కశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్‌ | Three policemen killed, three security personnel injured in jammu kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్‌

Published Fri, Mar 28 2025 6:10 AM | Last Updated on Fri, Mar 28 2025 6:10 AM

Three policemen killed, three security personnel injured in jammu kashmir

ముగ్గురు పోలీసులు మృత్యువాత

ఇద్దరికి గాయాలు

ఇద్దరు ముష్కరులు సైతం హతం

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో చోటుచేసుకున్న భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాక్‌ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఐదుగురు ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్‌ ఆపరేషన్‌ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. 

రాజ్‌బాగ్‌ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్‌ సెక్టార్‌లో జమ్మూకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్‌ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. 

అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్‌ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement