ప్రతీ ఒక్కరికి జీవించే హక్కును కాపాడాలి. – నక్క నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పౌరహక్కుల సంఘం. -
ఒక్కొక్కరిది ఒక్కో గాథ!
ఏటూరునాగారం: విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితులైనవారు కొందరు. వివిధ రకాల పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు, వేధింపుల నేపథ్యంలో అడవి బాట పట్టిన వారు మరి కొందరు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూ రంగా ఉన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఎన్ కౌంటర్లో అసువులు బాశారు. ఇన్నా ళ్లూ ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నార్లే అను కున్న తల్లిదండ్రులు, బంధువులు.. విగత జీవులైన తమ పిల్లల్ని చూసి తల్ల డిల్లిపో యారు.ఎన్కౌంటర్లో చనిపో యిన వారందరివీ నిరుపేద కుటుంబాలే కావడం గమ నార్హం. చెల్పాక ఎదురు కాల్పుల్లో నేలకొ రిగిన మావోయిస్టులను తీసుకెళ్లేందుకు ఏటూరునాగారం సామాజి క ఆస్పత్రికి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఆదివాసీలను ‘సాక్షి’ పలకరించింది. చిన్నతనంలోనే అడవి బాట పట్టిందిఛత్తీస్గఢ్ రాష్ట్రం పూర్వాడ తాలూకా బైరాన్గుట్ట గ్రామా నికి చెందిన ముసాకి జమున తండ్రి రాజు, తల్లి కొసంగి చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో పాటు గ్రామాల్లో సల్వాజుడుం, మావోయిస్టులు, పోలీసుల ఇబ్బందులు తాళలేక జమున తొమ్మిదేళ్ల వయస్సులోనే గ్రామానికి చెందిన మరి కొంతమందితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లింది. అప్పట్నుంచీ తిరిగి వచ్చింది లేదు. ఇప్పుడు శవమై కన్పించింది. – లక్ష్మణ్, జమున బాబాయి వాళ్ల పాటలు విని అడవిలోకి పోయిండుమాది ఛత్తీస్గఢ్. నాకు ఇద్దరు కొడుకు లు. చిన్నోడు ముసాకి కరుణాకర్ అలియాస్ దేవల్ అడవిలో అప్పు డప్పుడు వినిపించే పాటలకు ఆకర్షితుడై ఐదేళ్ల క్రితం అడవి బాట పట్టిండు. వాడి చిన్నతనంలోనే నా భార్య సోడి చనిపో యింది. ఇంటి దగ్గర ఉండమంటే అన్నల్లో చేరిండు. అప్పట్నుంచి కన్పించలేదు. – ముసాకి బుజ్జ, కరుణాకర్ తండ్రి22 ఏళ్ల క్రితం వెళ్లాడుభద్రు (కుర్సం మంగు) పొలం పను లు చేసుకుంటూ ఉండేవాడు. 22 ఏళ్ల క్రితం సల్వాజుడుం కార్యక లాపాలు ముమ్మరంగా ఉన్న సమయంలో ఛత్తీస్గఢ్లో జరిగిన గొడవలు, అల్లర్లతో అడవిలోకి వెళ్లి ఇక రాలేదు. అడవిలోకి వెళ్లాక జానకిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది. – కుర్సం సోడి (సోమయ్య) భద్రు సోదరుడు. ఛత్తీస్గఢ్ గూడెంలోకి వచ్చేవారితో కలిసి వెళ్లాడుమాది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఊసూరు తా లూకా మలంపెంట. నా భర్త చనిపోయా డు. నేను నా పెద్ద కొడుకు, చిన్నోడు కామేష్ కూలి పను లు చేసుకుంటూ ఉండేవాళ్లం. కామేష్ 14 ఏళ్ల వయస్సులో మా గూడెంలోకి వచ్చేవారితో కలిసి అడవి లోకి వెళ్లాడు. ఇప్పటికి రెండేళ్లు అవుతోంది. – కారం ఉంగి, కామేష్ తల్లి -
TG Highcourt: ఏటూరు నాగారం ఎన్కౌంటర్పై హైకోర్టు తీర్పు
-
ములుగు ఎన్కౌంటర్..హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:ఏటూరునాగారంలో ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్పై మంగళవారం(డిసెంబర్3) హైకోర్టులో విచారణ జరిగింది.పిటిషనర్,ప్రభుత్వం తరపున వాదనలను కోర్టు విన్నది. పిటిషనర్ ఐలమ్మ భర్త మధు అలియాస్ మల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తన భర్త మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయన్న ఐలమ్మ తరపు న్యాయవాది వాదనల మేరకు హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.కుటుంబ సభ్యులు అడిగితే ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇతర మావోయిస్టుల మృతదేహాలను హ్యాండ్ఓవర్ చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా,ఆదివారం ఏటూరునాగారం చల్పాక వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.అయితే మావోయిస్టుల మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులతో పాటు పౌరహక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.హైకోర్టు ఆదేశాలతో మావోయిస్టుల మృతదేహాలను కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) మార్చురిలో పోలీసులు భద్రపరిచారు. కోర్టు మంగళవారం ఇచ్చిన ఆదేశాల తర్వాత మధు బాడీ తప్ప మిగిలిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ఇదీ చదవండి: వారి మృతదేహాలను భద్రపర్చండి -
వారి మృతదేహాలు భద్రపర్చండి
సాక్షి, హైదరాబాద్: ఏటూరునాగారం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను చూసేందుకు వారి కుటుంబసభ్యులకు అనుమతి ఇవ్వాలని స్థానిక పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు మృతదేహాలను ఫ్రీజర్లో భద్రపర్చాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం ఉదయం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఈ ఎన్కౌంటర్ బూటకమని, మత్తు పదార్థం/విషమిచ్చి పట్టుకుని కాల్చి చంపారని, తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పోలీసులు అనుమతించడం లేదని పేర్కొంటూ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కాలవల ఐలమ్మ (మీనా) సోమవారం హైకోర్టులో లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. ఆగమేఘాలపై పోస్టుమార్టం: పిటిషనర్ పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఎన్కౌంటర్గా సృష్టించడం కోసం కాల్పులు జరిపారు. మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయి. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని కోరుతూ ఐలమ్మ ఆదివారమే జిల్లా ఎస్పీకి, ఉన్నతాధికారులకు ఈ మెయిల్ పంపారు. అయినా ఆమెను, కుటుంబసభ్యులను పోలీసులు అనుమతించలేదు.బూటకపు ఎన్కౌంటర్ కానప్పుడు మృతదేహాన్ని చూపించడానికి అభ్యంతరం ఏంటీ?..’అని ప్రశ్నించారు. అయితే అప్పటికే పోస్టుమార్టం ముగిసిపోయిందని జీపీ చెప్పడంతో.. కుటుంబసభ్యులు చూడకముందే ఆగమేఘాల మీద పోస్టుమార్టం ఎందుకు చేశారో పోలీసులు చెప్పాలని సురేశ్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్పై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. నిపుణుల బృందం పోస్టుమార్టం పోలీసుల తరఫున హోంశాఖ జీపీ మహేశ్రాజ్ వాదనలు వినిపిస్తూ.. ‘అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో పోలీసులు ప్రతిస్పందించారు. ఎదురుకాల్పుల్లో మరణించిన వారిని భద్రతాపరమైన ఇబ్బందుల దృష్ట్యా సమీప ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఫోరెన్సెక్ నిపుణుల బృందం అక్కడే పోస్టుమార్టం పూర్తి చేసింది. ఈ ప్రక్రియ అంతా వీడియో తీశారు.మృతదేహాలను అక్కడే ఫ్రీజర్లో భద్రపరుస్తారు. కుటుంబసభ్యులు చూడటానికి ఎలాంటి అభ్యంతరం లేదు..’అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్ను అనుమతించాలని ఏటూరునాగారం ఎస్హెచ్ఓను ఆదేశించారు. పోస్టుమార్టంలో పాల్గొన్న నిపుణులు, వైద్యుల పూర్తి వివరాలు తమ ముందుంచాలని చెబుతూ, తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. -
ఐదుగురు మావోల కోసం జల్లెడ
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన పోలీసులు ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్లో ఒక మహిళ సహా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా.. పరారైన మిగతా ఐదుగురి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం వాజేడు, వెంకటాపురం(కె)తో పాటు ఇటు మహారాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం, మంథని మహాదేవ్పూర్ అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు గాలిస్తున్నా యి. తప్పించుకున్న మావోయిస్టులకు గాయాలై ఉంటాయని, సమీప అటవీ ప్రాంతంలో తలదాచుకుని ఉంటారని భావిస్తున్న పోలీసులు సోమవారం చెల్పాక అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్లు సమాచారం. ఒక వైపు పొలకమ్మ వాగు, మరోవైపు దట్టమైన అటవీప్రాంతం ఉండటంతో పోలీసులు నలుమూలలా నిఘా వేసినట్లు తెలుస్తోంది. సామాజిక ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తుఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలకు స్థానిక సామాజిక ఆస్పత్రిలో సోమవారం పోççమార్టం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చోటు చేసుకోగా, ఎస్పీ శబరీష్ మృతదేహాలను పరిశీలించిన తర్వాత భారీ బందోబస్తు మధ్య ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించాలని భావించారు. కానీ వర్షం, భద్రత కారణాల దృష్ట్యా ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్ర పర్చారు. సోమవా రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం ప్రత్యేక పర్యవే క్షణ అధికారి, డీఎస్పీ రవీందర్రెడ్డి నేతృత్వంలో కాకతీయ మెడికల్ కళాశాలలోని ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇక్కడ ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్కు మార్, డీఎస్పీ రవీందర్రెడ్డితో చర్చించిన తర్వాత.. కాకతీ య వైద్య కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు, ప్రొఫెసర్ ఖాజామొహినొద్దీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సురేందర్, నవీన్, పీజీ వైద్యులు నవీన్, మాధురి, మౌనిక, జీతేందర్, ప్రియాంక, ఫరేక, లావణ్య, తరుణ్, ప్రశాంత్లతో కూడిన బృందం ఏడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. మధ్యాహ్నం 12.47 నిమిషాలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 6.33 వరకు కొనసాగింది. అనంతరం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మావోయిస్టుల మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపర్చారు. వైద్యులతో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోస్టుమార్టం గది వద్ద ఉండేందుకు కూడా వీల్లేకుండా కట్టుదిట్టం చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి ఆస్పత్రి వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనదారులను అడ్డగించి ఆరా తీశారు. విషం పెట్టారు.. హింసించి చంపారుశరీరం మొత్తం తుక్కు తుక్కు చేశారుమావోయిస్టు మల్లయ్య భార్య మీనా ఆరోపణఏటూరునాగారం: ‘ఇది ఎన్కౌంటర్ కాదు.. అన్నంలో విషం పెట్టి బేహోష్ (అపస్మారకస్థితిలో)లో ఉన్నప్పుడు నా భర్తను పట్టుకున్న పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపారు..’ అని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఏగోళపు మల్లయ్య అలియాస్ మధు భార్య మీనా ఆరోపించారు. ములుగు ఎన్కౌంటర్లో మరణించిన తన భర్త మృతదేహాన్ని చూడటానికి మీనా, సోదరుడు రాజయ్య ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మీనా విలేకరులతో మాట్లాడారు. ‘ముఖంపై చర్మం తప్ప శరీరంలో ఎక్కడా బొక్కలు కనబడటం లేదు.. మొత్తం తుక్కుతుక్కు చేసి హింసించి హింసించి చంపారు. తల నుజ్జునుజ్జుగా అయింది. దగ్గరినుంచే కాల్చి చంపినట్లు తెలుస్తోంది. హింసించి విషమిచ్చి చంపారా? లేక మత్తుమందు ఇచ్చి అతిక్రూరంగా చంపారా? అనేది అర్థం కావటం లేదు. మరణించిన మహిళా మావోయిస్టును చూస్తే.. మొత్తం బట్టలు చింపేసి గొంతు కోసినట్లుగా ఉంది.. ఒక భుజం మొత్తానికే వెనక్కి తిరిగి ఉంది. ఎంత క్రూరంగా హింసించి చంపారో దీన్నిబట్టి అర్థమవుతుంది..’ అని పేర్కొన్నారు. ప్రస్తుత మంత్రి సీతక్క గతంలో నక్సల్స్ పార్టీలో పని చేశారు కదా.. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లకు ఎలా మద్దతు తెలుపుతున్నారని మీనా ప్రశ్నించారు. కనీసం ఫొటో తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదంటేనే ఎంత క్రూరంగా హింసించి చంపారో తెలుస్తోందంటూ విలపించారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గొప్పోడి అంజమ్మ డిమాండ్ చేశారు. -
ములుగు ఎన్కౌంటర్.. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పౌరహక్కుల సంఘం ఆరోపణలను తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి ఖండించారు. ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు.ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది దుష్ప్రచారం. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండిస్తున్నాను. ఎదురుకాల్పులకు కొద్ది రోజుల ముందు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇద్దరు ఆదివాసీలను దారుణంగా హత్య చేశారు. ఇలాంటి ఘటనలను అడ్డుకొనేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారు.మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో సాయుధులైన ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. శవపరీక్షలు.. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకే జరుగుతున్నాయి. విచారణ అధికారిగా ఇతర జిల్లా డిఎస్పీని నియమించాము. దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మహిళా మావో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు సైతం ఉన్నారు. మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్ కాగా, మిగతా ఆరుగురు ఛత్తీస్గఢ్ జిల్లాకు చెందినవారు. ఉదయం 6.16 గంటల ప్రాంతంలో చెల్పాక-ఐలాపూర్ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దాదాపు అరగంటకుపైగా కాల్పులు జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలంలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, 303 రైఫిల్, ఇన్సాస్ తుపాకీ, ఎస్బీబీఎల్ గన్, సింగిల్షాట్ తుపాకీ, తపంచా, కిట్బ్యాగులు, విప్లవ సాహిత్యం తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ములుగు ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ.. రేపటికి వాయిదా
సాక్షి,హైదరాబాద్ : ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం 6.15 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–గ్రేహౌండ్స్ బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఒక మావోయిస్టు ఉండగా మిగతా ఆరుగురు ఛత్తీస్గఢ్కు చెందిన వారని ఆయన తెలిపారు.అయితే, చెల్పాక ఎన్కౌంటర్పై పోలీసులు, రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్పాక ఎన్కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పౌరహక్కుల సంఘం పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచేసి ప్రాణలు తీసినట్లు తెలిపారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారన్న న్యాయవాది..ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. అయితే, అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగిందని,ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మృతదేహాలను రేపటి వరకు భద్ర పర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ భద్రపరిచిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షి,వరంగల్: ములుగు జిల్లాలో ఆదివారం(డిసెంబర్1) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏటూరునాగారం చల్పాక సమీపంలో కూంబింగ్ చేస్తుండగా గ్రేహౌండ్స్ బలగాలకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నారు.ఎన్కౌంటర్లో మృతిచెందింది వీళ్లే..1. కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, టీఎస్సీఎమ్ కార్యదర్శి ఇల్లందు-నర్సంపేట 2. ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్పూర్ 3. ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్4. ముస్సాకి జమున 5. జైసింగ్, మావోయిస్టు పార్టీ సభ్యుడు6.కిషోర్, మావోయిస్టు పార్టీ సభ్యుడు7.కామేష్, మావోయిస్టు పార్టీ సభ్యుడు -
భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా భెజ్జి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళలు సహా పది మంది మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతం ఏపీ, తెలంగాణ సరిహద్దుగా ఉండడంతో మూడు రాష్ట్రాల పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. భెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాజ్గూడ, దంతేస్పురం, నగరం, భండార్పదర్ గ్రామాల మధ్య అడవుల్లో కుంట– కిష్టారం ఏరియా నక్సల్స్ కమిటీ సమావేశమైంది. నక్సలైట్ల సమావేశంపై పక్కా సమాచారం అందుకున్న జిల్లా, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం ఉదయం భండార్పదర్ గ్రామ సమీపంలో మావోలకు పోలీసులు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పరస్పర కాల్పులు మొదలయ్యాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. ఇందులో పది మంది మావోయిస్టులు చనిపోయారని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ ప్రకటించారు. మృతుల్లో డివిజినల్ కమిటీ సభ్యుడు మద్కం మాసా, మాసా భార్య దుధీ హునీ, ఏరియా కమిటీ సభ్యురాలు లఖ్మా మాధవి, గార్డ్ కొవసీ కోసా, మద్కం జితూ, మద్కం కోసీలుగా గుర్తించారు. మద్కం మాసాపై రూ.8 లక్షలు, లఖ్మాపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది. మిగతా నలుగురిని గుర్తించాల్సి ఉంది. ఘటనస్థలం నుంచి ఇన్సాస్, ఏకే 47, ఎస్ఎల్ఆర్, బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మావోలపై ఉక్కుపాదందేశంలో 2026 మార్చి నాటికి మావోయి స్టులను అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ డివిజన్లో జరిగిన ఎన్కౌంటర్లలో 207 మంది మావోలు చనిపోగా 787 మంది అరెస్ట్ అయ్యారు. 789 మంది లొంగిపోయారు. దీంతో బస్తర్ అడవుల్లో సంచరించడం మావో యిస్టు దళాలకు కష్టంగా మారింది. నిర్బంధం పెరగడంతో దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల నుంచి ఇతర రాష్ట్రాల్లోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు మావోలు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచారు. శుక్రవారం ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దు మల్కన్గిరి జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు చనిపోయాడు.తెలుగు మాట్లాడే ప్రాంతంలో..ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఏపీలోని చింతూరు, తెలంగాణలోని దుమ్ముగూడెం ప్రాంతాలకు సరిహద్దుగా ఉంది. ఇక్కడ ఉన్న ఆదివాసీ గ్రామాల పేర్లు తెలుగులో ఉండడమే కాక వారు తెలుగు కూడా మాట్లాడగలరు. ఉపాధి, విద్య, వైద్యం, నిత్యావసరాల కోసం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు వచ్చివెళ్తుంటారు. ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరగడంతో ఏపీ, తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెరిగిపోవడంతో ఈ గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా గాలిస్తున్నా ఇప్పటికీ మావోయిస్టు అగ్రనా యకత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం ఒక్కటే మావోయిస్టులకు ఊరటనిస్తోంది. -
Udupi Encounter: మావోయిస్ట్ అగ్రనేత విక్రమ్ గౌడ మృతి
ఉడిపి: కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కల తాలూకాలోని కబ్బినలే గ్రామంలో సోమవారం రాత్రి యాంటీ నక్సల్ ఫోర్స్ (ఏఎన్ఎఫ్), మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత విక్రమ్ గౌడ్ హతమయ్యాడు.సీతాంబేలు ప్రాంతంలో నిర్వహిస్తున్న యాంటీ నక్సల్స్ సెర్చ్ ఆపరేషన్లో నక్సల్స్-ఏఎన్ఎఫ్ బృందానికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్ యూనిట్ అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందుకున్న ఏఎన్ఎఫ్ బృందం ఈ ఆపరేషన్ను ముమ్మరం చేసింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం చిక్మగళూరు జిల్లా జయపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిని నక్సల్ యూనిట్ సందర్శించింది. తరువాత వారు కొప్ప తాలూకాలోని యెడగుండ గ్రామంలోకి కూడా చొరబడ్డారు. అక్కడ వారు అటవీ ఆక్రమణ, కస్తూరిరంగన్ నివేదికకు సంబంధించిన అంశాలపై చర్చించారు.దీనిపై వివరాలు అందిన దరిమిలా ఏఎన్ఎఫ్ ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ను ముమ్మరం చేసింది. సోమవారం రాత్రి ఐదుగురు మావోయిస్టులు కిరాణా సామాన్లు కొనుగోలు చేసేందుకు కబ్బినలే గ్రామంలోకి వచ్చారు. ఈ నేపధ్యంలో ఏఎన్ఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నేత విక్రమ్ గౌడ్ మృతి చెందగా, మిగిలిన మావోయిస్టులు తప్పించుకున్నారు.కర్ణాటకలో యాక్టివ్గా ఉన్న మావోయిస్టు నేతల్లో విక్రమ్ గౌడ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. విక్రమ్ గౌడ్ పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడు. ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులకు చెందిన ఇతర గ్రూపులు యాక్టివ్గా మారే అవకాశాన్ని నిరోధించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు.ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు -
అడవికి అదే హీరో! మరి ఎదురుపడితే.. ఇలా చేస్తే సేఫ్గా బయటపడే ఛాన్స్
-
ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు
కడప అర్బన్: తాము చెప్పినట్టు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి మేజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని రవీంద్రారెడ్డి తరఫు న్యాయవాదులు నాగిరెడ్డి, ఓబులరెడ్డి మీడియాకు మంగళవారం తెలిపారు. న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్రా రవీంద్రారెడ్డిని ఈ నెల 4న రాత్రి పోలీసులు కడప తాలూకా పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి 41ఏ నోటీసు ఇచ్చారు. తరువాత తనతో వచి్చన న్యాయవాది హరినాథరెడ్డి, స్నేహితుడు మహేశ్వర్రెడ్డిని పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీంద్రారెడ్డి హైదరాబాద్ వెళ్లారు.కాగా.. ఈ కేసు విషయమై జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు, సీఐని సస్పెండ్ చేశారని తెలిసి అతడు స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు స్నేహితులైన వెంకటసుబ్బారెడ్డి, ఉదయ్కుమార్రెడ్డితో కలిసి కారులో కడప వస్తుండగా.. ఈ నెల 8న కర్నూలు టోల్ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఓ ఇంట్లోకి రవీంద్రారెడ్డిని తీసుకెళ్లి పోలీసులు విచారించారు. ఆ సమయంలో ఎన్కౌంటర్ చేసేందుకు వెనుకాడబోమని పోలీసులు అతడిని బెదిరించారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వకపోతే భార్యను, కుమార్తెను అథోగతి పాల్జేస్తామని రవీంద్రారెడ్డిని హెచ్చరించారు. ఎంపీ అవినాష్రెడ్డి, అతడి పీఏ రాఘవరెడ్డి ప్రోద్బలంతోనే వైఎస్ విజయమ్మ, వైఎస్ షరి్మల, వైఎస్ సునీతపై పోస్టింగ్లు చేశానని ఒప్పుకోవాలంటూ బలవంత పెట్టారు. తాము చెప్పినట్టు వినకపోతే ఎక్కువగా కేసులను పెట్టి జీవితాంతం జైలులో ఉండేలా చూస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించారు. థర్డ్ డిగ్రీ కారణంగా తన శరీరంపై అయిన గాయాలను మెజిస్ట్రేట్కు రవీంద్రారెడ్డి చూపించారు. ఆలస్యంగా వైద్య పరీక్షలు కాగా.. వర్రా రవీంద్రారెడ్డితో పాటు అరెస్టు చేసిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్కుమార్రెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రిమ్స్కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అనంతరం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో కడపలోని పులివెందుల కోర్టు ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.మిగిలిన ఇద్దరు నిందితులకు 41ఏ నోటీసులు అందజేసి బెయిల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వర్రా రవీంద్రారెడ్డిని రిమాండ్ నిమిత్తం కడప కేంద్ర కారాగారంలోకి తీసుకెళ్లిన తరువాత రిమ్స్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కడప కేంద్ర కారాగారానికి వర్రాను తరలించారు. కాగా అధికారులు మంగళవారం సాయంత్రం వరకు అతడిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లకపోవడం గమనార్హం. వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్లను అరెస్ట్ చేశాంసాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్రెడ్డిలను అరెస్ట్ చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఈ ముగ్గురిలో రవీంద్రారెడ్డికి కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిందని తెలిపారు. మిగిలిన ఇద్దరి రిమాండ్ను కోర్టు తిరస్కరించిందన్నారు. ఈ వివరాలను హైకోర్టు రికార్డ్ చేసింది. ఇదిలావుంటే.. వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారణ సందర్భంగా గాయపరిచిన విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై రాతపూర్వకంగా అఫిడవిట్ వేయాలని, దానిని పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే రవీంద్రారెడ్డి నిర్బంధానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై అతని భార్య కళ్యాణి, సుబ్బారెడ్డి, ఉదయభాస్కర్రెడ్డి నిర్బంధంపై వారి సంబంధీకులు హైకోర్టులో వేర్వేరుగా హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మణిపూర్లో భారీ ఎన్కౌంటర్..11 మంది ఉగ్రవాదులు హతం
ఇంఫాల్:మణిపూర్ జిరిబమ్లో సోమవారం(నవంబర్ 11) భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 11 మంది అనుమానిత కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది.కుకీ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు సోమవారం జిరిబమ్ పోలీస్స్టేషన్పై దాడికి ప్రయత్నించినప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న రిలీఫ్ క్యాంపును టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మణిపూర్లో గతేడాది జరిగిన అల్లర్లలో జిరిబమ్ పోలీస్స్టేషన్కు ఉగ్రవాదులు పలుమార్లు టార్గెట్ చేసి దాడి చేయడం గమనార్హం. -
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని కిష్త్వార్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ ప్రత్యేక దళాలకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఆదివారం ఉగ్రవాదులు, ఆర్మీ బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సైనికుడిని నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్గా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.‘‘జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వైట్ నైట్ కార్ప్స్ , అన్ని ర్యాంక్లకు చెందిన అధికారులమంతా నయాబ్ సుబేదార్ రాకేష్ కుమార త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాం. భార్త్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించబడిన ఉమ్మడి కౌంటర్ ఎదురుకాల్పుల ఆపరేషన్లో భాగమై వీరమరణం పొందారు. ఈ దుఃఖ సమయంలో మేం మరణించిన కుటుంబానికి అండగా ఉంటాం’’ అని పేర్కొంది. #GeneralUpendraDwivedi #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of #Braveheart Nb Sub Rakesh Kumar who laid down his life in the line of duty in J&K. #IndianArmy offers deepest condolences and stands firm with the bereaved family in this hour of grief. https://t.co/bJRZY7w8d3— ADG PI - INDIAN ARMY (@adgpi) November 10, 2024గ్రామ రక్షణ గార్డులు నజీర్ అహ్మద్ , కుల్దీప్ కుమార్ల బుల్లెట్తో కూడిన మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిన్న భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు అపహరించి హతమార్చిన తర్వాత గురువారం సాయంత్రం కుంట్వారా, కేష్వాన్ అడవుల్లో ఆర్మీ బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.చదవండి: జార్ఖండ్లో అవినీతిపరులను బీజేపీ విడిచిపెట్టదు: ప్రధాని మోదీ -
భీకర ఎన్కౌంటర్.. మధ్యలో బిస్కెట్!
శ్రీనగర్: సుధీర్ఘ చర్చలు, మంతనాల వేళ మధ్యమధ్యలో ఛాయ్తోపాటు బిస్కెట్లు తినడం పరిపాటి. మిత్రదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల వేళ పనికొచ్చే బిస్కెట్లు శత్రువుతో పోరాడేవేళ అక్కరకు రావడం విశేషం. పాకిస్తాన్ విద్వేషాగి్నని ఎగదోస్తుంటే దానిని కశ్మీర్లో విస్తరింపజేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు బిస్కెట్లను వాడుకుని విజయం సాధించారు. శనివారం జరిగిన లష్కరే కమాండర్ ఉస్మాన్ ఎన్కౌంటర్ వివరాలను సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం వెల్లడించాయి. మొరిగితే అసలుకే మోసం కశ్మీర్లో కీలకమైన ఉగ్రకమాండర్ ఉస్మాన్ శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఉస్మాన్ సిద్ధహస్తుడు. గత ఏడాది పోలీస్ ఇన్స్పెక్టర్ మస్రూర్ వనీని చంపేసిన ఘటనలో ఇతని ప్రమేయముంది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది జాడ తెలియడంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయితే ఖన్యాయ్లో శునకాల బెడద ఎక్కువ. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే మొరుగుతాయి. ఈ శబ్దాలకు ఉస్మాన్ అప్రమత్తమవడం ఖాయం. దీనికి పరిష్కారంగా బలగాలు తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లాయి. అంతా జల్లెడ పడుతూ కుక్కలు అరవకుండా బిస్కెట్లు వెదజల్లుతూ వాటి నోరు మూయించారు. దీంతో వీరి పని సులువైంది.ఏకే47తో సిద్ధం ఉస్మాన్ ఎల్లప్పుడూ అత్యాధునిక ఏకే47 గన్తో అప్రమత్తంగా ఉంటాడు. గ్రనేడ్లు, పిస్టల్ ధరిస్తాడు. వేగంగా దాడిచేస్తాడు. దీంతో తమ రాక విషయం తెలీకుండా జాగ్రత్తపడుతూ బలగాలు అతడిని సమీపించాయి. చివరి నిమిషంలో ఉస్మాన్ దీనిని కనిపెట్టి బలగాలపైకి ఎదురుకాల్పులు జరిపాడు. గ్రనేడ్లు విసిరాడు. ఈ క్రమంలో నలుగురు జవాన్లు గాయపడినా ఎట్టకేలకు ఉస్మాన్ను సైన్యం హతమార్చింది. గత రెండేళ్లలో కశీ్మర్ లోయలో సైన్యం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ ఘటనను చెబుతారు. లష్కరే తోయిబా విభాగమైన రెసిస్టెంట్ ఫ్రంట్కు ఈ ఎన్కౌంటర్ కోలుకోలేని దెబ్బ. స్థానికేతర కారి్మకులు, భద్రతా బలగాలపైకి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సభ్యులు తరచూ కాల్పులకు తెగబడటం తెల్సిందే. వీరికి సూచనలు చేసే ఉస్మాన్ను సైన్యం ఎట్టకేలకు తుదముట్టించి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాల్లో ఘన విజయం సాధించింది. -
లక్నోలో ఎన్కౌంటర్.. ఒక దుండగునికి గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పోలీసులకు, దుండగులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు గాయపడ్డాడు. ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తల్కతోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్థరాత్రి తల్కతోరా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు బైక్లపై వెళ్తున్న ముగ్గురు నిందితులు పోలీసులను చూసి, తమ బైక్లను వెనక్కుతిప్పి పారిపోయారు. దీంతో పోలీసు బృందం వారిని వెంబడించింది. ఆలంనగర్ రైల్వే లైన్ సమీపంలో నిందితుల్లో ఒకడు బైక్పై నుంచి జారి కిందపడిపోయాడు. వెంటనే అతను పిస్టల్ తీసి, పోలీసులపైకి రెండు రౌండ్లు కాల్చాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.ఒక నిందితుని కాలికి బుల్లెట్ తగిలి గాయపడి, పోలీసులకు పట్టుబడ్డాడు. మరో బైక్పై వెళుతున్న నిందితులిద్దరినీ కూడా పోలీసులు వెంబడించి విజయవంతంగా పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పోలీసులు ఒక కంట్రీ మేడ్ పిస్టల్, రెండు లైవ్ కాట్రిడ్జ్లు, రెండు వినియోగించిన కాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’ -
జమ్ముకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
-
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంత్నాగ్లో శనివారం(నవంబర్ 2) భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ గాలింపు కొనసాగుతోంది. కాగా, శ్రీనగర్ బుడ్గమ్లో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ వారంలో ఐదు ఉగ్రవాద సంబంధిత ఘటనలు జరగడం గమనార్హం.ఇదీ చదవండి: రూ.15 కోసం ముక్కును తెగనరికి -
మహారాష్ట్రలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
నాగ్పూర్:ఛత్తీస్గఢ్,మహారాష్ట్ర సరిహద్దులో సోమవారం(అక్టోబర్ 21) భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్ను నాగ్పూర్లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కమాండో టీం కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఇటీవలే భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టులు మృతి వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాల వేళ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ జరిగి నెల గడవక ముందే తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇదీ చదవండి: ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు: అమిత్ షా -
తుల్తులీ ఎన్కౌంటర్ మృతులు 38 మంది
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్గఢ్ చరిత్ర లోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్న తుల్తులీ ఎన్కౌంటర్లో రోజులు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఈనెల 4న నారాయణపూర్ జిల్లా పరిధిలోని తుల్తులీ, గవాడీ గ్రామాల మధ్య ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో తొలి రోజు 31మంది చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.అందులో 22మందిని గుర్తించగా మిగిలిన వారిని గుర్తించలేకపోయారు. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత మావో యిస్టులు లేఖ విడుదల చేస్తూ ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం 35మంది చనిపోయినట్లు వెల్లడించారు. ఇక్కడితోనే మృతుల సంఖ్య ఆగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ శుక్రవారం ఈ ఎన్కౌంటర్పై మరిన్ని వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం తుల్తులీ ఎన్కౌంటర్లో మొత్తం 38మంది చనిపోయారని వెల్లడించారు. మృతులపై ఉన్న రివార్డు మొత్తం రూ.2.60 కోట్లుగా ఉంది. -
తుల్తులీ ఎన్కౌంటర్పై స్పందించిన మావోయిస్టులు..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్గఢ్లోని తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ మొత్తంగా 35 మంది సభ్యులను నష్టపోయింది. ఈ ఎదురుకాల్పులపై ముందుగా ప్రకటన చేసిన పోలీసులు 31 మంది చనిపోయినట్టుగా పేర్కొన్నారు. ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న 31 మృతదేహాల్లో 22 మందినే గుర్తుపట్టగా, మిగిలిన వారు ఎవరనే అంశంపై సందిగ్ధత కొనసాగింది. అయితే ఎన్కౌంటర్ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ స్పందించింది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 35 మంది చనిపోయినట్టు ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఆ పార్టీ పేర్కొంది. ఘటన జరిగిన తీరుపైనా పోలీసులు వెల్లడించిన వివరాలకు మించి అనేక అంశాలను మావోయిస్టులు ప్రకటించారు.మూడో తేదీనే చేరుకున్న బలగాలు మావోయిస్టులు బస చేసిన దంతెవాడ – నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దు అబూజ్మడ్ అడవుల్లోకి పోలీసులు, స్పెషల్ టాస్క్ఫోర్స్, డీఆర్జీ బలగాలు ఈనెల 3వ తేదీ రాత్రికే చేరుకున్నాయి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు రోలింగ్ కాల్కు పిలుపునిచ్చి టీ, టిఫిన్లు చేసేందుకు తాము సిద్ధమవుతున్న సమయాన ఆ ప్రాంతంపై డ్రోన్లు ఎగురుతూ కనిపించాయని మావోయిస్టులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమై సమీప గ్రామంలో విచారిస్తే భద్రతా దళాలు చుట్టుముట్టునట్టు రూఢీ అయ్యిందని.. ఈ క్రమాన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే 4న ఉదయం 10 గంటలకు కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత 11:30 గంటలకు ఊపందుకున్న కాల్పులు రాత్రి 9 గంటల వరకు పలుమార్లు కొనసాగాయని మావోలు ప్రకటించారు.పట్టు సాధించిన బలగాలుబస్తర్ ప్రాంతంలో దండకారణ్యం, అబూజ్మడ్ ప్రాంతాల్లో మావోయిస్టులకు గట్టిపట్టు ఉండేది. దండకారణ్య ప్రాంతంలో జనతన సర్కార్ను బీజ దశ నుంచి ఆ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ రాగా, అబూజ్మడ్ ప్రాంతం షెల్టర్ జోన్గా ఉపయోగపడేది. కానీ గడిచిన రెండేళ్లుగా దండకారణ్యం ప్రాంతంపై భదత్రా దళాలు, పోలీసులు కలిసికట్టుగా మావోల ప్రభావాన్ని తగ్గించగలిగారు. అంతేకాక మావోయిస్టుల అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు 2 వేల మంది భద్రతా దళాలు, ఆధునిక సాంకేతిక సంపత్తితో అడవులను గాలిస్తూ మావోల అడ్డాకు చేరుకోవడమే పెద్ద విజయం అనుకునే అభిప్రాయం నుంచి మాడ్ అడవుల్లోనే ఏకంగా 35 మంది మావోయిస్టులు నేలకొరిగేలా చేయగలగడం ప్రభుత్వ పరంగా భారీ విజయంగానే ఉంది. కాల్పులు జరిగిన తీరుపై మావోయిస్టులు వెల్లడించిన అంశాలు ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం 31 కాదు 35 మంది మృతి..తుల్తులీ–గవాడీ ఎదురు కాల్పుల్లో నేరుగా 14 మంది చనిపోగా తమ పార్టీకి చెందిన 17 మంది దళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు. దీంతో వీరిని అక్కడే పట్టుకున్న ప్రభుత్వ బలగాలు మరుసటి రోజైన అక్టోబర్ 5 ఉదయం 8 గంటలకు కాల్చిచంపారని ఆరోపించారు. దీంతో అధికారికంగా 31 మంది చనిపోయినట్టు నిర్ధారణ కాగా.. మరో నలుగురు గాయపడి చికిత్స పొందుతూ మావోల చెంతే చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 35గా మావోయిస్టులు వెల్లడించారు. -
సేఫ్ జోన్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులు సేఫ్ జోన్ వెతుకులాటలో పడ్డారు. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, రాష్ట్ర బలగాలు భారీ ఎత్తున ఎరివేతకు దిగడంతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తెలంగాణ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2026 మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించడంతోపాటు, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలోనూ దీనిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పైగా రాష్ట్రాల పోలీసు బలగాలకుతోడు కేంద్ర సాయుధ బలగాలను మరింత ఎక్కువగా కదన రంగంలోకి దింపుతున్న వేళ మావోయిస్టులు దిక్కుతోచని స్థితిలోకి చేరుకుంటున్నారు.ఇందుకు రెండు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. మావోయిస్టు అగ్ర నాయకత్వం వృద్ధాప్యంతోపాటు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. అదే సమయంలో తమకు దశాబ్దాలుగా సేఫ్జోన్లుగా ఉన్న ఒక్కో స్థావరాన్ని కోల్పోతున్నారు. దీంతో కొత్త ప్రదేశాల వైపు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మావోయిస్టులకు శత్రు దుర్భేద్యంగా ఉన్న అబూజ్మడ్ సైతం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళుతుండటం మావోయిస్టు నాయకత్వాన్ని మరింత కలవర పరుస్తోంది. మావోయిస్టులు తమను తాము కాపాడుకునేందుకు సేఫ్ జోన్లు వెతికే పనిలో ఉన్నారు.మరోవైపు రిక్రూట్మెంట్లు తగ్గటం, విచ్చినవారు కూడా ఎక్కువ కాలం ఉండటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక నేతల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఇక్కడా పట్టున్న ప్రాంతాలూ ఉన్నందున తెలంగాణను షెల్టర్ జోన్గా మార్చుకునే యోచనలో మావోయిస్టులు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆరుగురు మావోయిస్టులు తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కావడం, గ్రేహౌండ్స్, ప్రత్యేక బలగాలు నిత్యం జల్లెడపడుతుండటాన్ని ఉదహరిస్తున్నారు. ఆరు పదుల వయసు దాటిన అగ్రనేతలుమావోయిస్టు అగ్రనేతల్లో చాలామంది ఆరుపదుల వయస్సు దాటిన వారే ఉన్నారు. ఈ వయస్సులో వారికి మెరుగైన వైద్యం అందించడం సైతం కష్టంగా మారింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో కరీంనగర్కు చెందిన భూపతి అలియాస్ లచ్చన్న వయస్సు 63 ఏళ్లు, తిప్పరి తిరుపతికి 60 ఏళ్లు, నల్లగొండకు చెందిన పాక హన్మంతుకు 60 ఏళ్లు, హైదరాబాద్కు చెందిన మోడెం బాలకృష్ణకు 59 ఏళ్లు, పెద్దపల్లికి చెందిన పుల్లూరి ప్రసాదరావుకు 62 ఏళ్లు. విశ్వసనీయ సమాచారం మేరకు కొందరు అగ్రనేతల ఆరోగ్య పరిస్థితి ఇలా..⇒ మావోయిస్టు మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడు ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి అలియాస్ రామన్న అలియాస్ దయానంద్ అలియాస్ గుడ్సా దాదా అలియాస్ చంద్రశేఖర్ 74 ఏళ్లకు చేరారు. ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా. ఆయన లో బీపీ, డయాబెటిస్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్ సమస్యలతో ఇప్పుడు దాదాపు మంచానికే పరిమితమయ్యారు. ⇒ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేశ్ అలియాస్ ఆనంద్ అలియాస్ సొమ్రు దాదా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. భూపాలపల్లికి చెందిన రవికి 59 ఏళ్లు, డయాబెటిస్కు ఇన్సులిన్ వాడుతున్నారు. కిడ్నీలు చెడిపోయి కాళ్ల వాపులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస అలియాస్ సాధు అలియాస్ గోపన్నకు ఇప్పుడు 66 ఏళ్లు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న కోస ఒబెసిటీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ⇒ రామచంద్రారెడ్డి ప్రతాప్రెడ్డి అలియాస్ అప్పారావు అలియాస్ చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా. కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కర్రల సాయంతో నడుస్తున్నారు. ⇒ హైదరాబాద్కు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ డయాబెటిస్, గ్యాంగ్రిన్తో బాధపడుతున్నారు. -
మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసిన దంతేవాడ ఎన్ కౌంటర్
-
కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారాలోని గుగల్ధర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నంపై నిఘా సమాచారం అందిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.కొన్ని గంటలపాటు కొనసాగిన ఎన్కౌంటర్ తర్వాత, కుప్వారాలోని గుగల్ధర్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది హతమార్చారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయని భారత సైన్యం తెలిపింది.గుగల్ధార్లో భారత సైనికులు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారని ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో తెలిపింది. చొరబాటుదారులను తిప్పికొడుతూ, భారత సైన్యం కాల్పులు ప్రారంభించింది. గుగల్ధార్ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది.ఇటీవల జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ఉగ్రవాదికి జైషే మహ్మద్తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా రాజౌరీ జిల్లాలోని థానమండి ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ నుంచి అందిన ఇన్పుట్ ఆధారంగా, థానమండిలోని మణియల్ గలి వద్ద భద్రతా బలగాలు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని అని ఒక పోలీసు అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా? -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ 40 మంది మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి వార్షికోత్సవాల వేళ గట్టి ఎదురుదెబ్బ తగి లింది. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులు చనిపోయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్–దంతెవాడ జిల్లాల సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలైన ఎదురుకాల్పులు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ ఘటనలో మరణించిన 40 మందిలో తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్కౌంటర్లో పోలీసులకు, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఈ భారీ ఎన్కౌంటర్తో సౌత్ అబూజ్మడ్తో పాటు నార్త్ బస్తర్ మావోయిస్టు కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. భారీ బలగాలతో ఆపరేషన్ భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దంతెవాడ జిల్లా బస్రూర్, నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ల నడుమ గోవల్, నెందూర్, తుల్త్లీ గ్రామాల సమీపంలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమైనట్లు గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్స్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన 1,500 మంది జవాన్లు ఆపరేషన్ ప్రారంభించారు.శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయానికి ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా బయటకు సమాచారం అందింది. రాత్రి వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూ వచి్చంది. రాత్రి 9 గంటల సమయానికి 36 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. భద్రతా దళాల ఘన విజయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా బస్తర్ ఏరియా ఉంది. ఇక్కడ ఏడు జిల్లాలు ఉండగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాలను దండకారణ్యంగా.. కాంకేర్, నారాయణపూర్, కొండగావ్ జిల్లాలు పూర్తిగా, బీజాపూర్, దంతేవాడ జిల్లాలో కొంత భాగాన్ని అబూజ్మడ్గా పిలుస్తారు. ఆపరేషన్ గ్రీన్హంట్ మొదలయ్యాక దండకారణ్య ప్రాంతంలోనే మావోయిస్టులు, పోలీసుల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇక్కడే ఉన్నట్టగా ప్రచారం సాగుతోంది. శుక్రవారం అబూజ్మడ్లో ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 36 మంది మావోయిస్టులు చనిపోవడం కామ్రేడ్లకు గట్టి ఎదురుదెబ్బగా, భద్రతా దళాల ఘన విజయంగా చెప్పుకోవచ్చు. మృతుల్లో.... అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లో తూర్పు బస్తర్ డివిజన్కు చెందిన అగ్రశ్రేణి నక్సలైట్ డీవీసీఎం నీతి అలియాస్ ఊరి్మళ, కొప్పే, ఎస్జెడ్సీఎం రామకృష్ణ కమలేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఈరంగూడ గంగులూరు. ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తమ్ముల రోడ్డు పాలంకి. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 30 మంది నక్సల్స్ మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ-నారాయణ్పుర్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది.దంతెవాడ, నారాయణ్పుర్ పోలీసుల సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజా ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర మావోయిస్టు పార్టీ అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. ఎన్కౌంటర్ తీరుపై కేంద్ర పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: కాంగ్రెస్ యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతోంది: అమిత్ షా -
బద్లాపూర్ ఎన్కౌంటర్: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్లో సంచలనం సృష్టించిన ‘బద్లాపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఇటీవల పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి దిలీప్ భోసలేతో ఏకసభ్య విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిటి మూడు నెలల్లోగా ఎన్కౌంటర్ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించనుంది.Maharashtra Government forms a 1-member inquiry committee of retired High Court judge Dilip Bhosale, into the encounter of Badlapur sexual assault accused Akshay Shinde. The commission will submit the report within 3 months.— ANI (@ANI) October 2, 2024 నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్ ఘటన ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం.. దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.చదవండి: నిందితులు కాల్పులు జరుపుతుంటే..పోలీసులు చప్పట్లు కొట్టాలా?: ఫడ్నవీస్ -
యూపీలో ఎన్కౌంటర్..యువతిని హత్య చేసిన ముగ్గురిపై కాల్పులు
సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు గాయపడ్డారు. సుల్తాన్పూర్లో పెళ్లి పేరుతో యువతిని వంచించి, హత్య చేసిన నిందితులు సల్మాన్, సర్వర్, జావేద్లపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలపాలైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ అఖండ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.అదనపు పోలీసు సూపరింటెండెంట్ అఖండ్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 21న గోసైంగంజ్ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైందన్నారు. ఊపిరాడక ఆ యువతి మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలిందని తెలిపారు. అయితే ఇంతలో ఒక యువతి అదృశ్యంపై జూన్ ఒకటిన కడిపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యిదన్నారు.సల్మాన్, షహెన్షా, సర్వర్, జావేద్ అనే నలుగురు యువకులకు ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముందుగా సల్మాన్ ఆ యువతిని ముంబై తీసుకువెళ్లాడు. అనంతరం ఆమె తనను పెళ్లి చేసుకోవాలని సల్మాన్ను అడిగింది. దీంతో సల్మాన్ పెళ్లికి నిరాకరిస్తూ, ఆమెను తప్పుడు కేసులో జైలుకు పంపుతానని బెదిరించాడు. అనంతరం సల్మాన్, అతని సహచరులు ఒక పథకం ప్రకారం సెప్టెంబర్ 20 న ఆమెను హత్య చేశారు. ఈ కేసులో షాహెన్షాను అరెస్టు చేసిన పోలీసులు.. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అఖండ్నగర్ ప్రాంతంలో పోలీసులు వారిని వెంబడించి, కాల్పులు జరిపారు. తరువాత వారిని అదుపులోకి తీసుకొని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..! -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక పోలీసు వీరమరణం పొందగా, మరొక పోలీసు గాయపడ్డారు.వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం బిల్వార్ తహసీల్లోని కోగ్-మండలి గ్రామంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంయుక్తంగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అనంతరం ఎన్ కౌంటర్ మొదలైంది.ఇరువర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో కశ్మీర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందగా, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గాయపడ్డాడు. ఒక పోలీసు అధికారి ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతూ ఉగ్రవాదుల ఉనికిపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు కోగ్ గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించాయన్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: యూపీ, బీహార్లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు -
‘తక్షణ న్యాయం’ ప్రమాదకరం
సర్వోన్నత న్యాయస్థానంతో సహా దేశంలో వివిధ హైకోర్టులు అడపా దడపా అక్షింతలు వేస్తున్నా ఎన్కౌంటర్ల జాడ్యం పోయేలా లేదు. ఏ పార్టీ ఏలుబడి ఉందన్నదాంతో నిమిత్తం లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల తీరూ ఇదే. కనీసం స్క్రిప్టు మార్చడానికి కూడా పోలీసులు ప్రయత్నించరు. ముద్దాయిని/ముద్దాయిలను నేరస్థలానికి తీసుకెళ్లినప్పుడో, న్యాయస్థానంలో హాజరు పరచడానికి వెళ్తున్నప్పుడో హఠాత్తుగా తిరుగుబాటు చేసి పోలీసుల నుంచి తుపాకి గుంజుకుని కాల్చబోవటం, ఈలోగా పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడం వీటన్నిటి సారాంశం. పోలీసులకు స్వల్ప గాయాలు కావటం కూడా అన్నిచోట్లా డిటో. అక్షయ్ షిండే అనే నేరగాడిని మహారాష్ట్ర పోలీసులు హతమార్చిన తీరుపై బొంబాయి హైకోర్టు బుధవారం అనేక సందేహాలు వ్యక్తం చేసింది. వాహనంలో వెళ్తుండగా షిండే తిరగబడి పిస్తోల్ గుంజుకుని కాల్పులు జరిపే సమయంలో నలుగురు పోలీసులున్నా అతగాణ్ణి లొంగదీయలేకపోవటం ఏమిటని ప్రశ్నించింది. అసలు తుపాకులు, పిస్తోళ్లు ఉపయోగించటం తెలియని వ్యక్తి ఆయుధాన్ని అన్లాక్ చేసి కాల్పులు జరపటం ఎలా సాధ్యమని అడిగింది. ఈ ప్రశ్నలు సహేతుకమైనవి.బద్లాపూర్ స్కూల్ ఉదంతం ఘోరమైనది. గత నెల 13న ఒక పాఠశాలలోని మరుగుదొడ్డి వద్ద ఇద్దరు కిండర్గార్టెన్ పిల్లలపై నిందితుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ. ఘటనపై పిల్లల తల్లిదండ్రులకు తెలిసి ఫిర్యాదుచేస్తే ముద్దాయిని ఆగస్టు 17న అరెస్టు చేశారు. స్కూల్ యాజ మాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించాకగానీ ప్రిన్సిపాల్, సంస్థ చైర్మన్, కార్యదర్శిలపై పోక్సో కేసు పెట్టలేదు. ఆ స్కూల్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉన్నదో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అసలు ఆడపిల్లలు ఉపయోగించే మరుగుదొడ్డి వద్ద మహిళను నియమించాలని కూడా వారికి తోచలేదు. వీటన్నిటినీ తనిఖీ చేయాల్సిన విద్యాశాఖ పట్టించుకోలేదు. ఇంతమంది నిర్లక్ష్యం ఫలితంగా ఇద్దరు చిన్నారులు బాధితులుగా మారాక మాత్రం కఠిన చర్య తీసుకున్నట్టు కనబడటం కోసం వక్రమార్గం అనుసరించారు. స్కూల్ నిర్వాహకులు బీజేపీకి కావలసినవారు గనుకే ఎన్కౌంటర్ నాటకం ఆడారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపణ. నిజానిజాల మాటెలా ఉన్నా ప్రభుత్వాధికారులు మెతగ్గా వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. గత రెండు నెలల్లో మూడు ఎన్కౌంటర్లు జరిపి తమిళనాడు పోలీసులు ముగ్గురు నిందితులను హతమార్చారు. మావోయిస్టుల ప్రభావం అధికంగావున్న ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు జరగకపోతే వార్త. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఎన్కౌంటర్ల జోరు అధికమే. గత ఏడున్న రేళ్లలో యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు 49 మందిని కాల్చిచంపారు. గత సోమవారమే మరొకరిని హతమార్చి అర్ధ సెంచరీ పూర్తి చేశారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎన్కౌంటర్ మృతులంతా అమాయకులనీ, సచ్ఛీలురనీ ఎవరూ అనరు. ఎన్నో ఆరోపణలున్నవారే. కానీ నేర గాళ్లను శిక్షించటానికి ఒక విధానం ఏర్పర్చుకున్నప్పుడూ, దానికి అనుగుణంగా భిన్న వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడూ ఇష్టారాజ్యంగా కాల్చిచంపే అధికారం పోలీసులకెక్కడిది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇలాంటి కేసులను విచారించినప్పుడల్లా న్యాయస్థానాలు నిశితంగా ప్రశ్నిస్తున్నాయి. కానీ ఎక్కడా ఇవి ఆగుతున్న దాఖలాలు లేవు. 2006లో ఇద్దరు నిందితులను నవీ ముంబైలో పట్టుకుని వారిలో ఒకరిని ఎన్కౌంటర్ చేసిన కేసులో 12 మంది పోలీసులకు కిందికోర్టు విధించిన యావజ్జీవ శిక్షను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించటంతోపాటు కింది కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టిన ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’ ప్రదీప్ శర్మకు కూడా యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. న్యాయవాది అయిన ఎన్కౌంటర్ మృతుడి సోదరుడు అతను అరెస్టయ్యాక ఉన్నతాధికారులకూ, న్యాయస్థానానికీ టెలిగ్రామ్లు, ఫ్యాక్స్ మెసేజ్లు పంపటం, కాల్ రికార్డులు సేకరించటం పర్యవసానంగా ఇదంతా సాధ్యమైంది. కానీ ఎన్ని కేసుల్లో ఎందరు ఇలా చేయగలుగుతారు?ఎన్కౌంటర్లను వ్యతిరేకించే పౌరహక్కుల సంఘాల నేతలనూ, పౌర సమాజ కార్యకర్తలనూ నేరగాళ్లకు వత్తాసు పలుకుతున్నవారిగా ముద్రేయటం పాలకులకూ, పోలీసులకూ అలవాటు. కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు సాగిస్తున్న పోలీసులను సమాజంలోని భిన్నవర్గాలవారు ప్రశంసించటం కూడా కనబడుతుంది. ‘తక్షణ న్యాయం’ కోరేవారికి ఇది సబబే అనిపించవచ్చు. కానీ ఈ క్రమంలో ప్రభుత్వాల బాధ్యతనూ, జవాబుదారీతనాన్నీ ఉపేక్షించటం లేదా? అసలు పోలీసు కాల్పుల్లో మరణించినవారే నిజమైన దోషులని ఏ ప్రాతిపదికన నమ్మాలి? ఈ ధోరణివల్ల అసలు దోషులు తప్పించుకునే ప్రమాదంతోపాటు మరిన్ని నేరాలు జరగటానికి ఆస్కారం ఉండదా? కోల్ కతాలోని పీజీ కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతమే తీసుకుంటే సక్రమంగా దర్యాప్తు జరిగింది గనుకే మాఫియాల ఆధిపత్యం, వారి అండతో ఆసుపత్రి ఉన్నతాధి కారులు సాగిస్తున్న తప్పుడు పనులు బయటపడ్డాయి. నేరాలకు తావులేని వాతావరణం ఏర్పర్చటానికీ, వాటి నియంత్రణకు దోహదపడే చర్యలకూ బదులు నేరగాళ్లను హతమార్చే విధానం సమాజాన్ని బండబారుస్తుంది. అధికారులకు తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న భరోసానిస్తుంది. కఠినమైన చట్టాలు, పకడ్బందీ దర్యాప్తు, న్యాయస్థానాల్లో చురుగ్గా విచారణ వంటివి మాత్రమే సమాజ భద్రతకు తోడ్పడతాయి. అది మరిచి ‘తక్షణ న్యాయం’ కోసం వెంపర్లాడటం సరికాదు. -
బద్లాపూర్ నిందితుడి ఎన్కౌంటర్ను సమర్థించిన సీఎం షిండే
ముంబయి:బద్లాపూర్ లైంగికదాడి కేసులో నిందితుడిని ఎన్కౌంటర్ను మహారాష్ట్ర సీఎం ఏకనాథ్షిండే సమర్థించారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం షిండే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘నిందితుడి పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసమే పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు. ఇందులో తప్పేమీ లేదు’అని ఏక్నాథ్షిండే అన్నారు.కాగా, మహారాష్ట్ర బద్లాపూర్లోని ఓ పాఠశాల టాయిలెట్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిపిన కేసులో నిందితుడు అక్షయ్షిండేను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్షయ్షిండేను వాహనంలో తీసుకు వెళ్తుండగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించి తమపై కాల్పులు జరిపాడని, ఇందుకు తాము తిరిగి జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడని పోలీసులు తెలిపారు.బద్లాపూర్ లైంగికదాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఇదీ చదవండి: బద్లాపూర్ నిందితుడి ఎన్కౌంటర్పై పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు -
బద్లాపూర్ నిందితుడి ఎన్కౌంటర్.. పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు
ముంబై: బాద్లాపూర్ లైంగిక వేధింపుల నిందితుడి కస్టడీ మరణంపై బాంబే హైకోర్టు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి ఎన్కౌంటర్ అనుమానాలకు తావిస్తోందని.. ఈ సంఘటనను ఎన్కౌంటర్గా పేర్కొనలేమని పేర్కొంది. నిందితుడు అక్షయ్ షిండేను జైలు నుంచి బయటకు తీసుకొచ్చినప్పటి నుంచి శివాజీ ఆస్పత్రిలో మరణించినట్లు ప్రకటించే వరకు సీసీటీవీ ఫుటేజీని తమకు సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో నిందితుడు అక్షయ్ శిండేపై.. అతడి మొదటి భార్య వేధింపుల కేసు పెట్టింది.అయితే ఈ కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు నిందితుడిని కారులో తీసుకొని తాలోజా జైలు నుంచి బద్లాపూర్ బయల్దేరారు. ఈ క్రమంలో పోలీస్ అధికారి చేతిలో నుంచి తుపాకీ లాక్కొని ఎస్కార్టింగ్ పోలీసు బృందంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. అతడు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.తీవ్రంగా గాయపడిన షిండేను ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనలో ఏఎస్ఐ నీలేష్ మోరే, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండేలు గాయపడ్డారని చెప్పారు. అయితే ఇదంతా అబద్దమని, తన కొడుకునే పథకం ప్రకారమే హతమార్చారని ఆరోపిస్తూ నిందితుడు తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. నిందితుడు కాల్చిన ఆ రెండు బుల్లెట్లు ఎక్కడ..? అంటూ ప్రశ్నించింది. ‘ఇది నమ్మడం కష్టం. ప్రాథమికంగా ఫౌల్ ప్లే కనిపిస్తుంది. ఒక సామాన్యుడు రివాల్వర్ లాగా పిస్టల్ను కాల్చలేడు. ఏ టామ్, డిక్, హ్యారీ చేయగలడు, బలహీనమైన వ్యక్తి పిస్టల్ను లోడ్ చేయలేడు.’ పోలీసుల కథనాన్ని నమ్మడం కష్టంగా ఉంది. నిందితుడు పోలీసులపైకి మూడు బుల్లెట్లు కాల్చారని మీరు చెప్పారు. ఒక్కటే పోలీసులను తాకింది. మిగతా రెండు బుల్లెట్ల ఏమయ్యాయి. పోలీసు అధికారి సంజయ్ షిండే నిందితుడి తలపై కాకుండా కాళ్లు లేదా చేతులపై గురిపెట్టి ఉండాల్సింది. వాహనంలో ఉన్న నలుగురు అధికారులు ఒక్క వ్యక్తిని అధిగమించలేకపోయారంటే ఎలా నమ్మాలి? అతడేం భారీ మనిషికాదు. మీరు సులభంగానే అతడిని అడ్డుకొని ఉండొచ్చు. దీనిని ఎన్కౌంటర్ అని అనలేం. అలాగే ఇంతవరకు కేసు పత్రాలు సీఐడీకి ఎందుకు అప్పగించలేదు. ఏ దర్యాప్తులో అయినా సమయం కీలకం. ఆలస్యం అవుతుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయి’ అని కోర్టు ప్రశ్నించింది. పోలీసుల చర్యను అనుమానించడం లేదు కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు,పోలీసులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.సుక్మా జిల్లా కార్కగున అటవీ ప్రాంతంలో మంగళవారం(సెప్టెంబర్24) కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై తొలుత మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఈ కాల్పులకు ప్రతిగా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు.సోమవారమే ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
బద్లాపూర్ నిందితుడు హతం: ఎన్కౌంటర్ వెనక కుట్ర?
ముంబై: మహారాష్ట్రలోని ‘బద్లాపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్ తీవ్ర దుమారం రేపుతోంది. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అక్షయ్ను.. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్పై అతని తల్లి స్పందించారు. అక్షయ్ని చంపడానికి పోలీసులు చెప్పిన కారణాలను తోసిపుచ్చారామె. ఈ కేసులో పెద్ద కుట్రలో భాగంగా తన కుమారుడుని పోలీసులు హత్య చేసినట్లు ఆరోపించారు. ‘‘నా బిడ్డ అక్షయ్ షిండే హత్య పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర. పోలీసులే నా బిడ్డను హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని కూడా విచారించాలి. విచారణ జరిపి దోషులకు శిక్ష పడుతుందని హామీ ఇచ్చే వరకు నా కుమారుడి మృతదేహాన్ని తీసుకోవడానికి మేము అంగీకరించము’ అని అన్నారామె.#BadlapurSchoolSexualAssaultCase: Accused Shot Dead In Police Custody, Mother Alleges Conspiracy#DNAVideos For more videos, click here https://t.co/6ddeGFqM3o pic.twitter.com/2urBcFH6cY— DNA (@dna) September 24, 2024 క్రెడిట్స్: DNA (@dna)ఈ ఎన్కౌంటర్ ఘటన మహారాష్ట్రలో రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నమే నిందితుడిని ఎన్కౌంటర్ చేయించటమని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. ‘‘పోలీసులు అక్షయ్ షిండేను తీసుకువెళ్లే సమయంలో అతని చేతులు కట్టేయలేదా? అనికి తుపాకీని ఎలా లభించింది. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు?. ఈ కేసులో స్కూల్ మేనేజ్మెంట్పై ఎటువంటి చర్యలు లేవు. కానీ అరెస్టు చేసిన నిందితుడిని మాత్రం ఆత్మ రక్షణ పేరుతో అనుమానాస్పద ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. మాకు బద్లాపూర్ పోలీసులపై నమ్మకం లేదు. ఈ ఘటపై జ్యుడిషియల్ విచారణకు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని తీసుకువెళ్తున్న సమయంలో హోం శాఖ చూపిన నిర్లక్ష్యం సందేహాస్పదంగా ఉంది. ప్రభుత్వం బలహీనంగా మారినట్లు కనిపిస్తోంది’ అని ఎన్సీపి(ఎస్పీ) చెందిన ఓ నేత రాష్ట్ర హోం శాఖపై విమర్శలు గుప్పించారు.అయితే.. ప్రతిక్షాల ఆరోపణలపై సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ పథకం విజయవంతం చేసింది. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రతిపక్షంలో ఉన్న మూడు పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయని అన్నారు.చదవండి: పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘బద్లాపూర్’ రేప్ నిందితుడి మృతి -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్జిల్లా అబూజ్మడ్ అడవుల్లో సోమవారం(సెప్టెంబర్23) పోలీసులు,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా ఒక మహిళా మావోయిస్టున్నట్లు గుర్తించారు.ఘటనాస్థలం నుంచి మూడు మృతదేహాలతో పాటు ఒక ఏకే 47,ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు సమాచారం. -
పోలీసు క్యాంపుపై మావోయిస్టుల దాడి
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పోలీసు క్యాంప్పై దాడి చేశారు. సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని 15నుంచి 20 రౌండ్లు కాల్పులు జరిపారు. మావోయిస్టుల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.బలగాల ఎదురుదాడితో మావోయిస్టులు పారిపోయినట్లు సమాచారం. ఈ దాడిలో జవాన్ల వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.30 నుంచి 40 మంది వరకు మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.అరగంట పాటు మావోయిస్టులు, పోలీసుల మద్య కాల్పులు జరిగాయని తెలిపారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో బలగాలు జరిపిన కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. దీనిని ప్రతీకారంగానే పోలీసు శిబిరంపై మావోయిస్టులు దాడికి యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి..జమ్మూకాశ్మీర్లో కాల్పుల మోత -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి#𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐀𝐫𝐦𝐲𝐎𝐏 𝐊𝐇𝐀𝐍𝐃𝐀𝐑𝐀In the Joint operation launched on 11 Sep by 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐬 & 𝐉&𝐊 𝐏𝐨𝐥𝐢𝐜𝐞, Two Terrorists Neutralised & Large War Like Stores Recovered. 𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 C𝐨𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐝 pic.twitter.com/QUc92EhElN— Rising Star Corps_IA (@RisingStarCorps) September 13, 2024ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్కౌంటర్తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది. -
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ..!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్లలో మృతి చెందడం, మరోవైపు మావోయిస్టుల కీలక ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు పట్టుసాధిస్తుండటం మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం దంతెవాడ–బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు తొలితరం అగ్రనాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని కాంకేరు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు సహా మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమిటీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న, అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు హతమైన విషయం తెలిసిందే. తాజాగా గురువారం రఘునాథపాలెంలో జరిగిన ఎన్కౌంటర్తో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. \దళం తుడిచిపెట్టుకుపోయినట్లే... కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పాట్రో టీంకు తారసపడిన బీఏ–ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, లచ్చన్న సతీమణి తులసి అలియాస్ పునెం లక్కీ, పాల్వంచ మణుగూరు ఏరియా కమాండర్ కామ్రేడ్ రాము, పార్టీ సభ్యులు కోసి, సీనియర్ సభ్యులు గంగాల్, కామ్రేడ్ దుర్గేశ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్తో తెలుగు ప్రాంతాల్లో మావోయిస్టులకు చెందిన అత్యంత కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే–ఏఎస్ఆర్) దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లయింది. ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దులోపల ఇదే భారీ ఎన్కౌంటర్ కావడం గమనార్హం. ఇదే డివిజన్ కమిటీకి చెందిన మరో మావోయిస్టు విజయేందర్ను సైతం పోలీసులు ఈ ఏడాది జూలైలో గుండాలలో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చారు.ఇలా దెబ్బమీదదెబ్బతో బీకే–ఏఎస్ఆర్ డివిజన్కు తీవ్ర నష్టం జరిగింది.క్రమంగా పట్టుసాధిస్తున్న పోలీసులు..మరోవైపు చత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు అత్యంత పట్టుఉన్న ప్రాంతాల్లోనూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, స్థానిక పోలీస్ బలగాలు చొచ్చుకుపోతున్నాయ. కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోనూ వరుస ఎన్కౌంటర్లలో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు మావోయిస్టులపై పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు తెలంగాణ నుంచి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రంలోకి అడుగుపెడుతుండగా హతమార్చారు. ఈ ఏడాది జూన్లో ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లోనూ 8 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. ఇలా వరుస దాడులతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చత్తీస్గఢ్ వైపు ఒత్తిడి పెరగడంతో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయతి్నస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలను తెలంగాణ గ్రేహౌండ్స్, టీజీఎస్పీ, స్థానిక పోలీసు బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. మావోయిస్టులు తెలంగాణ వైపు రాకుండా ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తూ వారిని అడ్డుకుంటున్నాయి. ఏ మాత్రం సమాచారం దొరికినా వెంటనే బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. అయితే, తాజాగా గురువారం జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్కౌంటర్..!
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తూటాల మోత.. భారీ ఎన్కౌంటర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తూటాల మోత మోగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కరకగూడెం అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు, మావోయిస్టులకు కాల్పులు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో సరిహద్దు జిల్లాల గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. మృతిచెందిన మావోయిస్టులు లచ్చన్న దళంకు చెందినవారిగా గుర్తించారు. ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు గాయపడ్డారు.కాగా, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ –బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ దళాల జవాన్లు కూంబింగ్ చేపట్టారు.ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్గన్లతోపాటు బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ –బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ దళాల జవాన్లు ఉదయం 6 గంటల నుంచి కూంబింగ్ చేపట్టారు.ఆక్రమంలో 10.30 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్గన్లతోపాటు బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్ట్ల మృతి
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీజాపూర్ దంతెవాడ జిల్లా లావాపురెంగల్ వద్ద మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. పురంగెల్ అటవీ ప్రాంతంలో రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్ఫోర్స్, బీఎస్ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, వస్తుసామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ⚡⚡ Nine Naxalites eliminated in encounter by Security forces in Chhattisgarh's Dantewada District.— Āryāvarta Updates (@_AryavartaNews) September 3, 2024 -
బాలికపై అత్యాచారం.. కాల్పుల్లో నిందితునికి గాయాలు
ఉత్తరప్రదేశ్లో మరో అత్యాచార ఉదంతం వెలుగు చూసింది. డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 41 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అత్యాచార నేరానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక పాల ప్యాకెట్ కొనేందుకు ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. నిందితుడు దుకాణదారునికి తెలిసినవాడేనని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఆర్తనాదాలు విన్న స్థానికులు ఆ చిన్నారిని కాపాడి, ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంకల్ప్ శర్మ తెలిపారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాగా అత్యాచార నిందితుడు సైఫుల్లాను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లగా, అతడు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఎన్కౌంటర్ జరిపారు. పోలీసులు నిందితుని కాలిపై కాల్పులు జరిపారు. తరువాత నిందితుని నుంచి పిస్టల్, కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు ప్రాణాలు విడిచాడు. ఉదంపూర్లోని దాదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, సీఆర్పీఎఫ్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్ఎపీఎఫ్ అధికారి మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.ఇదిలా ఉండగా.. జమ్మూ ప్రాంతంలో ఇటీవల తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. జూలైలో, దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు సిబ్బంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' పేర్కొంది. జూలై 8న కతువా జిల్లాలోని పర్వత రహదారిపై ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్పై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. -
జమ్ము కశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఇండియన్ ఆర్మీ కెప్టెన్ మృతిచెందగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతాబలగాలకు అందిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు అస్సార్ నది ఒడ్డున దాక్కున్నారు. ఈ నేపధ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది. నిర్దిష్ట సమాచారం అందిన దరిమిలా పాట్నిటాప్ సమీపంలోని అకర్ ఫారెస్ట్లో భారత సైన్యం, జేకేపీ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని పేర్కొంది. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు ఆర్మీ పేర్కొంది.ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బారాముల్లాలో భద్రతను గణనీయంగా పెంచారు. సీనియర్ అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాగా జమ్ముకశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై చర్యలు చేప్టటేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా సంస్థల అధిపతులు పాల్గొననున్నారు. *Op ASSAR* Based on specific intelligence inputs, a joint operation by #IndianArmy and #JKP was launched in Akar Forest near Patnitop.Contact has been established with the terrorists and operations are in progress.@adgpi@NorthernComd_IA@JmuKmrPolice pic.twitter.com/j967WkaHFA— White Knight Corps (@Whiteknight_IA) August 13, 2024 -
యూపీలో మరో ఎన్కౌంటర్
యూపీలో మరో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ మన్నా సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన పంకజ్ యాదవ్పై యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) కాల్పులు జరిపింది. ఈ నేరస్తునిపై పై లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్లో పంకజ్ మృతిచెందాడు. కాగా బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ, మాఫియా షహబుద్ధీన్లకు పంకజ్ యాదవ్లకు షూటర్గా పనిచేశాడు. అలాగే డబ్బుల కోసం హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్గానూ పేరొందాడు. ఈ ఘటన గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ మధుర-ఆగ్రా హైవేలోని ఫర్హా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని ఎస్టీఎఫ్ తమకు తెలియజేసిందన్నారు. నేరస్తుడు పంకజ్ యాదవ్ తన సహచరులలోని ఒకరితో కలిసి బైక్పై ఆగ్రా వైపు వెళ్తున్నట్లు ఇన్ఫార్మర్ నుండి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్టీఎఫ్ బృందం అతనిని వెంబడించింది. ఆతను గ్రామం వైపు పరిగెడుతూ ఎస్టీఎఫ్ బృందంపై కాల్పులు ప్రారంభించాడు. దీనికి ప్రతిగా ఎస్టీఎఫ్ కూడా కాల్పులు జరిపింది. ఈ ఎన్కౌంటర్లో పంకజ్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సహచరుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. దీంతో ఎస్టీఎఫ్ బృందం అతని కోసం గాలిస్తోంది.గాయపడిన పంకజ్ను మధుర జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. యూపీ ఎస్టీఎఫ్ బృందం సంఘటనా స్థలం నుండి ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. పంకజ్ యాదవ్ మవులోని తాహిరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ గ్రామ నివాసి. మన్నా సింగ్ హత్యలో ప్రమేయమున్న పంకజ్ యాదవ్పై హత్య, దోపిడీ తదితర 36 కేసులు నమోదయ్యాయి. పంకజ్ యాదవ్ను అరెస్టు చేయడానికి యూపీ పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్ సిబ్బంది చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్లోని బసంత్గఢ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రతికూల వాతావరణం, పొగమంచు మధ్య భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం అణువణువునా గాలిస్తున్నారు. ఉగ్రవాదులెవరూ హతమైనట్లు ఇంతవరకూ సమాచారం లేదు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఖనేడ్ అడవిలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా దళాలకు ఇన్పుట్ అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి, కాల్పులు ప్రారంభించాయి. అటవీప్రాంతంలో నలువైపులా ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సైనిక వర్గాలు తెలిపాయి. నలుగురు ఉగ్రవాదులతో కూడిన జైషే గ్రూపు రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూపు చెట్లలో దాక్కొనగా, మరొక గ్రూపు తప్పించుకుంది. బసంత్గఢ్లోని ఖనేడ్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని డీఐజీ మహ్మద్ రైస్ భట్ తెలిపారు.దీనికిముందు అనంత్నాగ్లో భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేశాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను దావూద్ అహ్మద్ దార్, ఇంతియాజ్ అహ్మద్ రేషి, షాహిద్ అహ్మద్ దార్లుగా గుర్తించారు. ఈ ముగ్గురూ హసన్పోరా తవేలాకు చెందినవారు. -
కుప్వారాలో ఎన్కౌంటర్.. ఒక జవాను వీరమరణం
జమ్ముకశ్మీర్లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీర్లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఐదుగురు భారత సైనికులు గాయపడ్డారు. వారిలో ఒక జవాను వీరమరణం పొందారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండోలతో పాటు, బాట్ టీమ్ స్క్వాడ్లలో అల్-బదర్, తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది.ప్రస్తుతం మచల్లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం(నేడు) తెల్లవారుజామున మచల్ సెక్టార్లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్లో ఉన్న సైనికులు అటుగా కొందరు(బ్యాట్ స్క్వాడ్) వెళ్లడాన్ని గమనించారు. వారిని లొంగిపోవాలని కోరారు. దీంతో బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి, పరుగులు తీయడం ప్రారంభించింది. దీంతో భారత సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ నేపధ్యంలో ఐదుగురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక జవాను చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. ఈ ఎన్కౌంటర్లో ఒక బ్యాట్ సభ్యుడు హతమయ్యాడు. అతని మృతదేహం పాక్ సైన్యానికి చెందిన డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్లో పడి ఉంది. -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు తాజాగా ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం ఆప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ జవాను గాయపడ్డారు.ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ ఆపరేషన్కు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా సరిహద్దు జిల్లా లోలాబ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.కుప్వారాలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిర్దిష్ట ఇన్పుట్ల ఆధారంగా భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు. తాజాగా భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. లోలాబ్లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీని ఆధారంగా కుప్వారా పోలీసులు ఆర్మీకి చెందిన 28, 22 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. Chinar Corps, Indian Army tweets, "Based on specific input regarding presence of terrorists in general area Kowut, Kupwara, a Joint Search Operation was launched by Indian Army and J&K Police on days leading upto 23 July 24. On 24 July, suspicious movement was observed and… pic.twitter.com/nxZHyajCOv— ANI (@ANI) July 24, 2024 -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్...
-
అస్సాంలో ఎన్కౌంటర్
అస్సాం: రాష్ట్రంలోని కాచర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్పీ నుమాల్ మహట్టా తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాపూర్ రోడ్డు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. మంగళవారం కాచర్లోని ధలై గంగా నగర్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ఏకే రైఫిళ్లను, ఒక సాధారణ రైఫిల్, ఒక పిస్టల్ను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పట్టుబడిన ముగ్గురూ హ్మార్ తీవ్రవాద సంస్థలో శిక్షణ పొందిన క్యాడర్గా ప్రాథమిక విచారణలో తేలింది. భుబన్ హిల్స్లోని సమీపంలోని అడవిలో మరికొందరున్నట్టు, అసోం–మణిపూర్ సరిహద్దుల్లో విధ్వంసాలకు సిద్ధమవుతున్నట్లు పట్టుబడిన ముగ్గురు వెల్లడించారు. దీంతో బుధవారం తెల్లవారుజామున అదనపు ఎస్పీ నేతృత్వంలోని బృందం అరెస్టయిన ఉగ్రవాదులతో పాటు భుబన్ హిల్స్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సమయంలో భుబన్హిల్స్లో ఉన్న కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు కాచర్కు చెందినవారు కాగా ఒకరు మణిపూర్కు చెందినవారు. మరో ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారికోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
జేకేలో అమరులైన కెప్టెన్, జవాన్లు వీరే
జమ్ముకశ్మీర్లో మరోసారి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఉదంతం చోటుచేసుకుంది. దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో భారత ఆర్మీకి చెందిన ఒక కెప్టెన్, నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దట్టమైన అడవుల మధ్య సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.ఉగ్రవాదులు సైనికులపై దాడికి తలపడగా నలుగురు వీర జవాన్లు అమరులయ్యారు. ఈ అమరుల పేర్లను సైన్యం విడుదల చేసింది. భారత ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందారు. థాపా రెండవ తరం ఆర్మీ అధికారి. అతని తండ్రి కల్నల్ భువనేష్ థాపా ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. సోదరి నేపాలీ గాయని. థాపా సిలిగురిలో నివసిస్తున్నారు. ఆయన 2019లో భారత సైన్యంలో చేరారు. ఆయనతో పాటు జవాను నాయక్ డి రాజేష్, కానిస్టేబుళ్లు, బిజేంద్ర, అజయ్ అమరులైనవారిలో ఉన్నారు.దోడాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ఆర్మీ అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అంతకంతకూ పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్తో మాట్లాడి తాజాగా జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఆర్మీ చీఫ్కు రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం.