జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం | Encounter Operation in Baramulla | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published Wed, Apr 23 2025 9:47 AM | Last Updated on Wed, Apr 23 2025 10:16 AM

Encounter Operation in Baramulla

శ్రీనగర్‌: కశ్మీర్ లోయలో ఉగ్రదాడి ఘటన వేళ బారాముల్లాలో తాజాగా ఎన్‌కౌంటర్‌ జరిగింది. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో​ ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది.

వివరాల ప్రకారం.. బారాముల్లలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. భారత సరిహద్దుల నుంచి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ సందర్బంగా ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. దీంతో, యూరి సెక్టార్‌లో కూంబింగ్‌ కొనసాగుతోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement