West Bengal
-
‘స్టూడెంట్తో పెళ్లి’.. వివాదంలో మహిళా ప్రొఫెసర్
పవిత్రమైన బంధాల్లో గురుశిష్యుల బంధం ఒకటి. అయితే అతిజుగుప్సాకరమైన పనులతో దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నవాళ్లను తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ మహిళా ప్రొఫెసర్కు సంబంధించిన ఓ వీడియో ఇన్స్టాగ్రామ్ను కుదిపేస్తోంది. తన స్టూడెంట్నే ఆమె వివాహం చేసుకున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో నదియాలో ఉంది హరిన్ఘటా టెక్నాలజీ కాలేజీ. ఈ కాలేజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పరిధికి వస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్గా పని చేసే పాయల్ బెనర్జీ.. తన స్టూడెంట్ను వివాహమాడింది. ఆమె నుదుట ఆ విద్యార్థి కుంకుమ దిద్దడం దగ్గరి నుంచి.. దండలు మార్చుకోవడం, ఏడగుడులు వేయడం ఇలా అన్నీ సంప్రదాయ పద్ధతిలో క్లాస్రూంలోనే జరిగిపోయాయి. పైగా హల్దీ వేడుకలను కూడా విద్యార్థుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. మొత్తానికి ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు కాస్త వైరల్ కావడంతో.. ఆమె పాపులర్ అయిపోయారు. సరదా కామెంట్లతో పాటు సీరియస్గా విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు. అయితే.. ఇక్కడే ప్రొఫెసర్ పాయల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.VIDEO Credits: HornbillTV అది నిజం వివాహం కాదని, సరదా కోసం చేసిన ప్రయత్నమని చెబుతున్నారు. పాయల్ ఓ సైకాలజీ ప్రొఫెసర్. సైకలాజికల్ డ్రామాలో భాగంగా అలాంటి క్లాస్ను నిర్వహించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. తానంటే గిట్టని వాళ్లు ఆ వీడియోను బయటపెట్టారని ఆమె మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఆమె వివరణతో సంతృప్తి చెందలేదు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి నివేదిక వచ్చేదాకా ఆమెను సెలవుల్లో పంపారు. మరోపక్క.. ఈ ఘటనపై స్పందించేందుకు విద్యార్థులెవరూ సుముఖత చూపించకపోవడం గమనార్హం. -
‘సంజయ్రాయ్కు మరణశిక్ష విధించాలని కోరడం లేదు’
కోల్కతా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ (RG Kar Case) ఆస్పత్రి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు తాము మరణశిక్ష కోరుకోవడం లేదని బాదితురాలి తల్లిదండ్రులు కోల్కతా హైకోర్టుకు వారి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.సోమవారం కోల్కతా హైకోర్టులో ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన కేసు విచారణ జరిగింది. విచారణ సమయంలో తమ కుమార్తె జీవితం కోల్పోయిందని నిందితుడు సంజయ్ రాయ్ కూడా తన జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు’ బాధితురాలి తల్లిదండ్రులు కోర్టుకు తెలిపినట్లు.. వారి తరుఫు న్యాయవాది గార్గి గోస్వామి కోర్టుకు తెలిపారు. జనవరి 20 న కోల్కతా సియాల్డాలోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్ట్ సీల్దా కోర్టు (sealdah court )లో విచారణ జరిగింది. విచారణ అనంతరం నిందితుడు సంజయ్ రాయ్కు ఉరిశిక్ష బదులుగా యావజ్జీవ కారాగారవాస శిక్ష మాత్రమే విధిస్తున్నట్టు కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, సీల్దా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్, సీబీఐ కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్ను కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.సీల్దా కోర్టు తీర్పు ఇలాపశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో సీల్దా కోర్టు సోమవారం మధ్యాహ్నం (జనవరి 20) తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ (sanjay roy)కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ‘నేను అమాయకుడిని, కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారంటూ’ కోర్టుకు తెలిపారు. సంజయ్ రాయ్ వాదనల్ని సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఖండించారు. నిందితుడికి జీవిత ఖైదు విధించారు.తీర్పు సమయంలో వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ సైతం వైద్యురాలి కేసు ఆరుదైన కేసుల్లో అరుదైన కేసు కేటగిరి కిందకు వస్తుందని, సమాజంపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు నిందితుడు రాయ్కు మరణిశిక్ష విధించాలని కోరింది. సీబీఐ వాదనపై సీల్దా కోర్టు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ స్పందించారు. ‘ఈ కేసు అరుదైన కేటగిరీ కిందకు రాదు. అతనికి (సంజయ్ రాయ్కు) జీవిత ఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఉరితీయండిగత నెల డిసెంబర్లో కోల్కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి - శిక్ష ఖరారుఅంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరుఫు లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన వాదనల్ని వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్లో కోల్కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.తాజాగా, సీల్దా కోర్టు సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించడంపై కోల్కతా వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆందోళన కారులు తమ నిరసనల్ని తెలుపుతున్నారు. -
నేతాజీపై రాహుల్ గాంధీ పోస్ట్.. ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పశ్చిమ బెంగాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై తన ఎక్స్ ఖాతాలో ఆయన చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదంగా మారడమే ఇందుకు కారణం. అఖిల భారతీయ హిందూ మహసభ(ABHM) ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జనవరి 23వ తేదీన నేతాజీ జయంతి. ఆరోజున రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అయితే అందులో ఆయన పేర్కొన్న నేతాజీ మరణం తేదీపై ఏబీహెచ్ఎం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు దక్షిణ కోల్కతాలోని భవానిపూర్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పీఎస్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎల్గిన్ రోడ్లోని నేతాజీ(Netaji) పూర్వీకుల నివాసం వద్ద రాహుల్ పోస్టుకు నిరసనగా అఖిల భారతీయ హిందూ మహసభ ధర్నాకు దిగింది. నేతాజీ తొలుత కాంగ్రెస్ను, ఆపై దేశాన్ని విడిచిపెట్టారు. అందుకు ఆ పార్టీ విధానాలే కారణం. ఇప్పుడు రాహుల్ గాంధీ దానిని కొనసాగిస్తున్నారేమో. రాబోయే రోజుల్లో దేశ ప్రజలే ఆయన్ని(రాహుల్ను) శిక్షిస్తారు. నేతాజీ జీవితంపై ఎవరైనా వక్రీకరణలు చేస్తే మా స్పందన ఇలాగా ఉంటుంది అని ఏబీహెచ్ఎం హెచ్చరించింది. నేతాజీ అదృశ్యం.. ఆయన మరణం చుట్టూరా నెలకొన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేతాజీ ఆగష్టు 18, 1945న చనిపోయారంటూ రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయితే.. అదే తేదీన నేతాజీ సైగాన్ నుంచి మంచూరియా వెళ్తున్న క్రమంలో తైహోకూ (ప్రస్తుత తైపాయి) వద్ద ఆ విమానం కూలిపోయిందనే ప్రచారం ఒకటి ఉంది. -
కోల్కతా రిపబ్లిక్ డే పరేడ్.. స్పెషల్ ఎట్రాక్షన్గా రోబో డాగ్స్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day celebrations) ఘనంగా నిర్వహించారు. రెడ్ రోడ్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, బెంగాల్ పోలీసులు, కోల్కతా పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, విపత్తు నిర్వహణ బృందాలు కవాతు చేశాయి. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.అయితే, ఈ పరేడ్లో ఆర్మీకి చెందిన రోబో శునకాలు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాయి. మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ (MULE)గా పేర్కొన్న రోబోటిక్ డాగ్కు సంజయ్గా నామకరణం చేశారు. ఈ రోబో డాగ్స్ మెట్లతో పాటు కొండలను నిటారుగా ఎక్కడంతో పాటు అడ్డంకులను దాటగలవు.జీవ, రసాయన, అణు పదార్థాలను పసిగట్టే సెన్సార్లు కలిగి ఉన్న ఈ రోబో డాగ్స్.. నిఘాతో పాటు బాంబులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం వంటి సేవల కోసం ఈ రోబో డాగ్స్ను ఆర్మీ ఉపయోగిస్తోంది.ఇదీ చదవండి: గుజరాత్ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోదీ.. కారణమిదే15 కిలోల బరువును కూడా ఇవి మోయగలవు, అలాగే 40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో కూడా పని చేస్తాయి. ఆర్మీలోని వివిధ యూనిట్లలో సుమారు వంద వరకు రోబో డాగ్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. #WATCH | West Bengal CM Mamata Banerjee takes part in #RepublicDay2025 celebrations at Kolkata.(Source: Mamata Banerjee Social Media) pic.twitter.com/1KUWOvFFvL— ANI (@ANI) January 26, 2025 -
సీబీఐ వల్లే ఇలా జరిగింది.. కోర్టు తీర్పు సంతృప్తిగా లేదు: మమతా బెనర్జీ
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ కేసులో తాము.. దోషికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశాము. కోర్టు తీర్పు విషయంలో సంతృప్తి చెందలేదని వెల్లడించారు.ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోర్టులపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. మేమంతా దోషి సంజయ్ రాయ్కి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశాం. కానీ, కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పు విషయంలో మేము అసంతృప్తిగానే ఉన్నాం. ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐకి బలవంతంగా బదిలీ చేశారు. సీబీఐ కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ వారి చేతుల్లోనే ఉంటే మరణశిక్ష పడేలా పోలీసులు శాయశక్తులా ప్రయత్నించేవారు. బాధితురాలికా న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. జీవిత ఖైతు చిన్న శిక్ష వంటిది. ఇలాంటి నేరస్థులను తప్పకుండా ఉరితీయాలి’ అని డిమాండ్ చేశారు. VIDEO | RG Kar rape and murder case: Here's what West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) said on Sealdah Court sentencing convict Sanjoy Roy to life term till death. "We have been demanding death sentence to the convict since Day 1 and we are still demanding the… pic.twitter.com/DdJBpJoZ4H— Press Trust of India (@PTI_News) January 20, 2025ఇదిలా ఉండగా.. ఆర్జీకర్ వైద్యుర్యాలి కేసులో తీర్పును వెల్లడిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా.. ఇది అరుదైన కేసు అని.. అతడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఇక, శనివారం న్యాయస్థానం సంజయ్ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అలాగే, దోషికి జీవిత ఖైదు విధించడమే కాకుండగా.. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు.. సంజయ్కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: కోల్కత్తా కేసు వివరాలు ఇలా.. -
ట్రోఫీ గెలిచిన 22 మందికి పోలీస్ ఉద్యోగాలు.. భారీ నజరానా కూడా!
సంతోష్ ట్రోఫీ జాతీయ సీనియర్ ఫుట్బాల్ చాంపియన్షిప్ టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు ఆటగాళ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ టోర్నీలో బెంగాల్ జట్టు రికార్డు స్థాయిలో 33వసారి ట్రోఫీ నెగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... విజేత జట్టులోని ఆటగాళ్లందరికీ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)లుగా నియమించనున్నట్లుప్రభుత్వం ప్రకటించింది.సంతోష్ ట్రోఫీ విజేతలకు బుధవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. జట్టులోని మొత్తం 22 మంది ప్లేయర్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు, ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయిందని మంత్రి తెలిపారు. అదే విధంగా.. జట్టులోని సభ్యులకు బెంగాల్ ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన సంతోష్ ట్రోఫీ ఫైనల్లో కేరళను ఓడించి బెంగాల్ జట్టు చాంపియన్గా నిలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేర నజరానాతో పాటు ఉద్యోగం రూపంలో మంచి బహుమతి ఇచ్చింది. మరిన్ని క్రీడా వార్తలుక్వార్టర్స్లో యూకీ ద్వయంఆక్లాండ్: కొత్త ఏడాదిని భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ విజయంతో ప్రారంభించాడు. ఏఎస్బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ శుభారంభం చేసింది.బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–4, 6–4తో సాండెర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)–జాన్సన్ (బ్రిటన్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ జంట రెండు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. హైదరాబాద్ తూఫాన్స్ గెలుపురూర్కెలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన పోరులో హైదరాబాద్ 3–0 గోల్స్ తేడాతో యూపీ రుద్రాస్ను చిత్తు చేసింది. తొలి క్వార్టర్లో 2 గోల్స్ చేసిన హైదరాబాద్ మూడో క్వార్టర్లో మరో గోల్తో తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. మూడు ఫీల్డ్ గోల్స్ సాధించిన తూఫాన్స్ మరో మూడు పెనాల్టీ కార్నర్లను వాడుకోలేకపోయింది.మరో వైపు చివరి క్వార్టర్లో ఎనిమిది నిమిషాల వ్యవధిలో ఐదు పెనాల్టీలు సహా మొత్తం ఆరు పెనాల్టీలు వచ్చినా రుద్రాస్ వాటిలో ఒక్కదానిని కూడా గోల్గా మలచలేకపోయింది. హైదరాబాద్ తరఫున జాకరీ వాలెస్ (6వ నిమిషం), రాజీందర్ సింగ్ (14వ నిమిషం), శిలానంద్ లాక్డా (32వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తాజా ఫలితం తర్వాత పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. గోల్స్ వర్షం కురిసిన మరో మ్యాచ్లో తమిళనాడు డ్రాగన్స్ 6–5 గోల్స్తో టీమ్ గోనాసిక వైజాగ్పై గెలుపొందింది. ఈ గెలుపుతో డ్రాగన్స్ రెండో స్థానానికి చేరగా, గోనాసిక ఏడో స్థానంలో నిలిచింది. -
బీజేపీ వస్తే మమత జైలుకే: బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు
కోల్కతా:పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మమత అరెస్టు తప్పదన్నారు. సందేశ్ఖాలీలో మహిళలను టీఎంసీ నేతలు వేధించిన ఘటనలకు మమత బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పారు. ‘2026లో బెంగాల్లో బీజేపీ పవర్లోకి వస్తే సందేశ్ఖాలీ ఘటనలపై విచారణ కమిషన్ వేస్తాం. సీఎం మమత కూడా జైలుకు వెళ్లకతప్పదు. సందేశ్ఖాలీలో మన తల్లులు, అక్కచెల్లెలను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు.దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు’అని సువేందు అధికారి హెచ్చరించారు. మమతా బెనర్జీ సందేశ్ఖాలీలో పర్యటించిన మరుసటి రోజే పోటీగా అక్కడ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సువేందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కాగా,గతేడాది ప్రారంభంలో తృణమూల్ నేత షాజహాన్షేక్ తమ భూములు కబ్జా చేయడమే కాకుండా తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఉత్తరపరగణాల జిల్లా సందేశ్ఖాలీలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అనంతరం షేక్షాజహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
సందేశ్ఖాలీలో నేడు మమతా బెనర్జీ పర్యటన
కోల్కతా:పశ్చిమబెంగాల్లో మహిళల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన సందేశ్ఖాలీలో సీఎం మమతాబెనర్జీ సోమవారం(డిసెంబర్30) పర్యటించనున్నారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల భూకబ్జాలు,లైంగిక వేధింపులపై ఈ ఏడాది ఆరంభంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.ఈ ఆందోళనల తర్వాత ఈ ప్రాంతంలో సీఎం మమత పర్యటించడం ఇదే తొలిసారి. పౌరసరఫరాల శాఖ కార్యక్రమంలో మమత పాల్గొననున్నారు. మాజీ టీఎంసీ నేత షేక్షాజహాన్ తమ భూములు కబ్జా చేయడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారని సందేశ్ఖాలీలో మహిళలు ఉద్యమించారు.తర్వాత రేషన్ స్కామ్లో మనీ లాండరింగ్ ఆరోపణలపై షేక్షాజహాన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షేక్ షాజహాన్ను అరెస్టు చేసింది. ఈ పరిణామాలతో అప్పట్లో అతడిని టీఎంసీ సస్పెండ్ చేసింది.ఇదీ చదవండి: బీహార్లో ఉద్రిక్తతలు..ప్రశాంత్కిశోర్పై కేసు -
మీరు ఆక్రమిస్తుంటే... మేం లాలీపాప్ తింటామా?
కోల్కతా: పశ్చిమబెంగాల్ను మరికొద్ది రోజుల్లోనే ఆక్రమించుకుంటామంటూ బంగ్లాదేశ్ రాజకీయ నేతలు కొందరు చేస్తున్న అతి వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ దీటైన సమాధానమిచ్చారు. అవన్నీ మతిలేని వ్యాఖ్యలంటూ ఆమె కొట్టిపారేశారు. ‘మీరొచ్చి బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమించుకుంటూ ఉంటే మేం లాలీపాప్ తింటూ కూర్చుంటామనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. ‘మా భూభాగాన్ని మా నుంచి లాక్కునే సత్తా ఎవ్వరికీ లేదు. అటువంటి ఆలోచన కూడా రానివ్వకండి’అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను ప్రేరేపించే దురుద్దేశంతోనే ఓ రాజకీయ పార్టీ ఫేక్ వీడియోలను ఇక్కడ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. భారత్లో పరిణామాలను రాజకీయం చేయాలని చూడటం బంగ్లాదేశీయులతోపాటు బెంగాల్కు, ఇక్కడి ప్రజలకు కూడా క్షేమకరం కాదని మమత హెచ్చరించారు. అనవసరమైన వ్యాఖ్యల కారణంగా బంగ్లాదేశ్లో పరిస్థితులు మరింతగా విషమించే ప్రమాదముందని కూడా మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
బాలికపై హత్యాచారం కేసులో... 61 రోజుల్లోనే మరణశిక్ష
కోల్కతా: ఈ ఏడాది అక్టోబర్లో 9 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి హత్యకు పాల్పడిన 19 ఏళ్ల వ్యక్తికి బెంగాల్లోని కోర్టు మరణ శిక్ష విధించింది. నేరం చోటుచేసుకున్న నాటి నుంచి కేవలం 61 రోజుల్లోనే విచారణ పూర్తవడం రికార్డు సృష్టించింది. దక్షిణ 24 పరగణాల జిల్లా జయ్నగర్లో అక్టోబర్ 4న ట్యూషన్ నుంచి వస్తున్న 9 ఏళ్ల బాలికను ముస్తాకిన్ సర్దార్ నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చంపేశాడు. అప్పటికే ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. దాంతో బాలిక హత్యాచార కేసులో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంతో నిందితుడిని కేవలం రెండున్నర గంటల్లోనే అరెస్ట్ చేశారు. అతడిచ్చిన వివరాలతో బాలిక మృతదేహాన్ని అదే రోజు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఆధారాలతో 25 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి బారుయిపూర్ పోక్సో కోర్టులో అక్టోబర్ 30న చార్జిషీట్ వేశారు. కోర్టు విచారణ నవంబర్ 4న మొదలై 26న పూర్తయింది. మొత్తం 36 మంది సాక్షులను విచారించారు. దోషి ముస్తాకిన్ సర్దార్కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జస్టిస్ సుబ్రతా చటర్జీ తీర్పు వెలువరించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదో రికార్డని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పోలీసులు, న్యాయాధికారుల కృషిని ప్రశంసించారు. -
ఇక ఈ జీవితం ఇంతే అనుకున్నా..! 36 ఏళ్లకు విముక్తి : వైరల్ స్టోరీ
సోదరుడిని హత్య చేసిన ఆరోపణల కేసులో జీవిత ఖైదు అనుభవించి శతాధికవృద్ధుడిగా జైలునుంచి విడుదలైన ఘటన వైరల్గా మారింది. గత నెల సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మాల్డా కరెక్షనల్ హోం నుంచి విడుదలయ్యాడో వ్యక్తి. ఆయన పేరే 104 ఏళ్ల రసిక్ చంద్ర మోండల్. ‘‘జైలుకి ఎపుడొచ్చానో, ఎన్నేళ్లు గడిపానో గుర్తు లేదు. ఇక ఈ జీవితం ఇంతే అనుకున్నాను’’ అంటున్న రసిక్ చంద్ర మాటలు పలువురిని ఆలోచింప చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని మానిక్చక్ నివాసి రసిక్ చంద్ర. 1988లో స్వల్ప భూవివాదంలో సోదరుడిని హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. 1992లో మాల్డాలోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటికి మోండల్ వయస్సు 72 సంవత్సరాలు. కలకత్తా హైకోర్టు విచారణ సమయంలో బెయిలుపై విడుదలయ్యాడు. కానీ దిగువ కోర్టు జీవితఖైదు విధించడం,హైకోర్టు దానిని సమర్ధించడంతో తిరిగి కరెక్షనల్ హోమ్కు వెళ్లక తప్పలేదు. ఆ తరువాత 2020లో పేరోలు మీద బయటికి వచ్చి, మళ్లీ 2021లో కరెక్షనల్ హోమ్కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి 36 ఏళ్లుగా జీవిత ఖైదుగా ఉన్నాడు. ఎలా విడుదలయ్యాడుజీవిత ఖైదు అనుభవించిన వ్యక్తి నిర్దేశించిన శిక్షాకాలంలో ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడ కుండా, సత్ర్పర్తనతో ఉంటే, జైలు నుంచి విడుదలయ్యే అర్హత ఉంటుంది. అలా 36 ఏళ్ల జైలు జీవితం తర్వాత మాల్డా కరెక్షనల్ హోమ్ నుండి 104 ఏళ్ల వృద్ధుడిగా జనజీవితంలోకి వచ్చాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన తండ్రిని విడుదల చేసినట్లు మోండల్ కుమారుడు ప్రకాష్ మోండల్ తెలిపాడు. ఈ వయసులో కూడా మోండలు ఆరోగ్యంగా, చురుగ్గా కనిపించడం విశేషం. ఎందుకంటే మోండల్ జైలులో నిత్యం వ్యాయామం చేసేవాడట. క్రమశిక్షణతో ఉంటూ వయసుకు తగ్గట్టు ఫిట్నెస్ పెంచుకున్నాడు.అంతేకాదు మొక్కలను పెంచడం, తోటపనిలో బాగా పాలు పంచుకునేవాడు. బయటికి వచ్చాక తన అభిరుచికి తగట్టి తోట పని చేసుకుంటానని చెప్పాడు మోండల్. అంతేకాదు తాను నిర్దోషిని, పరిస్థితుల వల్ల తన పరిస్థితి ఇలా వచ్చిందని తెలిపారు. ఇన్నాళ్లుగాకుటుంబాన్ని, మనవలు మనవాళ్లతో గడిపేసమయాన్ని కోల్పోయాను అంటూ వాపోయాడు. అన్నట్టు మోండల్ భార్య మీనా ,ఇన్నాళ్లకు తన భర్త విడుదల కావడంపై సంతోషం ప్రకటించింది. -
బంగ్లాదేశ్కు ఐరాస దళాలు పంపాలి: మమతా డిమాండ్
కోల్కతా : పొరుగు దేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో తాత్కాలిక ప్రభుత్వంతో సహకరించేందుకు ఐరాస శాంతి పరిరక్షక దళాలను మోహరించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఐరా సలో ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని విదేశీ గడ్డపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీ యులను స్వదేశానికి తీసుకు రావాలన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితులపై మన వైఖరిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ వివరించాలని, లేకుంటే విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేయాలని కోరారు. మమతా బెనర్జీ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ... ద్వైపాక్షిక అంశాలపై తాను మాట్లాడలేనని చెప్పారు. అయితే, అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు, అక్కడి నుంచి వచ్చిన బాధితులు, ఇస్కాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల మేరకు అసెంబ్లీలో స్పందించాల్సి చచ్చిందన్నారు. బంగ్లాదేశ్లో దాడులకు గురైన భారతీయులకు అవసరమైతే పునరావాసం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆహార పదార్ధాలకు ఎటువంటి కొరత లేదన్నారు.వక్ఫ్ పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుందిబీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై మమత అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లు పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ముస్లింలను విభజించి ఏకాకులుగా మార్చేం దుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం పట్టించు కోవడం లేదన్నారు. హిందూ ఆలయ ట్రస్టులు, చర్చిల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఇలాగే జోక్యం చేసుకోగలడా అని ఆమె ప్రశ్నించారు. మూడింట రెండొంతుల మెజారిటీ లేని బీజేపీ పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలదా అని ఆమె ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. బిల్లుపై జేపీసీలో జరిగే చర్చల్లో ప్రతిపక్ష సభ్యులను బీజేపీ మాట్లాడనివ్వడం లేదని అందుకే టీఎంసీ ఆ కమిటీ నుంచి వైదొలగిందని వివరించారు. -
యువకుడిని ముక్కలుగా చేసి హత్య.. ఏడుగురికి మరణశిక్ష
కోల్కతా:పశ్చిమబెంగాల్లో 2020లో యువకుడిని ముక్కలుముక్కలుగా చేసి హత్య చేసిన కేసులో ఏడుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇది అత్యంత క్రూరమైన రీతిలో జరిగన హత్య కావడం వల్లే నిందితులకు మరణశిక్ష విధిస్తున్నట్లు చిన్సూర సెషన్స్కోర్టు తెలిపింది. ఓ ముక్కోణపు ప్రేమకథలో బిష్ణుమాల్(23) అనే యువకుడిపై బిశాల్ అనే యువకుడు కోపం పెంచుకున్నాడు.స్నేహితుల సహకారంతో బిష్ణును అతడి ఇంటివద్ద నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఓ ఇంట్లో బిష్ణు శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి హత్యచేశారు. బిష్ణుమాల్ను ముక్కలుగా చేసిన తతంగాన్ని మొత్తం నిందితులు వీడియో చిత్రీకరించారు. అనంతరం శరీరభాగాలను పలు ప్రాంతాల్లో పారవేశారు. ఈ కేసులో బిష్ణు ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న యువతి సాక్ష్యం కీలకంగా పనిచేసిందని ప్రాసిక్యూటర్ తెలిపారు.బిష్ణు హత్యలో నేరుగా పాల్గొన్న ఏడుగురు నిందితులకు మరణశిక్ష పడగా నిందితులకు సహకరించిన మరొకరికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. కేసులో అందరు నిందితులను హత్యజరిగిన వెంటనే పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ప్రధాన నిందితుడు బిశాల్ మాత్రం నెల రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. బిశాల్ అరెస్టయిన తర్వాతే మృతుడి తల భాగాన్ని పోలీసులు రికవర్ చేయగలిగారు. తలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి బిశాల్ తన ఇంట్లో దాచుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. -
ఆర్జీ కర్ ఆసుపత్రి.. నిందితుడు సంజయ్రాయ్ గొంతు వినిపడకుండా పోలీసుల హారన్లు!
కోల్కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి ఘటన కేసు విచారణలో కోల్కతా పోలీసులు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలో విచారణ కొనసాగుతుంది.అయితే విచారణ నిమిత్తం జైల్లో ఉన్న నిందితుడు సంజయ్ రాయ్ను కోల్కతా పోలీసులు సోమవారం సీల్దా కోర్టుకు తరలించారు. ఆ సమయంలో సంజయ్ రాయ్ మీడియాకు, ప్రజలకు వినిపించకుండా పోలీసులు హారన్ కొడుతూ తీసుకెళ్లడం చర్చనీయాశంగా మారింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నవంబర్ 11న సీల్దా కోర్టుకు సంజయ్రాయ్ను తీసుకెళ్లే సమయంలో కోల్కతా మాజీ పోలీసు కమీషనర్ వినీత్ గోయల్పై రాయ్ తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని, తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యానించాడు. ఈ తరహ ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేలా సైరన్ మోగిస్తూ కోర్టుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. -
పశ్చిమ బెంగాల్: ఇరువర్గాల మధ్య చెలరేగిన హింస.. నిషేదాజ్ఞలు అమలు
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. డిజిటల్ డిస్ప్లే బోర్డులో అభ్యంతరకర మెసేజ్ వచ్చిన నేపధ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకూ 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.బెల్దంగాలో జరిగిన ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసు అధికారి తెలిపారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కార్తీకమాస పూజల వేదిక సమీపంలోని గేటు వద్ద ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డుపై ఉన్న సందేశం ఒక వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక పోలీసు వాహనంపై కూడా దాడి జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది.ఈ ఘర్షణల కారణంగా సీల్దా నుంచి ముర్షిదాబాద్ వెళ్తున్న భాగీరథి ఎక్స్ప్రెస్ కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. ఈ ఘటనకు మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్లో గంతులేస్తూ.. -
బెంగాల్ లో పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలు
-
కోల్కతా హత్యాచార ఘటన: కేసు బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ దారుణ ఘటన కేసుకు సంబంధించిన విచారణను పశ్చిమ బెంగాల్ వెలుపలకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇక.. జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు బదిలీకి సుప్రీం నిరాకరించింది. ఈ సందర్భంగా పోలీసు, న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతోందని వ్యాఖ్యానించిన ఓ లాయర్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మందలించారు. కోర్టులో ‘క్యాంటీన్ కబుర్లు’ చెప్పొద్దని, అటువంటి జనరల్ స్టేట్మెంట్లు చేయొద్దని సూచించారు.‘‘మణిపూర్ వంటి కేసుల్లో బదలీ చేశాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమి లేదు. కావును అటువంటి బదిలీ చేయలేం. ఇక.. ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ దాఖలు చేసిన ఆరో స్టేటస్ పోర్టును మేం పరిశీలించాం. అయితే..సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో మేం కేసు స్టేటస్ పరిశీలనకు దూరంగా ఉన్నాం. నాలుగు వారాల తర్వత స్టేటల్ అప్డేట్ అయిన కొత్త రిపోర్టును దాఖలు చేయనివ్వండి’ అని సీజేఐ పేర్కొన్నారు. ఇక.. వాదన సమయలో పశ్చిమ బెంగాల్ ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని ఓ న్యాయవాది అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఘాటుగా స్పందించారు. ‘‘ మీరు ఎవరి తరపున హాజరవుతున్నారు. ఇలాంటి సాధారణ ప్రకటనలు చేయొద్దు. ఈ కేసులో అలాంటిదేమీ లేదు. కోర్టులో క్యాంటీన్ కబుర్లు చెప్పొద్దు’’ అని మందలించారు. ఇక.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది.చదవండి: నేను ఏ నేరం చేయలేదు.. ప్రభుత్వమే ఇరికిస్తోంది: సంజయ్ రాయ్ కేకలు -
కోల్కతా వైద్యురాలి కేసులో బిగ్ ట్విస్ట్
కోల్కతా: కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్.. తాను నిర్ధొషినని చెబుతున్నాడు. జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య చేయలేదని, ప్రభుత్వం కావాలనే తనను ఇరికిస్తుందని ఆరోపించాడు. తన మాట ఎవరూ వినడం లేదని, పోలీస్ అధికారులు తనను భయపెడుతున్నారని తెలిపాడు.కాగా నిందితుడు సంజయ్రాయ్ను సోమవారం సీబీఐ అధికారులు సీల్డా కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తరువాత కోర్టునుంచి వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తుండగా.. వ్యాన్లో నుంచే మీడియాతో మాట్లాడాడు సంజయ్ రాయ్. నేను ఏ నేరం చేయలేదంటూ గట్టిగా కేకలు వేస్తూ చెప్పాడు. ప్రభుత్వం తనను ఇరికించి నోరు విప్పకుండా బెదిరిస్తోందన్నారు.మరోవైపు ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై కోల్కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీరికి మహిళలు కూడా మద్దతు తెలిపారు. భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురి అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఎనభై ఏడు రోజుల తర్వాత కోల్కతా కోర్టు సోమవారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్పై అభియోగాలు మోపింది. ఈ కేసులో రోజువారీ విచారణ నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతుందని కోర్టు వెల్లడించింది. రాయ్పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు), 103 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదైంది. -
కాళీ నిమజ్జనంలో రాళ్లదాడి
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో కాళీమాత విగ్రహం నిమజ్జనంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. రాజాబజార్ పరిధిలోని నార్కెల్దంగ ప్రాంతంలో కాళీమాత విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలంలో ఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.కాళీమాత విగ్రహం నిమజ్జనం ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటన స్థానికంగా కలకలంరేపింది. అప్రమత్తమైన పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని కోల్కతా పోలీసులు సోషల్ మీడియా సైట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్కింగ్ విషయంలోవివాదం జరిగిందని, దీనిని బీజేపీ నేతలు రాళ్లదాడి ఘటనగా చెబుతున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.హిందువులు చేపట్టిన ఊరేగింపుపై మమతా బెనర్జీవర్గానికి చెందినవారు రాళ్లు రువ్వారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. మమతా బెనర్జీ వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తక్షణమే పదవి నుండి వైదొలగాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ రాజాబజార్లో కాళి నిమజ్జనం ఊరేగింపుపై దాడి జరిగిందని, పోలీసులు భక్తులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత -
బెంగాల్లో పేషెంట్పై డాక్టర్ అఘాయిత్యం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ రోగిపై డాక్టర్ చేసిన అత్యాచార ఘటన కలకలం రేపింది. నార్త్ 24 పరగణాలలోని హస్నాబాద్లో 26 ఏళ్ల రోగిపై అత్యాచారం చేసినందుకు కోల్కతా పోలీసులు ఓ డాక్టర్ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘‘ నిందితుడైన డాక్టర్ సదరు మహిళా రోగికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి లైంగిక వేధింపులను చిత్రీకరించాడు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. నిందితుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియోను ఉపయోగించి మరీ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇటీవల నిందితుడు నూర్ ఆలం సర్దార్పై బాధిత మహిళ తన భర్తతో కలిసి.. హస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. నగరంలోని బరున్హాట్ ప్రాంతంలోని డాక్టర్ క్లినిక్ నుంచి పోలీసులు సర్దార్ను అరెస్టు చేశారు. నిందితుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. మహిళా రోగి.. అపస్మారక స్థితికి తీసుకువచ్చి అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు’’ అని పోలీసులు తెలిపారు.ఈ కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మహిళ రహస్య వాంగ్మూలం రికార్డ్ చేసి.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు బరున్హాట్ ఎస్పీ హొస్సేన్ మెహెదీ రెహ్మాన్ తెలిపారు. దీంతో కోర్టు నిందితుడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మరోవైపు.. గత నెలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి మరణశిక్షను తప్పనిసరి చేసే కఠినమైన కొత్త బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. -
మీకు సేవ చేయలేకపోతున్నా.. క్షమించండి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని, అక్కడి ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతుండడమే ఇందుకు కారణమని మండిపడ్డారు. ఆ రెండు రాష్ట్రాల్లో వృద్ధులకు ఉచితంగా వైద్యం లభించకపోవడం చూసి చాలా బాధపడుతున్నానని చెప్పారు. వారికి సేవ చేసే అదృష్టం రాకపోవడం పట్ల చింతిస్తున్నానని తెలిపారు. ఆ వృద్ధులను క్షమాపణ కోరుతున్నానని పేర్కొన్నారు.ఆయుష్మాన్ భారత్ను మరింత విస్తరింపజేస్తూ 70 ఏళ్లు దాటిన వారందరికీ ఈ పథకం వర్తించేలా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన(ఏబీ–పీఎంజేఏవై)ను మోదీ మంగళవారం శ్రీకారం చుట్టారు. తొమ్మిదో ఆయు ర్వేద దినోత్సవం, ధన్వంతరి జన్మదినోత్సవం సందర్భంగా వైద్య రంగానికి సంబంధించి రూ.12,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. 70 ఏళ్లు దాటిన వారిని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి తీసుకొస్తానని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఈరోజు నెరవేరుస్తున్నానని తెలిపారు.ఏబీ–పీఏంజేఏవైతో 4 కోట్ల మంది లబ్ధి పొందుతారని వెల్లడించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ఐదేళ్లలో మరో 75,000 ఎంబీబీఎస్, ఎండీ సీట్లు ‘‘70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ వయ వందన కార్డులు అందజేస్తాం. వీటితో ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,000కుపైగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 80 శాతం డిస్కౌంట్తో ఔషధాలు లభిస్తున్నాయి. ఈ కేంద్రాలతో పేదలు, మధ్యతరగతికి రూ.30,000 కోట్ల మేర లబ్ధి కలిగింది. స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్ల వంటి పరికరాల ధరలు తగ్గించడంతో సామాన్య ప్రజలకు రూ.80,000 కోట్లు ఆదా అయ్యాయి. దేశంలో గత పదేళ్లలో దాదాపు లక్ష ఎంబీబీఎస్, ఎండీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో మరో 75,000 సీట్లు రాబోతున్నాయి. వైద్య విద్య నిరుపేదలకు సైతం సులభంగా అందుబాటులోకి రావాలన్నదే మా లక్ష్యం’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. రోజ్గార్ మేళాలో 51 వేల మందికి నియామక పత్రాలు దేశంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించేలా, వారి ఆకాంక్షలు నెరవేరేలా ఒక పటిష్టమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. గరిష్ట సంఖ్యలో యువతకు ఉపాధి కలి్పంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మంగళవారం ‘రోజ్గార్ మేళా’లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 51,000 మందికి వర్చువల్గా నియామక పత్రాలు అందజేశారు. అంతరిక్షం, సెమీకండక్టర్ల వంటి ఆధునిక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దాంతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్తేరాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలోని భవ్యమందిరంలో బాలరాముడిని ప్రతిష్టించుకున్న తర్వాత వచ్చిన ఈ తొలి దీపావళి పండుగ మనకు చాలా ప్రత్యేకమని చెప్పారు -
‘మానవత్వం లేదు’.. బెంగాల్, ఢిల్లీపై ప్రధాని మోదీ ధ్వజం
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయనందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లను లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అనారోగ్యంతో ఉన్న ప్రజలను పట్టించుకోకపోవటం అమానుషమని మండిపడ్డారు. ప్రధాని మోదీ మంగళవారం వృద్ధుల కోసం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య రక్షణ పొందుతారు. దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు.‘‘ ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు. తీవ్రమైన వ్యాధికి చికిత్సకు అయ్యే ఖర్చు విని పేదలు వణికిపోయేవారు. డబ్బు లేకపోవడంతో వైద్యం చేయించుకోలేని నిస్సహాయతలో ఉండేవారు. ఈ నిస్సహాయతలో ఉన్న పేద ప్రజలను నేను చూడలేకపోయా. అందుకే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా దేశంలోని 4 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారు. .. కానీ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లోని వృద్ధులకు సేవ చేయలేక పోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నా. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను మీకు సహాయం చేయలేకపోతున్నా. ఎందుకంటే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వాలు ఈ పథకంలో చేరటం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రంలోని జబ్బుపడిన ప్రజలను అణచివేసే ధోరణి అమానుషం. నేను దేశ ప్రజలకు సేవ చేయగలను. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లోని వృద్ధులకు సేవ చేయకుండా నన్ను అక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.చదవండి: రాణి రాంపాల్పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ -
చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్షా
కోల్కతా: బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని కేంద్రహోం మంత్రి అమిత్షా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న పెద్ద టార్గెట్ అన్నారు. ఆదివారం(అక్టోబర్ 27) కోల్కతాలో పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.బెంగాల్లో చొరబాట్లను తక్షణమే ఆపాలన్నారు. బెంగాల్లో చొరబాట్లు,అవినీతి ఆగాలంటే 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే సాధ్యమన్నారు.బెంగాల్లో మహిళలకు భద్రత లేదని చెప్పడానికి సందేశ్ ఖాలీ హింస,ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలే నిదర్శనమన్నారు.అక్రమ వలసలు పెరగడం వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాట్లను ఆపినప్పుడే బెంగాల్లో శాంతి నెలకొంటుందన్నారు.కాగా, పశ్చిమబెంగాల్లో రూ.500 కోట్లతో నిర్మించిన ల్యాండ్పోర్ట్ను అమిత్షా ప్రారంభించారు. ఇదీ చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్లో ప్రధాని ఎన్నికల ప్రచారం -
దానా తుపాను : 86 రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు తిప్పలు (ఫొటోలు)
-
తీరం దాటిన ‘దానా’ తీవ్ర తుపాను
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపాను ‘దానా’ తీరం దాటింది. అర్ధరాత్రి 1:30 నుండి 3:30 మధ్య తీరాన్ని తాకింది. ఒడిశాలోని బిత్తర్కని నేషనల్ పార్క్, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒడిశా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఒడిశాలో 7వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లొతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో ఏకంగా 400లకు పైగా రైళ్లు రద్దు అయ్యాయి. కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచే నిలిపివేశారు.బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కదలికలను ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–06), ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయని ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో గురువారం తెలియజేసింది. 2022 నవంబర్ 26న పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈఓఎస్–06, 2016 సెప్టెంబర్ 8న జీఎస్ఎల్వీ ఎఫ్–05 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు విపత్తులను ముందస్తుగా గుర్తించి మానవాళికి మేలు చేస్తుండటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం.ఈ నెల 20న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సముద్రపు గాలి నమూనాలను బట్టి ఈఓఎస్–06 ఉపగ్రహం ముందస్తుగా గుర్తించింది. మేఘాలను బట్టి ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహం ఈ తుపానును ముందస్తుగా గుర్తించింది. తుపాను బెంగాల్, ఒడిశా మీదుగా వెళ్లి తీరం దాటింది. ఈ విషయాన్ని ఈ రెండు ఉపగ్రహాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునే అవకాశం చిక్కింది.