జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..ఏడుగురు ఉగ్రవాదులు హతం | Indian Army Stops Infiltration Bid Of Pakistan Army Men | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..ఏడుగురు ఉగ్రవాదులు హతం

Published Fri, Feb 7 2025 3:29 PM | Last Updated on Fri, Feb 7 2025 3:59 PM

Indian Army Stops Infiltration Bid Of Pakistan Army Men

పూంచ్‌:జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు(ఎల్‌వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పూంచ్‌ జిల్లాలోని క్రిష్ణఘాటి సెక్టార్‌లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు దాకా పాకిస్తాన్‌ ఆర్మీ జవాన్లే కావడం గమనార్హం.

పాకిస్తాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ సభ్యులు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవడానికి సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు మృతి చెందారు. ఫిబ్రవరి5వ తేదీని కాశ్మీర్‌ లిబరేషన్‌ డేగా పాకిస్తాన్‌ జరుపుకుంది. ఈ నేపథ్యంలో అదే రోజు పాక్‌ ఆర్మీకి చెందిన జవాన్లు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం పట్ల సైన్యం అప్రమత్తమై  వారి ప్రయత్నాన్ని అడ్డుకుంది.

ఇటీవల జమ్ముకశ్మీర్‌లో వరుస ఘటనల్లో  పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లలో పలువురు జవాన్లు కూడా గాయపడ్డారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ హతమైన విషయం తెలిసిందే.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement