కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..  జవాను వీరమరణం | Army soldier killed in encounter in Jammu Kashmir Udhampur | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..  జవాను వీరమరణం

Published Fri, Apr 25 2025 5:21 AM | Last Updated on Fri, Apr 25 2025 5:21 AM

Army soldier killed in encounter in Jammu Kashmir Udhampur

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గురువారం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ ప్రత్యేక విభాగం జవాను ఒకరు అసువులు బాశారు. ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న బలగాలు డుడు–బసంత్‌గఢ్‌ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా తారసపడిన ఉగ్రమూకలు బలగాలపైకి అకస్మాత్తుగా కాల్పులకు దిగాయి.

 ఘటనలో హవల్దార్‌ ఝంటు అలీ షేక్‌ నేలకొరిగారు. అనంతరం కూడా ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ సందర్భంగా బలగాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. కాగా, గత 24 గంటల్లో చోటుచేసుకున్న మూడో ఎన్‌కౌంటర్‌ ఇది. బుధవారం బారాముల్లాలోని ఉడి నాలా వద్ద జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమవ్వడం తెల్సిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement