Waqf act:. పశ్చిమబెంగాల్‌లో నిరసన సెగ.. సీఎం మమతా విన్నపం ఇదే! | CM Mamata says Waqf Act won't be implemented in West Bengal | Sakshi
Sakshi News home page

Waqf act:. పశ్చిమబెంగాల్‌లో నిరసన సెగ.. సీఎం మమతా విన్నపం ఇదే!

Published Sat, Apr 12 2025 3:46 PM | Last Updated on Sat, Apr 12 2025 5:17 PM

CM Mamata says Waqf Act won't be implemented in West Bengal

కోల్ కతా:  వక్ఫ్ సవరణ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిన తరుణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిరసన జ్వాలలు రాజుకున్నాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  పెద్ద ఎత్తున నిరసన ‍కార్యక్రమం చేపట్టారు.  ప్రధానంగా రాష్ట్రంలో ముర్షీబాద్ తో పాటు పల్ల జిల్లాల్లో వరుసగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో శనివారం అది ఇంకా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో వంద మందిని అరెస్టు చేశారు. 

దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా.  ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది  ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి  జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.

వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే.  మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

 

కాగా, పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు..  చట్ట రూపం  దాల్చింది.ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు..

సుప్రీంకోర్టులో వక్ఫ్‌ బిల్లును సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి., ఈ క్రమంలో.. తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది.  వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్‌ను కలిపి విచారించాలని చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. 

వక్ఫ్ చట్టాన్ని బెంగాల్ లో  అమలు చేయం: దీదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement