జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మృతి | CRPF Officer Killed In Terror Attack In JK Udhampur Encounter On, See Details Inside | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మృతి

Published Mon, Aug 19 2024 6:21 PM | Last Updated on Mon, Aug 19 2024 7:16 PM

CRPF Officer Killed In Terror Attack In JK Encounter On

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఒకరు ప్రాణాలు విడిచాడు. ఉదంపూర్‌లోని దాదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్‌ పోలీసులకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్స్‌, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు సెర్చింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్‌ఎపీఎఫ్‌ అధికారి మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.

ఇదిలా ఉండగా.. జమ్మూ ప్రాంతంలో ఇటీవల  తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. జూలైలో, దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు సిబ్బంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' పేర్కొంది. 

జూలై 8న కతువా జిల్లాలోని  పర్వత రహదారిపై ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement