తెలంగాణ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌..కానిస్టేబుల్‌ మృతి | Constable Lost Life In Gadchiroli While Conflict With Maoists | Sakshi
Sakshi News home page

తెలంగాణ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌..కానిస్టేబుల్‌ మృతి

Published Tue, Feb 11 2025 8:27 PM | Last Updated on Tue, Feb 11 2025 8:32 PM

Constable Lost Life In Gadchiroli While Conflict With Maoists

సాక్షి,హైదరాబాద్‌:తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారం(ఫిబ్రవరి11)జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్‌ మహేష్‌ నాగుల్వార్‌ మృతి చెందారు. మహేష్‌ను ఘటనాస్థలం నుంచి హెలికాప్టర్‌ ద్వారా గడ్చిరోలిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మహేష్‌ మృతిచెందారు.కాగా,ఇటీవలే గడ్చిరోలి ప్రాంతానికి చెందిన పలువురు మావోయిస్టు అగ్రనేతలు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే.అయినా గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గలేదనడానికి ఈ ఎన్‌కౌంటరే నిదర్శనమన్న వాదన వినిస్తోంది.

మరోవైపు రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 30 మంది దాకా మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిందిగా చెప్తున్న హెలికాప్టర్‌లో నుంచి తీసిన ఓ వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement